Monday, July 21, 2025

మహాకవి శ్రీ దాశరథి కృష్ణమాచార్యులు గారి శత జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులు

తెలంగాణ రైతాంగ సాయధ పోరాటంలో అక్షరాన్ని ఆయుధంగా మలిచి.. నిజాం నిరంకుశ పాలనపై ధిక్కార స్వరం వినిపించిన మహానీయుడు ఉద్యమ వైతాళికుడు, మహాకవి శ్రీ దాశరథి కృష్ణమాచార్యులు గారి శత జయంతి సందర్భంగా తెలంగాణకు, సాహిత్య రంగానికి ఆయన చేసిన సేవలను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. తెలంగాణ ప్రజల కన్నీళ్లను అగ్నిధారగా మలిచి నిరంకుశ పాలన మీదికి ఎక్కు పెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు అన్నారు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకుని తెలంగాణ కోసం ఉద్యమించిన దాశరథి చిరస్మరణీయుడని కొనియాడారు. ప్రజల్లో చైతన్యం నింపిన ధిశాలి. తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి. అనునిత్యం సమ సమాజం కోసం తపించిన గొప్ప వ్యక్తి దాశరథి అన్నారు. కథలు, నాటికలు, సినిమా పాటల రచనల ద్వారా తెలుగు భాషకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలోనూ విశేషంగా కృషి చేశారన్నారు. తెలుగు సినిమా సాహిత్యంలోను విశిష్ఠ స్థానం సంపాదించారన్నారు. తెలంగాణ ఉద్యమ స్పూర్తితో  దశారథి రచించిన పద్యాలు, పాటలు ఇప్పటికీ ప్రజలందరికీ ఉత్తేజాన్ని, స్పూర్తిని కలిగిస్తాయన్నారు. దశారథి స్పూర్తితోనే తెలంగాణ తొలి, మలి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కవులు, కళాకారులు, సాహితీవేత్తలను ప్రజా ప్రభుత్వం ఘనంగా సన్మానించి, చేయూత అందించడం జరిగిందన్నారు. 

ప్రతి ఏడాది దాశరధి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా  ప్రకటించే దాశరధి కృష్ణమాచార్య అవార్డు - 2025ను  కవి, వ్యాసకర్త అన్నవరం దేవేందర్ గారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

No comments:

Post a Comment