Tuesday, January 27, 2026

*_అక్రెడిటేషన్ల జీవోను సమూలంగా సవరించాలి_*



*అక్రెడిటేషన్ల జీవోను సమూలంగా సవరించాలి*
*ప్రెస్' స్టిక్కర్ నిబంధన తొలగించండి* 
*-మంత్రి ని, స్పెషల్ కమీషనర్ ను కలిసిన టీడబ్ల్యూజేఎఫ్ నేతలు*

హైదరాబాద్, జనవరి 27: మీడియా అక్రెడిటేషన్ల జీవో 252ను సవరించడం పట్ల తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర సమాచార పౌరసంబధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్పెషల్ కమీషనర్ సీహెచ్ ప్రియాంక లకు కృతజ్ఞతలు తెలిపారు. ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య, రాష్ట్ర కో-కన్వీనర్లు తన్నీరు శ్రీనివాస్, కుడుతాడు బాపురావు, హైదరాబాద్ జిల్లా కన్వీనర్ రవి కుమార్, నాయకులు శ్రీధర్, శ్రీనివాస్, రవికుమార్ తదితరులు  మంగళవారం సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని, సమాచార భవన్ లో కమీషనర్ ప్రియాంక ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. జీవో 252 సవరణ సమూలంగా జరగలేదని,  మరోసారి జీవోను పున:సమీక్షించి  సవరించాలని వారు కోరారు. జీవో
సవరణలో  కేబుల్ చానల్స్, నియోజకవర్గ స్థాయి రిపోర్టర్లకు న్యాయం జరగడం లేదని,  గతంలో  కేబుల్ ఛానల్స్ కు ఐఅండ్ పీఆర్ ద్వారా 12  రాష్ట్రస్థాయి అక్రెడిటేషన్ కార్డులు, నాలుగు జిల్లా స్థాయి అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చేవారని, ఈ విషయాన్ని తాము పలు తమరి దృష్టికి తీసుకువచ్చినప్పటికీ, సవరించిన జీవోలో కేబుల్ చానల్స్ అంశమే లేకపోవడం బాధాకరమని అన్నారు. యూనియన్ గా తమ అభిప్రాయాన్ని చెప్పినప్పటికీ కేబుల్ చానల్స్ విషయంలో, నియోజకవర్గ స్థాయిలో రిపోర్టర్లకు ఇచ్చే కార్డుల విషయంలో ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమని, అదే విధంగా ఎంపానల్మెంట్ లేని చిన్న, మధ్య తరహా పత్రికలకు గతంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఇచ్చినట్లు అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని, అదే విధంగా రెగ్యులర్ గా నడుస్తున్న పత్రికలను ఎంపానల్మెంట్ చేయాలని వారు మంత్రిని, కమీషనర్ ను కోరారు. 
*'ప్రెస్'స్టిక్కర్ నిబంధన తొలగించాలి*
అక్రెడిటేషన్ కార్డు ఉన్న జర్నలిస్టులు మాత్రమే తమ వాహనాలకు 'ప్రెస్' అని రాసుకోవాలంటూ జారీ చేసిన సర్క్యులర్ ను రద్దు చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య కోరారు. ఈ మేరకు ఆయన, పలువురు ఫెడరేషన్ నాయకులు మంగళవారం సమాచార పౌరసంబధాల శాఖ స్పెషల్ కమీషనర్ ప్రియాంక ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సర్క్యలర్... జర్నలిస్టులను, జర్నలిజం వృత్తిని అవమానించేదిగా ఉందని, జర్నలిస్టులకు కేవలం సంక్షేమ పథకాల కోసం గుర్తింపు కార్డుగా ఇచ్చే అక్రెడిటేషన్ కార్డును జర్నలిస్టుగా గుర్తించేందుకు ప్రామాణికం చేయడం తగదని, అక్రెడిటేషన్ కార్డు ఉన్న వారే తమ వాహనాలకు "ప్రెస్"అని రాసుకోవాలనే నిబంధన సరైంది కాదని, ఈ సర్క్యులర్ నిబంధన ఇటు జర్నలిస్టుల సమాజానికి,
అటు జర్నలిజం వృత్తి స్వేచ్ఛకు భంగం కలుగుతుందని మామిడి సోమయ్య కమీషనర్ తో అన్నారు.  రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చే అక్రెడిటేషన్ కార్డు కలిగి ఉన్న జర్నలిస్టులు మాత్రమే జర్నలిస్టులు కాదని, అక్రెడిటేషన్ కార్డు లేని జర్నలిస్టులు చాలా మంది ఉన్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 వేల మంది జర్నలిస్టులు వుండగా, వీరిలో సగం మందికి మాత్రమే ప్రభుత్వం అక్రెడిటేషన్ కార్డులు ఇస్తున్నదని, మిగతా సగం మంది జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు లేకుండా కేంద్ర ప్రభుత్వం ఆర్ ఎన్ ఐ (ప్రస్తుత పీ ఆర్ జీఐ) రిజిస్ట్రేషన్ పొందిన మీడియా సంస్థలు గుర్తింపు కార్డులతో పనిచేస్తున్నారని అన్నారు. 
ఎంపానల్మెంట్ లేని మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు ఉండవని, అంత మాత్రాన ఆ జర్నలిస్టులను జర్నలిస్టులే కాదనే విధంగా తమ వాహనాలకు ప్రెస్ స్టిక్కర్ పెట్టుకోవద్దంటూ ప్రభుత్వం నిబంధనలు విధించడం సరైంది కాదని అన్నారు. సమాజంలో  నకిలీ జర్నలిస్టులను కట్టడి చేయడానికి అనేక మార్గాలున్నాయని, ప్రత్యేక రూల్స్ ద్వారా నియంత్రించవచ్చని, అలాంటి చర్యలకు తామేమీ వ్యతిరేకం కాదని, కానీ ఆ పేరుతో అసలైన జర్నలిస్టులను అవమానించడం, అడ్డుకోవడం సరైంది కాదని అన్నారు. ఇప్పటికే అక్రెడిటేషన్ కార్డు లేని అనేక మంది జర్నలిస్టులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ నేపథ్యంలో తమరు జారీ చేసిన సర్క్యులర్ "మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు"గా అంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సర్క్యులర్ నిబంధన ను వెంటనే ఉపసంహరించాలని మామిడి సోమయ్య కోరారు. దీనిపై పునరాలోచన చేస్తామని, రవాణాశాఖ అధికారులతో చర్చిస్తానని కమీషనర్ ప్రియాంక హామీ ఇచ్చారు.

ఖమ్మం జిల్లా కలెక్టర్ సమాచార హక్కు చట్టాన్ని గౌరవిస్తున్నారా.?

బ్రేకింగ్ న్యూస్ :

*_ఖమ్మం జిల్లా కలెక్టర్,మున్సిపల్ కార్పొరేషన్,ఇరిగేషన్ కార్యాలయం,అర్బన్ తహశీల్దార్ కార్యాలయం వారికి సమాచార హక్కు చట్టం అంటే గౌరవం లేదు.._*

#RTIA ➡️ #violation 

#TelanganaRising ??

#telanganarising2047  ??

#RevanthreddyCM 

#ponguletisrinivasreddy

#IPRD_Telangana

@TelanganaCMO @Bhatti_Mallu @INC_Ponguleti @TummalaOfficial @CPRO_TGCM @IPRTelangana @PonguletiOffice @Collector_KMM @MC_Khammam @aclbkhammam @Khammam @Aadabtvlive @v6velugu @ShanarthiNews3 @eenadulivenews @ABNJyothyTV @myvaartha @NavatelanganaD @bigtvtelugu @BplplH 

https://x.com/Praja_Snklpm/status/2016061726677217791?t=4Z14bs6vKENF5Dk19Lnkwg&s=19

Monday, January 26, 2026

ప్రైవేట్ వ్యక్తలు గుప్పిట్లో తెలంగాణ పాలనా యంత్రాంగం!



*_ఇందిరమ్మ రాజ్యంలో "రాజ్యాంగేతర శక్తులు!"_*

👉మంత్రులు, ఎమ్మెల్యేల కంటే కూడా పవర్ ఫుల్! 
👉ఫైలు ఏదైనా, పైరవీలు ఏమైనా అన్నీ వారి కనుసన్నల్లోనే! 
👉ప్రైవేట్ వ్యక్తలు గుప్పిట్లో తెలంగాణ పాలనా యంత్రాంగం! 

*టెండర్లు, దందాలు రేవంత్ బామ్మర్ది సూదిని సృజన్ రెడ్డి!*

*షాడో హోం రేవంత్ రైట్ హ్యాండ్ వేం నరేందర్ రెడ్డి!*

*షాడో రెవెన్యూ రేవంత్ తమ్ముడు కొండల్ రెడ్డి!*

*షాడో సినిమాటోగ్రఫి రేవంత్ నమ్మినబంటు రోహిన్ రెడ్డి!*

*షాడో మున్సిపల్ రేవంత్ అనుచరుడు ఫయీం ఖురేషీ!*

*కొడంగల్ షాడో ఎమ్మెల్యే రేవంత్ అన్న తిరుపతి రెడ్డి!*

*విదేశీ పెట్టుబడుల వ్యవహారాలు రేవంత్ తమ్ముడు కృష్ణారెడ్డి!*

*ఫైరవీలు దందాలు రేవంత్ చిన్ననాటి దోస్త్ అనిల్ రెడ్డి!*

*సచివాలయంలో షాడో సీఎంగా ఓ మహిళా అంటూ కథనాలు!*

ప్రజాపాలనా, ఇందిరమ్మ రాజ్యంతో పేరుతో రాజ్యాంగేతరుల చేతుల్లో తెలంగాణ ప్రభుత్వ పాలన!
ప్రతిపక్షాలు ఆధారాలు బయటపెడుతున్నా మారని ప్రభుత్వ పెద్దల తీరు

*‘వాళ్లు చట్టసభకు వెళ్లలేదు. రాజ్యాంగం మీద ప్రమాణం చేయలేదు. ప్రభుత్వంలో ఎలాంటి చిన్న పదవులు కూడా లేవు. కానీ, వాళ్ల మాటే శాసనం.* వాళ్ల కన్ను పడందే టెండర్ దక్కదు. వాళ్ల అనుమతి లేనిదే ఫైలు కదలదు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ‘రాజ్యాంగేతర శక్తులు’ తెలంగాణ పరిపాలనా యంత్రాంగాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్నారన్న ఆరోపణలు ఇప్పుడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. అమృత టెండర్ల నుంచి సినిమా టికెట్ల సెటిల్మెంట్ల వరకు,  హైడ్రా కూల్చివేతల నుంచి భూముల కేటాయింపుల వరకు. అంతా ఈ ‘షాడో’ శక్తుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
Courtesy / Source by :
https://x.com/shankar_journo/status/2015960656676323799?t=T4axAws-IaWfzrgffY5EEQ&s=08

Monday, January 19, 2026

_NFC రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) వెడల్పు చేయాలి_

NFC రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) వెడల్పు పెంపు అవసరం కోసం మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారిని శామీర్ పేట లో వారి నివాసంలో కలిసిన వినతి పత్రం అందజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు
స్థానిక కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి గారు.

ఈ సందర్భగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ ఈ వంతెనను సుమారు 45 సంవత్సరాల క్రితం అప్పటి అవసరాలకు అనుగుణంగా నిర్మించారు.

