Wednesday, June 24, 2026

*డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ సందర్భంగా నివాళులు అర్పించిన బీజేపీ తెలంగాణ అధ్యక్షులు ఎన్.రామచందర్ రావు*

*డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ సందర్భంగా నివాళులు అర్పించిన బీజేపీ తెలంగాణ అధ్యక్షులు ఎన్.రామచందర్ రావు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 23:

జ్వలంత జాతీయవాద చింతకుడు, గొప్ప విద్యావేత్త, భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, మన మార్గదర్శకులు పూజ్య డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ సందర్భంగా, నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచందర్ రావు.ఈ సందర్బంగా రామచందర్ రావు మాట్లాడుతూ “ఒక దేశం, ఒక జెండా, ఒక రాజ్యాంగం” అనే దృఢ సంకల్పంతో, మాతృభూమి భారతదేశ ఐక్యత మరియు సమగ్రత కోసం డా. ముఖర్జీ గారు తన ప్రాణాలను అర్పించారు అని అన్నారు. ఆయన జీవిత త్యాగం, ధైర్యం, తపస్సు మరియు అచంచల దేశభక్తి చిరస్మరణీయ గాథగా నిలిచింది.జాతీయ ఐక్యత, సాంస్కృతిక వైభవం మరియు దేశ సంక్షేమం పట్ల ఆయన చూపిన నిబద్ధత ప్రతి భారతీయుడికి నిరంతరం స్ఫూర్తినిస్తుంది అని అన్నారు. ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ లక్ష్యం వైపు మనం ముందుకు సాగుతున్న ఈ ప్రయాణంలో, ఆయన ఆదర్శాలు ప్రతి అడుగులోనూ మనకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి అని అన్నారు.భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే త్యాగం, పోరాటం చేసిన ఈ మహనీయ జాతీయ నాయకుడికి పునఃపునః వందనాలు సమర్పించారు.ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్లు శ్రీ సీహెచ్. విద్యాసాగర్ రావు గారు, శ్రీ బండారు దత్తాత్రేయ గారు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment