Wednesday, February 15, 2023

జర్నలిస్టులపై అట్రాసిటీ కేసుపై.... కీలక తీర్పు....!

*జర్నలిస్టులపై అట్రాసిటీ కేసుపై.... కీలక తీర్పు....!*

హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. జర్నలిస్టుల పై అట్రాసిటీ కేసు నమోదు చేయడాన్ని సవాలు చేస్తూ ఇద్దరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.దీనిపై ధర్మాసనం విచారణ జరిపింది. విధుల్లో ఉన్న జర్నలిస్టులకు ఎదుటివారు ఏ సామాజిక వర్గమో ఎలా తెలుస్తుంది? అని కోర్టు ప్రశ్నించింది. ఓ మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు ఎలా నమోదు చేస్తారని పోలీసుల (Police) ను నిలదీసింది. ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలంటే ఫిర్యాదుదారు ఏ సామాజికవర్గానికి చెందినవారో నిందితులకు తెలిసి ఉండాలని, కానీ ప్రస్తుత కేసులో ఫిర్యాదుదారు కులం గురించి విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులకు తెలియదని అభిప్రాయపడింది. అందువల్ల జర్నలిస్టులపై ఎస్సీ, ఎస్టీ కేసు చెల్లదని న్యాయస్థానం స్పష్టం చేసింది. తమపై ఎస్సీ, ఎస్టీ చట్టం సెక్షన్ 3(2)(ఎ) కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ ఇద్దరు జర్నలిస్టులు హైకోర్టును ఆశ్రయించగా మంగళవారం ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎం. మానవేంద్రనాథ్ రాయ్ విచారణ జరిపారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment