Wednesday, December 6, 2023

#తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులారా మారండి!

*_#తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు (అన్ని శాఖలు) #IAS & #IPS అధికారులతో సహా అందరికి 'ప్రజాసంకల్పం Link Media' విజ్ఞప్తి చేస్తుంది.#రాజ్యాంగం కు గౌరవం ఇచ్చి,#ప్రజాస్వామ్య బద్దంగా  ప్రజలకు జవాబుదారీతనంగా మీరు మీ విధులను నిర్వర్తించండి.#పాలకులకు,#ప్రజాప్రతినిధులకు ఊడింగం చేయకండి. ప్రజాసమస్యల పరిష్కారంలో చట్టాలకు అనుగుణంగా పనిచేయడం నేర్చుకోండి. మీ ద్రుష్టికి ప్రజలు నేరుగా కానీ ప్రభుత్వ అధికారిక మాద్యమాలద్వారా కానీ సమస్యలను తీసుకొచ్చినపుడు వాటిమీద విచారణ చేసి పరిష్కారం చేయండి. అంతేకాని నెలలు తరబడి పెండింగ్ లో పెట్టకండి. RTIA ద్వారా సమాచారాన్ని అడిగినపుడు చట్టాలకు గౌరవం ఇచ్చి సమాచారం ఇవ్వడం నేర్చుకోండి. సోషల్ మీడియా చాలా యాక్టీవ్ గా వుంది అని తెలుసుకోవాలి. ప్రజలపక్షాన ప్రశ్నించే గొంతులు, ప్రజాసంఘాలు, NGO's చాలా ఉన్నాయి అని తెలుసుకోవాలి.ప్రభుత్వాలు, పాలకులు, ప్రజాప్రతినిధులు ప్రతి 5 సంవత్సరాలకొకసారి మారుతుంటారు. మీరు ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేయండి. ఇకనుంచి అయినా మారుతారు అని నమ్మకంతో.... Bplkm🪶_*

*NOTE : ప్రభుత్వ అధికారులు #తెలంగాణ  వచ్చినప్పటినుంచి అధికారికంగా అధికారి హోదాలో న్యాయస్థానాల (హైకోర్టు, లోకాయుక్త,మానవహక్కుల కమీషన్, వినియోగదారుల ఫోరమ్... Etc)చుట్టూ ఎందుకు ఎక్కువగా తిరుగుతున్నారు?? మీరే ఆలోచించుకోవాలి.. ఆత్మవిమర్శన చేసుకోవాలి.*

No comments:

Post a Comment