Friday, October 16, 2020

తెలంగాణ కరోనా పరీక్షలు

హైదరాబాద్ : 17/10/2020

*తెలంగాణలో కొత్తగా 1,451కరోనా కేసులు*
తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల్లో కొత్తగా 1451 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,20,675కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్క రోజే కరోనాతో 9మంది మృతి చెందారు. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,265కి చేరింది. రాష్ట్రంలో 22,774 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 18,905 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. కరోనా బారి నుంచి నిన్న 1983 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,96,636కి చేరింది.

సుజీవన్ వావిలాల🖋️
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

No comments:

Post a Comment