Thursday, February 2, 2023

గ్రూప్ 4 పరీక్ష తేదీని ప్రకటించిన.... టీఎస్ పీఎస్ సీ.....!

*గ్రూప్ 4 పరీక్ష తేదీని ప్రకటించిన.... టీఎస్ పీఎస్ సీ.....!*

హైదరాబాద్‌:రాష్ట్రంలో నిర్వహించనున్న గ్రూప్‌-4 పరీక్ష తేదీని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) గురువారం ప్రకటించింది.జులై 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్‌-1 పరీక్ష.. పరీక్ష మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-1 పరీక్ష ఉటుందని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్‌ భాషల్లో ఈ పరీక్ష ఉంటుంది.

కాగా గ్రూప్-4 నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లోని 9,168 పోస్టుల్ని ప్రభుత్వం భర్తీ చేయనుంది. వీటిలో ప్రధానంగా జూనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అకౌంటెంట్‌, వార్డ్‌ ఆఫీసర్‌ తదితర ఉద్యోగాలు ఉన్నాయి. వీటి కోసం గత డిసెంబర్‌లో 1న నోటిఫికేషన్‌ జారీ చేయగా.. ఇప్పటి వరకు 9 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రేపటితో(ఫిబ్రవరి 3)గ్రూప్‌-4 దరఖాస్తు గడువు ముగియనుంది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment