Tuesday, February 28, 2023

సాత్విక్ ఆత్మహత్యపై సమగ్ర విచారణకు ఆదేశించిన.... మంత్రి సబిత....!

*సాత్విక్ ఆత్మహత్యపై సమగ్ర విచారణకు ఆదేశించిన.... మంత్రి సబిత....!*

హైదరాబాద్: నగరంలోని నార్సింగి కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి  ఆరా తీశారు.విద్యార్థి ఆత్మహత్యపై సమగ్ర విచారణ చేపట్టాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకోవాలని, పోలీసులు తమ దర్యాప్తును కొనసాగించాలని స్పష్టం చేశారు. వీలైనంత తొందరగా విచారణ నివేదిక అందించాలని ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్‌  కు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment