Sunday, June 7, 2026

_సీఎం బందోబస్తు విధులు ముగించుకొని తిరుగు ప్రయాణంలో వస్తుండగా దుర్ఘటన_

*పిడుగుపాటుకు గురై ఏఆర్ కానిస్టేబుల్ రాజు మృతి*

*సీఎం బందోబస్తు విధులు ముగించుకొని తిరుగు ప్రయాణంలో వస్తుండగా దుర్ఘటన*
 
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 6:

బందోబస్తు విధులు ముగించుకొని తిరిగి వస్తుండగా పిడుగుపాటుకు గురై ఏఆర్ కానిస్టేబుల్ రాజు మృతి.కానిస్టేబుల్ రాజు  కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన జిల్లా ఎస్పీ.డాక్టర్.సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ IPS.నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం ఉల్పారా గ్రామానికి చెందిన మద్దమల్ల.రాజు 2014 బ్యాచ్ ఏ ఆర్ కానిస్టేబుల్ గా ఎంపికై నాగర్ కర్నూల్ ఆర్మూడ్ రిజర్వులో విధులు నిర్వర్తిస్తున్నాడు.గత రెండు రోజులుగా సీఎం బందోబస్తు నిమిత్తం సోమశిల లో విధులు నిర్వర్తిస్తున్నారు.శుక్రవారం సాయంత్రం బందోబస్తు విధులు ముగించుకొని తిరుగు ప్రయాణంలో వస్తుండగా  మామిళ్ళపల్లి గ్రామం సమీపంలో  పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మరణించడం జరిగింది.ఈ సమాచారం అందుకున్న ఉప్పునుంతల పోలీసులు మృతదేహాన్ని నాగర్ కర్నూల్ గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు.ఈ సంఘటనపై జిల్లా ఎస్పీ  గారు స్పందిస్తూ జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వెళ్లి  ఏఆర్ కానిస్టేబుల్ రాజు పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించినారు.వారి యొక్క కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యాన్ని చెప్పడం జరిగింది.అలాగే రేపు వారి యొక్క స్వగ్రామమైన ఉల్పర గ్రామం వంగూరు మండలం నందు ప్రభుత్వ లాంఛనాలతోటి అంత్యక్రియలు జరుగుతాయని తెలిపారు.

No comments:

Post a Comment