Sunday, February 12, 2023

డాక్టర్ కందాల శోభారాణి గారు కొద్దిసేపటి క్రితం తీవ్ర అనారోగ్యంతో వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు.

కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగం  అధ్యాపకురాలు డాక్టర్ కందాల శోభారాణి గారు కొద్దిసేపటి క్రితం తీవ్ర అనారోగ్యంతో వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు. వీరిది పాపయ్యపేట గ్రామం, చెన్నారావుపేట మండలం ,వరంగల్ జిల్లాకు చెందిన వారు. కాకతీయ యూనివర్సిటీలో తెలుగు విభాగంలో పి.హెచ్.డి. పూర్తి చేసి, అధ్యాపకురాలిగా కొనసాగుతూనే మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షురాలిగా పనిచేశారు. ఆదివాసి, ప్రజల హక్కుల  రక్షణ కోసం తుదికంఠ పోరాడారు. అనేక రచనలు ,కవిత్వాలు రాసి తెలుగు సాహిత్యాభివృద్ధి వికాసానికి కృషి చేశారు. సమాజ అభివృద్ధికి అడ్డంకిగా మారిన కులం, మతం, దోపిడీ, పీడన, వివక్షత, అణచివేత , పితృ స్వామ్య వ్యవస్థ లేని సమ సమాజ స్థాపన కోసం తుది కంఠ పరితపించారు. ఈమె భర్త   టి.రమేష్ గతంలో PDSU ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. ప్రస్తుతం సామాజిక ఉద్యమాల్లో కొనసాగుతున్నారు. వీరికి ఒక బాబు కౌశిక్ ఉన్నారు.
డాక్టర్ శోభారాణి మృతి పట్ల కాకతీయ విశ్వవిద్యాలయం అధికారులు, అధ్యాపకులు ,సిబ్బంది, అరసంతో పాటు పలు సంఘాల నాయకులు, పరిశోధక విద్యార్థులు తమ ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేశారు. ఆమె మరణానంతరం ఆమె భౌతిక కాయాన్ని ఆమె కోరుకున్నట్లు కాకతీయ మెడికల్ కళాశాలకు అప్పగించనున్నారు. ప్రజల సందర్శనార్థం ఆమె భౌతిక కాయాన్ని రేపు ఉదయం 11 గంటల వరకు వారి గృహం యందు వుంచుతారు.
అడ్రస్ : కాకతీయ యూనివర్సిటీ రెండవ గేటు,కనకయ్య హోటల్ వెనక, హనుమకొండ.
🌹🌹🌹 ✊✊✊

No comments:

Post a Comment