Sunday, November 3, 2024

HMDA అధికారిక ప్రకటన:


HMDA అధికారిక ప్రకటన:

హెచ్‌ఎండీఏ పరిధిలోని గ్రామపంచాయతీల్లో అనధికార లేఅవుట్లలో ప్లాట్‌ల రిజిస్ట్రేషన్‌ను నిషేధించినట్లు కొన్ని మీడియా ఛానెళ్లలో వార్తలు రావటం గమనించాం. ఇది పూర్తిగా తప్పుడు ప్రచారం.

దీనికి సంబంధించి… గత సంవత్సరకాలంగా, హెచ్‌ఎండీఏ నుండి రిజిస్ట్రేషన్ & స్టాంపుల శాఖకు ఎలాంటి అభ్యర్థనను పంపలేదు మరియు గ్రామ పంచాయతీల్లో అనధికారిక లేఅవుట్‌ల ప్లాట్‌ల రిజిస్ట్రేషన్‌ను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని స్పష్టంగా తెలియపరుస్తున్నాం.

ఈ వార్తలు పూర్తిగా నిరాధారమైనవి మరియు అవాస్తవాలు.

ఇలాంటి నిరాధారమైన, సత్యదూరమైన పుకార్లను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ మీడియా సంస్థలు దీనిని గమనించాల్సిందిగా కోరుతున్నాం.

It has been reported by certain sections of the media that the registration of plots in unauthorized layouts in Gram Panchayats within HMDA limits has been prohibited.

In this regard, it is clarified that, over the past year, neither HMDA has sent any such request to the Registration & Stamps Department, nor has the State Government issued any order to stop the registration of plots for unauthorised layouts in Gram Panchayats. 

These reports are completely baseless and are far from the truth.

Citizens are advised not to give credence to such unfounded rumours.
#HMDA 

Courtesy / Source by : https://x.com/HMDA_Gov/status/1853096749952307454?t=B41R95-UDIw7pKQ3BL2tRw&s=19

కులగణన...డెడికేటెడ్ కమిషన్

స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లకు న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి @revanth_anumula గారు చెప్పారు. అందరి ఏకాభిప్రాయం మేరకు తక్షణం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.

➡️కులగణన సంబంధిత అంశాలపై సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల నేపథ్యం, న్యాయస్థానాలు లేవనెత్తిన పలు అంశాలపై ముఖ్యమంత్రి గారు తన నివాసంలో  మంత్రులు @UttamINC గారు, @Min_SridharBabu గారు, @DamodarCilarapu గారు, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు @Bmaheshgoud6666 గారు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

➡️రాష్ట్రంలో ఈ నెల 6వ తేదీ నుంచి సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి మరియు కుల సర్వే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు కోర్టు తీర్పులను తప్పకుండా అనుసరించాలని స్పష్టం చేశారు.

➡️అందరి అభిప్రాయాల మేరకు వెంటనే బీసీ డెడికేటేడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని సీఎం గారు అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించిన రేపటిలోగా ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.

➡️ఇలాంటి కీలకమైన అంశాల్లో ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలు ఉండవని, స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలోనూ పారదర్శకంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు అధికారులకు చెప్పారు. #Telangana #BCReservations 

Courtesy / Source by : https://x.com/TelanganaCMO/status/1853118832594043391?t=54KxlwkzGjrt3VjsFWB1nQ&s=19

Saturday, November 2, 2024

Telangana Greenlights Second Phase of Hyderabad Metro Project with Rs 24,269 Crore Budget

Telangana Greenlights Second Phase of Hyderabad Metro Project with Rs 24,269 Crore Budget

The Telangana government has sanctioned the second phase of the Hyderabad Metro Rail Project, approving a massive budget of Rs. 24,269 crore for five new corridors totaling 76.4 kilometers. The ambitious project will be developed as a joint venture between the Telangana government and the Government of India, aiming to alleviate traffic congestion and reduce pollution in the fast-growing city.

The new metro lines, announced in Government Order from the Municipal Administration and Urban Development Department, will extend Hyderabad’s existing network, which has already proved popular among commuters. The Phase-I metro, spanning 69 km, has become the world’s largest metro project implemented under a Public-Private Partnership (PPP) model, serving around 5 lakh passengers daily.

