Tuesday, January 12, 2021

వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గం వార్తలు

*మాజీ మంత్రివర్యులు (తాండూర్ మాజీ శాసనసభ్యులు) పట్నం మహేందర్ రెడ్డి అన్న గారికి నమస్కారం 🙏*

*అన్న గారు ఈరోజు మీరు చెంగోల్ గ్రామంలో స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషం... అయితే మీతో ఒక వాస్తవ విషయం ఈ సందర్బంగా తెలియచేయాలని అనుకుంటున్నాను, గత నెలలో ప్రజా సంకల్పం బృందం రైతు సమస్యలను  ప్రభుత్వము ద్రుష్టికి తీసుకెళ్లాలని  వికారాబాద్ జిల్లా పర్యటనలో వున్నప్పుడు తాండూర్ నియోజకవర్గం లో కూడా పర్యటిచడం జరిగింది. అప్పుడు తాండూర్ పట్టణంలో  కొన్ని సమస్యలు ప్రజలు మా ద్రుష్టికి తీసుకొచ్చారు. అవి ఏమిటి అంటే పట్టణంలోని ప్రధాన రహదారి అయినటువంటి పోలీస్ స్టేషన్ చౌరస్తా నుంచి చించొలి రహదారి మొత్తం అధ్వన్నంగా అయిపొయి భారీ సిమెంట్ వాహనాలతో మొత్తం దుమ్ము దూళి తో స్థానిక ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురికావడం అలాగే రోగాల భారిన పడడం చూసి చాలా బాధేసింది. అప్పుడు మీకు మరియు ప్రస్తుత శాసనసభ్యులు రోహిత్ రెడ్డి గారి ద్రుష్టికి https://youtu.be/hp2Qhnbh_Hw ఈ వాస్తవాలతో కూడిన వీడియో విశ్లేషణ మీ ద్రుష్టికి సోషల్ మీడియా ద్వారా తెలియపరచడం జరిగింది. ఈరోజు వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం మీరు అదే రహదారి గుండా వెళ్లి చెంగోల్ లో కార్యక్రమంలో పాల్గొన్నారు ఇప్పుడైనా మీరు ప్రత్యక్షంగా చూసి వుంటారు. దయచేసి ఈ సమస్య పరిష్కారం మీరే చేయాలి అని ప్రజా సంకల్పం & link Media ద్వారా మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాము*

Note : మహేందర్ రెడ్డి అన్నగారి PA అంజిల్ రెడ్డి గారు మీరు తక్షణమే అన్న గారికి చెప్పి ఈ సమస్య పరిష్కారం అయ్యేలా బాధ్యత తీసుకోవాలి 👍🙏

*Copy to Group link Media*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment