Tuesday, October 27, 2020

తెలంగాణ కరోనా పరీక్షలు

హైదరాబాద్ : 28/10/2020

*తెలంగాణ లో కొత్తగా 1,481 కరోనా కేసులు*
తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల్లో కొత్తగా 1,481 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,34,152కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో నలుగురు మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,319కి చేరింది. కరోనాబారి నిన్న ఒక్క రోజే 1,451 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,14,917 చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 17,916 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 14,883 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

సుజీవన్ వావిలాల🖋️ 
ప్రజల పక్షం 

బాపట్ల కృష్ణమోహన్ 
ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment