Thursday, October 15, 2020

తెలంగాణ కరోనా పరీక్షలు

హైదరాబాద్ : 16/10/2020

*తెలంగాణ లో కొత్తగా 1,554 కరోనా కేసులు*
తెలంగాణలో నిన్న రాత్రి 8 గంటల వరకు 43,916 నమూనాలను పరీక్షించగా 1,554 మంది కరోనా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ సోకిన వారి సంఖ్య 2,19,224కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనా చికిత్స పొందుతూ 7 మంది మృతిచెందారు. దీంతో మరణించిన వారి సంఖ్య 1256కి చేరింది. కరోనా బారి నుంచి 1435 మంది కోలుకోగా.. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 19,4653కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 23,203 యాక్టివ్‌ కేసులుండగా.. 19,251 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 37,46,963 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.

సుజీవన్ వావిలాల🖋️
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

No comments:

Post a Comment