*పిల్లల చదువు వ్యాపారం కాకూడదు, పారదర్శకత ఉండాలి*
*తల్లి తండ్రలపై అదనపు ఆర్థిక భారమే*
*ఈ అంశంపై విచారణ జరగాలి అని బాలల హక్కుల సంఘం డిమాండ్*
*అనురాధ రావు అధ్యక్షులు - బాలల హక్కుల సంఘం*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 23:
పిల్లల చదువు పేరుతో తల్లితండ్రల జేబు ఖాళీ చేస్తున్నాయి విద్యాసంస్థలు. బత్తిడి చేసి బయట 20 రూ|| దొరికే నోటు పుస్తకం - 40రూ॥లకు అమ్ముతున్నారు వీళ్లు. ఇది చాలా తీవ్రమైన విషయం.ఇటీవల సోషల్ మిడియాలో కొన్ని విడియోలు వైరలు అవుతున్నాయి, ప్రైవేటు స్కూల్స్, కాలేజేలకి సంబంధించినవి. వీటిలో భారిగా స్టేషనరీ నిలవలు, యూనిఫాం, బ్యాగులు, సాక్స్ కనిపిస్తున్నాయి. ఈ సంస్థలు అన్నీ కూడా బాగా పేరు పొందినవే. (Narayana school kothapet, Sloka International school, Sri Triveni school, Pulla Reddy Memorial school, Dilshuknagar Public school, Srichaitanya) etc...ఒకవేళ పేరెంట్ బయట కొంటే ప్రధానోపద్యాయులే పేరెంట్స్ పై తిరగబడిన సంఘటనలు కూడా చూస్తున్నం.మీరు ఇక్కడే కొనాలి అని, అన్నింటిపై వీరి సంస్థ బ్రాండ్ ప్రింట్ చేసి అమ్మకాలు చేస్తున్నారు. ఇది తల్లి తండ్రలపై అదనపు ఆర్థిక భారమే కదా.
విద్యారంగం సేవారంగంలో ఉండాలి, కాని పూర్తి వ్యాపర రంగంగా మార్చేశారు.అధికారుల కళ్ళు మూతలు పడ్డాయా? వీళ్ల దృష్టిలో లేదు అని అనుకోవడం తప్పు, సోషల్ మీడియా లో వైరల్ అవుతుంటే ఏ ఒక్క అధికారికి తెలియదు అని అనుకోకుండా ఉండలేం.పూర్తిగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది .ఈ వైరల్ విడియోల ఆరోపణలపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి, మన ముఖ్యమంత్రి గారు, అధికారాలు స్పందించాలని, వీరిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూన్నది బాలల హక్కుల సంఘం.రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలి.
బలవంతపు స్టేషనరీ అమ్మకాలు జరుగుతున్న విషయంపై విచారణ చేయాలి.మార్కెట్ ధరలకంటే అధిక ధరలతో విక్రయిస్తున్న వీరిపై చర్యలు తీసుకోవాలి.తల్లి తండ్రులు ఎంపిక చేసుకునే హక్కును రక్షించాలి.పిల్లల చదువు వ్యాపారం కాకూడదు, పారదర్శకత ఉండాలి. ఈ అంశంపై విచారణ జరగాలి అని బాలల హక్కుల సంఘం డిమాండ్
No comments:
Post a Comment