Tuesday, November 18, 2025

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి తన వివాహానికి ఆహ్వానించిన ప్రముఖ సినీ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి తన వివాహానికి ఆహ్వానించిన ప్రముఖ సినీ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ 

ఈ నెల 27 న రాహుల్ సిప్లిగంజ్ వివాహం

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

BREAKING 

రేపు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

నెక్లెస్ రోడ్ లో మధ్యాహ్నం 12 గంటలకు ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించనున్న సీఎం

కోటి మంది మహిళలకు కోటి చీరలు పంపిణీ చేయాలని నిర్ణయం 

అర్హులైన ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీర అందించాలని నిర్ణయం 

రేపు సెక్రటేరియట్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలతో మాట్లాడనున్న సీఎం.

అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో మొదలు కానున్న ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియ

చీరల ఉత్పత్తి ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఉత్పత్తికి అనుగుణంగా రెండు దశలుగా చీరల పంపిణీ చేపట్టాలని నిర్ణయం.  

తొలి దశలో గ్రామీణ ప్రాంతాల్లో చీరలను పంపిణీ. 

రేపటి నుంచి డిసెంబరు 9 తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ
 
రెండవ దశలో మార్చి 1నుంచి మార్చి 8  అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు పట్టణ ప్రాంతాల్లో మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ 

చీరల నాణ్యత విషయంలో రాజీపడకుండా పారదర్శకంగా పంపిణీ పూర్తి చేయాలని అధికారులకు సూచించిన సీఎం.

అయ్యప్ప మాలలో రెవిన్యూ అవినీతి అధికారులు

Kaluva Kiran Kumar, Mandal Surveyor and Mekala Bhaskar, Chainman, O/o the Tahsildar, Secunderabad Mandal in Hyderabad District were caught by the Telangana #ACB Officials, for demanding the #bribe of Rs.3,00,000/- and accepting Rs.1,00,000/- as first installment from the Complainant "for not to take any adverse action on the notice issued against the property pertaining to the Complainant".

In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website: ( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.

"ఫిర్యాదుదారునికి చెందిన ఒక ఆస్తికి సంబంధించి ఇవ్వబడిన నోటీసుపై ఎటువంటి ప్రతికూల చర్య తీసుకోకుండా ఉండేందుకు"
ఫిర్యాదుధారుని నుండి రూ.3,00,000/- #లంచం డిమాండ్ చేసి, అందులో మొదటి విడతగా రూ.1,00,000/- తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన హైదరాబాద్ జిల్లాలోని సికింద్రాబాద్ మండల తహశీల్దార్ వారి కార్యాలయంలోని మండల సర్వేయర్ - కాలువ కిరణ్ కుమార్ మరియు చైన్ మెన్ - మేకల భాస్కర్.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతేకాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Courtesy / Source by :

https://x.com/TelanganaACB/status/1990799434804797567?t=Dme-Tclsisk7BoT-elQrVg&s=19


Monday, November 17, 2025

🏡 Telangana Tourism – Homestay Applications Invited

🏡 Telangana Tourism – Homestay Applications Invited

To promote world-class, comfortable homestay facilities across district headquarters, rural areas & major tourist destinations, the Government of Telangana is inviting applications to classify fully operational homestay rooms as “Telangana Tourism Homestay Establishments.”

These homestays will offer:
✔️ Clean & comfortable accommodation
✔️ Authentic Telangana cuisine
✔️ A chance for domestic & foreign tourists to experience local culture, customs & traditions

💰 Classification Fees:
• Silver Category – ₹2,000
• Gold Category – ₹4,000
(Payable via DD to “Commissioner/Director of Tourism, Government of Telangana, Hyderabad.”)

📩 Applications & Guidelines:
Available at the Department of Tourism, Hyderabad
OR download from: tourism.telangana.gov.in

📮 Submit Applications to:
Director, Department of Tourism,
Govt. of Telangana,
Kala Bhavan, Ravindra Bharathi, Saifabad, Hyderabad – 500004
📞 040-23459282
📧 director.telanganatourism@gmail.com / telanganatourismpub@gmail.com

#TelanganaTourism #telanganaHomestays #TourismDevelopment #ExploreTelangana #TravelTelangana #TelanganaCuisine #RuralTourism #CulturalTourism #IncredibleIndia #VisitTelangana #TourismOpportunities #iprtelangana #TourismGrowth @TravelTelangana

Courtesy / Source by :
https://x.com/IPRTelangana/status/1989321164657918248?t=VSrucfjUl6XTDYP0PALRuQ&s=19

Sunday, November 16, 2025

రామోజీ గ్రూపు సంస్థలు తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి గర్వకారణంగా నిలుస్తున్నాయని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు అన్నారు.

రామోజీ గ్రూపు సంస్థలు తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి గర్వకారణంగా నిలుస్తున్నాయని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు అన్నారు. హైదరాబాద్ నగరంలో చార్మినార్, గోల్కొండ, హైటెక్ సిటీ వరుసలో నాలుగవ అద్భుతంగా రామోజీ ఫిల్మ్ సిటీ గుర్తింపు తీసుకొచ్చిందని చెప్పారు.

❇️పత్రికా రంగంలో తనదైన ముద్ర వేసిన #RamojiRao గారు ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రోత్సహించిన రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న వారికి సంస్థ రామోజీ ఎక్సలెన్స్ అవార్డులను బహూకరించింది. రామోజీ రావు గారి 89 వ జయంతిని పురస్కరించుకుని రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన ఈ అవార్డుల బహూకరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొని ప్రసంగించారు.

❇️కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి శ్రీ @CPR_VP గారు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. వారితో పాటు @tg_governor జిష్ణు దేవ్ వర్మ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు, కేంద్ర మంత్రులు @kishanreddybjp గారు, @RamMNK గారు, @bandisanjay_bjp గారు, మంత్రి @OffDSB గారు, మాజీ ఉప రాష్ట్రపతి @MVenkaiahNaidu గారు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ గారు, ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు.

❇️ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, రామోజీ రావు గారు ఏ విలువలు, సంప్రదాయాలను తెలుగు ప్రజలకు అందించారో ఆ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వారిని గుర్తించి ఎక్సలెన్స్ అవార్డులను అందించడం అభినందనీయమని అన్నారు.

❇️తెలుగు చలనచిత్ర రంగం నంది అవార్డుల నుంచి ఆస్కార్ అవార్డుల వరకు ఎదగడంలో రామోజీ ఫిల్మ్ సిటీ ఎంతో తోడ్పాటును అందించిందని ప్రశంసించారు. టాలీవుడ్, బాలీవుడ్ కాకుండా హాలీవుడ్ సహా స్క్రిప్ట్‌తో రామోజీ ఫిల్మ్ సిటీలోకి ప్రవేశిస్తే ప్రింట్ తీసుకుని వెళ్లొచ్చేలా అద్భుతమైన కళాఖండాన్ని సృష్టించారని అన్నారు.

❇️రామోజీ గారు ఏ రంగంలో ప్రవేశించినా అందులో తనదైన ముద్ర వేశారని చెప్పారు. వయసు పైబడినప్పటికీ నిత్యం పనిలోనే సంతృప్తి ఉంటుందని చెప్పేవారని, రామోజీ రావు గారు ఒక నిబద్ధతతో పని చేశారని కొనియాడారు. రామోజీ ఒక పేరు కాదని, అదొక బ్రాండ్ అని ఆ బ్రాండ్‌ను కొనసాగించే విషయంలో గ్రూపు సంస్థలకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పారు.

❇️రాష్ట్రంలో తెలుగు భాష అభివృద్ధికి కొన్ని చర్యలు తీసుకున్నామని, కొంత సమయం పట్టినప్పటికీ తెలుగు భాషలో పరిపాలనా వ్యవహారాలను కొనసాగించే విషయంలో అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

❇️వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ఏడుగురు ప్రముఖులకు ఈ సందర్భంగా రామోజీ పేరిట స్థాపించిన #RamojiRaoExcellenceAwards బహూకరించారు. జర్నలిజంలో ఇండిపెండెంట్ జర్నలిస్టు, రచయిత @journohardy గారికి, మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న సామాజిక కార్యకర్త, (Impact And Dialogue Foundation) వ్యవస్థాకురాలు పల్లబి ఘోష్ (#PallabiGhosh) గారికి,  ప్రముఖ పర్యావరణ వేత్త, #AakarCharitableTrust వ్యవస్థాపకులు, చైర్మన్ అమలా అశోక్ రూయా (#AmlaAshokRuia) గారికి ఎక్సలెన్స్ అవార్డులను అందించారు.

❇️అలాగే, సామాజిక విద్యావేత్త, @Pehchaan_School వ్యవస్థాపకుడు ఆకాశ్ టాండన్ గారికి, ఆదివాసీ భాషలను పరిరక్షించడంలో విశేష కృషి చేసిన ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సెలర్, ప్రొఫెసర్ సత్తుపతి ప్రసన్న శ్రీ గారికి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ జి. మధవీ లత గారికి, అంధుడైన పారిశ్రామిక వేత్త శ్రీకాంత్ బొల్లా గారికి ఎక్సలెన్స్ అవార్డులను అందజేశారు.

❇️ఈ కార్యక్రమంలో #RamojiGroup చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ గారు, మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ గారు, రామోజీ ఫిల్మ్ సిటీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ విజయేశ్వరి గారితో పాటు సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

#Eenadu #RamojiFilmCity

Courtesy / Source by:

https://x.com/TelanganaCMO/status/1990103785851810087?t=HBHXRhcJGMpw35rL6Gx3iQ&s=19

రామోజీ గ్రూపు సంస్థలు తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి గర్వకారణంగా నిలుస్తున్నాయని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు అన్నారు.

రామోజీ గ్రూపు సంస్థలు తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి గర్వకారణంగా నిలుస్తున్నాయని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు అన్నారు. హైదరాబాద్ నగరంలో చార్మినార్, గోల్కొండ, హైటెక్ సిటీ వరుసలో నాలుగవ అద్భుతంగా రామోజీ ఫిల్మ్ సిటీ గుర్తింపు తీసుకొచ్చిందని చెప్పారు.

❇️పత్రికా రంగంలో తనదైన ముద్ర వేసిన #RamojiRao గారు ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రోత్సహించిన రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న వారికి సంస్థ రామోజీ ఎక్సలెన్స్ అవార్డులను బహూకరించింది. రామోజీ రావు గారి 89 వ జయంతిని పురస్కరించుకుని రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన ఈ అవార్డుల బహూకరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొని ప్రసంగించారు.

❇️కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి శ్రీ @CPR_VP గారు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. వారితో పాటు @tg_governor జిష్ణు దేవ్ వర్మ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు, కేంద్ర మంత్రులు @kishanreddybjp గారు, @RamMNK గారు, @bandisanjay_bjp గారు, మంత్రి @OffDSB గారు, మాజీ ఉప రాష్ట్రపతి @MVenkaiahNaidu గారు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ గారు, ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు.

❇️ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, రామోజీ రావు గారు ఏ విలువలు, సంప్రదాయాలను తెలుగు ప్రజలకు అందించారో ఆ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వారిని గుర్తించి ఎక్సలెన్స్ అవార్డులను అందించడం అభినందనీయమని అన్నారు.

❇️తెలుగు చలనచిత్ర రంగం నంది అవార్డుల నుంచి ఆస్కార్ అవార్డుల వరకు ఎదగడంలో రామోజీ ఫిల్మ్ సిటీ ఎంతో తోడ్పాటును అందించిందని ప్రశంసించారు. టాలీవుడ్, బాలీవుడ్ కాకుండా హాలీవుడ్ సహా స్క్రిప్ట్‌తో రామోజీ ఫిల్మ్ సిటీలోకి ప్రవేశిస్తే ప్రింట్ తీసుకుని వెళ్లొచ్చేలా అద్భుతమైన కళాఖండాన్ని సృష్టించారని అన్నారు.

❇️రామోజీ గారు ఏ రంగంలో ప్రవేశించినా అందులో తనదైన ముద్ర వేశారని చెప్పారు. వయసు పైబడినప్పటికీ నిత్యం పనిలోనే సంతృప్తి ఉంటుందని చెప్పేవారని, రామోజీ రావు గారు ఒక నిబద్ధతతో పని చేశారని కొనియాడారు. రామోజీ ఒక పేరు కాదని, అదొక బ్రాండ్ అని ఆ బ్రాండ్‌ను కొనసాగించే విషయంలో గ్రూపు సంస్థలకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పారు.

❇️రాష్ట్రంలో తెలుగు భాష అభివృద్ధికి కొన్ని చర్యలు తీసుకున్నామని, కొంత సమయం పట్టినప్పటికీ తెలుగు భాషలో పరిపాలనా వ్యవహారాలను కొనసాగించే విషయంలో అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

❇️వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ఏడుగురు ప్రముఖులకు ఈ సందర్భంగా రామోజీ పేరిట స్థాపించిన #RamojiRaoExcellenceAwards బహూకరించారు. జర్నలిజంలో ఇండిపెండెంట్ జర్నలిస్టు, రచయిత @journohardy గారికి, మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న సామాజిక కార్యకర్త, (Impact And Dialogue Foundation) వ్యవస్థాకురాలు పల్లబి ఘోష్ (#PallabiGhosh) గారికి,  ప్రముఖ పర్యావరణ వేత్త, #AakarCharitableTrust వ్యవస్థాపకులు, చైర్మన్ అమలా అశోక్ రూయా (#AmlaAshokRuia) గారికి ఎక్సలెన్స్ అవార్డులను అందించారు.

❇️అలాగే, సామాజిక విద్యావేత్త, @Pehchaan_School వ్యవస్థాపకుడు ఆకాశ్ టాండన్ గారికి, ఆదివాసీ భాషలను పరిరక్షించడంలో విశేష కృషి చేసిన ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సెలర్, ప్రొఫెసర్ సత్తుపతి ప్రసన్న శ్రీ గారికి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ జి. మధవీ లత గారికి, అంధుడైన పారిశ్రామిక వేత్త శ్రీకాంత్ బొల్లా గారికి ఎక్సలెన్స్ అవార్డులను అందజేశారు.

❇️ఈ కార్యక్రమంలో #RamojiGroup చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ గారు, మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ గారు, రామోజీ ఫిల్మ్ సిటీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ విజయేశ్వరి గారితో పాటు సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

#Eenadu #RamojiFilmCity

Courtesy / Source by:

https://x.com/TelanganaCMO/status/1990103785851810087?t=HBHXRhcJGMpw35rL6Gx3iQ&s=19

Friday, November 14, 2025

*_అందెశ్రీకి అవమానం.!_*

*_అందెశ్రీకి అవమానం.!_*
_# ఆంధ్రా చిత్ర పరిశ్రమ వింత వైఖరి_
_# కీరవాణి నీకేమైంది.?_
_# డబ్బున్నోడు చస్తే... ఇలాగే చేస్తారా..?_
_# 'ఆంధ్రోళ్లు'కు తెలంగాణలో అధికారిక లాంఛానాలు బంద్ చేయ్యాల.!_

Courtesy / Source by:
_(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ప్రముఖ పరిశోధన పాత్రికేయులు, 9440000009,  "ఘంటారావం"కు ప్రత్యేకం)_

*_అందెశ్రీ సినిమాలకు కూడా పనిచేశాడు కదా..! ఒకరూ ఇద్దరు మినహా టాలీవుడ్ పెద్దల్లో ఒక్కడైనా సంతాపం ప్రకటించాడా..? బన్నీ తన తెలివితక్కువతనానికి ఒక్కరోజు జైలుపాలయితే అదేదే కుట్రకేసు అన్నట్టుగా టాలీవుడ్ కేరక్టర్లు అన్నీ సంతాపం, మద్దతు ప్రకటించడానికి బన్నీ ఇంటి ఎదుట పొర్లుదండాలు పెట్టాయి కదా..! ‘మెగా విషాదం’ అన్నాయి కదా..!_*

*_కీరవాణి...ఏందీ పని_*
ఓ తెలంగాణ ఆత్మకవి అందెశ్రీ మరణం వారికెందుకు పట్టలేదు..? అవన్నీ ఎందుకు..? కీరవాణి కంపోజర్‌ను పిలిచి తెలంగాణ రాష్ట్ర గీతానికి ట్యూన్ కట్టమన్నారు కదా.! బోలెడంత డబ్బు ఇచ్చారు కదా.! ఓ చెత్తా ట్యూన్ ఇచ్చాడు కదా.! ఐనా తెలంగాణ ఓన్ చేసుకుంది కదా.!

*_డిఫెండ్ చేయకపోతే..!_*
తన మీద వచ్చిన విమర్శలకూ అందెశ్రీయే డిఫెండ్ చేసుకొచ్చాడు. తను మరణించాడు కదా.! మీకెక్కడైనా 'కీరవాణి' అనే మనిషి కనిపించాడా.? మాయమైపోయాడా…?

*_కృతజ్ఞత కూడా లేదా..?_*
నాకైతే ఓ ట్వీట్ గానీ, ఓ పోస్టు గానీ కనిపించలేదు, ఓ సంతాప ప్రకటన లేదు. ఈ మనిషికి అందెశ్రీ పట్ల కనీస కృతజ్ఞత కూడా లేదా..?
జయజయహే తెలంగాణ గీతానికి కీరవాణి కట్టిన ట్యూన్ ఏమాత్రం పవర్‌ఫుల్‌గా ఓ పోరాట, ఓ రాష్ట్రగీతం స్థాయిలో లేదు అంటే అందెశ్రీ ఒప్పుకోలేదు. ఆ విమర్శ చేసిన వాళ్ల మీదే కోపగించాడు, అంటే కీరవాణికి కోట్ల డబ్బే కాదు, తన మీద విమర్శలకూ అడ్డుగా నిలిచాడు.

*_కీరవాణి కరెన్సీ బంధం_*
నీకు 'ఒక్క తెలంగాణ కంపోజర్ దొరకలేదా.?' అనే ప్రశ్ననూ ఎదుర్కున్నాడు తను. సరే, ఆ పాటతో అందెశ్రీది నెత్తుటి ఉద్వేగ బంధం.! కీరవాణిదేముంది..? జస్ట్, ఓ కరెన్సీ నోెట్ల బంధం… నిజానికి అందెశ్రీ పార్థివశరీరం మీద పూలు జల్లి, నివాళి అర్పించాల్సినవాడు. మరి ఏమయ్యాడు..?

*_వీళ్ళంతా ఇంతేనా..?_*
ఈ రాజమౌళి కుటుంబమంతా ఇంతేనా..? పక్కా కమర్షియల్ బందీలేనా..?
దీనికి రచయిత, నిర్మాత, దర్శకుడు ప్రభాకర్ జైనీ స్పందన ఏమిటంటే..? ఆలోచించాల్సిన విషయమే.!

_‘‘మనం వాళ్ల నుంచి ఆ సంస్కారం ఎక్స్ పెక్ట్ చేయడమే తప్పు. ముఖ్యమంత్రితో ప్రయోజనాలు పొందాలని తప్పితే, స్టూడియోలకు స్థలాలు పొందడానికి, సినిమాలకు రాయితీలు పొందడానికి తప్పితే, సినిమా వాళ్ళెవరికీ, తెలంగాణా పట్ల ఎటువంటి అభిమానం లేదు."_

*_'సుద్ద'పూస..బోసు పురాణం_*
తెలంగాణా ఉద్యమం సమయంలో ఈ సినీ గేయ రచయితలు సుద్దాల అశోక్ తేజ, చంద్రబోస్ ఉద్యమ గీతం రాయమని అడిగితే ఉచ్చలు పోసుకున్నరు. ‘మా పొట్ట గొట్టుకుంటమా?’ అని నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఇప్పుడు సిగ్గు లేకుండా, ముఖ్యమంత్రి ముందర కూర్చుని తెలంగాణా సాంస్కృతిక అభ్యుదయం గురించి మాట్లాడుతున్నారు.

*_వీడో తేడా గాడు_*
ఇంకొకడు, ఉత్తేజ్ అనే థర్డ్ గ్రేడ్ జోకర్, తెలంగాణా ఉద్యమంలో 1200 మంది ఆత్మాహుతి చేసుకుంటే, తాగి పండుకున్నడు గాని, ఒక్క కన్నీటి బొట్టు రాల్చలేదు గాని, వైజాగ్ లో ‘హుదూద్’ తుపాను వస్తే మాత్రం హృదయం కరిగి కవితలు రాసిండు జోకర్ గాడు. వీళ్ళిద్దరూ కేసీయార్ ముందు కూర్చుని సినిమా రంగ అభివృద్ధికి సలహాలు ఇచ్చారు. అశోక్ తేజకు, ఈ ప్రభుత్వమైతే ఏకంగా కోటి రూపాయలిచ్చి, అపవిత్రమయింది.

*_జలగల్లా మనను పీక్కు తింటూనే..!_*
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన యస్.పీ బాలసుబ్రహ్మణ్యం కూడా తెలంగాణా పాట పాడమని అడిగితే నిరాకరించాడు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణా ఏర్పడినా, ఈ సినిమా వాళ్ళు, ఇంకా జలగల్లా మనను పీక్కు తింటూనే ఉన్నారు. సినిమా రంగంలో తెలంగాణా నటులు, టెక్నీషియన్స్ తమది తెలంగాణా అని చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారు. ‘జయజయహే’ పాటను ఖూనీ చేసినవాడు ఆ గేయాన్ని రాసిన అందెశ్రీకి నివాళి అర్పిస్తాడని ఎలా అనుకున్నారు. సినిమా రంగం నుంచి ఏ ఒక్కరైనా స్పందించారా.? స్పందించరు. వాళ్ళ సంస్కృతి, సంప్రదాయాలు వేరు.. తెలంగాణ సంప్రదాయాలు వేరు.

*బాక్స్:*
ఒక కవికి ఇంతకన్నా ఏం కావాలి? గండ పెండేరాలు తొడిగేవాళ్లు కాదు, అశ్రునయనాలతో అంతిమ యాత్రలో పాడె మోసేవాడిని చూడు.!

నేనైతే, ఒక కవి పాడెను మోసిన ముఖ్యమంత్రిని ఇంతవరకు చూడలేదు. గత ప్రభుత్వాల అధినేతలు రాజాంతఃపురాలలో ఉండి శ్రద్ధాంజలి సందేశాలను పంపిన వారే కానీ, ఇలా ఒక కవి అంతిమయాత్రలో పాల్గొన్న వారు లేరు.

ఈ విషయంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోటోకాల్ ను పక్కన పడేసి, మట్టిలో కలిసి మాయమైపోతున్న అందెశ్రీ పార్థివ శరీరం పక్కన నిలవడం, చివరిసారిగా, దింపుడు కళ్ళెం దగ్గర చెవిలో పిలవడం, నోట్లో పాలు పోయడం, అతనికి అందెశ్రీ పట్ల ఉన్న అభిమానానికి, ప్రేమకు తార్కాణం.
రాజకీయాలు, ద్వేషాలు వదిలి, సజల నయనాలతో ఈ దృశ్యాన్ని వీక్షించండి.
జోహార్ ప్రకృతికవి అందెశ్రీ!

*_ఫాంహౌస్ దొర_*
కొండగట్టు అంజన్న గుడి దగ్గర 61 మంది పోతే థూ నా బొడ్డు అన్న గొప్ప ఔదార్యం మన దొర గారిది
ఆర్టీసీ కార్మికులు చస్తుంటే అది ఒడిసిన ముచ్చట
గూడ అంజన్న చావు బ్రతుకులో ఉంటే పట్టించుకోని రియల్ స్టేట్స్‌మాన్

ఐదు సార్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా పనిచేసిన సాయన్నకు అధికార లాంఛనాలు ఇవ్వని మనిషి
ఆంధ్రా హరికృష్ణకు బుర్రిపాలెం కృష్ణకు అధికార లాంఛనాలతో జరిపిన ఉదార స్వభావం

ఆంధ్రా మాగంటి గోపినాథ్ పోతే వెక్కి వెక్కి ఏడ్చిన సారు, అలగా అందెశ్రీ పోతే అడుగు బయట పెట్టని మహా నటుడు మా సారు...?

*అంకితం*
*_మట్టి కవి అందెశ్రీ అన్నకు_*

Tuesday, November 11, 2025

అందెశ్రీ గారి అంతిమయాత్రలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాడె మోశారు

ప్రముఖ కవి, రచయిత, ఉద్యమ గొంతుక, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ గారి పార్థీవ దేహాన్ని సందర్శించి ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు వారికి నివాళులర్పించారు. ఎంతోకాలంగా అత్యంత సన్నిహితంగా మెలిగిన అందెశ్రీ గారి ఆకస్మిక మరణంతో భారమైన హృదయంతో ముఖ్యమంత్రి గారు వారి అంతిమయాత్రలో పాల్గొని అశ్రునివాళి అర్పించారు.

❇️అంతిమయాత్రలో పాల్గొన్న ముఖ్యమంత్రి గారు అందెశ్రీ గారి పాడె మోశారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, సాహితీప్రియులు అక్షరయోధుడికి కడసారి వీడ్కోలు పలికారు. మొదట లాలాపేట్ జయశంకర్ స్టేడియం నుంచి తార్నాక, ఉప్పల్ మీదుగా ఘట్‌కేసర్ ఎన్ఎఎఫ్‌సీ నగర్ వరకు అంతిమ యాత్ర సాగింది.

❇️అందెశ్రీ గారి సతీమణి మల్లుబాయి గారు, కుమార్తెలు వాక్కులమ్మ, వెన్నెల, వేకువ, కుమారుడు దత్తు సంప్రదాయం పద్ధతిలో కర్మకాండలను నిర్వహించగా, అధికారిక లాంఛనాలతో అందెశ్రీ గారి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి గారు అందెశ్రీ గారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంతిమ సంస్కార కార్యక్రమాన్ని దగ్గరుండి పరిశీలించారు.

❇️సాహిత్య సమరయోధుడి అంతిమయాత్రలో ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రులు @OffDSB గారు, @jupallyk_rao గారు, @seethakkaMLA గారు, @Ponnam_INC గారు, @INC_Ponguleti గారు, @minister_adluri గారు, ప్రభుత్వ సలహాదారులు @Vemnarenderredy గారు, కే కేశవరావు గారు, పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ @Bmaheshgoud6666 గారు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు, అధికారులు  పాల్గొన్నారు. #AndeSri #JayaJayaheTelangana

Courtesy / Source by :

https://x.com/TelanganaCMO/status/1988184387905855531?t=SzLs7M01dXZFfCSLs6L0sg&s=19

అందెశ్రీ గారిని కోల్పోవడం తెలంగాణ సమాజంతో పాటు వ్యక్తిగతంగా నాకు తీరని లోటు

మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ...

పశువుల కాపరిగా, తాపీ మేస్త్రిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా రాష్ట్ర సాధనలో గొప్ప పాత్ర పోషించిన వ్యక్తి అందెశ్రీ 

వారిని కోల్పోవడం తెలంగాణ సమాజంతో పాటు వ్యక్తిగతంగా నాకు తీరని లోటు 

పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనను కలిసి తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారానికి మీ పాత్ర ఉండాలని కోరా 

గద్దర్ అన్నతో పాటు అందెశ్రీ గారు  కూడా ప్రజల్లో  స్పూర్తి నింపారు 

ఆయన రాసిన ప్రతీ పాట తెలంగాణలో స్ఫూర్తిని నింపింది 

అందుకే ఆయన రాసిన “జయ జయహే తెలంగాణ” గీతాన్ని పాఠ్యాంశంగా చేర్చేందుకు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంటాం 

ఆయన పేరుతో ఒక స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తాం 

వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది 

ఆయన పాటల సంకలనం “నిప్పుల వాగు” ఒక భగవద్గీతగా, బైబిల్ గా, ఖురాన్ గా తెలంగాణ సమస్యలపై పోరాడేవారికి గైడ్ గా ఉపయోగపడుతుంది 

అందుకే 20 వేల పుస్తకాలను ముద్రించి తెలంగాణలోని ప్రతీ లైబ్రరీ లో “నిప్పుల వాగు” ను అందుబాటులో ఉంచుతాం 

అందెశ్రీ గారికి పద్మశ్రీ ఇవ్వాలని గత ఏడాది కేంద్రానికి లేఖ రాశాం 

ఈ సంవత్సరం కూడా కేంద్రానికి లేఖ రాస్తాం 

వారికి పద్మశ్రీ గౌరవం దక్కేలా కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి సహకరించాలి.

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు గా వారిని పద్మశ్రీ తో గౌరవించుకునేందుకు కృషి చేద్దాం..
Courtesy 

Saturday, November 1, 2025

*_All D best for Indian proud daughters ✊_*

https://x.com/Praja_Snklpm/status/1984790299189952888?t=y0CmAhCNFhCC82N4b4fsbw&s=08

*_All D best for Indian proud daughters ✊_*

*Let the good wishes flow! 🫶*
*✍️ Send in your message of support for the #WomenInBlue ahead of the #Final 👇*
*#TeamIndia | #CWC25 |*

*#INDvSA*
*#IndianWomenCricket*
*#BCCIWOMEN*
*#ICCWomensWorldCup2025*  
*@BCCIWomen @CVAnandIPS*
*@IPRTelangana @IPR_AP*

*Bplkm✍️*

📲 Just scan & share your experience instantly... Collector,Hyderabad

📢 Dear Citizens,
Your feedback shapes better public service delivery!

💡 We’ve launched the QR Code Feedback System at the #Hyderabad Collectorate.

📲 Just scan & share your experience instantly.

💬 Your voice drives change — every opinion counts!

#PeopleFirst #SmartGovernance #Hyderabad

@TelanganaCMO
@TelanganaCS
@IPRTelangana
@harichandanaias

Courtesy / Source by :

https://x.com/Collector_HYD/status/1984130048799219843?t=J8vNbN9FQuuonwc4pjlhbQ&s=19


Thursday, October 30, 2025

మొంథా తుపాను... అధికారులకు ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు ఆదేశాలు జారీ

మొంథా తుపాను వల్ల తీవ్ర ప్రభావానికి గురైన వరంగల్‌, హనుమకొండ తదితర ప్రాంతాల్లో వరద బాధితుల కోసం సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు ఆదేశాలు జారీ చేశారు. వరద ప్రభావత ప్రాంతాలకు వెంటనే అవసరమైనన్ని పడవలను పంపించాలని, వివిధ జిల్లాల్లో అందుబాటులో ఉన్న ఎస్​డీఆర్​ఎఫ్ సిబ్బందిని తక్షణమే తరలించాలని @TelanganaCS గారిని, @TelanganaDGP గారిని ఆదేశించారు.

❇️వరంగల్, హనుమకొండ నగరాల్లో వరద సహాయక చర్యలపై ముఖ్యమంత్రి గారు మంత్రులు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షించారు. అత్యవసరమైన ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం, హైడ్రా సిబ్బందిని, హైడ్రా వద్ద ఉన్న వరద సహాయక సామగ్రిని వినియోగించాలని ఆదేశించారు.

❇️ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. వరద ప్రాంతాల్లో ఎక్కడైనా ఇండ్ల కప్పులు, బంగ్లాల్లో చిక్కుకున్న కుటుంబాలకు డ్రోన్ల ద్వారా అవసరమైన ఆహారం, మంచినీటిని సరఫరా చేయాలని ఆదేశించారు.

❇️పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా అప్రమత్తతతో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని చెప్పారు. ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లకుండా సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు.

❇️వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈరోజు తలపెట్టిన వరంగల్ జిల్లా పర్యటనను వాయిదా వేసుకున్న ముఖ్యమంత్రి గారు గురువారం రోజున వరంగల్, హుస్నాబాద్ తదితర ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. @Collector_WGL @Collector_HNK @cpwarangal #CycloneMontha #Warangal #Hanamkonda #ReliefOperation #SDRF 

Courtesy / source by :

https://x.com/TelanganaCMO/status/1983813217135812623?t=gqrqGNoZQzQ9PmlFQFctkg&s=19

Wednesday, October 29, 2025

మొంథా తుపాన్ ప్ర‌భావంపై ముఖ్య‌మంత్రి ఆరా...

మొంథా తుపాన్ ప్ర‌భావంపై ముఖ్య‌మంత్రి ఆరా...

* అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారుల‌కు ఆదేశం...
*  క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాల‌ని ఆదేశాలు...

హైద‌రాబాద్‌:  మొంథా తుపాన్ ప్ర‌భావంపై ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారుల‌ను బుధ‌వారం ఆరా తీశారు. వ‌రి కోత‌ల స‌మ‌యం కావ‌డం... ప‌లు చోట్ల క‌ళ్లాల్లో ధాన్యం ఆర‌బోసిన నేప‌థ్యంలో ఎటువంటి న‌ష్టం వాటిల్ల‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు. ధాన్యం, ప‌త్తి కొనుగోలు కేంద్రాల్లోనూ త‌గిన ఏర్పాట్లు చేయాల‌ని సీఎం సూచించారు. మొంథా తుపాను ప్ర‌భావం ఉమ్మ‌డి ఖ‌మ్మం, ఉమ్మ‌డి వ‌రంగ‌ల్‌, ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాల్లో అధికంగా ఉండ‌డం.. హైద‌రాబాద్ స‌హా ఇత‌ర జిల్లాల్లోనూ భారీ వ‌ర్షాలు కురుస్తుండ‌డంతో అన్ని శాఖ‌ల అధికారులు, సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మ‌హ‌బూబాబాద్ జిల్లా డోర్న‌క‌ల్ జంక్ష‌న్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌, గుండ్రాతిమ‌డుగు స్టేష‌న్‌లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లు నిలిచిపోవ‌డం.. ప‌లు రైళ్లను ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అధికారులు దారి మ‌ళ్లించిన నేప‌థ్యంలో ప్ర‌యాణికుల‌కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేయాల‌ని సీఎం ఆదేశించారు. మొంథా తుపాన్ ప్ర‌భావం అధికంగా ఉన్న జిల్లాల్లో ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని.. జిల్లా కలెక్టర్లు ఆయా బృందాల‌కు త‌గిన మార్గ‌ద‌ర్శ‌క‌త్వం వ‌హించాల‌ని సీఎం సూచించారు. వాగులు, వంకలు పొంగే ప్రమాదం ఉన్నందున జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోత‌ట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించాలని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. నీటి పారుద‌ల శాఖ అధికారులు, సిబ్బంది రిజ‌ర్వాయ‌ర్లు, చెరువులు, కుంట‌ల నీటి మ‌ట్టాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలిస్తూ నీటి విడుద‌ల‌పై ముందుగానే క‌లెక్ట‌ర్లు, క్షేత్ర స్థాయి సిబ్బందికి స‌మాచారం ఇవ్వాల‌ని సూచించారు. పూర్తిగా నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలని సీఎం సూచించారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో, లోలెవ‌ల్ బ్రిడ్జిలు, కాజ్‌వేల‌పై నుంచి రాక‌పోక‌లు పూర్తిగా నిషేధించాల‌న్నారు.  పోలీసులు, రెవెన్యూ అధికారులు వాటి స‌మీపంలో బారికేడ్లు ఏర్పాటు చేసి ప‌ర్య‌వేక్ష‌ణ చేయాల‌ని సీఎం ఆదేశించారు. తుపాను ప్ర‌భావంతో వ‌ర్ష‌పు నీరు నిల్వ ఉండి దోమ‌లు, ఇత‌ర క్రిమికీట‌కాలు విజృంభించి అంటువ్యాధులు ప్ర‌బ‌లే ప్ర‌మాదం ఉన్నందున న‌గ‌ర‌, పుర‌పాల‌క‌, గ్రామ పారిశుద్ధ్య సిబ్బంది ఎప్ప‌టిక‌ప్పుడు పారిశుద్ధ్య ప‌నులు చేప‌ట్టాల‌ని సీఎం సూచించారు. వైద్యారోగ్య శాఖ త‌గినంత మందులు అందుబాటులో ఉంచుకోవాల‌ని... అవ‌స‌ర‌మైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల‌ని సీఎం ఆదేశించారు.  ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ప‌శు న‌ష్టం చోటుచేసుకోకుండా జాగ్ర‌త్త‌లు వ‌హించాల‌ని సీఎం సూచించారు. రెవెన్యూ, విద్యుత్‌, పంచాయ‌తీరాజ్, ఆర్ అండ్ బీ, వైద్యారోగ్య‌, పోలీస్‌, అగ్నిమాప‌క శాఖ‌లు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది స‌మ‌న్వ‌యంతో సాగాల‌ని సీఎం సూచించారు.  హైద‌రాబాద్ న‌గ‌రంలో ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే విన‌తుల‌కు జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్‌, అగ్నిమాప‌క శాఖ సిబ్బంది త‌క్ష‌ణ‌మే స్పందించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Tuesday, October 28, 2025

PUBLIC/PRESS NOTE

28.10.2025 Hyderabad

PUBLIC/PRESS NOTE

On 27.10.2025 hearing was held at Real Estate Appellate Tribunal, MCRHRD campus, Hyderabad in Dr Lubna Sarwath vs Phoenix Global Spaces Pvt Ltd & Ors. 

On 7.10.2025 Phoenix was instructed to file Building permissions, TGRERA registrations , all related documents, yet they were not filed.
Appellant filed rejoinder to the counter affidavit of R1 & R2.  
The Counter filed on 7.10.2025 by R1&R2 does not answer any of the grounds of the appeal, rather they gone into same rhetoric of ‘maintainability’ of appellant,  etc.

Prima facie analysis shows that at the date of TGRERA Order dt. 27.03.2025 the
said survey numbers 272 and 273 Puppalguda V Gandipet M, RR District, were held in Prohibited List which was blatantly denied in the TGRERA Order, that clearly indicates the collapse of TGRERA Order and exposes the unfairness of TGRERA order and all the Respondents.

Secondly, it is observed that R1 hastens with another letter to get the said survey numbers
to the said extent to be deleted from Prohibited List after this Appeal is filed in this Hon’ble
Tribunal. The said District Registrar obliges by a mere letter from the Tahsildar. All due procedure
has been manipulated by the Respondents.

As the Respondents private and state are seen to be colluding with one another it is
appealed once again to the Tribunal that the TGRERA Registrations be suspended pending thorough investigation, to save allottee interests that is one of the primary objectives of the RERA Act 2016 and objective of this Hon’ble Tribunal.

Thanks
Dr Lubna Sarwath, Social & Environmental Activist, Indian National Congress, Hyderabad

Friday, October 24, 2025

*నమిశ్రీ అవినీతికి సహకరించిన సంబందిత ప్రభుత్వ శాఖల అవినీతి అధికారులను సస్పెండ్ చేసి జైళ్ళో పెట్టాలి.*

*ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు.* https://x.com/Praja_Snklpm/status/1981715955261870362?t=J2iZUdkbNA8zLBQGpNmO2Q&s=08

*ఆదాబ్ హైదరాబాద్: 24 Oct 2025*

*సికింద్రాబాద్ ఎస్టేట్ భూములు & అబ్దుల్లాపూర్ మెట్ అటవీభూములు*

*_ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది_*

*Mr రేవంత్ రెడ్డి సారు ఇదేనా #TelanganaRising అంటే ??*

*@HMDA_Gov @Comm_HYDRAA*

*నమిశ్రీ అవినీతికి సహకరించిన సంబందిత ప్రభుత్వ శాఖల అవినీతి అధికారులను సస్పెండ్ చేసి జైళ్ళో పెట్టాలి.*

*@TelanganaCMO @CPRO_TGCM @IPRTelangana @TelanganaCS @Aadabtvlive @iamkondasurekha @HarithaHaram @CollectorRRD @Acpibrahimpatnm @Tahsildaribp @IbrahimpatnamPS @PIBHyderabad @BplplH*

కర్నూలు జిల్లా బస్సు ప్రమాద ఘటనలో గాయపడిన మరియు సురక్షితంగా ఉన్న ప్రయాణికుల వివరాలు

కర్నూలు జిల్లా బస్సు ప్రమాద ఘటనలో గాయపడిన మరియు సురక్షితంగా ఉన్న ప్రయాణికుల వివరాలు :

1.మన్నెంపల్లి సత్యనారాయణ (వయసు 27), తండ్రి ఎం. రవి, సత్తుపల్లి, ఖమ్మం జిల్లా – గాయపడి ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

2.బడంత్ర జయసూర్య (వయసు 24), తండ్రి సుబ్బరాయుడు, మియాపూర్, హైదరాబాద్ – గాయపడి కర్నూలు GGH లో చికిత్స పొందుతున్నారు.

3.అండోజ్ నవీన్ కుమార్ (వయసు 26), తండ్రి కృష్ణాచారి, హయత్‌నగర్, హైదరాబాద్ – గాయపడి చికిత్సలో ఉన్నారు.

4.సరస్వతి హారిక (వయసు 30), తండ్రి రంగరాజు, బెంగళూరు – కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలో ఉన్నారు.

5.నెలకుర్తి రమేష్ (వయసు 36), దత్తలూరు మండలం, నెల్లూరు జిల్లా – స్వల్ప గాయాలు, ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారు.

6.శ్రీలక్ష్మి (నెలకుర్తి రమేష్ భార్య), జస్విత (వయసు 8), అభీరా (వయసు 1.8 సంవత్సరాలు) – ముగ్గురు సురక్షితంగా కర్నూలులో బంధువుల వద్ద ఉన్నారు.

7.కపర్ అశోక్ (వయసు 27), తెలంగాణ రాష్ట్రం – సురక్షితంగా హైదరాబాద్‌కి వెళ్తున్నారు.

8.ముసలూరి శ్రీహర్ష (వయసు 25), నెల్లూరు జిల్లా – గాయపడి కర్నూలు GGH లో చికిత్స పొందుతున్నారు.

9.పునుపట్టి కీర్తి (వయసు 28), ఎస్.ఆర్. నగర్, హైదరాబాద్ – చికిత్స అనంతరం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యి హైదరాబాద్ చేరుకున్నారు.

10.వేణుగోపాల్ రెడ్డి (వయసు 24), తెలంగాణ రాష్ట్రం – చికిత్స అనంతరం హైదరాబాద్ చేరుకున్నారు.

11.ఎం.జి.రామరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా – చికిత్స పూర్తయి హైదరాబాద్ చేరుకున్నారు.

12.ఘంటసాల సుబ్రమణ్యం, కాకినాడ, ఆంధ్రప్రదేశ్ – ఆకాశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

13.అశ్విన్ రెడ్డి – ఎటువంటి గాయాలు లేవు, సంఘటనా స్థలంలో సురక్షితంగా ఉన్నారు.

14.ఆకాశ్ – ఎటువంటి గాయాలు లేవు, సురక్షితంగా ఉన్నారు.

15.జయంత్ కుశ్వాల్, మధ్యప్రదేశ్‌ (హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు) – సురక్షితంగా ఉన్నారు.

16.పంకజ్ ప్రజాపతి – ఎటువంటి గాయాలు లేవు, సురక్షితంగా ఉన్నారు.

17.గుణ సాయి, తూర్పు గోదావరి జిల్లా – స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్నారు.

18.శివా (గణేష్ కుమారుడు) – ఎటువంటి గాయాలు లేవు, బెంగళూరు చేరుకున్నారు.

19.గ్లోరియా ఎల్సా సామ్, బెంగళూరు – ఎటువంటి గాయాలు లేవు, బెంగళూరు చేరుకున్నారు.

20.చారిత్ (వయసు 21), బెంగళూరు – సురక్షితంగా బెంగళూరు చేరుకున్నారు.

21.మొహమ్మద్ ఖిజర్ (వయసు 51), బెంగళూరు – సురక్షితంగా బెంగళూరు చేరుకున్నారు.

22.తరుణ్ (వయసు 27) – బస్సులో ఎక్కకముందే రద్దు చేసుకున్నారు.

డ్రైవర్ల వివరాలు
1.లక్ష్మయ్య, పల్నాడు జిల్లా – ప్రధాన డ్రైవర్‌. సంఘటన సమయంలో బస్సు నడుపుతున్నారు. ప్రమాదం తర్వాత అబ్స్కాండ్‌ అయ్యారు (సంఘటన స్థలం నుండి పరారయ్యారు).
2.శివనారాయణ, ప్రకాశం జిల్లా – స్పేర్ డ్రైవర్‌. ప్రస్తుతం పోలీస్‌ కస్టడీలో ఉన్నారు మరియు విచారణ కొనసాగుతోంది.

ప్రయాణికుల రాష్ట్రాలవారీగా:
👉తెలంగాణ రాష్ట్రం – 6
👉ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం – 11
👉మధ్యప్రదేశ్ – 1
👉కర్ణాటక రాష్ట్రం – 4

మరో ముగ్గురు ఏ రాష్ట్రానికి చెందినవారు తెలియాల్సి ఉంది.
@Collector_JGL 

Source / Courtesy by :

https://x.com/IPRTelangana/status/1981664928810373602?t=mn9So2NzD25H5Ck_ZfvJ9w&s=19

Tuesday, October 21, 2025

*ప్రజా సేవకురాలు, ప్రగతి వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకురాలు బూర్గుల సుమన ఇక లేరు*

*ప్రజా సేవకురాలు, ప్రగతి వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకురాలు బూర్గుల సుమన ఇక లేరు*

రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం బూర్గుల గ్రామ మాజీ ఎంపీటీసీ మరియు మాజీ సర్పంచ్ బూర్గుల సుమన అనారోగ్యంతో ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో కన్నుమూశారు. ఈమె హైదరాబాద్ మొదటి ముఖ్యమంత్రి  బూర్గుల రామకృష్ణారావు సోదరుడి కుమార్తె , బూర్గుల నరసింగరావు చెల్లెలు. ఈమె బూర్గుల గ్రామానికి ఒక సారి ఎంపీటీసీ గా మరియు సర్పంచ్ గా సేవలందించారు.. అంతే కాకుండా ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో తాను టీచర్ గా తన దగ్గర చదువుకున్న ఆ నాటి విద్యార్ధుల సహకారం తో బూర్గులలో "ప్రగతి వెల్ఫేర్ అసోసియేషన్" ను స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, నేడు ఈ అసోసియేషన్ అనేక గ్రామాలకు విస్తరించి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుంది.. అంతేకాదు తాను చనిపోయినా తన శరీరం పదిమందికి ఉపయోగ పడాలని హాస్పిటల్ కి దానం చేస్తున్నట్లు వీలునామా రాసుకున్న గొప్ప వ్యక్తి.  ఆమె లేని లోటు బూర్గుల గ్రామ ప్రజలతో పాటు చుట్టూ పక్కల ప్రజలకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు... 
(Courtesy/ Source)by:➡️𝗚𝗡𝗥

Sunday, October 19, 2025

*_Mr రేవంత్ రెడ్డి "గారు" మిమ్మల్ని బద్నామ్ చేస్తున్న రెవిన్యూ శాఖ అవినీతి అధికారులు._*

https://youtu.be/iO9xmgfmQJ4?si=N2yCnNSiZj8XJ5ZY  

*_ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది_*

*_Mr రేవంత్ రెడ్డి "గారు" మిమ్మల్ని బద్నామ్ చేస్తున్న రెవిన్యూ శాఖ అవినీతి అధికారులు._*
 
*_#TelanganaRising అంటే అవినీతి లో అని అన్ని ప్రభుత్వ శాఖల అవినీతి ప్రభుత్వ అధికారులు / అవినీతి ప్రజాప్రతినిధులు రుజువు చేస్తుండ్రు._*

*@MNatarajanINC*
*@TelanganaCMO* *@CPRO_TGCM @IPRTelangana @TelanganaCS* *@INC_Ponguleti @Bmaheshgoud6666 @PIBHyderabad @aadabhyd* *@INCTelangana @RamMohanINC @TRPpartyTG @BplplH*

https://x.com/Praja_Snklpm/status/1979811942740197680?t=GUsxMmL2fm-ktcjHw3-cOg&s=19
               *****
https://www.instagram.com/reel/DP-5TBHEoOC/?igsh=eTJkNWt6eW1va243
               *****
https://www.facebook.com/share/1CMgZLpaWM/

Saturday, October 18, 2025

*తీరు మార్చుకోండి .... అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్*

*తీరు మార్చుకోండి .... అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్*

హైదరాబాద్... ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనుల అమలులో అన్ని శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీలు, డిపార్ట్‌మెంట్ హెడ్‌లు (హెచ్‌ఓడిలు) తమ నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారుఏ అధికారి అయినా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ప్రభుత్వం సహించబోదని ముఖ్యమంత్రి అధికారులకు గుర్తు చేశారు.

రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా కొందరు అధికారులు పని తీరులో మార్పు రాలేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల అలసత్వం విడనాడి, ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ లక్ష్యాలు, లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నతాధికారులు విధులు నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. అధికారులు సొంతంగా నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావద్దని సీఎం సూచించారు. రాష్ట్రాభివృద్ధితోపాటు రాష్ట్ర ప్రజలందరి సంక్షేమం కోసం అధికారులు కృషి చేయాలని సీఎం సూచించారు.

సీఎంవో కార్యదర్శులు , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో ముఖ్యమంత్రి ఈరోజు తన నివాసంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

పథకాల ప్రయోజనాలను ప్రజలకు చేరవేయడంలో మరింత చురుగ్గా పని చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి.. సీఎస్‌ను అన్ని శాఖల కార్యదర్శుల నుండి ఎప్పటికప్పుడు నివేదికలు తీసుకోవాలని, పనుల పురోగతిని సమీక్షించాలని ఆదేశించారు. పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను త్వరితగతిన అమలు చేయడంలో ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలను తన దృష్టికి తీసుకురావాలని సీఎంఓ అధికారులను ఆదేశించారు.

కేంద్ర నిధుల స్థితిగతులను సమీక్షించిన సీఎం రేవంత్‌రెడ్డి పెండింగ్‌లో ఉన్న కేంద్ర గ్రాంట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద వచ్చే నిధులను వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్ర వాటా చెల్లించి పెండింగ్‌లో ఉన్న కేంద్ర నిధుల విడుదల కోసం ఎదురుచూస్తున్న పథకాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం సూచించారు.

తమ పరిధిలోని శాఖలపై ప్రతివారం తనకు నివేదికలు అందజేయాలని, ప్రగతిని సమీక్షిస్తానని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎంఓ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

*V.S.జీవన్*

Friday, October 17, 2025

*Mr రేవంత్ రెడ్డి సారు ఇదేనా #TelanganaRising అంటే ?*


*ఆదాబ్ హైదరాబాద్:*

*"నమిశ్రీ భూదందా"*

*Mr రేవంత్ రెడ్డి సారు ఇదేనా #TelanganaRising అంటే ?*

*@TelanganaCMO*
*@CPRO_TGCM @IPRTelangana @TelanganaCS @PrlsecyMAUD @cdmatelangana @CommissionrGHMC @Collector_HYD @RdoSecunderabad @Aadabtvlive @PIBHyderabad @TRPpartyTG @PressClubHyd @BplplH @Narhariyarabotu*

https://x.com/Praja_Snklpm/status/1979438425838358905?t=zbxe6C0QNoZARKKlzu_Lew&s=08

Thursday, October 16, 2025

కోర్టు పర్మిషన్తో క్రిమినల్ కేసు బుక్ చేసిన మేడిపల్లి పోలీసులు

భాజపా నేత మేక రాంరెడ్డిపై కేసు నమోదు

- కోర్టు పర్మిషన్తో క్రిమినల్ కేసు బుక్ చేసిన మేడిపల్లి పోలీసులు
-  న్యాయం గెలిచిందంటున్న సీనియర్ జర్నలిస్ట్ జీ కుమార స్వామి
-  మేడిపల్లి సిఐ గోవింద్ రెడ్డి, ఎస్ఐ నర్సింగ్ తిరుపతయ్యలకు కృతజ్ఞతలు..

 అక్షర శోధన న్యూస్ : అక్టోబర్ 17 హైదరాబాద్

 అక్టోబర్ 9 తారీకు ఉదయం సోషల్ మీడియా వేదికగా సీనియర్ జర్నలిస్ట్ జి కుమార స్వామిని బెదిరించిన భాజపా నాయకుడు మేక రామ్ రెడ్డి పైన మేడిపల్లి పోలీసులు కోర్టు పర్మిషన్ తో 352 బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అదేవిధంగా సదరు వ్యక్తికి నోటీసులిచ్చి చార్ షీట్ వేసి కోర్టుకు పంపిస్తామని తెలిపారు.
ఈ మేరకు స్పందించిన బాధితుడు కుమారస్వామి మాట్లాడుతూ.. ఎట్టకేలకు న్యాయం గెలిచిందని, మేడిపల్లి పోలీసుల మీద నమ్మకం ఉంచి సుమారుగా వారం రోజులపాటు వేచి చూడడం జరిగిందని, కోర్టు పర్మిషన్ తో సదరు వ్యక్తి మీద కేసు నమోదు చేసి న్యాయం చేశారని పేర్కొన్నారు. అదేవిధంగా ఇలాంటి వ్యక్తుల మీద నిఘా కూడా ఏర్పాటు చేసి మాలాంటి వారికి రక్షణ కల్పించాలని కోరారు. అదేవిధంగా అతని నుండి మాకు ప్రాణహాని ఉందని, సిటీ పరిధిలో ఎక్కడ, ఎప్పుడు ఏమైనా సదరు వ్యక్తే కారణమని మీడియాతో తెలియజేశారు. ఈ కేసు విషయంలో మాకు సహకరించిన మేడిపల్లి ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులకు, నా తోటి జర్నలిస్టు మిత్రులకు, అదేవిధంగా దళిత సంఘాలు నాయకులకు, ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
(SOURCE)

రౌడీషీటర్ నగర బషిష్కరణ

పత్రికా ప్రకటన

రౌడీషీటర్ నగర బషిష్కరణ

గౌరవ శ్రీ. జి. సుధీర్ బాబు IPS గారు, రాచకొండ పోలీస్ కమిషనర్, ఆదిబట్ల SHO సమర్పించిన రికార్డులను పరిశీలించిన తర్వాత, తేదీ.30.09.2025 న హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్, 1348 ఫస్లీ, సెక్షన్ 26(1) నిబంధనల ప్రకారం రౌడీ షీటర్ అయిన కొడుదుల నవీన్ రెడ్డి S/o కోటి రెడ్డి, వయస్సు: 32 సంవత్సరాలు, Occ: వ్యాపారం, R/o. ప్లాట్ నెం. 34, తిరుమల హోమ్స్, మన్నెగూడ, అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, రంగారెడ్డి జిల్లా. N/o  ముషంపల్లి గ్రామం, నల్గొండ మండలం మరియు జిల్లాకు చెందిన వ్యక్తికి నగర బహిష్కరణ ఉత్తర్వులు నోటీసును జారీ చేశారు. 

స్థానికంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చట్టవిరుద్ధ కార్యకలాపాలలో పాల్గొంటున్నందుకు, ఏసీపీ ఇబ్రహీంపట్నం ద్వారా నోటీసు అందిన ఏడు రోజులలోగా, తనను రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధి నుండి 6 నెలల పాటు ఎందుకు బహిష్కరించకూడదో కారణం తెలపాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. పైన పేర్కొన్న కొడుదుల నవీన్ రెడ్డి S/o కోటి రెడ్డి (రౌడీ షీటర్) పై ఆదిబట్ల పోలీస్ స్టేషన్ లో దాడి, హత్యాయత్నం, క్రిమినల్ బెదిరింపులు, మరియు అల్లర్లు, వంటి నేరాలతో సహా పలు క్రిమినల్ కేసుల నేర చరిత్ర ఉంది. అతను ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ, భయాందోళనలు సృష్టించడంలో పేరుగాంచాడు. అతని నిరంతర బెదిరింపుల కారణంగా, ప్రజలు అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి లేదా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడానికి భయపడుతున్నారు. కావున నగర బహిష్కరణ విధించటం జరిగింది.

@TelanganaCOPs @DcpMalkajgiri @DCPLBNagar @DcpBhongir @DCPMaheshwaram @ntdailyonline @TelanganaToday @eenadulivenews @v6velugu @ManaTelanganaIN @sakshinews @thenewsminute @TOIHyderabad @XpressHyderabad @DeccanChronicle @TheDailyPioneer @TheHansIndiaWeb @the_hindu @TheDailyMilap @TheSiasatDaily @way2_news @abntelugutv @IndianExpress @NewIndianXpress @IndiaToday @bbcnewstelugu

SOURCE / Courtesy by :

https://x.com/RachakondaCop/status/1978311802284032171?t=8rReLHGbHhr7jLqgCh96wg&s=19

Monday, October 13, 2025

*మునగనూరు సర్కారు భూమి కబ్జా లో ఫేక్ రసీదుల కలకలం..?*

*మునగనూరు సర్కారు భూమి కబ్జా లో ఫేక్ రసీదుల కలకలం..?*

*పోలీస్ వ్యవస్థ ఎక్కడ..?*

*హైడ్రా నిద్రపోతుందా..?*

*ఇప్పటికే దీనిపై ఇంటలిజెన్స్ రిపోర్ట్ పంపిన స్థానిక ఐబి అధికారులు..*

*ఫేక్ రసీదులు తయారు చేసి భూములు కబ్జా చేసిన వారిని శిక్షించరా..?*

*రాచకొండలో పోలీసు వ్యవస్థ పని చేస్తుందా..?*

*ఎందుకు విచారణ జరిపి క్రిమినల్ కేసులు నమోదు చేయడం లేదు..?*

*సామాన్యుడికి ఒక చట్టం.. జర్నలిస్టులకు మరో చట్టమా.. ఇదెక్కడి న్యాయం..?*

*ఫేక్ సర్టిఫికెట్లు.. రసీదులు తయారు చేయడం నేరం.. కాదా?*

*మునగనూరు గ్రామపంచాయతీ పేరుతో ఫేక్ రసీదులు తయారు చేసిన వారిని ఎందుకు వదిలేస్తున్నారు..?*

*జర్నలిస్టులు అయితే నేరం చేయవచ్చా..!*

*చట్టం అందరికీ సమానమే.. కదా.. మరి వీళ్లపై ఎందుకు క్రిమినల్ చర్యలు తీసుకోవడం లేదు..?*

*మునగనూరు సర్వేనెం :90 భూ కబ్జా బాగోతంలో ప్రజా ప్రతినిధులు, గత అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో.. తుర్కయంజాల్ కమిషనర్... అందరూ పాత్రధారులే..!*

గత ప్రభుత్వం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పేరుతో మాయ చేసింది. అందుకోసం ఎటువంటి జీ.ఓ విడుదల చేయకుండా.. అనధికారికంగా ప్రభుత్వ భూములను కబ్జా చేసి మరీ.. కొంత మంది జర్నలిస్టులకు అంట గట్టింది. ఆయా నియోజకవర్గాలలో గత ప్రభుత్వ అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సర్కార్ భూముల కబ్జా బాధ్యతలను అప్పటి ప్రభుత్వం అప్పగించింది. దీంతో నాటి అధికార పార్టీ ఎమ్మెల్యేలు వారికి నచ్చిన వాళ్లను.. వాళ్ల మోచేతి నీళ్లు తాగే జర్నలిస్టులను ఎంపిక చేసి ప్రభుత్వ భూములను అనధికారికంగా కట్టబెట్టారు.

*జర్నలిస్టులు అనే సోయి మరిచి.. ఫేక్ రసీదులు సృష్టించి..!*

రంగారెడ్డి జిల్లా పరిధిలోని గత అధికార పార్టీ ఇద్దరు ఎమ్మెల్యేలు (ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం) 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వాళ్ల లబ్దికోసం అనధికారికంగా ప్రభుత్వ భూమిని కబ్జా చేసి వారికి అనుకూలమైన జర్నలిస్టులకు అంటగట్టారు. ఎల్బీనగర్ పరిధిలోని జర్నలిస్ట్ ల కోసం మునగనూరు సర్వేనెం :90 లో రెండున్నర ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఎమ్మెల్యే తనకు నచ్చిన జర్నలిస్ట్ లకు  అప్పగించారు. దీంతో సదురు మహానుభావులు.. లోక జ్ఞానం ఉన్నోళ్లు.. కదా.. సమాజం పట్ల అవగాహన ఉంటుందని ప్రజలు నమ్మేవాళ్లు.. కానీ సదురు జర్నలిస్టులు సంకలు గుద్దుకొని.. సోయి మరిచి.. సర్కారు భూమి లో 2004 నుంచి తామే ఉంటున్నట్లు.. ఇంటి నెంబర్లతో సహా పొందుపరిచి మునగనూరు గ్రామపంచాయతీలో ఇంటి పన్ను చెల్లిస్తున్నట్లు ఫేక్ రసీదులు తయారు చేశారు. ఎందుకంటే మునగనూరు సర్వేనెం:90 సర్కారు భూమిలో ఏండ్ల తరబడి ఉంటూ ఇంటి పన్ను చెల్లిస్తున్నట్లు నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రభుత్వ భూమిలో 2023 వరకు ఒక్క ఇంటి నిర్మాణం జరగలేదు. 

*బొక్క బోర్లా..*

మునగనూరు ప్రభుత్వ భూమిలో 2004 నుంచి ఇంటి పన్ను చెల్లిస్తున్నట్లు బుఖాయించే ప్రయత్నం చేసిన కబ్జాదారులు 2023లో కరెంటు మీటర్ల కోసం అదే ఇంటి పన్ను రసీదులను పొందుపరచడం గమనార్హం. ఇక్కడే సదురు కబ్జాదారులు బొక్క బోర్లా పడ్డారు. వీళ్లను కాపాడే ప్రయత్నంలో అధికారుల కూడా బుక్కయ్యారు. 2004లో ఎటువంటి నిర్మాణాలు లేకుండా కొత్తగా నిర్మించిన ఇండ్లకు ఫేక్ రసీదులతో కరెంటు మీటర్లు మంజూరు చేసిన ఏడీఈ కూడా నేరస్తుడే..? వీళ్ళతో పాటు అతడిని కూడా విచారణ జరిపి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

*గత ఎమ్మార్వో.. మున్సిపల్ కమిషనర్లు కూడా నేరస్తులే...!*

మునగనూరు ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన గత ఎమ్మార్వో.. గత తుర్కయంజాల్ కమిషనర్, ప్రస్తుత కమిషనర్లకు కూడా ఈ కబ్జా బాగోతంలో భాగము ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఎటువంటి జీవో లేకుండా సర్కారు భూమిని ఆక్రమించడం నేరం. ఇందులో గత ఎమ్మార్వో కు.. కమిషనర్లకు కూడా ప్లాట్లు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపితే అనేక విషయాలు బయటపడతాయి పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

*ఎమ్మెల్యేల పిఏ లకు డ్రైవర్లకు సైతం..!*

గత ప్రభుత్వ ఎమ్మెల్యే తన సోకాల్డ్ జర్నలిస్టులతో పాటు పీఏలకు, పీఆర్ఓలకు, డ్రైవర్లకు కూడా మునగనూరు సర్కార్ భూమిలో ఎలా ఉంటాయి..? ప్రస్తుత ఎమ్మెల్యే పీఏకు డ్రైవర్ కు, తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డ్రైవర్ తో పాటు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ముఖ్యంగా లోకల్ ఎమ్మెల్యే కు అనుకూలంగా ఉండే మరో డిజిటల్ పత్రిక చైర్మన్ కూడా ఇటీవల మునగనూరు సర్కారు భూమిలో ప్లాట్లు పొందినట్లుగా సమాచారం. దీనిపై ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

*ఇప్పటికే ఐ బి రిపోర్ట్..?*

మునగనూరు సర్కారు భూమి కబ్జాపై ఇంటలిజెన్స్ బ్యూరో అధికారులు జిల్లా కలెక్టర్ కు.. సంబంధిత రెవెన్యూ అధికారులకు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులకు.. ప్రభుత్వానికి ఇప్పటికే ఒక నివేదిక అందజేసినట్లుగా తెలుస్తోంది..! అయినా ఇప్పటి వరకు ఫేక్ రషీదులతో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై ఎందుకు విచారణ జరిపి క్రిమినల్ కేసులు నమోదు చేయడం లేదంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు ఫేక్ రసీదుల విషయంలో సమగ్ర విచారణ చేపట్టి సర్కార్ భూమిని కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

*హైడ్రా నిద్రపోతుందా..?*

పేదోడు ఓ 30- 40 గజాల ప్రభుత్వ స్థలంలో చిన్నపాటి గుడిసె వేసుకున్న.. లేదా ఓ రేకుల షెడ్డు లాంటి ఇల్లు నిర్మించుకున్న.. కూల్చి వేస్తున్న హైడ్రాధికారులు.. అప్పనంగా మునగనూరులో ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఫేక్ రసీదులతో కరెంట్ మీటర్లు పొంది.. జర్నలిస్టుల పేరుతో పక్కా నిర్మాణాలు చేపట్టిన వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు. చట్టం పేదోడికైనా.. ఉన్నోడికైనా.. జర్నలిస్ట్ అయినా.. ఒక్కటే కదా..! మరి ఫేక్ రసీదులతో ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై విచారణ చేపట్టి క్రిమినల్ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు..? అనేది.. పలువురి ప్రశ్న..? వెంటనే హైడ్రాధికారులు మునగనూరు సర్కారు భూమి విషయంలో జోక్యం చేసుకొని ప్రభుత్వ భూమిని కాపాడాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
(SOURCE)

Saturday, October 11, 2025

*ఇలా చేస్తే మీ ఆధార్ సేఫ్....వర్చువల్ ఐడీతో మరింత గోప్యంగా సమాచారం*

*ఇలా చేస్తే మీ ఆధార్ సేఫ్....వర్చువల్ ఐడీతో మరింత గోప్యంగా సమాచారం*

మన ప్రాథమిక ఐడీ ఆధార్. అందులోని వివరాలు అంగడి సరకుగా మారితే చాలా ముప్పు ఉంటుంది. గతంలో రిజిస్ట్రేషన్​ శాఖ వెబ్​సైట్ నుంచి బయటికి వచ్చిన ఆధార్ సమాచారంతో అనేకమంది ఖాతాల నుంచి రూ.లక్షలు మాయమయ్యాయి. ఇలా జరగకుండా చూడ్డానికి ఉడాయ్ వర్చువల్ ఐడీ, ఆధార్ లాక్, హిస్టరీ వంటి సేవలను అందుబాటులో ఉంచింది. మరి మన సమాచార భద్రతను సరిచూసుకుందామా?

*ఆధార్‌ వర్చువల్‌ ఐడీని ఎలా పొందాలి :*

* వర్చువల్ ఐడీ (వీఐడీ) ద్వారా వ్యక్తిగత సమాచారం మరింత గోప్యంగా ఉంటుంది.
* అధికారిక పోర్టల్​కి వెళ్లి ఆధార్ సర్వీసుల్లో వర్చువల్ ఐడీ (వీఐడీ) జనరేట్​పై క్లిక్ చేయాలి.
* అనంతరం ఆధార్​ కార్డు నంబరు, క్యాప్చా నంబరును నమోదు చేయాలి.
* తరువాత లింక్ అయిన ఫోన్​ నంబరుకు వచ్చిన ఓటీపీని నమోదు చేస్తే వర్చువల్ ఐడీ కనిపిస్తుంది.
* మెసేజ్​ ద్వారా కూడా ఈ ఐడీని పొందవచ్చు.
* ఆధార్​కు లింక్ అయిన ఫోన్​ నంబరులో ఆర్​వీఐడీ స్పేస్ ఆధార్​లోని చివరి నాలుగు నంబర్లను టైప్ చేసి 1947కు మెసేజ్ పంపించాలి. ఇలా చేస్తే వర్చువల్ ఐడీ నంబర్ మెసేజ్ ద్వారానే వస్తుంది.
* ప్రతి పనికీ ఆధార్ నంబరును కాకుండా వర్చువల్ ఐడీని వినియోగించుకోవచ్చు.
* బ్యాంకు అకౌంట్ తెరవడానికి, ప్రభుత్వ సర్వీసులకు దరఖాస్తు చేయడానికి, ఈ కేవైసీ వంటి తదితరాలకు దీనిని ఉపయోగించవచ్చు.

*లాక్‌ చేసే అవకాశం :*

* ముందు మై ఆధార్ పోర్టల్​కు వెళ్లాలి. అందులో ఆధార్ సర్వీసెస్​పై క్లిక్ చేయాలి.
* దానికింద ఆధార్ లాక్, అన్​లాక్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి తదుపరిపై క్లిక్ చేయాలి.
* తరువాత ఆధాక్ వర్చువల్ ఐడీ (వీఐడీ), పూర్తి పేరు, పిన్​కోడ్, క్యాప్చాను నమోదు చేయాలి.
* తరువాత వచ్చిన ఓటీపీని నమోదు చేస్తే మీ ఆధార్ బయోమెట్రిక్ లాక్ అవుతుంది.
* ఇదే తరహాలో అన్​లాక్ చేసుకోవచ్చు.

*ఎక్కడ వినియోగించామో తెలుసుకోండిలా :*

* ఆధార్​ను ఎక్కడెక్కడ ఉపయోగించామో తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం ఉడాయ్ పోర్టల్​కు వెళ్లాలి.
* పైన ఎడమవైపు ఉన్న మై ఆధార్ ఆప్షన్​లో కనిపించే ఆధార్ సర్వీసెస్​పై క్లిక్ చేయాలి.
* ఆధార్ అథంటికేషన్​ హిస్టరీ అనే ఆప్షన్​ ఎంచుకోగానే కొత్త పేజీ ఓపెన్​ అవుతుంది.
* అందులో లాగిన్​పై క్లిక్ చేసి ఆధార్ నంబరు, క్యాప్చా, ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
* తరవాత కనిపించే స్క్రీన్లో ఆథంటికేషన్ హిస్టరీపై క్లిక్ చేయాలి.
* అక్కడ ఆల్​ను, తేదీని ఎంచుకుంటే ఆధార్​కు లింక్ చేసిన ఓటీపీ, బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ ద్వారా మీ కార్డును ఆరు నెలలుగా ఎక్కడెక్కడ వినియోగించారనే విషయం కనిపిస్తుంది.

*ఇలా ఫిర్యాదు చేయవచ్చు :*

* మీకు తెలియకుండా ఆధార్​ను ఎక్కడైనా వినియోగించారని అనిపిస్తే వెంటనే 1947కి కాల్ చేసి కంప్లెయింట్ చేయవచ్చు.
* help@uidai.gov.inకి మెయిల్ ద్వారా లేదా ఉడాయ్ వెబ్​సైట్​లో నేరుగా ఫిర్యాదు చేయవచ్చు.
* ఇకపై ఈ ఘటనలు జరగకుండా ఉండాలంటే మీ ఆధార్ కార్డును బయోమెట్రిక్ లాక్ చేయడం ఉత్తమం.
* దీంతో మీ ప్రమేయం లేకుండా బయోమెట్రిక్​ని వినియోగించడానికి వీలుండదు.

*వేలిముద్ర పడటంలేదా :*

* వేలిముద్రలు లేని వారికి, వైకల్యం ఉన్న వ్యక్తులకు తమ ఐరిస్ స్కాన్లను మాత్రమే అందించడం ద్వారా ఆధార్ కార్డు లభ్యమవుతుంది.
* కొందరు వృద్ధులు, కాయకష్టం చేసేవారి వేలి ముద్రల గీతలు చెరిగిపోతుంటాయి.
* దానికోసం దగ్గరలోని ఆధార్ కేంద్రానికి వెళ్ల బయోమెట్రిక్ మినహాయింపు నమోదు మార్గదర్శకాల కింద పేరు, జండర్, చిరునామా, పుట్టిన తేదీ వివరాలను సమర్పించాలి. దీని తరువాత ఆధార్ ఎన్​రోల్​మెంట్ సెంటర్ సూపర్​వైజర్ ధ్రువీకరిస్తే సరిపోతుంది.
* అప్పటికీ కాకపోతే దగ్గరలోని ప్రాంతీయ కార్యాలయానికి వెళ్తే సరిపోతుంది.
* అక్కడ ఆధికారులు వేలిముద్రలను పరిశీలించి సమస్యకు పరిష్కారం చూపిస్తారు.

*గంతల నాగరాజు(GNR)*

Friday, October 10, 2025

నోబెల్ శాంతి బహుమతి 2025 గెలుచుకున్న వెలిజులా ఉక్కు మహిళ..

బుల్లెట్ల కంటే బ్యాలెట్ గొప్పది మచాడో పిలుపునకు దేశమే కదిలింది..

నోబెల్ బహుమతి వచ్చింది

నోబెల్ శాంతి బహుమతి 2025 గెలుచుకున్న వెలిజులా ఉక్కు మహిళ.. ఐరన్ లేడీ మరియా మచాడో. ఆమె ధైర్యసాహసాలు, తెగింపు, పోరాటం వల్లే గుర్తింపు పొందినట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది. మూడే మూడు అంశాలు ఆమెను ఎంపిక చేయటానికి దోహదపడ్డాయని స్పష్టం చేస్తూ కమిటీ వెల్లడించింది.

వెనిజులా దేశంలో సైన్యం పాలనకు వ్యతిరేకంగా స్థిరమైన శాంతియుత పోరాటం చేశారు. వెనిజుల దేశంలో ప్రజాస్వామ్యాన్ని తిరిగి తీసుకురావాలనే లక్ష్యంతో అందర్నీ ఏకం చేశారు. వెనిజుల దేశ ప్రజల ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛ, శాంతి కోసం ఆమె చేసిన పోరాటం, ఉద్యమం ఆ దేశ ప్రజల్లో ఆశను పుట్టించాయి. ఒకప్పుడు చాలా విభేదాలు ఉన్న రాజకీయ ప్రతిపక్షంలో ఆమె స్వేచ్ఛాయుత ఎన్నికలు అలాగే ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రభుత్వం కోసం అందరినీ కలిపింది. ప్రజాస్వామ్యానికి ఇదే ముఖ్యం. మన అభిప్రాయాలు వేరైనా, ప్రజాపాలన నియమాలను కాపాడుకోవడానికి అందరూ ఏకం కావాలి. ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఉన్నప్పుడు, ఈ ఐక్యత చాలా అవసరం.

ప్రభుత్వ హింస సొంత ప్రజలపైనే జరుగుతోంది. దాదాపు 8 కోట్ల మంది దేశం విడిచి వెళ్లిపోయారు. ఎన్నికల మోసాలు, అక్రమ కేసులు, జైలు శిక్షల ద్వారా ప్రతిపక్షాన్ని అణచివేశారు. మచాడో గురించి, ఆమెకు నోబెల్ కమిటీ ఎందుకు అవార్డు ఇచ్చింది అంటే 

మచాడో సుమాటే అనే సంస్థను స్థాపించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని పెంచడానికి ఉన్న సంస్థ. 20 సంవత్సరాల క్రితమే ఆమె స్వేచ్ఛాయుత, నిజాయితీగల ఎన్నికలకు మద్దతు ఇచ్చారు.

*ఆమె మాటల్లో చెప్పాలంటే, రాజకీయ పదవుల కోసం తుపాకీలను కాకుండా, బ్యాలెట్ (ఓటు) పద్ధతిని ఎన్నుకోవాలని ఆమె నమ్మారు.

*అప్పటి నుండి ఆమె న్యాయ స్వాతంత్రం మానవ హక్కులు, ప్రజల ప్రాతినిధ్యం కోసం గట్టిగా మాట్లాడారు.

ఆమె 2024 ఎన్నికలకు ముందు వెనిజులా ప్రజల స్వేచ్ఛ కోసం చాలా సంవత్సరాలుగా కృషి చేస్తున్నారు.

*మచాడో ప్రతిపక్షం తరఫున అధ్యక్ష అభ్యర్థిగా నిలబడాలనుకున్నారు, కానీ పాలకులు ఆమెను పోటీ చేయకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత, ఆమె మరొక పార్టీ అయిన ఎడ్ముండో గొంజాలెజ్ ఉరుటియాకు మద్దతు ఇచ్చింది.

*రాజకీయ విభేదాలను పక్కన పెట్టి, లక్షల మంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు. పౌరులపై వేధింపులు, అరెస్టులు, హింస జరిగే ప్రమాదం ఉన్న, వారికి ఎన్నికలను పర్యవేక్షించేవారిగా శిక్షణ ఇచ్చారు.

ప్రభుత్వం ఓట్లను నాశనం చేసి, ఫలితాల గురించి అబద్ధాలు చెప్పకముందే, లెక్క చేసుకున్నారు

https://x.com/Praja_Snklpm/status/1976675390023508072?t=spIWT0NYqtRLJWxeTsHiww&s=08

*_BREAKING NEWS_*

*The Norwegian Nobel Committee has decided to award the 2025 #NobelPeacePrize to Maria Corina Machado for her tireless work promoting democratic rights for the people of Venezuela and for her struggle to achieve a just and peaceful transition from dictatorship to democracy.*

*Congratulations ⬇️* *#MariaCorinaMachado ✊*

*#NobelPrize #Nobel #NobelPeacePrize2025 #nobelprize2025* 

*@PIB_India*
*@PTI_News*
*@IPRTelangana @IPR_AP*

*Human Rights Forum-మానవ హక్కులు వేదిక* Press release/Invitation.

*Human Rights Forum*
*మానవ హక్కులు వేదిక*
Press release/
Invitation.
సీనియర్ జర్నలిస్ట్,
కృష్ణ మోహన్ గారికి.

Balagopal Memorial Meet on *October 12, 2025*

Human Rights Forum (HRF) is organising the 16th commemorative meeting of human rights activist K Balagopal on October 12 (Sunday), 2025. The venue of the meet, which will be held from 10 am to 5 pm, is the Sundarayya Vignana Kendram Main Hall, Baghlingampally, Hyderabad.
There will be talks on four important, contemporary topics on the occasion:
Prof. Nandini Sundar, sociologist, Delhi University will speak on ‘Whose Bastar? The struggle for Adivasi futures’
PS Ajay Kumar of the All India Lawyers Association for Justice (AILAJ), will talk on ‘New forms of land theft’
Apar Gupta of the Internet freedom Foundation will reflect on ‘AI and Privacy’  
Yogendra Yadav, national convener of Bharat Jodo Abhiyaan will speak on ‘Challenges to the Architecture of Electoral Democracy’
HRF shall be releasing a book on the day titled ‘Rajyanganni Ela Chudali?’, a collection of writings in Telugu on the Indian Constitution by K Balagopal.
A short film on Palestine will also be screened.
About Balagopal
A tireless fighter for justice for three decades, Balagopal inspired an entire generation to rights activism, leading by example. An eloquent speaker, original political thinker and writer, his rich analyses of various contemporary and historical issues are well known both within Telangana, AP and outside. He was a man of rare courage and integrity who espoused a politics that was deeply ethical. He entered the legal profession in 1996 and defended cases of adivasis, women, dalits and labourers creating spaces for those who could not otherwise access justice in the courts.
Balagopal was founder-member of the Human Rights Forum (HRF) and its general secretary for four years, from 2005 to 2009.  A champion of the oppressed, he was a source of enormous moral strength to all democratic struggles. He relentlessly strove to build a vibrant, broad-based and truly independent human rights movement. 
HRF invites all to the meet to remember this human rights colossus.
Request you to depute your reporter to cover the lectures.
 
VS Krishna                                                      S Jeevan Kumar                                      
(HRF TS & AP Coordination Committee Members)
10-10-2025
Hyderabad

Thursday, October 9, 2025

అక్రమాలపై వార్త రాసిన విలేకరిని బెదిరించిన మేక రామ్ రెడ్డి


అక్రమాలపై వార్త రాసిన విలేకరిని బెదిరించిన మేక రామ్ రెడ్డి

- సోషల్ మీడియా వేదికగా మానసికంగా, శారీరకంగా కృంగదీసే విధంగా పోస్టులు
-  టార్గెట్ చేస్తూ ఎక్కడ కనబడ్డా ఫోటోలు వీడియోలు తీసి దాడి చేయాలని పిలుపు
-  హుడా లక్ష్మీ నగర్ పాత నేరస్తుడు మేకరామ్ రెడ్డి పైన మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
-  రామ్ రెడ్డి వికృత చేష్టలపై జర్నలిస్ట్ సంఘాలు, దళిత సంఘాల సీరియస్

Courtesy/ source by ⬇️
 అక్షర శోధన న్యూస్ : అక్టోబర్ 10 హైదరాబాద్

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని రాజీవ్ నగర్ నివాసులు, సీనియర్ పాత్రికేయులు జి కుమారస్వామి బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలపైన వార్తాలు రాస్తే హుడా లక్ష్మి నగర్ కు చెందిన ఓ రాజకీయ పార్టీ నేత మేక రామిరెడ్డి సోషల్ మీడియా వేదికగా దాడి చేసిన వైనం మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ మేరకు 9 తారీఖు గురువారం మధ్యాహ్నం రాచకొండ కమిషనరేట్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిన విలేఖరి. వెంటనే స్పందించిన పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం.. ఈ మేరకు కుమారస్వామి మాట్లాడుతూ.. నా వృత్తిలో భాగంగా బోడుప్పల్ కార్పొరేషన్ లో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు అక్రమ నిర్మాణాలపై ప్రజలకు ప్రభుత్వానికి అధికారులకు తెలిసే విధంగా వార్తలు రాయడం జరుగుతుందని, అదేవిధంగా గురువారం సత్తిరెడ్డి నగర్ 20వ డివిజన్లో ఒక బిల్డర్ తన బిల్డింగ్ కు అడ్డు వస్తున్నటువంటి ఒక పెద్ద వేప చెట్టును నరికేసి,సెట్ బ్యాక్ లేకుండా బిల్డింగ్ కడుతున్నారని వార్త రాయడం జరిగిందని, దానిమీద వెంటనే స్పందించిన కమిషనర్ ఎంక్వైరీ అధికారులను పంపియగా, కొంతమంది రాజకీయ నాయకులు, కింది స్థాయి అధికారులు తప్పుడు ఎంక్వయిరీ చేసి కమిషనర్ ను తప్పుదోవ పట్టిస్తున్నారని సోషల్ మీడియా వేదికగా వాట్స్అప్ గ్రూప్లో ప్రజలకు ప్రభుత్వానికి అధికారులకు తెలిసే విధంగా నేను పోస్ట్ పెట్టడం జరిగిందని, దానికి కౌంటర్ గా ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తి హుడా లక్ష్మీ నగర్ నివాసులు, ఒక జాతీయ పార్టీ నేత మేక రామ్ రెడ్డి నన్ను టార్గెట్ చేస్తూ.. కింది స్థాయి నుండి, నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఒక విలేకరిగా 9 సంవత్సరాల కాలంలో ఒక పేపర్ కి ఎడిటర్ గా ఎదుగుతున్న నన్ను మానసికంగా, శారీరకంగా కృంగదీసే విధంగా వాట్సాప్ గ్రూపులో పోస్ట్లు పెట్టి, సంగారెడ్డిలో ఒక విలేకరిని చెట్టుకు కట్టేసినట్లు కట్టేసి దాడి చేస్తామని, చేయిస్తామని, జింతక్ జింతక్ జింతక్..అనే సినిమా డైలాగ్ తీసుకొని నిన్ను చింతపండు చేస్తామని, ఎక్కడ కనబడ్డ ఫోటోలు వీడియోలు తీసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని, దాడులు చేయాలని ప్రజలకు ఒకరకంగా ఇన్ డైరెక్టుగా సిగ్నల్ ఇచ్చారని, మేక రామిరెడ్డి నుండి నాకు ప్రాణహాని ఉందని, మేడిపల్లి పోలీసులు నాకు రక్షణ కల్పించి, పాత నేరస్తుడైన రామ్ రెడ్డి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేడిపల్లి పోలీసులను కోరినట్లు తెలిపారు. అదేవిధంగా హుడా లక్ష్మీ నగర్ 7వ డివిజన్ ,19 డివిజన్లలో మేక రామిరెడ్డి పైన పలు ఫిర్యాదులు, ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయని, ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన ఘటనలో ఆయా పార్టీ నుండి సస్పెండ్ కూడా చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎలాంటి సత్సంబంధం లేకుండా ఒక విషయం మీద ఒక విలేకరి మీద సోషల్ మీడియా వేదికగా మానసికంగా కృంగదీసే విధంగా మాటల దాడి చేయడం పట్ల నన్ను నా కుటుంబాన్ని తొక్కి భయభ్రాంతులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి వెంటనే అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని నాకు నా కుటుంబానికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరారు.