Friday, November 4, 2022

విద్యాశాఖలో ‘స్మార్ట్ క్లాస్’ స్కాం

*_ఫైనాన్స్ నుంచి క్లియరెన్స్ ఎంత? బిడ్డింగ్ ఎంత.?_*
_◆ విద్యాశాఖలో ‘స్మార్ట్ క్లాస్’ స్కాం_
_◆ పైకి ఓసీబీ పేరుతో బిడ్డింగ్_
_◆ లోపల ఓఈబీతో ఆంధ్రావాళ్లకు కాంట్రాక్టులు_
_◆ రూ.1.25 లక్షల ఐఎఫ్పీకి రూ.3.50 లక్షలు_
_◆మూడు నెలల ముందు నుంచే సెల్‌ కాన్ దోస్తానా!_
_◆ మొబైల్ కంపెనీకి కొమ్ముకాస్తున్న మంత్రి ?_

Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009 'తెలంగాణ వాచ్' కోసం ప్రత్యేకం)_*

*_ఇప్పటికే అప్పులతో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ రాష్ట్రంలో డబ్బు ఆదా చేయాల్సింది కాగా... అదనంగా ఖర్చు చేస్తున్న వైనాలు ఎన్నో.. ఎన్నెన్నో. తాజా ఉదాహరణ..విద్యా శాఖలో ‘స్మార్ట్ క్లాస్’ విధానంలో కుంభకోణం ఇది. ఓవైపు విద్యాశాఖ కఠిన నిబంధనలు పెడుతూనే మరోవైపు తమకు అనుకూలమైన ఆంధ్రా కంపెనీలకు వందల కోట్లు ముట్టజెప్పేలా వాటిని మార్చింది. ఇప్పటికే హోర్డింగ్స్ ప్రచారాన్ని వదలకుండా రూ.3 కోట్ల విలువైన కార్లను వరంగల్ జిల్లా మంత్రి గిఫ్ట్ గా తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. పైకి ఓసీబీ(ఓపెన్ కాంపిటెటివ్ బిడ్డింగ్) పేరుతో బిడ్డింగ్ పిలిచినా లోపల మాత్రం ఓఈఎం(ఒరిజినల్ ఎక్విప్ మెంట్ మ్యానుఫ్యాక్చర్) పేరుతో తమకు అనుకూలంగా ఉన్నవారికి కట్టబెట్టేలా నిబంధనలు తయారు చేశారు. ఐఎఫ్‌పీ(ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్) అంటే క్లాస్ రూంలో స్మార్ట్ టీవీలాగా పనిచేస్తుంది. ఈ ప్యానెల్‌ ను మల్టీ పర్పస్‌ లా వాడుకోవచ్చు._*

*_అసలేం జరిగిందంటే..?:_*
ఇవి 8, 9, 10 తరగతి గదుల్లో 4,660 స్కూల్స్‌ కు అందించాలంటే సుమారు 14 వేల ఐఎఫ్‌పీ కావాలి. వీటి ధర మార్కెట్లో ఏడాది క్రితం రూ.3.5 లక్షలు ఉండేది. కానీ, ఇప్పుడు అవి లక్ష నుంచి లక్షా యాబై వేలకు అందుబాటులో ఉన్నాయి. మ్యాక్స్ హబ్, వీవీటెక్ కంపెనీలు 14 వేల ఐఎఫ్‌పీలకు ఇంకా తక్కువ ధరలోనే సరఫరా చేసే అవకాశాలు ఉన్నాయి. అన్ని విమానాశ్రాయల్లో కనిపించే తైవాన్ కంపెనీ డెల్టా ఐఎఫ్‌పీ లక్ష రూపాయలకు ఇతర చోట్ల సరఫరా చేసింది. కానీ, తెలంగాణ విద్యా శాఖ మాత్రం 'స్పెషలైజేషన్' అంటూ ఒక్కొక్క ప్యానెల్ బోర్డుకు అదనంగా రూ.2 లక్షలకు పైగా దోచిపెడుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి.

