Monday, December 18, 2023

రాష్ట్రపతికి ద్రౌపది ముర్ము కు స్వాగతం పలికిన... సీఎం, గవర్నర్...!

*రాష్ట్రపతికి ద్రౌపది ముర్ము కు  స్వాగతం పలికిన... సీఎం, గవర్నర్...!*

హైదరాబాద్‌: శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  హైదరాబాద్‌ వచ్చారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్‌ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వాగతం పలికారు.ఐదు రోజులపాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేస్తారు. తిరిగి ఈ నెల 23న దిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ రవి గుప్తా తదితర ఉన్నతాధికారులు ఉన్నారు.

*సుజీవన్ వావిలాల*

No comments:

Post a Comment