Monday, July 21, 2025

అడ్వాన్డ్స్ టెక్నాలజీ సెంటర్స్ (ATC), తెలంగాణ రైజింగ్-2047 పై సచివాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష

 అడ్వాన్డ్స్ టెక్నాలజీ సెంటర్స్ (ATC), తెలంగాణ రైజింగ్-2047 పై సచివాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష 

హాజరైన మంత్రి వివేక్ వెంకటస్వామి, ఉన్నతాధికారులు

తెలంగాణ రైజింగ్-2047 కు అనుగుణంగా అడ్వాన్డ్స్ టెక్నాలజీ సెంటర్స్ (ATC) అభివృద్ధి, పురోగతిపై అధికారులతో సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 

పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కోర్సులు, శిక్షణ అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించిన సీఎం 

ATC ల అభివృద్ధి, పనుల్లో పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం 

నిర్దేశిత సమయానికి అనుగుణంగా వీలైనంత త్వరగా ATC ల అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి 

ATC ల అభివృద్ధి, పురోగతిపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానన్న సీఎం 

రాష్ట్రంలో మూడు దశల్లో 111 ATC లను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపిన అధికారులు 

ఫేజ్-1 లో 25, ఫేజ్-2 లో 40, ఫేజ్-3 లో 46 ATC లను  అభివృద్ధి చేయనున్నట్లు తెలిపిన అధికారులు 

ఫేజ్-1, ఫేజ్-2 లో ఇప్పటి వరకు 49 అందుబాటులోకి వచ్చాయని తెలిపిన అధికారులు 

ATC లను వీలైనంత త్వరగా పూర్తిగా చేసేందుకు అవసరమైతే నైపుణ్యం కలిగిన నిర్మాణ సంస్థల సహకారం తీసుకోవాలని సూచించిన సీఎం

జీనోమ్ వ్యాలీలో ఒక మోడల్ ATC ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి 

ఫార్మా, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ పరిశ్రమలకు అవసరమైన శిక్షణ అందించే కోర్సులు అక్కడ నిర్వహించాలని సూచించిన సీఎం

అవసరమైన స్థలం కేటాయింపుతో పాటు అధునాతన సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు సూచించిన సీఎం

No comments:

Post a Comment