Friday, January 26, 2024

*పురస్కారం అందుకున్న గంటలోనే... హఠాన్మరణం*

*పురస్కారం అందుకున్న గంటలోనే... హఠాన్మరణం*

*గుండెపోటుతో ఆదిలాబాద్‌ బల్దియా మేనేజరు దివాకర్‌ మృతి*

ఆదిలాబాద్‌ : పురస్కారం అందుకున్న ఆనందంలో ఉండగానే ఆయన ఆయువు తీరింది. మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూరు పట్టణానికి చెందిన దివాకర్‌(56) ఆదిలాబాద్‌ బల్దియాలో మేనేజరుగా విధులు నిర్వహిస్తున్నారు.ఉత్తమ ఉద్యోగిగా ఎంపికైన ఆయన జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో శుక్రవారం నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఇంటికి వెళ్లాక గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబీకులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పుట్టినప్పటి నుంచే వైకల్యం కారణంగా వీల్‌ఛైర్‌కే పరిమితమైన ఆయనకు 2004లో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. పదేళ్లకు పైగా ఆదిలాబాద్‌ బల్దియాలోనే విధులు నిర్వహించడంతో అక్కడే స్థిరపడ్డారు. భార్య నాగలక్ష్మి, కుమారులు సాయి (సాప్ట్‌వేర్‌), గిరిధర్‌ (ఆర్మీ ఉద్యోగి). పురపాలక అధ్యక్షుడు జోగు ప్రేమేందర్‌, కమిషనర్‌ ఎ.శైలజ, బల్దియా అధికారులు, సిబ్బంది భౌతిక కాయానికి నివాళులర్పించారు.

*V.S. జీవన్*

No comments:

Post a Comment