Tuesday, March 26, 2024

భుజంగారావు...భూదందాలు, సెటిల్మెంట్ లు..అక్రమ ఫోన్ ట్యాపింగ్

భుజంగారావు.. ఈయన పేరు వింటేనే గుర్తుకొచ్చేది భూదందాలు, సెటిల్మెంట్ లు. అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తమ వెల్మ సామాజిక వర్గానికి చెందిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కవిత, ఎర్రబెల్లి దయాకర్ రావు, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు తదితరుల అండదండలతో తన అవినీతికి భూకబ్జాలకు, హవాలా, సెటిల్మెంట్ లకు అంతు లేకుండా పోయింది. తమ వెల్మ సామాజిక వర్గాల వారికి ఏ ఇబ్బంది వచ్చినా అండగా ఉంటూ సెటిల్మెంట్ లు చేసేది. తన అక్రమ సంపాదనతో వందల కోట్లు వెనకేసుకొని గిట్టని వారి మీద తన కండకావరాన్ని ప్రదర్శించేదని చెబుతుంటారు. ఎస్సై నుండి ASP దాకా ఎదిగిన భుజంగారావు ఇప్పుడు అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయి ఊచలు లెక్కబెడుతున్న ఈ భుజంగారావు భాగోతాలు చూస్తుంటే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతుంది. డిపార్ట్మెంట్ లోకి రాకముందు మిర్యాలగూడ లో సినిమా టికెట్లు అమ్మేవాడంట. ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తి చేసి మొదటి పోస్టింగ్ ఎస్సై గా మల్కాజిగిరి పీఎస్ లో చేశాడు. ఆ తర్వాత నాచారం పీఎస్ లో విధులు నిర్వర్తిస్తూ  భూకబ్జాలకు భీజం వేశాడు. రామకృష్ణ అనే వ్యక్తి ద్వారా రెండు వేల గజాల పార్క్ స్థలాన్ని కబ్జా చేసి కోట్లకు పడగెత్తాడు. ఆ తర్వాత వనస్తలిపురం అక్కడ నుండి మాదాపూర్‌ పోలీస్ స్టేషను కు సీఐ గా ప్రమోషన్ పొంది ఆ ఏరియా లో ఇద్దరు రిటైర్డ్ సర్వేయర్లను నియమించుకొని తన భూదందాలకు మరింత పదును పెట్టి తన భూదందాలకు సెటిల్మెంట్ లకు అంతు లేకుండా పోయేది. ఆ తర్వాత భువనగిరి డీఎస్పీగా కొనసాగుతూ నయూం కేస్ విషయంలో విచారణ అధికారిగా కొనసాగుతూ టాస్క్ ఫోర్స్ DCP గా ఉన్న రాధాకృష్ణన్ అండదండలతో పలువురు ఎస్సై లను సీఐ లను తమ ఏజెంట్లు గా పెట్టుకుని నయూం అక్రమ ఆస్తులను కొన్ని తారుమారు చేసి వందల కోట్ల రూపాయలు వెనకేసుకుని దాదాపుగా పది ఇండ్లు కొన్నాడు. ఇతడికి ముగ్గురు భార్యలు. రేవంత్ రెడ్డి Anumula Revanth Reddy  గారికి వ్యతిరేకంగా ఫోన్ ట్యాపింగ్ చేసి కేసులో అడ్డంగా బుక్ అయిన అతడు రేపో మాపో ఏసీబీ విచారణ ను ఎదుర్కొని ఈడీ నజర్ పడే అవకాశం ఉంది.
Courtesy / Source by :
https://twitter.com/sreereddi77/status/1772560376392982741?t=AxbdFeWjZzo8GZNNLq1dUA&s=19

No comments:

Post a Comment