*_ఇది సాధ్యమేనా..?:_*
నిబంధనల ప్రకారం.. టెండర్‌ లో పేర్కొన్న వస్తువులు ఇక్కడే తయారు కావాలి. రెండు మూడు కంపెనీలు 'టై అప్' అయి ఇలాంటి టెండర్లలో పాల్గొంటాయి. ఇలా ఆయా కంపెనీలు ఒప్పందాల కోసం కలిసిపోయి టెండర్లలో పాల్గొంటాయి. 

*_గతంలోనూ ఇదే తంతు:_*
గతంలోనూ 'మన ఊరు-మన బడి' మూడు టెండర్లలో అలానే చేశారు. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ లోనూ ఇదే జరిగింది. వారు అనుకున్న వారికే ఇచ్చినా.. మరి ఇంత స్మార్ట్ గా చేసుకోలేదు. విద్యా శాఖ ఇచ్చిన టెండర్ల నోటిఫికేషన్ ప్రకారం ఓఈఎం అర్హత సామ్ సాంగ్, ఎల్జీ కంపెనీలకే ఉంది. అయితే, వీరి వద్ద నుంచి 3 నెలల ముందే సెల్‌ కాన్ అనే మొబైల్ కంపెనీకి చెందిన వారు తమకు తప్ప.. ఎవరికి ఐఎఫ్‌పీ‌లు అమ్మరాదని అగ్రిమెంట్ చేసుకున్నారు. దీంతో పది రోజుల క్రితం నోటిఫికేషన్ విడుదల చేశారు.

*_ఏస్కో నా రాజా..!:_*
సెల్‌ కాన్ కు అన్ని ప్రాంతాల్లోనూ వారి మొబైల్ ఫోన్ షాపులైన సెలక్ట్ షోరూంలు ఉన్నాయి. ఇంకేముంది అన్ని అనుకున్నట్లే చకచకా జరిగిపోతున్నాయి. టెండర్ వచ్చాక 15 రోజుల్లో సరఫరా పూర్తి చేయాలి. 60 రోజుల్లో అన్ని స్కూల్స్ లో 'ఫిట్టింగ్ చేయాలి' అని పేర్కొన్నారు. వడ్డించే వాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా కంచం నిండుతుందని చెప్పడానికి ఇదే మంచి ఉదాహరణ. ఇలా మూడు నెలల క్రితమే టెండర్లను కావాల్సిన వారికి ఇచ్చేసి.. పనులు ప్రారంభించుకుని పేరుకు మాత్రం 'ఓపెన్ కాంపిటేషన్ బిడ్డింగ్' అంటూ డ్రామాలతో 'స్మార్ట్'గా కుంభకోణానికి పాల్పడుతున్నారని అంటున్నారు.

*_కుమ్ముడే కుమ్ముడు..:_*
కాంట్రాక్టర్‌ కు చేసిన మేలుకు బదులుగా మూడో కంటికి తెలియకుండా డబ్బులు అధికార పార్టీ నేతలకు చేరాలి. అది ఆంధ్రా కాంట్రక్టర్స్‌ కే చెల్లుతుంది. ఆ లాబీయింగ్ వారికే సాధ్యమవుతుంది. దీంతో టీఆర్ఎస్ ప్రభుత్వం వారినే నమ్ముకుంది. అందుకే టెండర్లు వారికే దక్కేలా పక్కా ప్లాన్ తో ప్రభుత్వం ముందుకు వెళుతోంది. స్మార్ట్ గా విద్యాశాఖలో ఈ స్కాంని సెల్‌ కాన్ మొబైల్ వారికి అప్పగించి, వందల కోట్ల రూపాయలు వారికే మేలు జరిగేలా చేస్తున్నారు. నీళ్లు, నిధులు, నియామాకల్లోనూ జరిగే టెండర్ల పక్రియలో ఎక్కడ చూసినా టీఆర్ఎస్ నేతలకు అనుకూలంగా వున్న వారిదే హవా? ఓపెన్ బిడ్డింగ్ వ్యవహారాల రహస్యాల చిట్టాలు తొలివెలుగు మీ ముందు ఉంచుతూనే ఉంది.