ప్రాంతంలో జనాభా వేగంగా పెరగడం, కొత్త కాలనీలు విస్తరించడంతో ప్రస్తుతం ఈ వంతెన ట్రాఫిక్‌ను మోయలేకపోతోంది. ఇది హబ్సిగూడా నుండి ఈసీఐఎల్‌కు, బోడుప్పల్ నుండి ఈసీఐఎల్‌కు వెళ్లే ప్రధాన మార్గం కావడంతో రోజూ వేలాది మంది ప్రయాణికులు దీనిపై ఆధారపడుతున్నారు.

వంతెన వెడల్పు తక్కువగా ఉండడం వల్ల తీవ్రమైన ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి, స్థానిక ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, చిన్న పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల రోజువారీ జీవితం తీవ్రంగా ప్రభావితమవుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తక్షణ చర్యలు అవసరం.

ఈ పనుల కోసం ప్రత్యేక రైల్వే అభివృద్ధి ప్రణాళిక (SRDP) కింద నిధులు ఇప్పటికే విడుదలైనట్లు నా దృష్టికి వచ్చింది.
అందువల్ల, దయచేసి ఈ విషయాన్ని పరిశీలించి NFC రైల్వే ఓవర్ బ్రిడ్జి వెడల్పు పెంపుకు అనుమతి ఇవ్వగలరని మనవి. దీనివల్ల ప్రజలకు కలిగే ఇబ్బందులు తగ్గుతాయి అని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

_దోమల బెడద నుండి ప్రజలకు విముక్తి కలిగించండి జోనల్ కమిషనర్ గారు : కార్పొరేటర్ బన్నాల_

*హైకోర్టు కాలనీ హెచ్ఎంటి చెరువులోనీ గుర్రపు డెక్కని తొలగించండి : కార్పొరేటర్ బన్నాల* 

*దోమల బెడద నుండి ప్రజలకు విముక్తి కలిగించండి జోనల్ కమిషనర్ గారు : కార్పొరేటర్ బన్నాల* 

*చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ జిహెచ్ఎంసి  స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ ఈరోజు ఉప్పల్ జోనల్ కమిషనర్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ రాధిక గుప్తా గారిని కలిసి హైకోర్టు కాలనీ హెచ్ఎంటి నగర్ చెరువులో గుర్రపు డెక్క తో నిండి పోయిందని దానివల్ల విపరీతమైన దోమల తో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని వెంటనే గుర్రపు డెక్కను తొలగించే అన్ని చర్యలు చేపట్టాలని వినతి పత్రం సమర్పించడం జరిగింది* 

*అనంతరం కార్పొరేటర్ గీతా ప్రవీణ్ జోనల్ కమిషనర్ రాధిక గుప్తా గారితో మాట్లాడుతూ గతంలో ఎంటమాలజీ డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి మూడు నెలలకు ఒకసారి గుర్రపు డెక్కను తొలగించుటకు అన్నీ చర్యలు చేపట్టే వారుఅని, కానీ సెప్టెంబర్ మాసం నుండి ఎంటమాలజీ డిపార్ట్మెంట్ కనుమరుగ అయిందని, చెరువుల వైపు ఎంటమాలజీ డిపార్ట్మెంట్ కనీసం రావట్లేదని గతంలో యాంటీ లార్వా ప్రోగ్రాంను ఏర్పాటు చేసేవారని గుర్రపు డెక్కని ప్రతి మూడు నెలలకు ఒకసారి తొలగించేవారని ఇవన్నీ గత ఆరు నెలల నుండి జరగడంలేదని*, *విపరీతమైన దోమలతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పాలవుతున్నారని సాయంత్రం 5 దాటితే ప్రజలు వీధుల్లో నిలబడే పరిస్థితి లేదని ,వెంటనే గుర్రపు డెక్క తొలగించుటకు అన్నీ చర్యలు చేపట్టి ప్రజలకు దోమల నుండి ఉపశమనం కల్పించాలని కోరారు*. *జోనల్ కమిషనర్ గారు మాట్లాడుతూ వీలైనంత త్వరలో గుర్రపు డెక్కన్ తొలగించి అన్ని చర్యలు చేపడతానని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలక్కుండా చూసుకుంటానని హామీ ఇవ్వడం జరిగింది*.

*కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, సీనియర్ నాయకులు ఎద్దుల కొండలరెడ్డి, కోకొండ జగన్, ముద్ధం శ్రీనివాస్ యాదవ్, బాలకృష్ణ గౌడ్ ,ఎండి షఫీ, ఎండి హనీఫ్, శ్యాం, బాలు, సకినాల చందు మొదలగువారు పాల్గొన్నారు*

Sunday, January 18, 2026

*_బోల్తా పడిన గిల్ట్ ఆఫ్ ఇండియా(EGI)_*

*_బోల్తా పడిన గిల్ట్ ఆఫ్ ఇండియా(EGI)_*
_# ట్రాప్ లో పడటానికి ఎవడైనా ఒకటే.!_
_# పడేసిటోడి తెలివితేటలే ముఖ్యం_ 

ఎన్టీవీ జర్నలిస్టుల అక్రమ అరెస్టులపై రేవంత్ సర్కార్ తీరుపై మండిపడ్డ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా(EGI)

ఎన్టీవీ ప్రసారం చేసిన వీడియోలో ఎలాంటి వ్యక్తుల పేర్లు ప్రస్తావించలేదు.. దీనిపై తెలంగాణ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సంఘం ఫిర్యాదు చేసిన వెంటనే జర్నలిస్టులపై క్రిమినల్ డిఫమేషన్ కేసు నమోదు చేశారు

అర్ధరాత్రి ఇంటిపై దాడులు చేసి జర్నలిస్టులను అరెస్ట్ చేసి, కోర్టు బెయిల్ మంజూరు చేసే వరకు లాకప్‌లో ఉంచారు

అపకీర్తి జరిగిందని భావించిన గుర్తుతెలియని మహిళా అధికారిణి కాకుండా, తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు

ఈ ఘటనలో ఎన్టీవీ జర్నలిస్టులపై తొందర తొందరగా చర్యలు తీసుకొని, మీడియాను అపకీర్తి చేయడాన్ని మేము ఖండిస్తున్నాం

అరెస్టులు చేసే కంటే ముందుగా, పోలీసులు న్యాయ ప్రక్రియను అనుసరించి, సమగ్ర దర్యాప్తు జరపాల్సింది

తెలంగాణలో మీడియా స్వేచ్ఛగా, ఎలాంటి అడ్డంకులు లేకుండా పనిచేసేలా ప్రభుత్వం చూడాలి

అలాగే మీడియాతో వ్యవహరించేటప్పుడు న్యాయ ప్రక్రియను పాటించి, సంయమనం వహించాలని అధికారులను కోరుతున్నాం – ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా

Wednesday, January 14, 2026

_తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క జర్నలిస్టుకు చిన్న సమస్య వచ్చిన ముందుండేది తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం మాత్రమే_

*_మిత్రులారా ... "NTv జర్నలిస్టుల అరెస్ట్ గురించి మౌనం ఎందుకు ఉన్నారు..? TJSS అధ్యక్షుడు అనంచిన్ని గారూ" అంటూ ఉదయం నుంచి చాలా ఫోన్ కాల్స్_*

*తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క జర్నలిస్టుకు చిన్న సమస్య వచ్చిన ముందుండేది తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం మాత్రమే*

*_NTv యాజమాన్యం బహిరంగ క్షమాపణ తరువాత మనం ఏ విధంగా ఆ జర్నలిస్టుల అరెస్ట్ ను ఖండించగలం. గత ప్రభుత్వం సంకలు నాకిన వారు ఇప్పుడు ఎలా అరుస్తారు.? నాడు 1889 మంది జర్నలిస్టులు అరెస్టు అయినప్పుడు NTv  ఎప్పుడూ నోరు మెదపలేదు. ఇతర పత్రికలలో చానలలో చేస్తున్న జర్నలిస్టులు వాళ్ళ దృష్టిలో జర్నలిస్టులు కారా.? క్షమాపణ ఈ వీడియో చూడండి.._*

*_మంత్రి, ఐఏఎస్ అధికారిణిపై కథనం: బహిరంగ క్షమాపణ చెప్పిన న్యూస్ ఛానల్_*

మంత్రి, ఐఏఎస్ అధికారిణిపై కథనం: బహిరంగ క్షమాపణ చెప్పిన న్యూస్ ఛానల్
మంత్రి, మహిళా ఐఏఎస్ అధికారిణిపై వివాదాస్పద కథనం ప్రసారం
తీవ్రంగా స్పందించిన ఐఏఎస్ అధికారుల సంఘం, పోలీసులకు ఫిర్యాదు
ఎన్టీవీతో పాటు పలు డిజిటల్ ఛానళ్లపై ఎఫ్ఐఆర్ నమోదు
క్షమాపణ చెబుతూ ప్రకటన చేసిన ఎన్టీవీ
తెలంగాణలో ఓ మంత్రి, ఓ మహిళా ఐఏఎస్ అధికారికి సంబంధించి ప్రసారం చేసిన వివాదాస్పద కథనంపై ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ ఎన్టీవీ (NTV) బహిరంగంగా క్షమాపణ చెప్పింది. ఈ కథనం ఓ మహిళా ఐఏఎస్ అధికారిణి ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉందని ఐఏఎస్ అధికారుల సంఘం ఆరోపించడంతో పాటు, పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్టీవీ యాజమాన్యం, తమ ప్రసారం వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా విచారం వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించింది.

*_వివాదానికి దారితీసిన కథనం_*
ఈ నెల 8వ తేదీన ఎన్టీవీ ఛానెల్‌లో ఒక కథనం ప్రసారమైంది. తెలంగాణకు చెందిన ఓ కాంగ్రెస్ మంత్రికి, ఓ మహిళా ఐఏఎస్ అధికారిణికి మధ్య వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని, ఆ సంబంధాల కారణంగానే ఆమెకు కీలక పోస్టింగులు లభిస్తున్నాయని ఆ కథనంలో పరోక్షంగా ఆరోపించారు. కథనంలో మంత్రి పేరుగానీ, అధికారిణి పేరుగానీ నేరుగా ప్రస్తావించనప్పటికీ, వారిద్దరినీ సులభంగా గుర్తించేలా పరోక్ష సూచనలు ఇచ్చారు. ఈ కథనం ఆ అధికారిణి నైతికతను శంకించేలా ఉందని, ఆమె వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా ఉందని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అని, ఆయనపై అసత్య ప్రచారం జరుగుతోందని సామాజిక మాధ్యమాల్లో చర్చ మొదలైంది.

*_రంగంలోకి దిగిన ఐఏఎస్ అధికారుల సంఘం_*
ఈ ప్రసారాన్ని తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం తీవ్రంగా పరిగణించింది. సంఘం నాయకుడు, సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ నేతృత్వంలోని బృందం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్‌ను కలిసి అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఈ కథనం పూర్తిగా అసత్యమని, నిరాధారమైనదని, ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేస్తున్న మహిళల పట్ల సమాజంలో ఒక తిరోగమన ధోరణిని ప్రోత్సహించేలా ఉందని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కథనం యూట్యూబ్, ఎక్స్ (ట్విట్టర్) వంటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో సదరు అధికారిణి సైబర్‌స్టాకింగ్‌కు గురవుతూ తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్నారని తెలిపారు.