Phase-II Metro Corridors Breakdown:

1.Nagole to Shamshabad RGIA (Airport Corridor) - 36.8 km
2.Raidurg to Kokapet Neopolis - 11.6 km
3.MGBS to Chandrayangutta (Old City Corridor) - 7.5 km
4.Miyapur to Patancheru - 13.4 km
5.LB Nagar to Hayat Nagar - 7.1 km

These five corridors, part of the project’s “Part A,” represent a total of 76.4 km and are intended to serve key locations, expanding connectivity throughout the city. An additional 40 km extension (Corridor IX), from Rajiv Gandhi International Airport (RGIA) to Fourth City (Skill University), is currently under survey and planning.

Funding Details:
The estimated cost breakdown includes Telangana’s share at Rs. 7,313 crore (30%), the central government’s contribution of Rs. 4,230 crore (18%), and international loans, including from JICA, ADB, and NDB, covering Rs. 11,693 crore (48%). The remaining 4% (Rs. 1,033 crore) will come from a PPP component.

The Hyderabad Airport Metro Limited (HAML) will oversee the project’s development, with administrative clearances granted following comprehensive reviews of updated traffic data. The objective of the metro expansion is not only to serve Hyderabad’s commuters but also to promote equitable growth across all city areas.

Next Steps:
The Hyderabad Airport Metro Limited has been instructed to proceed with implementing the Phase-II corridors, a significant step forward in Hyderabad’s urban transit infrastructure.

#Hyderabad #hyderabadnews #MetroRail 

Courtesy / Source by : https://x.com/sudhakarudumula/status/1852697322599141459?t=t9GSuFEFeXRFhBsXJQ9low&s=19

“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”

D.Thirupathi, The Tahsildar of Jainoor Mandal & Special Officer for Pochamloddhi (Grampanchayat) and M.Shekar, Panchayat Secretary of (Out Sourcing), Jhandagudem  & I/C of Pochamloddhi of Jainoor Mandal, Kumurambheem-Asifabad Dist were trapped by #ACB Officials for demanding & accepting the #bribe amount of Rs.12,000/- "to issue Cheque of Rs.9,10,000/- for executed work pertaining to laying of CC roads ".

“Dial 1064 for Reporting Corruption”

"సిసి రహదారులు వేసినందుకు గాను రూ.9,10,000/- చెక్కును జారీ చేయడం కోసం రూ.12000/- #లంచం తీసుకుంటూ #అనిశా అధికారులకు పట్టుబడిన "కుమురంభీం-ఆసిఫాబాద్ జిల్లా, జైనూర్ మండల తహశీల్దార్ & పోచంలొద్ది (గ్రామపంచాయతీ) ప్రత్యేక అధికారి - "డి.తిరుపతి" & జండాగూడెం & పోచంలొద్ది (అవుట్ సోర్సింగ్) (ఇంచార్జి) గ్రామపంచాయతీ కార్యదర్శి - "ఎం.శేఖర్".

“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”

Courtesy / Source by :  https://x.com/TelanganaACB/status/1852694465192055002?t=_BEgiu7ChV9QFt15D_smeA&s=19

*_బాల సాయిబాబా ఆస్తి మటాష్.!_*

*_బాల సాయిబాబా ఆస్తి మటాష్.!_*

_# నవీన్ మిట్టల్ భూదందా!_
_• రియల్ సంస్థలకు బాలసాయి ట్రస్ట్ భూములు_
_• 42 ఎకరాల భూమి అక్రమ మార్పిడి_
_• ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి మోసం_
_• భూపతి అసోసియేట్స్ కుకేటాయిస్తూ జీవో నెం.45 జారీ_
_• ఐఏఎస్ అమోయ్ తో కలిసి భారీ దోపిడీ_
_• ఈడీని ఆశ్రయించిన మిట్టల్ బాధితులు_
_• తమను మోసం చేశారని లిఖితపూర్వక ఫిర్యాదు_
_• త్వరలో విచారణకు పిలవనున్న ఈడీ_

Courtesy / Source by :
_(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ప్రముఖ పరిశోధన పాత్రికేయులు, 9440000009)_

*_'రాజుల సొమ్ము రాళ్ళ పాలు. బాబాల సొమ్ము రియల్ ఎస్టేట్ పాలు' అన్నట్లు ఎందరో బాబాల సొమ్ము రకరకాల చేతుల్లోకి వెళ్ళింది. తాజాగా బాల సాయిబాబా ఆస్తులు కూడా అలా..అలా ఒక్కొక్కటిగా పొలిటికల్ అనఫిషియల్ బ్యాగ్రౌండ్ లో ఇద్దరు ఐఏఎస్ ల చాతుర్యంతో ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు అప్పనంగా కట్టబెట్టారు._*

*https://epaper.mediatodaydaily.in/view/714/2-11-2024*

*_ఫిర్యాదులే ఫిర్యాదులు:_*
తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారు తున్నాయి. ఇప్పటికే వందల ఎకరాల ప్రభుత్వ, భూదాన్ భూములను అక్రమంగా ప్రైవేటు వ్య క్తులకు కట్టబెట్టారనే ఆరోపణల దృష్ట్యా ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ ను ఈడీ విచారిస్తున్న సంగతి తెలిసిందే. అమోయ్ అక్రమాలపై బాధితులు వరుస పెట్టి ఈడీకి ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. తాజాగా బుధవారం నాడు అమోయ్ పాటు మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులపై ఈడీకి ఫిర్యాదు అందింది. ఐఏఎస్ లు నవీన్ మిట్టల్, మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ పై ఈడీకి బాధితులు ఫిర్యాదు చేశారు.

*_అసలేం జరిగిందంటే..?:_*
కొండాపూర్ పరిధిలోని మజీద్ బండిలో 88 ఎకరాల భూమిని ఓ కుటుంబం బాలసాయి ట్రస్టుకు దానం చేసింది. అయితే ఆ భూమిపై కన్నేసిన ఐఏఎస్ లు ఓ ప్రైవేటు సంస్థకు కట్టబెట్టేందుకు పక్కాగా స్కెచ్ వేశారు. ఆ భూమిలో 42 ఎకరాలకు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి.. భూపతి అసోసియేట్స్ కు ఇస్తున్నట్లు జీవో నెం.45 జారీ చేశారు. ఈమేరకు బాధితులు ఈడీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ భూమికి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి.. ముగ్గురు ఐఏఎస్ అధికారులు మోసం చేశారని తమకు న్యాయం చేయాలని కోరారు.

*_ఈడీ విచారణ తప్పదా..?_*
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ నగర శివార్లలో దాదాపు కోట్ల రూపాయల భూ దందా జరిగినట్లు తెలుస్తోంది. ధరణిని అడ్డం పె ట్టుకుని ఐఏఎస్ అమోయ్ కుమార్ దాదాపు 1000 ఎకరాలకు పైగా భూ అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా పనిచేసిన సమయంలో అమోయ్ కుమార్ మహేశ్వరం మండలం నాగారంలోని దాదాపు 50 ఎకరాల భూదాన్ భూములను అక్రమంగా ఓ మహిళ పేరు మీదకు బదిలీ చేశారు. అనంతరం దాన్ని 4 రియల్ ఎస్టేట్ కంపెనీలకు అమ్మేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో పెద్ద ఎత్తున నగదులా వాదేవీలు జరిగినట్లు సమాచారం అందండంతో ఈడీ రంగంలోకి దిగి మూడు రోజుల పాటు అమోయ్ కుమార్ ను ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే పలువురు బాధితులు ఈడీకి వరుసగా ఫిర్యాదులు చేశారు. అయితే అమోయ్ వెనుక ఎవరున్నారన్న దానిపై ఈడీ సమాచారం సేకరిస్తోంది. ఈ నేపథ్యంలో నవీన్ మిట్టల్, సోమేష్ కుమార్లపై బాధితులు ఫిర్యాదు చేయడంతో త్వరలోనే వారిద్దరి ని కూడా విచారించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఎంత భూమి అక్రమంగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబె ట్టారు..? ఎన్ని చోట్ల ఈ తంతు జరిగింది..? అక్రమ డబ్బును ఎక్కడ దాచారు..? వీరి వెనుక నాటి ప్రభు త్వ పెద్దల హస్తం ఉందా...? అన్న కోణంలో ఈడీ దర్యాప్తు చేయనుంది.

