Wednesday, January 24, 2024

కొత్తగా నియమితులైన ప్రభుత్వ సలహాదారులు

జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారిని వారి నివాసంలో.. కొత్తగా నియమితులైన ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారు (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ సంక్షేమం), శ్రీ వేణుగోపాల్ రావు గారు (ప్రోటోకాల్, ప్రజా సంబంధాలు) ముఖ్యమంత్రి సలహాదారు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు (ప్రజా వ్యవహారాలు), ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి శ్రీ మల్లు రవి గారు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు, శ్రీ బల్మూరి వెంకట్ గార్లు నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. 

ఈ సందర్భంగా కొత్తగా నియమితులైన ప్రభుత్వ సలహాదారులను మరియు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలను ముఖ్యమంత్రి గారు అభినందించారు.

దావోస్ పర్యటనలో తెలంగాణకు 40వేల కోట్లకు పైగా పెట్టుబడుల కోసం ఒప్పందాలు చేసుకోడం పై సీఎం శ్రీ రేవంత్ రెడ్డికి వారంతా అభినందనలు తెలిపారు.

https://twitter.com/INCTelangana/status/1749975906884747447?t=v9aAQj0WoClL6kmLi36fdw&s=19

No comments:

Post a Comment