Thursday, February 8, 2024

*శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసు....రంగంలోకి ఈడీ*

*శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసు....రంగంలోకి ఈడీ*

హైదరాబాద్‌: హెచ్‌ఎండీఏ మాజీ సంచాలకుడు శివబాలకృష్ణ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) రంగంలోకి దిగింది. అతనిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌తో పాటు, స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాలు ఇవ్వాలని ఈడీ అధికారులు ఏసీబీని కోరారు.వివరాలు వచ్చిన అనంతరం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టనున్నారు.

ప్రభుత్వ లెక్కల ప్రకారం శివబాలకృష్ణ ఆదాయానికి మించిన ఆస్తుల విలువ సుమారు రూ.13 కోట్లు కాగా.. బహిరంగ మార్కెట్‌లో వాటి విలువ రూ.250 కోట్లకు పైనే ఉంటుందని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రాథమిక అంచనా. ఏసీబీ 8 రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించగా.. అతడి దందాలు మరిన్ని బహిర్గతమయ్యాయి. తన అక్రమ ఆదాయాన్ని ఎక్కువగా స్థిరాస్తుల కొనుగోళ్లకే వెచ్చించినట్లు తేలింది. శివబాలకృష్ణతోపాటు కుటుంబసభ్యులు, బినామీల పేరిట మొత్తం 214 ఎకరాల వ్యవసాయ భూములు, 29 ప్లాట్లు, 8 ఇళ్లు ఉన్నట్లు ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో తేలింది. మరోవైపు మూడు రోజులపాటు హెచ్‌ఎండీఏ ప్రధాన కార్యాలయంలో తనిఖీలు చేసి స్వాధీనం చేసుకున్న దస్త్రాల్ని ఏసీబీ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. పలు స్థిరాస్తి సంస్థలకు బాలకృష్ణమంజూరు చేసిన అనుమతులపై ఆరా తీస్తోంది. ఈ క్రమంలోనే ఈడీ రంగంలోకి దిగింది.

*V.S. జీవన్*

ఎక్రిడేషన్ కార్డ్ తో సంబంధం లేకుండా జర్నలిస్టులకు సహాయం

*ఎక్రిడేషన్ కార్డ్ తో సంబంధం లేకుండా జర్నలిస్టులకు ఉచిత వైద్యసేవలు అందేలా కృషి: ప్రొఫెసర్ కోదండరాం.* 

హైదరాబాద్ ఫిబ్రవరి 08: విద్య వైద్యం వంటి కనీస అవసరాలు కూడా లేక జర్నలిస్టులు అనేక అవస్థలు పడుతున్నారని జనసమితి వ్యవస్థాపకులు తెలంగాణా సాధకుడు, శాసనమండలి సభ్యులుగా ఇటీవలే నామినేట్ అయిన కోదండరాం అన్నారు.

డిజెఎఫ్ జాతీయ మహాసభకు ముఖ్య అతిథిగా విచ్చే సిన ఆయన జర్నలిస్టుల సమస్యలపై స్పందించారు జర్నలిస్టుల పై ప్రభుత్వాలు సానుకూలంగా ఉండాలన్నారు.

వారికి విద్య వైద్యంతో పాటు వారికి నివాస యోగ్య మైన స్థలాల కేటాయింపులు జరగాల్సి ఉందన్నారు కార్పోరేట్ విద్యాల యాలలో జర్నలిస్టులకు 50 శాతం రాయితీ ఇప్పటికే అమలు లో ఉన్నదని కానీ అది కూడా సరిగా అమలు కావటం లేదన్న విషయాలు నా దృష్టికి వచ్చాయని వాటి ప్రామాణికతలలో కూడా మరింత వెసులుబాటు కలిగేలా ప్రయత్నం చేయాల న్నారు.

అలాగే ఎక్రిడేషన్ తో సంబంధం లేకుండా జర్నలిస్టులకు ఉచితంగా వైద్య సేవలు అందేలా కృషి చేద్దామన్నారు ఈ మేరకు తగిన ప్రతిపాదనను తన వద్దకు తీసుకు వస్తే సంబంధిత ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకు వెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తా నని హామీఇచ్చారు.