*_అమోయ్ కుమార్ ఉత్తర్వులు రద్దు..:_*
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేటలోని సర్వే నంబర్ 63లో ప్రభుత్వానికి చెందిన 78 ఎకరాల్లో 52 ఎకరాలను నిషేధిత జాబితానుంచి తొలగిస్తూ అప్పటి కలెక్టర్ అమోయ్ కుమార్ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. ఆ భూములపై కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులు సరికావని తప్పుబట్టింది. కోర్టు వివాదాలు సదు స్తుండగా నిషేధిత జాబితా నుంచి తొలగించడం చెల్లదని, ఆ భూముల్లో జోక్యం చేసుకోరాదని ఆదేశాలు జారీ చేసింది. గుట్టల బేగంపేటలోని 78 ఎకరాల భూమి హక్కులపై సుదీర్ఘకాలంగా కోర్టు వివాదాలు నడుస్తున్నాయి. 2018లో ఈ భూమి ప్ర భుత్వానిదేనంటూ బోర్డులు ఏర్పాటు చేయడంతో.. తమ భూముల్లో జోక్యం చేసుకోరాదంటూ ప్రైవేటు వ్యక్తులు కోర్టును ఆశ్రయించడంతో యథాతథస్థి తి కొనసాగించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, నిషేధిత జాబితాలో ఉన్న 78 ఎకరాల్లో 52 ఎకరాలను తొలగిస్తూ 2022 ఆగస్టు 8న అప్పటి కలెక్టర్ అమోయ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ భూమిలో ప్ర భుత్వ జోక్యాన్ని అడ్డుకోవాలని, నిషేధిత జాబితాలో నుంచి 52 ఎకరాలను తొలగించడం ద్వారా రిజిస్ట్రే షన్కుఅవకాశం కల్పిస్తూ జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం జస్టిస్ కె. లక్ష్మణ్ విచారణ చేపట్టారు. సుదీర్ఘ వాద నలను విన్న జడ్జి.. కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ, ఆ భూముల్లో జోక్యం చేసుకోరాదంటూ తీర్పుచెప్పారు..

సీఎం గారితో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఉన్నత విద్యా మండలి చైర్మన్ గారితో పాటు అన్ని యూనివర్సిటీల వైస్ చాన్సలర్లు

రాష్ట్రంలోని యూనివర్సిటీలను నూటికి నూరు శాతం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని, ఉన్నత విద్యకు సంబంధించి గడిచిన పదేండ్లలో దెబ్బతిన్న వ్యవస్థలను తిరిగి పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి @revanth_anumula గారు ఉన్నత విద్యా మండలికి, వైస్ చాన్సలర్లకు సూచించారు.

✅నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఉన్నత విద్యా మండలి చైర్మన్ గారితో పాటు అన్ని యూనివర్సిటీల వైస్ చాన్సలర్లు ముఖ్యమంత్రి గారితో జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా  విద్యామండలి, వీసీలకు సీఎం గారు దిశానిర్దేశం చేశారు.

✅ఎవరి ప్రభావితంతోనో వైఎస్ చాన్సలర్ పోస్టులకు ఎంపిక జరగలేదు. మెరిట్, సామాజిక సమీకరణల ఆధారంగానే ఎంపిక జరిగింది. బాగా పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి.

✅కొంతకాలంగా యూనివర్సిటీల పట్ల విశ్వాసం సన్నగిల్లింది. తిరిగి వర్సిటీల గౌరవం పెంచే దిశగా పని చేయాలి.

✅యూనివర్సిటీలను 100 శాతం ప్రక్షాళన చేయాలి. గతంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లను విద్యార్థులు యేళ్ల తరబడి గుర్తు పెట్టుకునేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.

