Sunday, February 4, 2024

➧ కేసీఆర్, హరీష్, డ్రామారావు వారు చేసిన పాపాలను కప్పిపుచ్చి కాంగ్రెస్ పై అబద్ధపు ప్రచారం చేస్తున్నారు.

డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula గారు:

➧ కేసీఆర్, హరీష్ డ్రామారావు వారు చేసిన పాపాలను కప్పిపుచ్చి కాంగ్రెస్ పై అబద్ధపు ప్రచారం చేస్తున్నారు.

➧ అబద్ధపు ప్రచారాలతో రాజకీయ లబ్ధి పొందాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు.

➧ రాష్ట్ర పునర్విభజన చట్టం చేసినప్పుడే కృష్ణా, గోదావరి జలాల పంపిణీని కేంద్రానికి అప్పగిస్తున్నట్లు కేసీఆర్ ఒప్పుకున్నారు.

➧ ఈ పుస్తకానికి, ఈ చట్టానికి మీరే రచయిత

➧ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడానికి పునాది పడిందే కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడు..

➧ టీఆరెస్ అభ్యంతరం చెప్పకపోగా కేసీఆర్ ఓటు వేసి చట్టాన్ని ఆమోదింపజేశారు..

➧ దీనికి బాధ్యులు కేసీఆర్, కె. కేశవరావు..

➧ ఈ చట్టం కావడానికి మొట్టమొదటి కారణం కేసీఆరే..

➧ 811 టీఎంసీల నీళ్లపై పంపకాలు ఎలా జరగాలో ఇరు రాష్ట్రాల సీఎంలతో చర్చించారు.

➧ 2015 జూన్ 18న KRMB సమావేశం నిర్వహించింది

➧ 299 టీఎంసీలు తెలంగాణకు, 511 టీఎంసీలు కేటాయించేందుకు కేసీఆర్, హరీష్ సంతకాలు పెట్టారు.

➧ తెలంగాణకు 50 శాతం వాటా అడగకుండా రాష్ట్రానికి అన్యాయం చేశారు.

➧ కృష్ణా నది 68శాతం తెలంగాణలో ఉంది.. 32శాతం మాత్రమే ఏపీలో ఉంది..

➧ అంతర్జాతీయ నీటి విధి విధానాల ప్రకారం 5వందల పైచిలుకు తెలంగాణకు, మిగతావి ఏపీకి కేటాయించాలి.

➧ కానీ సంతకాలు పెట్టి మరీ తెలంగాణకు రావాల్సిన నీటిని శాశ్వతంగా ఏపీకి ధారాదత్తం చేసిన దుర్మార్గుడు కేసీఆర్.

➧ 15 ప్రాజెక్టులను KRMBకి అప్పగిస్తామని 2022లో సమావేశంలో అంగీకరించారు.

➧ 19.05.2023న 17వ KRMB సమావేశంలో కేంద్రానికి అప్పగిస్తున్నట్లు కేసీఆర్ అంగీకరించారు.

➧ 2023 బడ్జెట్ లో గోదావరి, కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు రూ.400 కోట్లు కేటాయించారు. 

➧ ప్రాజెక్టులను కేంద్రానికి స్వాధీనం చేయడం మామా, అల్లుళ్లు కలిసే చేశారు.

➧ 2004లో కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో టీఆర్ఎస్ భాగస్వామి..

➧ పోతిరెడ్డిపాడు పొక్క పెద్దది చేసే నిర్ణయం జరిగినపుడు హరీష్, నాయిని నర్సింహారెడ్డి మంత్రులుగా ఉన్నారు, కేంద్రంలో కేసీఆర్ మంత్రిగా ఉన్నారు...

➧ పదవులకు ఆశపడి పెదవులు మూసుకుంది మీరు కాదా?

➧ పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తరలించుకపోతుంటే కొట్లాడింది తెలంగాణ కాంగ్రెస్ నేతలు పీజేఆర్, మర్రి శశిధర్ రెడ్డి...

➧ వాళ్లకు సహకరించకుండా వైఎస్ కు లొంగిపోయింది కేసీఆర్..

➧ 14 జనవరి 2020న జగన్ ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిసి కృష్ణా జలాల పై 6గంటలు సమీక్ష చేశారు.

➧ అక్కడే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రోజుకు 8 టీఎంసీలు తరలించుకుపోయేందుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

➧ తండ్రి పోతిరెడ్డిపాడుతో  రోజుకు 4 టీఎంసీలు తరలించుకుపోతే.. కొడుకు రాయలసీమ లిఫ్ట్ తో రోజుకు 8 టీఎంసీలు తరలించుకుపోయారు.

➧ నీటి తరలింపుకు టెండర్ ఆపేందుకు సమావేశానికి వెళ్లకుండా సమావేశాన్ని వాయిదా వేయాలని లేఖ రాయించారు.

➧ టెండర్ ఒప్పందాలు పూర్తి కావాలనే కేసీఆర్ ఆ సమావేశానికి వెళ్లలేదు.

➧ కేసీఆర్ ధనదాహంతో తెలంగాణ నీటిని తరలించుకుపోయేందుకు సహకరించారు.

➧ తెలంగాణ హక్కులను కాలరాస్తూ నీటి దొంగలు కృష్ణా జలాలను దారిదోపిడీ చేస్తున్నారు.

➧ ఈ జల దోపిడీకి కారణం కేసీఆర్..

➧ పదేళ్లలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారు.

➧ ఉమ్మడి రాష్ట్రంలో జరిగినదానికంటే ఎక్కువ ఈ నిర్లక్ష్యం పదేళ్లలో జరిగింది
➧ పదేళ్లు పాలమూరు-రంగారెడ్డి పడావు పడ్డది..

➧ రెండేళ్లలో పూర్తి చేస్తానన్న కేసీఆర్... పదేళ్లయినా పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేయలేదు..

➧ ఇన్ని పాపాలు చేసి ఇప్పుడు ప్రజా ఉద్యమాలు చేస్తామని బిఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు.

➧ పాపాలు చేసి ప్రజా ఉద్యమాలంటే ప్రజలు చెప్పుతో కొడతారు.

➧ తెలంగాణకు రావాల్సిన వాటా, హక్కుల కోసం మేం కొట్లాడుతుంటే...

➧ అధికారం కోల్పోయి దిక్కుతోచక ఏదో ఒక వంకతో మామా అల్లుళ్లు కాంగ్రెస్ ను బదనాం చేయాలని చూస్తున్నారు.

➧ కేసీఆర్ కు సూటిగా సవాల్ విసురుతున్నా..

➧ అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టు జలాలపై చర్చ పెడదాం...

➧ రెండు రోజులు ప్రాజెక్టుల శ్వేతపత్రంపై చర్చిద్దాం

➧ రెండు రోజులు చాలవంటే సమావేశాలను పొడగిద్దాం..

➧ కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత రావు అందరూ రండి...

➧ నీకు నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రా

➧ మీకు పూర్తి అవకాశం ఇస్తాం... ఒక్క నిమిషం కూడా మైక్ కట్ చేయం.. రా

➧ నిజానిజాలేంటో నిరూపిద్దాం రా..

➧ ఎవరు ద్రోహి, ఎవరు తెలంగాణకు అన్యాయం చేశారో తేలిపోతుంది..

Courtesy / Source by :
https://twitter.com/TelanganaCMO/status/1754153686400450916?t=ct1PYx47EOi7wAB9lrQR3w&s=19

No comments:

Post a Comment