*_జేఏసీ డిమాండ్స్_*
1). రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో 252 మార్గదర్శకాలలోని అభ్యంతరాలను నోటిఫికేషన్కు ముందు సవరించాలి.
2) చిన్న వార్తాపత్రికలు, కేబుల్ ఛానెళ్లు మరియు M-ఛానల్ కాకుండా ఇతర వార్తాపత్రికలకు, ప్రతి జర్నలిస్టుకు వారి సీనియారిటీని పరిగణనలోకి తీసుకొని అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలి.
3). రెండు కార్డుల వ్యవస్థకు బదులుగా, డెస్క్ జర్నలిస్టులు కూడా అన్ని జర్నలిస్టుల మాదిరిగానే ఒకే అక్రిడిటేషన్ కార్డు వ్యవస్థను కొనసాగించాలి.
4). తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అయింది. తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులకు 15 సంవత్సరాల సీనియారిటీ నిబంధన అసంబద్ధం. దానిని తొలగించాలి.
6). కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన వారందరికీ ఎటువంటి షరతులు లేకుండా అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి.
7) తెల్ల రేషన్ కార్డులను వెంటనే అందించాలి.
8). జర్నలిస్టుల కుటుంబాలకు ఉచిత విద్య మరియు ఉచిత వైద్యం వెంటనే అందించాలని సంబంధిత విభాగాలకు అధికారిక ఆదేశాలు జారీ చేయాలి.
9). జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు బీమా సౌకర్యాలు కల్పించాలి.
10). 60 సంవత్సరాలు నిండిన జర్నలిస్టులందరికీ నెలకు రూ. 12,000 పెన్షన్ పథకాన్ని అమలు చేయాలి.
11)జర్నలిస్టులకు దేశవ్యాప్తంగా రైల్వే ఫ్రీ పాసులు కల్పించాలి.
12)దేశవ్యాప్తంగావెహికల్ టోల్గేట్ సౌకర్యం కల్పించాలి
No comments:
Post a Comment