*నకిరేకల్ నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది*
*- నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య*
నకిరేకల్ నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య ఆరోపించారు, శనివారం నాడు నల్లగొండ ఎస్పి కార్యాలయంలో ఎస్పి శరత్ చంద్ర పవార్ గారిని కలిసి నకిరేకల్ నియోజకవర్గంలో జరుగుతున్న ఆగడాల గురించి వారికి వివరించారు, గత ఐదేండ్లు ప్రశాంతంగా ఉన్నా నకిరేకల్ నియోజకవర్గంలో కొంత మంది వ్యక్తులు కావాలని అలజడులు సృష్టిస్తున్నారని ఆరోపించారు, బిఆర్ఎస్ నాయకులనే టార్గెట్ చేసి గ్రామాల్లో కాంగ్రెస్ గుండాలు దాడులు చేస్తున్నారనీ మండిపడ్డారు, నకిరేకల్ మండంలోని తాటికల్ గ్రామంలో బిఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త మనోహర్ రెడ్డి అనే వ్యక్తి ఇందిరమ్మ ఇండ్లు గతంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గా పనిచేసిన వ్యక్తికే మంజూరు చేయడం పట్ల సోషల్ మీడియాలో ప్రశ్నించిందుకు మాజీ సర్పంచ్ మరియు అతని అనుచరులు విచక్షారహితంగా దాడి చేస్తే ఆ వ్యక్తి నకిరేకల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు చేయకపోగా అతనిపైనే వేరే ఫిర్యాదు పేరిట కేసులు చేస్తామని స్థానిక ఎమ్మెల్యే ప్రోద్భలంతో వేదింపులకు గురిచేస్తున్నారని ఫైర్ అయ్యారు, కడపర్తి గ్రామంలో గోర్ల బిక్షమయ్య అనే రైతు భూ వివాదంలో ప్రత్యర్ధి ఎమ్మెల్యే గన్మెన్ అవ్వడంతో ఆ సమస్యను స్థానిక పోలీసులు సంవత్సరం నుండి పట్టించుకోవడం లేదని విమర్శించారు, మండలాపురంలో ఏర్పుల నాగమ్మ, వల్లభాపురం గ్రామంలో మాద రమేష్, కడపర్తి గ్రామంలో గోర్ల మహేష్ ల సమస్యలు నెలల తరబడి పోలీస్ స్టేషన్ లలో మగ్గుతున్నాయని ఆరోపించారు, ఎస్పి గారు నకిరేకల్ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ద తీసుకొని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు...
SOURCE
No comments:
Post a Comment