Saturday, October 24, 2020

తెలంగాణ కరోనా పరీక్షలు

హైదరాబాద్ : 25/10/2020

*తెలంగాణ లో కొత్తగా 978 కరోనా కేసులు*
తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల్లో కొత్తగా 978 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,31,252కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో నలుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,307కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 1,446 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,10,480కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 19,465 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 16,430 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

జీహెచ్‌ఎంసీ పరిధిలో నిన్న ఒక్క రోజే 185 కేసులు నమోదయ్యాయి.

సుజీవన్ వావిలాల🖋️ 
ప్రజల పక్షం 

బాపట్ల కృష్ణమోహన్ 
ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment