Friday, January 27, 2023

ప్లోరోసిస్ భాదితుడు స్వామి మృతి..... KTR తీవ్ర దిగ్భ్రాంతి

*ప్లోరోసిస్ భాదితుడు స్వామి మృతి..... KTR తీవ్ర దిగ్భ్రాంతి*

చౌటుప్పల్‌: నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెంలో ఫ్లోరోసిస్‌ బాధితుడు అంశాల స్వామి (32) శనివారం ఉదయం మృతిచెందాడు. ట్రై సైకిల్‌ పైనుంచి కింద పడి తలకు బలమైన గాయం కావడంతో మృతి చెందారు.ఈ వార్త తెలుసుకున్న మంత్రి కేటీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్వామి మృతిపై ట్విటర్‌ వేదికగా కేటీఆర్‌ స్పందించారు. ''స్వామి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఫ్లోరోసిస్‌ నివారణ, బాధితుల కోసం పోరాటం చేసిన గొప్ప యోధుడు ఆయన. ఎంతో మందికి ఆయన ప్రేరణ. స్వామి ఎప్పుడూ నా హృదయానికి దగ్గరగా ఉంటాడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి'' అని సంతాపం ప్రకటించారు.

గతంలో స్వామికి మంత్రి కేటీఆర్‌ ఇల్లు కట్టించారు. జీవనోపాధి కోసం ఆయనకు సెలూన్‌ ఏర్పాటు చేయించారు. మూడు నెలల క్రితం ఆయన ఇంటి గృహ ప్రవేశానికి కూడా కేటీఆర్‌ హాజరయ్యారు. ఆ సందర్భంగా దిగిన ఫొటోను కేటీఆర్‌ ట్విటర్‌లో షేర్‌ చేస్తూ మృతుడి కుటుంబానికి సానుభూతి తెలిపారు.

*సుజీవన్ వావిలాల*🖋️

No comments:

Post a Comment