Sunday, December 24, 2023

తెలంగాణ వాచ్' కథనంతో ఉలికిపాటు

అద్దె కూడా కట్టలేదట.!



* 'తెలంగాణ వాచ్' కథనంతో ఉలికిపాటు
* అధికారుల వివరణలో బయటపడ్డ మరో వైనం
* మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వివరణ

కొండా లక్ష్మణ్​ తెలంగాణ స్టేట్ ​హార్టికల్చర్​ వర్సిటీకి చెందిన ప్యాక్​హౌస్​ను 11 నెలల కాలానికి ఆల్​ నాచురల్ ​రూట్స్ ఇంపెక్స్ కంపెనీకి లెట్ అవుట్ (అద్దె) కు ఇచ్చామని రిజిస్ట్రార్​ ఎ.భగవాన్​ తెలిపారు. ఆ కంపెనీ రెంట్​ఇవ్వకపోవడంతో నోటీసులు జారీ చేశామని 'తెలంగాణ వాచ్'లో "మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నీడలో..! రూ.500 కోట్ల స్థలం..నెలకు రూ.58 వేలకే.!" అంటూ వచ్చిన సంచలన పరిశోధన కథనానికి శనివారం ఆయన వివరణ ఇచ్చారు.

11 నెలలకే అద్దెకు అట.!:
వర్సిటీలోని పోస్ట్​ హార్వెస్ట్​ టెక్నాలజీ రీసెర్చ్​స్టేషన్​కు సంబంధించిన ప్యాక్​హౌస్​లో బీఎస్సీ హార్టికల్చర్ ​నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు వ్యాల్యూ యాడెడ్​ప్రొడక్ట్స్​పై ప్రయోగాలు చేయడానికి, హ్యాండ్స్​ఆన్​ఎక్స్​పీరియన్స్​లో భాగంగా విద్యార్థులకు సహాయ పడేందుకు ఆల్​ నాచురల్ ​కంపెనీకి రెంట్ కు ఇచ్చినట్టు తెలిపారు. 2022 డిసెంబర్​17న నిర్వహించిన వర్సిటీ బోర్డు మీటింగ్​లో 11 నెలల పాటు అద్దెకు ఇచ్చేందుకు ఆమోదం తెలిపినట్టు చెప్పారు.

2024 మే 31వ తేదీ వరకు మాత్రమే..:
మొదట 11 నెలలకు ఓకే చెప్పిన తర్వాత 33 నెలలకు అగ్రిమెంట్​పొడిగించాలని సదరు సంస్థ తమను అభ్యర్థించిందని పేర్కొన్నారు. నెలకు రూ.58,734 రెంట్ తో పాటు కరెంట్, వాటర్​బిల్లులు చెల్లించేలా 2023 జూన్​ ఒకటో తేదీన అగ్రిమెంట్​ చేసుకున్నామని వెల్లడించారు. ఈ అగ్రిమెంట్​ 2024 మే 31వ తేదీ వరకు ఉంటుందని వివరించారు. ‘‘అగ్రిమెంట్​చేసుకున్న నాటి నుంచి ఆల్ నాచురల్ సంస్థ వర్సిటీకి రెంట్ తో పాటు కరెంట్, వాటర్​బిల్లులు చెల్లించలేదు. అవి చెల్లించాలని ఈ నెల 15న సదరు సంస్థకు నోటీసులు ఇచ్చాం. ఆయా బిల్లుల రసీదులను ఈ నెల 21లోగా సమర్పించకుంటే తదుపరి చర్యలు ఉంటాయని హెచ్చరించాం” అని పేర్కొన్నారు. అద్దె ప్రాతిపదికన 33 నెలలకు ఒప్పందం చేసుకుని, భూమిని అప్పగించారనేది అవాస్తవమని తెలిపారు. 11 నెలల కాలానికే లెట్​అవుట్​ అగ్రిమెంట్​చేసుకున్నామని, ఈ ఒప్పంద కాలాన్ని 33 నెలలకు మించి పొడిగించే అధికారం వర్సిటీకి, వైస్​చాన్స్​లర్​కు, బోర్డ్​ఆఫ్​ మేనేజ్​మెంట్​కు లేదన్నారు.

ఆ ఒప్పందంతో సంబంధం లేదు : మాజీ మంత్రి
హార్టికల్చర్​వర్సిటీకి సంబంధించిన ఐదెకరాల భూమిని ఒక సంస్థకు అప్పగిస్తూ వర్సిటీ స్థాయిలో చేసుకున్న ఒప్పందానికి, తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి నిరంజన్​రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

No comments:

Post a Comment