Friday, June 7, 2024

*_రామోజీరావు కన్నుమూత_*

_విషాద వార్త_
*_రామోజీరావు కన్నుమూత_*

_(అనంచిన్ని వెంకటేశ్వరావు, 9440000009)_

*_అధికార లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు_*

*_తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం_*

*_ఓ మీడియా దిగ్గజానినికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగటం దేశంలో ఇదే ప్రథమం_*

రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు(87) కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో  జూన్ 5వ తేదీన హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ జూన్ 8వ తేదీ శనివారం ఉదయం 04 : 50 నిమిషాలకు  తుదిశ్వాస విడిచారు.  ఫిల్మ్‌సిటీలోని  నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలిస్తున్నారు.  

రామోజీరావు మృతి పట్ల   పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబరు 16న రైతుకుటుంబంలో జన్మించాడు. తల్లి వెంకటసుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. 

రామోజీరావు స్థాపించిన రామోజీ గ్రూపు ఆధీనంలో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది. 2016లో భారత ప్రభుత్వం రామోజీరావుకు దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ తో సత్కరించింది.

*_టిజేఎస్ఎస్ ల సంయుక్త సంతాపం_*

*_మీడియా దిగ్గజం రామోజీ రావు మృతి పట్ల తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం, తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు, అనంచిన్ని వెంకటేశ్వరావులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రామోజీరావు మీడియాకు అందించిన సేవలు భవిష్యత్ తరాలకు ఎంతో విలువైనవని అన్నారు.

No comments:

Post a Comment