Sunday, October 11, 2020

తెలంగాణ కరోనా పరీక్షలు

హైదరాబాద్ : 12/10/2020

*తెలంగాణ లో కొత్తగా 1,021 కరోనా కేసులు*
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది.నిన్న రాత్రి 8గంటల వరకు 30,210 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,021 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,13,084కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం బులిటెన్‌ విడుదలచేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో ఆరుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,228కి చేరింది. కరోనా బారి నుంచినిన్న ఒక్క రోజే 2,214 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,87,342కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 24,514 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 20,036 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్సపొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 35,77,261కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 228 కొత్త కేసులు నమోదయ్యాయి.

సుజీవన్ వావిలాల🖋️
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

No comments:

Post a Comment