Monday, October 12, 2020

తెలంగాణ కరోనా పరీక్షలు

హైదరాబాద్ : 13/10/2020

*తెలంగాణలో కొత్తగా 1,708కరోనా కేసులు*
తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 46,835 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,708 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,14,792కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో ఐదుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1.233కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 2,009 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,89,351కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 24,208 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 19,748 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 36,24,096కి చేరింది.

సుజీవన్ వావిలాల🖋️
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

No comments:

Post a Comment