Saturday, January 21, 2023

బిఎస్పి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన నిరసన దీక్ష విజయవంతం

*బిఎస్పి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన నిరసన దీక్ష విజయవంతం*

*అగ్రకుల పార్టీల్లోని బీసీలు నిజమైన బీసీలకు పుడితే బీసీల కోసం పోరాటం చేయాలని జర్నలిస్టు తెలంగాణ విట్టల్ డిమాండ్*

*బిజెపి కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు బీసీ వ్యతిరేక పార్టీలు జాజుల శ్రీనివాస్ గౌడ్*

*దీక్షలో పాల్గొన్న షాద్నగర్ బిఎస్పి నాయకులు*

భారతదేశంలో జనాభాలో 52 శాతం ఉన్న బీసీల రిజర్వేషన్ 27% నుండి 52 శాతానికి పెంచాలని బహుజన్ సమాజ్ పార్టీ హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ సికింద్రాబాద్ ఉమ్మడి జిల్లాల ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్ష కార్యక్రమం హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథులుగా బహుజన్ సమాజ్ పార్టీ బీసీ స్టీరింగ్ కమిటీ మెంబర్స్ డాక్టర్ సాంబశివ గౌడ్ చంద్రశేఖర్ ముదిరాజ్ శ్రీనివాస్ యాదవ్  తెలంగాణ విటల్ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పాల్గొని ప్రసంగించారు జనాభాలో మెజార్టీ శాతం ఉన్న బీసీలను అగ్రకుల పార్టీలు వాడుకొని అభివృద్ధిలో వెనక్కి నెట్టేస్తున్న విషయాన్ని గుర్తుతెరిగి బహుజన్ అంత ఏకమై బీసీల రిజర్వేషన్ను జనాభాకు తగ్గ స్థాయిలో సాధించుకోవడానికి ఏకం కావాల్సిన అవసరం ఆసన్నమైందని పేర్కొన్నారు అదేవిధంగా దేశ సంపదలో ఉత్పత్తిదారులుగా ఉన్నటువంటి బీసీలను అగ్రకుల పార్టీలు కుట్రపూరితంగా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ మోసం చేస్తున్నాయని విమర్శించారు,  అదేవిధంగా జర్నలిస్ట్ *తెలంగాణ విటల్* మాట్లాడుతూ అన్ని పార్టీల్లో ఉన్న బీసీ నాయకులు నిజమైన బీసీలకే పుడితే, బీసీల తరఫున గొంతేటి మాట్లాడాలని, వారి తరఫున పోరాటం చేయాలని, మీరు బీసీల తరఫున ఉంటారా చెంచాలుగా ఉంటారా తెలుసుకోవాలని సవాల్ విసిరారు,  అదేవిధంగా తెలంగాణ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు *జాజుల శ్రీనివాస్ గౌడ్* మాట్లాడుతూ బీసీలను గల్లీలో కేసీఆర్ మోసం చేస్తే, ఢిల్లీలో నరేంద్ర మోడీ బిజెపి పార్టీ మోసం చేస్తున్నారని ,ఇప్పటికైనా బీసీలు ఈ కుట్రలను పసిగట్టి అగ్రకుల పార్టీలైన బిజెపి కాంగ్రెస్ బిఆర్ఎస్ బీసీ వ్యతిరేక పార్టీలని, ఆ పార్టీలను పాతరేయాలని పిలుపునిచ్చారు, బీసీల తరఫున పోరాటం చేస్తున్న బీఎస్పీకి అండగా ఉండాలని , బీఎస్పీ పార్టీ జనాభాకు తగ్గ ఎమ్మెల్యే ,ఎంపీ సీట్లు ఇస్తుంటే, బిజెపి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఎందుకు ఇయట్లేదో బీసీలు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు, కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పి. లింగం , షాద్నగర్ నియోజకవర్గం అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ , ఫరూక్నగర్ మండల అధ్యక్షులు తుప్పరి కుమార్ ,కొత్తూరు మున్సిపాలిటీ అధ్యక్షులు గట్టు విష్ణు ,కొత్తూరు మున్సిపాలిటీ ఉపాధ్యక్షులు రేనెట్లా జలంధర్ గౌడ్ , వెలిజర్ల సెక్టార్ సెక్రెటరీ లింగారం లక్ష్మయ్య, బీఎస్పీ సీనియర్ నాయకులు దొబ్బల రమేష్ తదితరులు పాల్గొన్నారు

సుజీవన్ వావిలాల !

No comments:

Post a Comment