మొయినాబాద్ పామ్‌హౌస్ కేసు విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

*సోమవారానికి వాయిదా వేసిన హైకోర్ట్*

మొయినాబాద్ పామ్‌హౌస్ కేసు విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.హైదరాబాద్: మొయినాబాద్ పామ్‌హౌస్  కేసు విచారణను హైకోర్టు  సోమవారానికి వాయిదా వేసింది.ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. రిప్లై ఇచ్చేందుకు ప్రతివాదులు హైకోర్టును గడువు కోరారు. దీంతో ధర్మాసనం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. కోర్టుకు సమర్పించిన వీడియో క్లిప్పింగ్స్‌ను అనుమతించాలని హైకోర్టు రిజిస్ట్రీకి న్యాయస్థానం ఆదేశించింది.

*సుజీవన్ వావిలాల🖋️* 

Thursday, November 3, 2022

మునుగోడు ఎన్నికలు - ఎలక్షన్ అధికారులు

https://twitter.com/Praja_Snklpm/status/1588073239330230272?t=lld8M6CODJuDATKWx8wC0g&s=08                                                                  *#మునుగోడు ఓటరు మహాశయులు ఇచ్చే తీర్పు రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలకు గుణపాఠం కాబోతుంది. ఓటింగ్ శాతం ఏ ఏ పార్టీ కి ఎంత వస్తుందో చాలా ముఖ్యం.*

*ఏది ఏమైనా #MunugodeBypoll లో విచ్చలవిడిగా మద్యం / డబ్బులు పంపిణీ చేస్తున్నా,#సోషల్ మీడియా వేదికగా @CEO_Telangana & @ECISVEEP అధికారులకు తెలియచేసినా మౌనంగా వున్నారు ఎందుకు??*
*Note* : *ప్రజాస్వామ్యబద్దంగా జరగాల్సిన ఎన్నికలు ఎలక్షన్ అధికారుల బాధ్యతరహిత్యం వల్ల అడ్డదారులు తొక్కింది*
*#askktr*
*Bplkm🪶*

Wednesday, November 2, 2022

అతి మంచితనమే అతగాడి బలహీనత

*చెర్లపల్లి జైలులో...*
*_దురదృష్టవంతుడు_*
_◆ దోషి కాని నిందితుడు.!_
_◆ ఎవరికి చెప్పినా నమ్మరు.!_
_◆ అతి మంచితనమే అతగాడి బలహీనత.!_
_◆ ట్రాప్ అయ్యాడు.!_

Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 944 000 0009 'తెలంగాణ వాచ్ ' కోసం ప్రత్యేకం)_*

*_అతనో మధ్య తరగతి మనిషి. దీన స్థితిలో కష్టపడి చదివాడు. చూస్తుండగానే తల్లిదండ్రులు దూరంగా జరిగారు. భార్యబిడ్డలే ప్రపంచం. అందర్నీ నమ్మే నైజం. అతని సహజ లక్షణం. ఇదే శాపంగా మారింది. దోషి కాకున్నా.. అతడు నిందితుడే.! ఉండేది మాత్రం చర్లపల్లి జైలులోనే..! అయితే  అతను జీవితశిక్ష పడిన ఖైదు కాదు. కనీసం రిమాండ్ ఖైదీ అంతకన్నా కాదు. చేయని నేరాలకు మానసిక శిక్ష అనుభవిస్తున్న కలియుగ ఖైదు ఉద్యోగి జీవిత కథ. అక్కడ పనిచేసే జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ విషాద గాథ ఇది._*

