Tuesday, February 28, 2023

సాత్విక్ ఆత్మహత్యపై సమగ్ర విచారణకు ఆదేశించిన.... మంత్రి సబిత....!

*సాత్విక్ ఆత్మహత్యపై సమగ్ర విచారణకు ఆదేశించిన.... మంత్రి సబిత....!*

హైదరాబాద్: నగరంలోని నార్సింగి కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి  ఆరా తీశారు.విద్యార్థి ఆత్మహత్యపై సమగ్ర విచారణ చేపట్టాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకోవాలని, పోలీసులు తమ దర్యాప్తును కొనసాగించాలని స్పష్టం చేశారు. వీలైనంత తొందరగా విచారణ నివేదిక అందించాలని ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్‌  కు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

కాలేజీ స్టూడెంట్ ఆత్మహత్య.....!

*కాలేజీ స్టూడెంట్ ఆత్మహత్య.....!*

హైదరాబాద్ నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజ్‌లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న ఎన్.సాత్విక్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి 10:30 సమయంలో తన క్లాస్‌రూమ్‌లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కాలేజీలో ఒత్తిడి వల్లే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని తోటి విద్యార్థులు చెప్తున్నారు. దారుణమైన విషయం ఏమిటంటే.. సాత్విక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న విషయం తెలిసి కూడా కాలేజీ సిబ్బంది పట్టించుకోలేదు. కనీసం ఆసుపత్రికి కూడా తరలించలేదు. తోటి విద్యార్థులే.. ఓ వెహికల్‌ని లిఫ్ట్ అడిగి, సాత్విక్‌ను ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే సాత్విక్ మృతిచెందాడు. పోస్ట్ మార్టం నిమిత్తం సాత్విక్ మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️

పార్టీ సస్పెన్షన్ ఎత్తివేయకపొతే ఎన్నికల్లో పోటీకి దూరం.... MLA రాజా సింగ్.....!

*పార్టీ సస్పెన్షన్ ఎత్తివేయకపొతే ఎన్నికల్లో పోటీకి దూరం.... MLA రాజా సింగ్.....!*

*హైదరాబాద్.....!*
: తనపై విధించిన సస్పెన్షన్‌ను భాజపా అధిష్ఠానం తొలగిస్తుందన్న నమ్మకం ఉందని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు.సస్పెన్షన్‌ ఎత్తివేయకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే ఉద్దేశం లేదని తెలిపారు. మంగళవారం ఆయన పలు వార్తా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షాలకు తాను పెద్ద అభిమానినని, పార్టీకి వ్యతిరేకంగా వెళ్లే ఉద్దేశమే లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో భాజపా అగ్రనేతలు బండి సంజయ్‌, కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ సహా అందరి ఆశీస్సులు తనకు ఉన్నాయని చెప్పారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Monday, February 27, 2023

అశ్రునయనాల మధ్య ప్రీతికీ కన్నీటి వీడ్కోలు

*అశ్రునయనాల మధ్య ప్రీతికీ కన్నీటి వీడ్కోలు*

జనగామ: మెడికో ప్రీతి  అంత్యక్రియలు  స్వగ్రామంలో ముగిశాయి. అశృనయనాల మధ్య ప్రీతికి కుటుంబసభ్యులు, బంధువులు, పార్టీలు, ప్రజాసంఘాల నేతలు కన్నీటి వీడ్కోలు పలికారు.ప్రీతి మృతితో గిర్నితండా కన్నీటి సంద్రంగా మారింది. కాగా... ప్రీతి అంత్యక్రియల్లో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. విపక్ష నేతలను అంత్యక్రియల్లో పాల్గొనకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ప్రీతి అంత్యక్రియల్లో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆపై గొడవ సర్దుమణిగింది. మందకృష్ణ మాదిగ బీఆర్‌ఎస్  బీజేపీ నేతలు  పాడె పట్టారు. ప్రీతి అంత్యక్రియల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

D. శ్రీనివాస్ కు తీవ్ర స్వస్థత....!

*D. శ్రీనివాస్ కు  తీవ్ర స్వస్థత....!*

హైదరాబాద్ : పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీనివాస్‌కు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.డీఎస్‌కు ఫిట్స్ రావడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన సిటీ న్యూరో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స జరుగుతోంది. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించారు.

తన తండ్రి తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారని.. ఆసుపత్రిలో చికిత్స జరుగుతోందని కాబట్టి రెండు రోజుల పాటు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేనని ట్విటర్ వేదికగా తన కార్యకర్తలకు తెలిపారు. నేడు రేపు తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుంటున్నట్టు వెల్లడించారు. ''మా నాన్న డి. శ్రీనివాస్ గారు తీవ్ర అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు'' అని అరవింద్ తన ట్వీట్‌లో తెలిపారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Sunday, February 26, 2023

మన్నించు తల్లీ..😔

*మన్నించు తల్లీ..*
*'సమాజంలో భాగమైన' ఈ వేదింపులకు బలయిన ప్రీతి కన్నుమూత*
*దారుణ ఘటన పై స్పందించాలో వద్దో అనే సందిగ్ధంలో సమాజము వుండిపోయింది.* 
*(కులం,మతం,జాతి,వర్గం,రాజకీయాలు,...)*
*బాధితురాలి కోసం సమాజం నామమాత్ర స్పందన, కానీ వేదింపులు గురిచేసిన వాడికి దొరికిన కొద్దిపాటి మద్దతు!!*
*Shame!!*

😔
తల్లీ నిన్ను మానసికంగా చంపేసిన ఈ వ్యవస్థలో వున్నందుకు సిగ్గుపడుతున్నాను.

మేధావులు అనుకునే వెధవల్లారా ఇప్పుడైనా స్పందించండి

ఓం శాంతి సద్గతి 🙏

Bplkm🪶

వైద్య విద్యార్థిని ప్రీతి ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి.... ఈటల రాజేందర్.....!

*వైద్య విద్యార్థిని ప్రీతి ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి.... ఈటల రాజేందర్.....!*

హైదరాబాద్‌: వరంగల్‌ కేఎంసీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్  డిమాండ్‌ చేశారు.బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రీతికి మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఆదివారం నిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లిన ఈటల.. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ''రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో నిగూఢంగా ఇంకా ర్యాగింగ్‌ కొనసాగుతోంది. మెడికల్‌ కాలేజీల్లో పీజీ చదివే అమ్మాయిల మీద సీనియర్లు వేధింపులకు గురిచేస్తున్నారని ప్రీతి ఘటనతో స్పష్టమైంది. ఇలాంటి ఘటనలు వెలుగుచూసినప్పుడు హెచ్‌వోడీలే చర్యలు తీసుకోవాలి. ప్రీతి విషయంలో సకాలంలో హెచ్‌వోడీ స్పందించి చర్యలు తీసుకుని ఉంటే ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకునేదికాదు. చివరకు ప్రిన్సిపల్‌ దగ్గరికి వెళ్లి ఆమె గోడు వెళ్లబోసుకున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. ఈ ఘటనపై ప్రీతి తండ్రి పోలీసులకు చెప్పినా ప్రయోజనం లేకపోయింది. ఇక్కడ అన్నీ వ్యవస్థలు విఫలమయ్యాయని అర్థమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సమగ్ర విచారణ జరిపించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి'' అని ఈటల డిమాండ్‌ చేశారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని.. వెంటిలేటర్‌పై ఆమెకు చికిత్స అందిస్తున్నామని నిమ్స్‌ వైద్యులు తెలిపారు.

*సుజీవన్ వావిలాల*🖋️