ప్రస్తుత ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో సానుకూలంగా ఉందని త్వరిత గతిన జర్నలిస్టులకు మంచి జరుగుతున్నదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

*V.S. జీవన్*

Monday, February 5, 2024

'#న్యాయం' ఎక్కడ దొరుకుతుంది ?*

https://x.com/thulasichandu1/status/1754422863250235875?t=QQgINlWOsBQel4mosi78gg&s=08                                                                                            *-ప్రభుత్వ హాస్టళ్లలోకి ఆటో డ్రైవర్లు అర్థరాత్రి వేళ ఎందుకొస్తున్నారు?* 
*ఇంత దారుణమైన నిర్వహణా లోపాలున్నా ఎస్సీ హాస్టళ్లలో లక్షల మంది పిల్లలు చదువుకుంటున్నారు అంటే అంతకు మించిన మరో దారి వాళ్లకు లేదని కదా అర్థం..?* 

*విద్యార్థులకు ఏదైనా కష్టమొస్తే ప్రాణాలు తీసుకోవడం తప్ప మరో మార్గం లేదన్న భావనలోకి వెళ్తున్నారు అంటే అది ప్రభుత్వ వ్యవస్థల ఘోర వైఫల్యం కాదా..?* 

*ఎలాంటి సమస్యలు హాస్టళ్లలో ఉన్నా వెంటనే పై స్థాయిలో ఉన్న అధికారుల దృష్టికి తెచ్చే హెల్ప్ లైన్ సౌకర్యం ఈ రోజుల్లో కూడా కష్టమైన పనేనా?* 

*కనీసం తల్లిదండ్రులైనా ఫోన్లు చేసి తమ పిల్లల కష్టాలు, హాస్టళ్లలో క్వాలిటీ గురించి చెప్పేలాగా ఉండాలి కదా?*

*కొన్ని ఎస్సీ ఎస్టీ హాస్టళ్లలో ఫుడ్డు బాగాలేదని కంప్లైంట్స్ చేస్తే, "మీ ఇంట్లో ఇంతకంటే మంచి తిండి తింటారా?" అని వార్డెన్లు, ఇన్ ఛార్జీలు ఆ పిల్లల నోరు మూయిస్తున్నారన్న వాస్తవాన్ని  ప్రభుత్వంలోని వాళ్లూ, ప్రజాప్రతినిధులు అర్థం చేసుకోవాలి.* 

*ఈ ఇష్యూ కేవలం ఇద్దరు ఆడపిల్లలకు సంబంధించినదిగా చూడకూడదు. మొత్తం హాస్టళ్ల పరిస్థితి ఎలా ఉందో ఇప్పటికైనా ప్రభుత్వం రియలైజ్ అవ్వాలి.*
*@revanth_anumula @seethakkaMLA @KTRBRS @RSPraveenSwaero*                                                                                              *****---*****---*****                                                                                     
_*'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'*_                                                                           *@thulasichandu1 మేడం '#న్యాయం'  ఎక్కడ దొరుకుతుంది ?*

*#పాలకులు & #ప్రభుత్వఅధికారుల నిర్లక్ష్యం వల్ల చనిపోవాల్సివచ్చిన ఈ చిన్నారి తల్లులకు శ్రద్ధాంజలి ఘటిస్తుంది 'ప్రజాసంకల్పం'😔*

*#IndianConstitution*
*#SupremeCourtofIndia* *#TelanganaHighCourt*

*న్యాయస్థానాలలో లక్షల్లో పెండింగ్ కేసులు... ఇదేనా ప్రజాస్వామ్యం అంటే..... Bplkm🪶*

Sunday, February 4, 2024

➧ కేసీఆర్, హరీష్, డ్రామారావు వారు చేసిన పాపాలను కప్పిపుచ్చి కాంగ్రెస్ పై అబద్ధపు ప్రచారం చేస్తున్నారు.

డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula గారు:

➧ కేసీఆర్, హరీష్ డ్రామారావు వారు చేసిన పాపాలను కప్పిపుచ్చి కాంగ్రెస్ పై అబద్ధపు ప్రచారం చేస్తున్నారు.

➧ అబద్ధపు ప్రచారాలతో రాజకీయ లబ్ధి పొందాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు.

➧ రాష్ట్ర పునర్విభజన చట్టం చేసినప్పుడే కృష్ణా, గోదావరి జలాల పంపిణీని కేంద్రానికి అప్పగిస్తున్నట్లు కేసీఆర్ ఒప్పుకున్నారు.

➧ ఈ పుస్తకానికి, ఈ చట్టానికి మీరే రచయిత

➧ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడానికి పునాది పడిందే కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడు..

➧ టీఆరెస్ అభ్యంతరం చెప్పకపోగా కేసీఆర్ ఓటు వేసి చట్టాన్ని ఆమోదింపజేశారు..

➧ దీనికి బాధ్యులు కేసీఆర్, కె. కేశవరావు..

➧ ఈ చట్టం కావడానికి మొట్టమొదటి కారణం కేసీఆరే..

➧ 811 టీఎంసీల నీళ్లపై పంపకాలు ఎలా జరగాలో ఇరు రాష్ట్రాల సీఎంలతో చర్చించారు.

➧ 2015 జూన్ 18న KRMB సమావేశం నిర్వహించింది

➧ 299 టీఎంసీలు తెలంగాణకు, 511 టీఎంసీలు కేటాయించేందుకు కేసీఆర్, హరీష్ సంతకాలు పెట్టారు.

➧ తెలంగాణకు 50 శాతం వాటా అడగకుండా రాష్ట్రానికి అన్యాయం చేశారు.

➧ కృష్ణా నది 68శాతం తెలంగాణలో ఉంది.. 32శాతం మాత్రమే ఏపీలో ఉంది..

➧ అంతర్జాతీయ నీటి విధి విధానాల ప్రకారం 5వందల పైచిలుకు తెలంగాణకు, మిగతావి ఏపీకి కేటాయించాలి.

➧ కానీ సంతకాలు పెట్టి మరీ తెలంగాణకు రావాల్సిన నీటిని శాశ్వతంగా ఏపీకి ధారాదత్తం చేసిన దుర్మార్గుడు కేసీఆర్.

➧ 15 ప్రాజెక్టులను KRMBకి అప్పగిస్తామని 2022లో సమావేశంలో అంగీకరించారు.

➧ 19.05.2023న 17వ KRMB సమావేశంలో కేంద్రానికి అప్పగిస్తున్నట్లు కేసీఆర్ అంగీకరించారు.

➧ 2023 బడ్జెట్ లో గోదావరి, కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు రూ.400 కోట్లు కేటాయించారు. 

➧ ప్రాజెక్టులను కేంద్రానికి స్వాధీనం చేయడం మామా, అల్లుళ్లు కలిసే చేశారు.

➧ 2004లో కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో టీఆర్ఎస్ భాగస్వామి..

➧ పోతిరెడ్డిపాడు పొక్క పెద్దది చేసే నిర్ణయం జరిగినపుడు హరీష్, నాయిని నర్సింహారెడ్డి మంత్రులుగా ఉన్నారు, కేంద్రంలో కేసీఆర్ మంత్రిగా ఉన్నారు...

➧ పదవులకు ఆశపడి పెదవులు మూసుకుంది మీరు కాదా?

➧ పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తరలించుకపోతుంటే కొట్లాడింది తెలంగాణ కాంగ్రెస్ నేతలు పీజేఆర్, మర్రి శశిధర్ రెడ్డి...

➧ వాళ్లకు సహకరించకుండా వైఎస్ కు లొంగిపోయింది కేసీఆర్..

➧ 14 జనవరి 2020న జగన్ ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిసి కృష్ణా జలాల పై 6గంటలు సమీక్ష చేశారు.

➧ అక్కడే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రోజుకు 8 టీఎంసీలు తరలించుకుపోయేందుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

➧ తండ్రి పోతిరెడ్డిపాడుతో  రోజుకు 4 టీఎంసీలు తరలించుకుపోతే.. కొడుకు రాయలసీమ లిఫ్ట్ తో రోజుకు 8 టీఎంసీలు తరలించుకుపోయారు.

➧ నీటి తరలింపుకు టెండర్ ఆపేందుకు సమావేశానికి వెళ్లకుండా సమావేశాన్ని వాయిదా వేయాలని లేఖ రాయించారు.

➧ టెండర్ ఒప్పందాలు పూర్తి కావాలనే కేసీఆర్ ఆ సమావేశానికి వెళ్లలేదు.

➧ కేసీఆర్ ధనదాహంతో తెలంగాణ నీటిని తరలించుకుపోయేందుకు సహకరించారు.

➧ తెలంగాణ హక్కులను కాలరాస్తూ నీటి దొంగలు కృష్ణా జలాలను దారిదోపిడీ చేస్తున్నారు.

➧ ఈ జల దోపిడీకి కారణం కేసీఆర్..

➧ పదేళ్లలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారు.

➧ ఉమ్మడి రాష్ట్రంలో జరిగినదానికంటే ఎక్కువ ఈ నిర్లక్ష్యం పదేళ్లలో జరిగింది
➧ పదేళ్లు పాలమూరు-రంగారెడ్డి పడావు పడ్డది..

➧ రెండేళ్లలో పూర్తి చేస్తానన్న కేసీఆర్... పదేళ్లయినా పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేయలేదు..

➧ ఇన్ని పాపాలు చేసి ఇప్పుడు ప్రజా ఉద్యమాలు చేస్తామని బిఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు.

➧ పాపాలు చేసి ప్రజా ఉద్యమాలంటే ప్రజలు చెప్పుతో కొడతారు.

➧ తెలంగాణకు రావాల్సిన వాటా, హక్కుల కోసం మేం కొట్లాడుతుంటే...

➧ అధికారం కోల్పోయి దిక్కుతోచక ఏదో ఒక వంకతో మామా అల్లుళ్లు కాంగ్రెస్ ను బదనాం చేయాలని చూస్తున్నారు.

➧ కేసీఆర్ కు సూటిగా సవాల్ విసురుతున్నా..

➧ అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టు జలాలపై చర్చ పెడదాం...

➧ రెండు రోజులు ప్రాజెక్టుల శ్వేతపత్రంపై చర్చిద్దాం

➧ రెండు రోజులు చాలవంటే సమావేశాలను పొడగిద్దాం..

➧ కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత రావు అందరూ రండి...

➧ నీకు నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రా

➧ మీకు పూర్తి అవకాశం ఇస్తాం... ఒక్క నిమిషం కూడా మైక్ కట్ చేయం.. రా

➧ నిజానిజాలేంటో నిరూపిద్దాం రా..

➧ ఎవరు ద్రోహి, ఎవరు తెలంగాణకు అన్యాయం చేశారో తేలిపోతుంది..

Courtesy / Source by :
https://twitter.com/TelanganaCMO/status/1754153686400450916?t=ct1PYx47EOi7wAB9lrQR3w&s=19

Saturday, February 3, 2024

నందమూరి తారకరామారావు... సచివాలయం

నందమూరి తారకరామారావు గారు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు సచివాలయంలోని అయిదు/ ఆరవ అంతస్తులో ఉన్న ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళడానికి ప్రత్యేకం గా ఒక లిఫ్ట్ ఉండేది. ఆయన లిఫ్ట్ దగ్గరకు రాగానే భద్రతా కారణాల దృష్ట్యా మిగిలిన అన్ని లిఫ్టు లను ఆపేసే వారు. ఎన్టీఆర్ గారు తన ఆఫీస్ లోపలకు వెళ్ళి కుర్చీలో కూర్చున్న తరువాతే లిఫ్టు లు మళ్ళీ పని చేసేవి.
ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచీ ఒకే ఉద్యోగి లిఫ్టు ఆపరేటర్ గా ఉండేవాడు. ఆ కారణంగా అతనికి ఎన్టీఆర్ గారితో కొంచెం చనువు ఉండేది. ఎన్టీఆర్. గారు కూడా అతనిని రోజూ చూస్తుంటారు కాబట్టి నవ్వుతూ బాగున్నావా అని అడిగేవారు.
ఒకరోజు ఎన్టీఆర్ గారు  ఆఫీస్ లో ఉండగా సాయంత్రం ఆ ఉద్యోగి ఆఫీస్ లోకి వెళ్ళి నమస్కారం చేశాడు. ఆ సమయం లో అప్పటి సభాపతి, మరి కొందరు ఆయనతో పాటు ఉన్నారు. ఎన్టీఆర్ గారు ఆశ్చర్యంగా అతణ్ణి చూసి "ఏమిటి?" అని అడిగాడు.
"సార్..నేను ఈ సాయంత్రం తో రిటైర్ అవుతున్నాను. మా యూనియన్ వారు చిన్న పార్టీ ఇస్తున్నారు. చివరి సారిగా మీకు చెప్పి వెళదాం అని వచ్చాను సర్" అని  చెప్పాడు లిఫ్ట్ ఆపరేటర్.
ఎన్టీఆర్ గారు ఆశ్చర్యంగా చూసి " అరే..పొద్దున్న చెప్పలేదే? ఉండు" అని తన కార్యదర్శులకు ఫోన్ చేసి అర్జెంట్ గా ఒక శాలువా, బోకే తెమ్మని ఆదేశించారు. ఈ లోపల ఆ ఉద్యోగి కుటుంబ వివరాలను అడిగారు. అతనికి సొంత ఇల్లు లేదని, పెళ్ళి కావలసిన కుమార్తెలు ఉన్నారని తెలుసుకుని సెక్రెటరీ ని పిలిచి ఆ ఉద్యోగి పేరుతో ఒక ప్రభుత్వ స్థలం ఉన్న ప్రాంతం లో రెండు ఎకరాల భూమి కీ పట్టా కాగితాలు అరగంట లోపల సిద్దం చెయ్యమని ఆదేశించారు.
ఇంతలో శాలువా, బోకే, స్వీట్స్ వచ్చాయి, వెంటనే
ఎన్టీఆర్ గారు ఆ లిఫ్ట్ ఆపరేటర్ ను  స్వయంగా సన్మానం చేసి, తన జేబులోంచి కొంత నగదు తీసి ఇంటి పట్టా కాగితాలతో సహా అందించి, అవసరం అయితే కలవమని చెప్పి పంపించారు. తాను ఏమాత్రం ఊహించని ఈ పరిణామానికి ఆనందబాష్పాలురాలుస్తూ వెళ్ళిపోయాడు ఆ ఉద్యోగి.  ప్రచారానికి నోచుకోని ఇలాంటి కోణాలు ఎన్.టి.రామారావు గారి పాలనలో ఎన్నో ఉన్నాయి...

త్తు... త్తు.. ఈళ్ల బతుకులు చెడ!

_*జోహార్లు #తెలంగాణ అమరవీరులకు ✊*_

 _*#తెలంగాణ ఒస్తే నిరుద్యోగులకు / రైతులకు / ప్రభుత్వవిద్యకు / సాగునీటి ప్రాజెక్టులకు.... Etc న్యాయం జరుగుతుంది అనుకుంటే #దొర కుటుంబం,#దొర బంధుమిత్రులు,#దొర గడిలో బానిసలుగా ఉన్న #ప్రజాప్రతినిధులు / ప్రభుత్వఅధికారులు ముఖ్యంగా #IAS / #IPS అధికారులు #తెలంగాణ ప్రజల సొమ్మును అక్రమంగా దోచుకున్నారు. ఈ దోపిడీ గురించి తెలిసినా మౌనంగా ఉన్న ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా & జర్నలిస్ట్ లు మరీముఖ్యంగా కండ్ల ముందు ఇంత పెద్ద #అవినీతి జరుగుతున్నా ప్రశ్నించని వెదవలు అనబడే మేధావులు మరియు పౌరసమాజం... త్తు... త్తు.. ఈళ్ల బతుకులు చెడ.... Bplkm🪶

Thursday, February 1, 2024

హైదరాబాద్ ట్రాఫిక్ పై స్పెషల్ ఫోకస్

హైదరాబాద్ ట్రాఫిక్ పై స్పెషల్ ఫోకస్

🚦భవిష్యత్తు అవసరాలకు సమగ్ర ప్రణాళిక 

🚦సిటీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల స్థాయి పెంపు

🚦సిబ్బంది కొరత లేకుండా హోంగార్డుల నియామకాలు

🚦మల్టీ లెవల్ పార్కింగ్ సెంటర్లను ప్రోత్సహించే కొత్త విధానం  

🚦హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ పై సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula

గ్రేటర్ హైదరాబాద్ సిటీలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ముందు చూపుతో చర్యలు చేపట్టాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణను పోలీస్ విభాగం అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ, పోలీసు విభాగాలు సమన్వయంతో ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ నిర్వహణ, నియంత్రణపై ఈరోజు సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు.

హైదరాబాద్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా గ్రేటర్ సిటీలో ట్రాఫిక్ నియంత్రణ, నిర్వహణపై సమగ్ర ప్రణాళికను రూపొందించాలని సీఎం సూచించారు. అందులో నిపుణులైన కన్సల్టెన్సీలకు బాధ్యతలు అప్పగించి ప్రత్యేకంగా అధ్యయనం చేయించాలన్నారు.  


పెరిగిన వాహనాల సంఖ్యకు అనుగుణంగా ట్రాఫిక్ సిబ్బంది అందుబాటులో లేరని సమావేశంలో చర్చకు వచ్చింది. స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే తగినంత మంది హోంగార్డుల నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. మూడు నెలల్లోగా ఈ నియామకాలు జరిగేలా ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. కొత్తగా నియమించిన వారికి తగిన శిక్షణనివ్వాలని సూచించారు. ఈలోపు వివిధ విభాగాల్లో పని చేస్తున్న హోం గార్డులను ట్రాఫిక్ విభాగానికి తిరిగి రప్పించాలని. తక్షణమే వారి సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. 


ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో (పీక్ అవర్స్లో) లా అండ్ ఆర్డర్ పోలీసులను గ్రేటర్ సిటీ ట్రాఫిక్ కంట్రోల్ విధులకు వినియోగించుకోవాలని అన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల స్థాయిని అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వాటికి సరిపడే సంఖ్యలో సిబ్బంది నియామకాలు చేపడుతామని సీఎం చెప్పారు. 


సిటీలోని అన్ని ప్రధాన జంక్షన్లు, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ సిబ్బంది తప్పకుండా అక్కడ ఉండేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. కేవలం ఆటోమేటిక్  సిగ్నల్ వ్యవస్థ మీద ఆధారపడకూడదని అన్నారు. టూ వీలర్ ట్రాఫిక్ ఇంటర్సెప్టర్స్ పై (ద్విచక్ర వాహనాలపై) ఎస్ఐలు, కానిస్టేబుళ్లను పంపించి ట్రాఫిక్ జామ్ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 


పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా ప్రధాన రహదారులు, జంక్షన్ల విస్తరణపై దృష్టి పెట్టాలని అన్నారు. ఎల్బీ నగర్ జంక్షన్ తరహాలో సబ్ వే, అండర్ పాస్, సర్ఫేస్ వే లను ఎక్కడెక్కడ నిర్మించాలి... అక్కడున్న సాధ్యాసాధ్యాలను గుర్తించాలని సీఎం అన్నారు.


హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పోలీస్ అధికారులు, మున్సిపల్ జోనల్ కమిషనర్లు సమన్వయంతో ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి పెట్టాలని అన్నారు. ప్రతినెలా తప్పనిసరిగా సమావేశమై ట్రాఫిక్ ఇబ్బందులను సమీక్షించి, తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 


పార్కింగ్ సమస్యను అధిగమిస్తే ట్రాఫిక్ ఇబ్బందులు తొలిగిపోతాయనే చర్చ జరిగింది. వీలైనన్ని చోట్ల మల్టీ లెవల్ కార్ పార్కింగ్ సెంటర్ల నిర్మాణాన్ని ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు, ప్రభుత్వ స్థలాలు గుర్తించాలని, పార్కింగ్ సెంటర్ల ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి ప్రభుత్వ పరంగా రాయితీలు ఇవ్వాలని సీఎం అన్నారు. అన్ని విధివిధానాలతో ప్రత్యేక పార్కింగ్ పాలసీని రూపొందించాలని సీఎం ఆదేశించారు.


లే అవుట్లకు హెచ్ఎండిఏ అనుమతులు ఇచ్చేటప్పుడు అక్కడ రోడ్లు, పార్కులు, మౌలిక వసతులకు ఎంత స్థలం కేటాయించాలనే ప్రమాణాలు పున: పరిశీలించాలని సీఎం ఆదేశించారు. విశాలమైన రోడ్లు ఉండేలా దేశంలోని ఇతర నగరాలు, విదేశాల్లో ఎలాంటి పద్దతులను అనుసరిస్తున్నారో పరిశీలించాలని సీఎం సూచించారు. 


హైదరాబాద్ లో బహుళ అంతస్తుల భవనాలకు అనుమతులు ఇచ్చేటప్పుడు ఆ ఏరియాలో ఉండే ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకోవాలని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, డీజీపీ శ్రీ రవి గుప్తా, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి శ్రీ శేషాద్రి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవెలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీ దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ శ్రీ రోనాల్డ్ రాస్, ముఖ్యమంత్రి కార్యదర్శి శ్రీ షానవాజ్ ఖాసీం, అడిషనల్ డీజీ ఇంటలిజెన్స్ శ్రీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ శ్రీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి, సైబరాబాద్ సీపీ శ్రీ అవినాష్ మహంతి, రాచకొండ సీపీ శ్రీ సుధీర్ బాబు, ట్రాఫిక్ డీసీపీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Courtesy / Source by :

https://twitter.com/TelanganaCMO/status/1752721089254539625?t=0YNoueuGiEWqaT4QcMUHAA&s=19