*_అసలేం జరిగిందంటే..?_*
సాటి మనిషికి సహజంగా ఉపయోగపడాలనే తాపత్రయం. ఆయన కొంప ముంచింది. మంచుతోంది. ముంచేస్తోంది కూడా. (ఈ కథనం రాకుంటే..) అష్టకష్టాలు పడి చదువుకొని.. దిగజారిన పరిస్థితుల మధ్య ఉద్యోగం కోసం అర్రులుచాసి.. ఎట్టకేలకు జైలులో ఓ సామాన్య ఉద్యోగం. సీనియారిటి మధ్యలో అక్కరకు రాకున్నా..అనుకోని పదోన్నతి. జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ గా బాధ్యతలు. ఓ సైబర్ బ్యాచ్ ఇతగాడిని ట్రాప్ చేసింది. ఓ లక్ష కాజేసింది. పాత కేసు ఒకటి బయటకు వచ్చింది. అంతే.. జైలు నుంచి గెంటేసి.. ఉన్నతాధికారులు బయట బాధ్యతలు అప్పగించారు. ఆయన పేరు దశరథ్. జస్ట్ చింతల దశరథ్ మాత్రమే.!

*_కొసమెరుపు_*
ఈ రచయిత నిజమైన రాతలకు భయపడిన ప్రభుత్వం 53 రోజులు నిర్భంధం విధించిన సమయంలో... ఆయన సిసి పుటేజీల పర్యవేక్షణ చేసి.. 'డ్రై ఫ్రూట్స్' తప్ప ఓ మెతుకు మింగిన వైనాన్ని ఉన్నతాధికారులకు నివేదించిన అధికారులలో ఇతను ఒకరు కావడం యాదృచ్చికం. అదో నరకం..అయినా జర్నలిజం నిబంధనల మేరకు నిజాలను మాత్రమే వెలుగులోకి తేవటం ఓ జర్నలిస్ట్ సామాజిక కర్తవ్యం. అందుకే ఈ నిఖార్సయిన కథనం.

*_అంకితం_*
_వార్తలు రాసినందుకే... 8, 53, 17.. మొత్తం 78 రోజులు జైలులో నిర్భంధించిన 'తెలంగాణ దొర'కు ఈ కథనం అంకితం. ధన్యవాదాలు_

బాక్స్ 1:
*_ఎలా ట్రాప్ అయ్యాడు..?_*
సైబర్ నేరగాళ్ల బారినపడి చర్లపల్లి జైలు ఉన్నతాధికారి ఒకరు దాదాపు లక్ష రూపాయలు సమర్పించుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న ఒక అధికారికి  ఇటీవల ఫోన్ చేసిన కొందరు యువతులు ఆయనతో చాటింగ్ చేశారు. ఆ తర్వాత నగ్నంగా వీడియో కాల్‌లో  మాట్లాడారు. ఆయనతోనూ అలాగే మాట్లాడించారు. దానిని రికార్డు చేసిన నేరగాళ్లు ఆ తర్వాత అసలు రూపం బయటపెట్టారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. వారి బెదిరింపులను ఆయన పట్టించుకోలేదు. 

*_సిబిఐ పేరుతో.._*
ఆ తర్వాత కొన్ని రోజులకు సీబీఐ అధికారి అజయ్ కుమార్ పాండే పేరుతో జైలు అధికారికి ఫోన్ చేసి.. మీ అసభ్య వీడియోపై యూట్యూబ్ నుంచి ఫిర్యాదు అందిందని, తనకు డబ్బులు చెల్లిస్తే మేనేజ్ చేసుకుంటానని నమ్మించాడు. అంతేకాదు, సీబీఐ పేరుతో నకిలీ లేఖ కూడా పంపాడు.

