*జూన్ 12న ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం...*
*బాల కార్మికం కాదు - బాల్యాన్ని హత్య చేయడం*
*బాలకార్మిక వ్యవస్థను రూపు మాపాలి - అనురాధ రావు బాలల హక్కుల సంఘం*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 11:
పాలు కావలని అడిగే చేతులు - పనిముట్లను,ఇటుకలను మోస్తున్నాయి, ఇది బాల కార్మికం కాదు - బాల్యాన్ని హత్య చేయడం. *International labour Organization* 2003 లో బాలకార్మిక వ్యవస్థను రూపు మాపడానికీ, దీని గురించి అవగాహనకల్పించడం, కావల్సిన చర్యలు తీసుకోవడానికి ఈ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవాన్ని ప్రారంభించింది.138 మిలియన్ పిల్లలు అంటే 13.8 కోట్ల చిన్నారులు బాల కార్మికులుగా మగ్గుతున్నారు. దీంట్లో 54 మిలియన్ / 5.4 కోట్ల మంది చిన్నారులు హానికరమైన పనుల్లో బలైతున్నారు.ఒక చిన్నారి రాత్రి 12 గంటల వరకు పని చేసి, ఉదయం పుస్తకాల సంచితో స్కూల్ కు వెళ్ళితే, ఆ బ్యాగు బరువు పుస్తకాలది కాదు, తన బాల్యానిది.చాలా వరకు చిన్న పిల్లలు పాలకోసం లేస్తారు కాని, ఈ చిన్నారులు పనికోసం లేస్తున్నారు. వీరిచేతుల్లో పుస్తకాలకు బదులుగా స్తుత్తి, పార, ఇటుకలు మోస్తూ, హోటల్స్లో టీ కప్పులు కడుగుతూ, ప్లేట్లు తీస్తు కనిపిస్తారు, ఇండ్లల్లో పనులు చేస్తూ ఉంటారు.కారణం పేదరికం, అనాధలుగా మరడం, ప్రజల్లో అవగాహన లేకపోవడం, ట్రాఫికింగ్ కు గురి కావడం.ప్రజల్లో అవగాహన కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయి, ప్రభుత్వ పథకాలు పేద ప్రజలకు అందడం లేదు. అధికారుల నిర్లక్ష్యం స్పష్టం గా కనబడుతోంది.మన దేశంలో ప్రతి ఆరునెలలకు ఒక రిస్క్యు ఆపరేషన్ జరుగుతుంది, జులై నెలలో ఆపరేషన్ ముస్కాన్, జనవరిలో ఆపరేషన్ స్మైల్. దీంట్లో తప్పిపోయిన చిన్నారులను, బాలకార్మికులను రెస్క్యూ చేసి వారి వారి తల్లిదండ్రులకు అప్పగిస్తారు.కాని సంవత్సరాలు మారుతున్నాయి,
బాలకార్మిక వ్యవస్థలో మార్పు లేదు. ఆపరేషన్ ముస్కాన్లో దొరుకుతున్నారు, ఆపరేషన్ స్మైల్లో దొరుకుతున్నారు. అది
ఒక మొక్కుబడి కార్యక్రమం అని అనుకోవచ్చు. కారణం ప్రతి సంవత్సరం సంఖ్య పెరుగుంతుంది.మన దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎక్కువ బాలకార్మికులు ఉన్నారు, వారు ఇతర రాష్ట్రాలకు కూడా ముఠాలు తీసుకుని వెళుతాయి. బీహార్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్ మరియు మహారాష్ట్ర.ప్రతి చిన్నారి స్కులుకు వెళ్లాలి, బాల కార్మిక వ్యవస్థ నుండి విముక్తి కల్పించాలి.బాల కార్మికులను పనిలో పెట్టుకున్న యాజమాన్యాన్ని, వారి ఫ్యాక్టరీలను/ సంస్థలను ఇటుక బట్టీలు, నిర్మాణ సంస్థలు, హోటల్స్, గాజుల ఫ్యాక్టరీలు, ముఖ్యంగా బాణసంచా తయారు చేసే ఫ్యాక్టరీలు ఏవైనా సరే సీజ్ చేసి కఠినంగా శిక్షలు,భారి జరిమాన విధించాలి.ప్రతిఒక్కరు తమ బాధ్యతగా ప్రతిజ్ఞ చేయాలి ,నా చుట్టూ ఉన్న పిల్లలను పని చేయకుండా స్కూల్ కు పంపుతాను అనే ప్రతిజ్ఞ చేద్దాం. ఆటపాటలతో వారి బాల్యాన్ని కాపాడటానికి మన వంతు కృషి చేద్దాం. బాల్యాన్ని చిదిమి వేయకుండా బడికి వెళ్లే విధంగా చుద్దాం - వారికి చేయుత నిద్దాం.
No comments:
Post a Comment