Saturday, May 25, 2024

_ఉమ్మడి ఖమ్మం జిల్లా రెవెన్యూలో.._*_భూ బకాసురుడు.!_*

_ఉమ్మడి ఖమ్మం జిల్లా రెవెన్యూలో.._
*_భూ బకాసురుడు.!_*
_💥 అసలు ఓనర్లను మార్చి.. ఏమార్చి_
_💥 డమ్మీలతో రిజిస్ట్రేషన్_
_💥 ఓనర్లకు భలే టోకరా_
_💥 తూ..తూ మంత్రంగా డబ్బులు ఇచ్చి మోసం చేసిన వైనం_
_💥 కోర్టు డిక్రీలలో సైతం ఫోర్జరీ సంతకాలు_
_💥 కోర్టు అంతర్జాలంలో ఈ మహనీయుడి కేసులు కనపడవు.!_

Courtesy / Source by :
_(వినయ్ భాస్కర్, 'తెలంగాణ వాచ్' ఖమ్మం ప్రత్యేక ప్రతినిధి)_

*_అతను ఓ రెవెన్యూ ఉద్యోగి. మంచి మాటకారి. మనుషులను మార్చి, ఏమార్చి, డమ్మీలతో ఏకంగా డాక్యుమెంట్ రిజిస్టేషన్ చేయడంలో మహా ముదురు. ఇతగారికి తోడుగా మరో ఇద్దరు తెరపైన ఆడుతుండగా, న్యాయస్థానంలో పని చేసే ఓ వ్యక్తి తెర వెనుక 'డ్రామా' నడిపించటం గమనార్హం._*

*https://telanganawatch.in/article.php?data=in-the-joint-khammam-district-revenue-bhu-bakasuradu*

*_అసలేం జరిగింది.?_*
_ఖమ్మం అర్భన్, వెలుగుమట్ల రెవెన్యూ పంచాయితీ, పుట్టకోట గ్రామంలో రెవెన్యూ రికార్డుల ప్రకారం మాదిరాజు రాం కిషన్ రావుకు సర్వే నెంబర్ 9/1లో రెండున్నర ఎకరాల భూమి ఉంది. ఈ భూమిపై 2005లో రెవెన్యూ శాఖలో పనిచేసే భూక్యా శ్రీరాం కన్ను పడింది. పావులు చాలా తెలివిగా, వేగంగా కదిపాడు. అనుభవదారుగా ఉన్న మంగయ్య, పట్టాదారు వారసులుగా ఉన్న రామకూరి దుర్గ, శివరాజు రామజ్యోతిలతో కలిపి డాక్యుమెంట్ (నెంబర్ 2906/2008) తనకు అనుకూలంగా ఉన్న సరిహద్దులతో రెండు ఎకరాల భూమిని రెవెన్యూ శాఖ ఉద్యోగి భూక్యా శ్రీరాం, కొత్తగూడెం గ్రామానికి చెందిన రావులపాటి శ్రీనివాస్ రావు, వడ్లమూడి సైదులు పేర్లతో రిజిస్ట్రేషన్ జరిగింది. ఇక్కడి వరకు గుట్టుగా బాగానే ఉంది._

*_11 ఏళ్ళ తర్వాత బయటకు పొక్కి...:_*
_సరిగ్గా 11 ఏళ్ళ తర్వాత అనగా 2019లో భూక్యా శ్రీరాం రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్ లో ఉన్న రామకూరి దుర్గను నేను కాదు, ఆ సంతకం నాది కాదంటూ అసలు వారసురాలు మార్చి 26, 2019న తన న్యాయవాది జి.సంజీవరెడ్డి ద్వారా నోటీసులు పంపటం జరిగింది. అంతే కాకుండా 2022లో పోలీసు ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేసింది._

*_తాజాగా...:_*
_ఇలాంటి నీచమైన పనులపై క్రిమినల్ కేసులు కాకుండా భూక్యా శ్రీరాం అండ్ గ్యాంగ్ బాగానే 'మేనేజ్' చేసినట్లు బాధితులు ఆరోపిస్తూ ఖమ్మం పోలీసు కమీషనర్ కు తాజాగా మరో ఫిర్యాదు అందింది. ఇది ఇలా ఉండగా తన ఫోర్జరీ డాక్యుమెంట్ తో భూక్యా శ్రీరాం వేరే సర్వే నెంబర్ భూమిని కబ్జా చేయడానికి వెళ్ళి, అక్కడ అల్లరి మూకలతో హల్చల్ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందటంతో ఓ క్రిమినల్ కేసు నమోదయింది. మరి ఖమ్మం జిల్లా కలెక్టర్, పోలీస్ కమీషనర్ లు భూక్యా శ్రీరాంపై ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూద్దాం._

*_ఓనర్లకు భలే టోకరా.!_*
_భూక్యా శ్రీరాం తెలివితేటలు వేరు. బహిరంగ మార్కెట్ లో సుమారు రూ. 4 కోట్ల విలువ చేసే ఈ భూమికి తూ..తూ మంత్రంగా డబ్బులు ఇచ్చి మోసం చేసిన వైనం ఈ సందర్బంగా వెలుగులోకి వచ్చింది. పట్టేదారులకు రూ.4 లక్షలు ఇచ్చినట్లు చెపుతుండగా అనుభవదారు మంగయ్యకు ఒక ఎకరం మాత్రమే రిజిస్టర్ చేసుకుంటున్నట్లు చెప్పి రూ.10 లక్షలు చెల్లించి రెండు ఎకరాలను రిజిస్టర్ చేసుకోవడం గమనార్హం. ఇదిలా ఉండగా అనుభవదారు చనిపోయేంత వరకు 'నయా మూఠా' ఆ ఊరి చుట్టుపక్కలకు కూడా రాలేదని అక్కడి రైతులు చెప్పటం కొసమెరుపు._

_బాక్స్:_
*_భూక్యా కేసులు మాత్రమే కనపడవు.!_*
_మనుషులను మార్చి రిజిస్ట్రేషన్ లకు తెగబడిన భూక్యా శ్రీరాం చాలా జాగ్రత్తగా వ్యవహరించేవాడు. ఎంత జాగ్రత్తగా అంటే ఈయన వేసిన కేసులు కానీ, ఈయన పైన వేసిన కేసుల వివరాలు న్యాయస్థానం అంతర్జాలంలో కనిపించకుండా చేశాడని హైకోర్టు రిజిస్టార్ కు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదులో ఫోర్జరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళా వారసురాలి భర్త తెర వెనుక ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ భూ కేసుకు ఎలాంటి సంబంధం లేకున్నా ఇతరులపై కేసు వేసి కోర్టు డిక్రీలు తప్పుడు పద్దతిలో పొందినట్లు పోలీసులకు ఓ ఫిర్యాదు ఇటీవలే అందింది._

No comments:

Post a Comment