*_సెటిల్ మెంట్ అవకాశం_*
రాహుల్ శర్మ అనే వ్యక్తి నంబరు ఇచ్చి ఆయనకు ఫోన్ చేసి సెటిల్ చేసుకోవాలని సూచించాడు. ఆయన ఇచ్చిన నంబరుకు జైలు అధికారి ఫోన్ చేశారు. యూట్యూబ్ నుంచి వీడియోలు తొలగించేందుకు రెండు విడతలుగా రూ. 97,500 చెల్లించుకున్నారు. ఆ తర్వాత కూడా మరోమారు ఫోన్ చేసి మరో రెండు వీడియోలు ఉన్నాయని, వాటిని వైరల్ చేయకుండా ఉండాలంటే రూ.85 వేలు చెల్లించాలని డిమాండ్ చేశాడు. దీంతో అయోమయంలో పడిన  అధికారిని  గమనించిన తోటి ఉద్యోగి విషయం ఆరా తీశారు. అది విని ఇది సైబర్ మోసం తప్ప మరోటి కాదని ఆయనకు చెప్పారు. 

*_కుషాయిగూడ పోలీసుల వద్దకు.._*
ఆయన కుషాయిగూడ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్ కాల్స్ ఆధారంగా నిందితులు పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.

బాక్స్ 2:
*_కాల్ చేస్తే.. పేరోల్.._*
పెరోల్‌ కాగితాలు ఉన్నతాధికారులకు పంపించి అనుమతి తొందరగా వచ్చేలా చూడాలంటే.. తనకు వీడియో కాల్‌ చేయాలంటూ ఖైదీ సోదరిని జైలు అధికారి వేధింపులకు గురిచేసిన ఘటన.

*_అసలేం జరిగిందంటే..?_*
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఎండీ బాషా అనే ఖైదీ చర్లపల్లి కేంద్రకారాగారంలో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడికి పెరోల్‌ అవకాశం లభించింది. అయితే, త్వరగా ప్రక్రియ పూర్తికావాలంటే తనకు వీడియో కాల్‌ చేయాలంటూ డిప్యూటీ సూపరింటెండెంట్‌ చింతల దశరథం ఖైదీ సోదరికి ఫోన్‌చేసి వేధించడం మొదలుపెట్టాడు. దీని గురించి జైల్లో ఉన్న సోదరుడికి చెప్పుకొని ఆమె విలపించింది. తమ కుటుంబసభ్యులను సదరు అధికారి లైంగికంగా వేధిస్తున్నాడంటూ పర్యవేక్షణాధికారి సంతోష్‌రాయ్‌కి గత నెల 26న ఖైదీ ఫిర్యాదు చేశాడు. వేధింపులు వాస్తవమేనని విచారణాధికారి నివేదిక అందించారు. ఈ నేపథ్యంలో శాఖాపరమైన చర్యల్లో భాగంగా ఆ అధికారిని బదిలీ చేస్తున్నట్లు జైళ్లశాఖ డీజీ జితేందర్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అతడిపై జైళ్లశాఖ అధికారితోపాటు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.

*_జైలు బయట విధులు_*
చర్లపల్లి డిప్యూటీ జైలర్ చింతల దశరథ్ పై చర్యల విషయంలో ఉన్నతాధికారులు సైతం ఎటూ నిర్ణయం తీసుకోలేని సంకట పరిస్థితి. అతని అతి మంచితనం.. ఇతరులకు అవకాశంగా మారింది. వెలుగుచూస్తున్న విషయాలు వేరు. యధార్థం వేరు. ఓ ప్రభుత్వ ఉద్యోగి జీవితంలో దురదృష్టం వెంటాడితే.. ఆ ఉద్యోగి పేరే చింతల దశరథం.

టెన్త్‌ పరీక్షల్లో కీలక మార్పులు.. ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు

*టెన్త్‌ పరీక్షల్లో కీలక మార్పులు.. ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు*

హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి పరీక్షల విధానంలో పాఠశాల విద్యా శాఖ కీలక మార్పులు చేసింది. పది వార్షిక పరీక్షలను ఇకపై ఆరు పేపర్లతోనే నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యా శాఖ సంచాలకులు శ్రీదేవసేన వెల్లడించారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ఆరు పేపర్ల నిబంధన అమల్లోకి వస్తుందని.. ఈ మేరకు జిల్లాల డీఈవోలు, విద్యా శాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. 9, 10వ తరగతుల విద్యార్థులకు నిర్వహించే సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌-2(ఎస్‌ఏ-2) పరీక్షలు కూడా 6 పేపర్లతోనే నిర్వహించాలని  ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇప్పటివరకు పదో తరగతిలో 11పేపర్లతో పరీక్షలు నిర్వహించారు. ద్వితీయ భాష మినహా ప్రథమ, తృతీయ భాష, గణితం, సామాన్య, సాంఘిక శాస్త్రాలు రెండు పేపర్లుగా విద్యార్థులు రాస్తున్నారు. కొవిడ్ పరిస్థితుల వల్ల పూర్తిస్థాయి బోధన జరగకపోవడంతో గతేడాది ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించారు. 11 పేపర్లు రాయడం వల్ల విద్యార్థులపై భారం పడుతోందని.. 6 పేపర్లకు కుదించాలని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ(ఎస్‌సీఈఆర్‌టీ) విద్యా శాఖ ముందు ప్రతిపాదనలు ఉంచింది. ఎస్‌సీఈఆర్‌టీ చేసిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన విద్యా శాఖ ఆరు పేపర్లకు కుదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, సామాన్య శాస్త్రం పరీక్షలో భౌతిక, జీవశాస్త్రాలకు వేర్వేరు సమాధాన పత్రాలు ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

ఓ తెలంగాణ తల్లి కానరాని లోకాలకు తరలిపోయింది.

*కామ్రేడ్ అమ్మ వస్తోంది..!*
*_కన్నీళ్లు తుడవరా.!_*
_◆ ఎదురుచూపులే జీవితం_
◆_ కాళ్ళు మొక్కిన కలెక్టరమ్మ_
_◆ పోరుబాటలో కొడుకులు_
_◆ పూరి గుడెసెలో జీవనం_
_◆ అన్నీ 'చావు' దెబ్బలే.!_
_◆ లక్ష మెదళ్ళను కదిలించిన లేఖ_

Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009 'తెలంగాణ వాచ్' కోసం ప్రత్యేకం)_*

*_తెలంగాణలో తల్లుల దర్పణ ముఖచిత్రం అదృశ్యమైయింది. ఓ తెలంగాణ తల్లి కానరాని లోకాలకు తరలిపోయింది. భర్త పోరాటానికి సన్మానం. కొడుకుల పోరాటానికి 'ఎన్ కౌంటర్స్' బహుమానం. ఎవరీ పెద్దపల్లి పెద్దవ్వ.. మల్లోజుల మధురవ్వ.. వాళ్లింటి పేరు పోరాటం..!_*

*_ఎవరీమె.._*
మధురమ్మ చనిపోయిందట.. ఎవరామె..? ఎందుకింతగా చెప్పుకుంటున్నారు..? పెద్దపల్లి పెద్దవ్వగా ఆ ప్రాంతం వాళ్లందరికీ పరిచయమే.! అసలు ఆమె కథే ఓ సంక్లిష్ట ముఖచిత్రం. నక్సలైట్ల ఉద్యమంలో 'తెగిన పేగులు బోలెడు.. పుస్తె పోగులు బోలెడు..' కన్నీళ్లు, అడవుల బాట పట్టిన కొడుకో, పెనిమిటో ఒక్కసారి 'వచ్చిపోతే' బాగుండననే ఎదురుచూపులు..! ఇవన్నీ ఎంత చెప్పుకున్నా ఒడవవు, తెగవు.! ఎందుకంటే తెలంగాణలో ప్రతి అమ్మది కనిపించని పోరాటమే.! కానీ మధురమ్మది కాస్త భిన్నమైన విచిత్ర అనుభవం.!

*_ఎదురుచూపులే జీవితం_*
నూరేళ్ల జీవితమంతా ఆమెకు కూడా ఎదురుచూపులే..! ఎప్పుడో పేగు కదిలినట్టు అనిపిస్తే 'ఏడుపులు..' ఇక 'ఎవరూ రారు' అని మళ్లీ మనసు నిమ్మలం చేసుకుని ముసుగు తన్ని పడుకోవడం.! ఈమె ఎవరంటే మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలైన మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీ, మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ భూపతిల తల్లి. ఆమె మంగళవారం కన్నుమూసింది. ఇదీ వార్త. ఆమె గురించి తెలిసినవాళ్లకు ఓ విషాదం.!

*_భర్త వెంకటయ్య పోరాటం_*
అప్పట్లో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం. భర్త వెంకటయ్య రజాకార్లతో పోరాడుతున్న సందర్భంలో భర్త కోసం రజాకార్లు వచ్చి వేధించేవాళ్లు. ఓరకమైన నిర్బంధం, ఆమె మీద నిఘా.! రాజ్యానికి వ్యతిరేకంగా సాగిన రెండురకాల పోరాటాల్లో ఆమె వేదన ఉంది. ఆవేదన ఉంది. భిన్నమైన అనుభవముంది. ఆమె పడిన కష్టముంది… అవమానాలున్నయ్.!

*_కాళ్ళు మొక్కిన కలెక్టరమ్మ_*
ఆనాడు అవస్థలపాలైనా స్వాతంత్య్ర సమరయోధుడి భార్యగా ప్రభుత్వం నుంచి సన్మానం అందుకుంది.! ప్రతి గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాన గౌరవాన్ని పొందుతూనే ఉంది. ఆమధ్య నాలుగేళ్ల క్రితం కావచ్చు పెద్దపల్లి కలెక్టర్ శ్రీదేవసేన మధురమ్మకు 'పాదాభివందనం' కూడా చేసింది. ఇంతా చేస్తే ఆమె భర్త రాజ్యానికి, అనగా అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినవాడే.

*_పోరుబాటలో కొడుకులు_*
కట్ చేస్తే... తొలి ముగ్గురు తనకు దక్కకుండా కన్నుమూశారు. ఆ తరువాత పుట్టిన కొడుకులు అడవి బాట పట్టారు. నక్సలైట్లయ్యారు.! ఉద్యమానికి నేతలయ్యారు.! కేంద్ర కమిటీ సభ్యులుగా ఎదిగారు. వాళ్లు కూడా రాజ్యానికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నవాళ్లే.! తండ్రి నెత్తురే.! వాళ్ల ఆచూకీ కోసం మధురమ్మను పోలీసులు అనేకసార్లు వేధించారు.! సేమ్, అప్పట్లో రజాకార్లు వేధించినట్టుగానే.! ఆమె జీవితంలో వ్యక్తులు మారారు..కాని సమస్యలు మాత్రం మారలేదనేది నడుస్తున్న చరిత్రకు నిదర్శనం.

*_పూరి గుడిసెలో.._*
ఆ ఇద్దరి ఆచూకీ కోసం తల్లి, తండ్రి, సోదరుడైనా ఆంజనేయ శర్మకు వేధింపులు తప్పలేదు. వాళ్ల సోదరుడు అక్కడే పౌరోహిత్యం చేసుకుంటాడు. 1987లో డీఎస్పీ బుచ్చిరెడ్డి హత్య జరిగింది. ప్రతీకారంగా పోలీసులు వందల ఇళ్లను కూల్చేశారు. అందులో మధురమ్మ ఇల్లు కూడా కూలిపోయింది. దాంతో నాలుగైదేళ్లు ఓ పూరి గుడిసే దిక్కయింది ఆమెకు.!

*_అన్నీ 'చావు' దెబ్బలే.!_*
అగ్రస్థానాల్లో ఉన్న నక్సలైట్లు ఎవరినైనా చూడటానికి రావాలంటే ఎంత కష్టమో ఆమెకు తెలుసు. ఎక్కడున్నా సరే క్షేమంగా ఉంటే చాలు అనుకుంది. కానీ పెద్ద కొడుకు కోటేశ్వరరావు 2011లో పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. ఆమె కుంగిపోయింది. చిన్న కొడుకైనా బాగుంటే చాలు అనుకుంది. సహజం కదా..! అదే తెలంగాణ తల్లుల అనుభవం కదా.!

*_లక్ష మెదళ్ళను కదిలించిన లేఖ_*
ఆ సోదరులు ఓసారి అమ్మకు బహిరంగ లేఖ రాశారు. *_''అమ్మా, మమ్ముల కన్నందుకు నీకు విప్లవ వందనాలు.. కోట్లాది మంది తల్లుల కన్నీళ్లు తుడవడానికి మేం ఈ విప్లవబాట ఎంచుకున్నాం, తిరుగుబాటు నాన్న రక్తం నుంచే వచ్చింది..''_ ఇలా సాగిపోయింది ఆ లేఖ..! అప్పట్లో ఉద్యమం బలంగా ఉన్న ప్రాంతాల్లో ఆ లేఖ లక్షలమందిని చదివించింది.! కదిలించింది. దాదాపు నూరేళ్లు బతికిన ఆమె ఇక జీవనాన్ని చాలించింది. మంగళవారం కన్నుమూసింది.

*_చివరిగా..._*
కిషన్‌జీ, స్వర్గానికి అమ్మ వస్తోంది, ఇప్పుడైనా కళ్లారా చూసి, ఆమె కన్నీటిని తుడువు కామ్రేడ్..!

Tuesday, November 1, 2022

ర్యాగింగ్ పేరుతో సీనియర్ల నరకం....34మంది విద్యార్థుల సస్పెన్షన్

*ర్యాగింగ్ పేరుతో సీనియర్ల  నరకం....34మంది విద్యార్థుల సస్పెన్షన్*

హైదరాబాద్‌: ఎంసెట్‌లో మెరుగైన ర్యాంకులు సాధించి ఎన్నో కొంగొత్త ఆశలతో పశువైద్య డిగ్రీ కోర్సులో చేరిన జూనియర్‌ విద్యార్థులకు సీనియర్లు ర్యాగింగ్‌ పేరుతో నరకం చూపించారు.ఈ వేధింపులకు పాల్పడిన 34 మంది విద్యార్థులను తరగతులు, హాస్టళ్ల నుంచి పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం తాజాగా సస్పెండ్‌ చేసింది. వీరిలో 25 మందిని తరగతులు, హాస్టళ్ల నుంచి... మరో 9 మందిని హాస్టళ్ల నుంచి, వర్సిటీ వాహనాలు ఎక్కకుండా నిషేధించింది.

రాజేంద్రనగర్‌లోని వర్సిటీ క్యాంపస్‌ కాలేజీలో పశువైద్య డిగ్రీ(బీవీఎస్సీ) కోర్సు రెండో, నాలుగో సంవత్సరం చదువుతున్న ఈ 34 మంది ఇటీవల కొత్తగా చేరిన జూనియర్‌ విద్యార్థులను ర్యాగింగ్‌ పేరుతో నానా రకాలుగా హింసించినట్లు బాధితులు ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రొఫెసర్లతో అంతర్గత కమిటీ వేసి విచారణ జరిపారు. ర్యాగింగ్‌, హింసించిన తీరును బాధితులు వివరించడంతో బాధ్యులను రెండు వారాల పాటు సస్పెండ్‌ చేస్తున్నట్లు సోమవారం వర్సిటీ ఉత్తర్వులు జారీచేసింది. పూర్తి విచారణ జరిపిన తరవాత తదుపరి చర్యలుంటాయని వివరించింది.

*సుజీవన్ వావిలాల*🖋️