Friday, January 20, 2023

తిరుమలలో డ్రోన్ కలకలం....!

*తిరుమలలో డ్రోన్ కలకలం....!*

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయాన్ని డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరించిన వీడియో ఒకటి కలకలం సృష్టించింది. ఈ వీడియో శుక్రవారం సాయంత్రం సోషల్‌ మీడియాలో కనిపించడంతో తితిదే అధికారులు అప్రమత్తమయ్యారు.ఆగమశాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయంపై ఎటువంటి వస్తువులు ఎగరడానికి అనుమతిలేదు. విమానాలను సైతం శ్రీవారి ఆలయం వైపునకు వెళ్లకుండా చూడాలని గతంలోనే పలువురు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయంపై నుంచి డ్రోన్‌ ద్వారా చిత్రీకరించిన వీడియో ఓ వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేశారు. డ్రోన్‌తో చిత్రీకరించినా తితిదే విజిలెన్స్‌ అధికారులు గుర్తించలేకపోవడం భద్రతా వైఫల్యంగా భక్తులు భావిస్తున్నారు. శ్రీవారి ఆలయం ఎదుట గొల్లమండపంపై, శ్రీవారి ఆలయంపైన నిరంతరం భద్రతా సిబ్బంది నిఘా ఉంటుంది. అలాంటిది భద్రతా సిబ్బంది ఎవరూ ఈ డ్రోన్‌ చిత్రీకరణను గుర్తించలేకపోయారు. మరోవైపు తిరుమల వ్యాప్తంగా 1600కు పైగా సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి. అందులోనూ ఈ డ్రోన్‌ వ్యవహారం బయటపడకపోవడం గమనార్హం.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment