Thursday, January 25, 2024

ఉద్యమ నేతకు ప్రభుత్వ గౌరవం ఇదీ

*ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరామ్...*

*గవర్నర్ కోటాలో పదవి* 

 *ఉద్యమ నేతకు ప్రభుత్వ గౌరవం ఇదీ..*
 
 తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరామ్‌కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కింది. తెలంగాణ ప్రభుత్వం మరో ఇద్దరు ఎమ్మెల్సీలను నియమించింది. ప్రొఫెసర్ కోదండరామ్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది. కోదండరామ్‌తో పాటు అమరుల్లా ఖాన్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ చేసింది. వీరిద్దర్ని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమిస్తూ రాజ్ భవన్ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోద ముద్ర తెలపడంతో ప్రొఫెసర్ కోదండరామ్‌కు కీలక పదవి దక్కింది

*V.S. జీవన్*

No comments:

Post a Comment