✅యూనివర్సిటీ ప్రస్తుత పరిస్థితులపై సమగ్ర అధ్యయనం చేసి ప్రమాణాలను పెంచే చర్యలు మొదలు పెట్టాలి. అవసరమైతే కన్సల్టెన్సీలను ఏర్పాటు చేసుకొని నివేదిక తయారు చేసుకోవాలి. వ్యవస్థల పునరుద్ధరణకు ఏం చేయాలో అధ్యయనం చేయాలి.

✅మంచి పని చేయడానికి వైస్ ఛాన్సలర్లకి స్వేచ్ఛ ఉంటుంది. ప్రభుత్వ సహకారం ఉంటుంది. తప్పు జరిగితే ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకోవాల్సివస్తుంది.

✅యూనివర్సిటీల్లో డ్రగ్స్, గంజాయి విక్రయాలపైన దృష్టి సారించాలి. అలాంటి విద్యార్థులను గమనించి కౌన్సెలింగ్ ఇవ్వాలి.

✅సీఎం సలహాదారు @Vemnarenderredy గారు, తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ. బాలకృష్ణా రెడ్డి, కార్యదర్శి ప్రొ. శ్రీరాం వెంకటేశ్, విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం గారితో పాటు ఆయా వర్సిటీలకు కొత్తగా నియమితులైన వైస్ చాన్సలర్లు ప్రొ. ఎం. కుమార్ (ఉస్మానియా), ప్రొ. ప్రతాప రెడ్డి (కాకతీయ), ప్రొ. జీఎన్ శ్రీనివాస్ (పాలమూరు), ప్రొ. నిత్యానంద రావు (తెలుగు), ప్రొ. అల్తాఫ్ హుస్సేన్ (మహాత్మాగాంధీ), ప్రొ. యాదగిరి రావు (తెలంగాణ), ప్రొ. అల్దాస్ జానయ్య (జయశంకర్ వ్యవసాయ), ప్రొ. రాజిరెడ్డి (కొండాలక్ష్మణ్ బాపూజీ ఉద్యాన వర్సిటీ), ప్రొ. ఉమేష్ కుమార్ (శాతవాహన), ప్రొ. సూర్య ధనుంజయ (మహిళా వర్సిటీ), ప్రొ. గోవర్దన్ (బాసర ఐఐఐటీ) గార్లు ముఖ్యమంత్రి గారిని కలిసిన వారిలో ఉన్నారు.
#RisingTelangana #University #HigherEductaion 

Courtesy / Source by : https://x.com/TelanganaCMO/status/1852631626263802358?t=YIYlVhkGGx-XoRx0vFMZ8w&s=19

Friday, November 1, 2024

సీఎం రేవంత్ రెడ్డి సారు ఆదేశాలు భేఖాతరు చేస్తున్న అధికారులు


https://youtu.be/XWKwPqQ_wUc?si=2omUR8eFplm1d1-D  

_*'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'*_

_*#తెలంగాణ @TelanganaCMO ఆదేశాలను అవినీతి అధికారులు భేఖాతరు చేస్తుండ్రు అంటే అర్ధం ఏమిటి ?*_

*@Bhatti_Mallu @TelanganaCS @CPRO_TGCM @IPRTelangana @PrlsecyMAUD @Vemnarenderredy @DigitalMediaTG @CommissionrGHMC @HMDA_Gov @TG_bPASS @mpponguleti*
*@Bmaheshgoud6666 @KomatireddyKVR @OffDSB @seethakkaMLA @DamodarCilarapu @UttamINC @Ponnam_INC @Tummala_INC   @INCTelangana* 

*@GHMCOnline @ZC_Khairatabad @ZC_SLP @ZC_LBNagar @ZC_Kukatpally1 @ZC_Charminar @ZC_Secunderabad @Boduppal_MC @MC_Peerzadiguda @MC_Shadnagar @JawaharnagarC*

*As always we offer our coordination in public interest....*

*కలం యోధులు 🪶*
*Bplkm✍️*

https://x.com/Praja_Snklpm/status/1852388038824833534?t=NflerUJtrQ0SZduW5-R7XA&s=08