*_కేసు నమోదు, ఎన్టీవీ క్షమాపణ_*
ఐఏఎస్ అధికారుల సంఘం ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు జనవరి 12న కేసు నమోదు చేశారు. ఎన్టీవీతో పాటు మరో ఏడు డిజిటల్ మీడియా సంస్థలైన తెలుగు స్క్రైబ్, ఎంఆర్ మీడియా, ప్రైమ్9 తెలంగాణ, పీవీ న్యూస్, సిగ్నల్ టైమ్స్, వోల్గా టైమ్స్, మిర్రర్ టీవీ, టీన్యూస్ తెలుగులపై పరువు నష్టం, మహిళల గౌరవానికి భంగం కలిగించడం వంటి సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఈ పరిణామాల నేపథ్యంలో, జనవరి 13న ఎన్టీవీ ఛానెల్ తన తప్పును అంగీకరించింది. యాజమాన్యం తరఫున ఎడిటర్ ఒక ప్రకటన చేస్తూ, జనవరి 7న ప్రసారమైన తమ కథనం ఏ ఒక్కరి వ్యక్తిత్వాన్ని కించపరిచే ఉద్దేశంతో ప్రసారం చేయలేదని తెలిపారు. "ఒకవేళ మా కథనం ఆ విధంగా అపార్థానికి దారితీసి ఉంటే, అందుకు మేము మనస్ఫూర్తిగా విచారం వ్యక్తం చేస్తున్నాం. ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులంటే మాకు అపారమైన గౌరవం ఉంది" అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

*_వివిధ వర్గాల స్పందన_*
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. ఒక వీడియో ప్రకటన విడుదల చేసి, తనపై వస్తున్న వదంతులను ఖండించారు. నిరాధారమైన వార్తలను ప్రచారం చేయవద్దని మీడియా సంస్థలను హెచ్చరించారు. మరోవైపు, ఈ ఘటనపై బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ వంటి వారు స్పందిస్తూ, మంత్రుల వల్ల ఐఏఎస్ అధికారులకు వేధింపులు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

Tuesday, January 13, 2026

_మళ్ళీ గద్దలు వాలుతున్నాయ్..!! మీడియా ముసుగులో దందాలు.._

*_మళ్ళీ గద్దలు వాలుతున్నాయ్..!!_*
_* మీడియా ముసుగులో దందాలు.._
_* ఒక్కొక్కడికి పదుల పత్రికలు_
_* యాడ్ ఏజన్సీలతో నిలువుదోపిడీలు_
_* పదవులు కోసం ఎదురుచూపులు_
_* తెలంగాణ మీద వాలుతున్న 'ఆంధ్ర గద్దలు'_
_* పదేళ్ల క్రితం పారిపోయినోళ్లు ప్రత్యక్షం_
_* పెత్తనాల కోసం మొదలైన ఆరాటం._
_* నమస్తే 'బంద్'_

COURTESY/SOURCE by:
_(అనంచిన్ని వెంకటేశ్వరావు, వ్యవస్థాపక అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘం, 9440000009)_

*_‌వలసవాదులు మళ్లీ వచ్చేశారు. తెలంగాణలో అధికార మార్పిడి జరిగిన వెంటనే వాలిపోయారు. రాజకీయం తప్ప అన్నీ ఊడ్చుకుపోయేందుకు మళ్ళీ గద్దల్లా వచ్చి వాలుతున్నారు. షర్మిల రూపంలో రాజకీయం విఫలమైనా, ఆర్థిక వనరులు కొల్లగొట్డుకునేందుకు వచ్చారు. తెలంగాణ మేధావులు, సీనియర్ జర్నలిస్టులు ఒక్క పత్రిక నడపడానికే నానా అవస్థలు పడుతుంటే.. ఒక్కొక్కడికి పదుల సంఖ్యలో పత్రికలా..అదెలా సాధ్యమో ఐఅండ్‌పిఆర్ అధికారులే చెప్పాలి. ఎలా ప్రకటనలు జారీ చేస్తున్నారో వివరాలు చెప్పాలి. అలా ప్రకటనలు జారీకి ఎంత కమీషన్ దండుకుంటున్నారో వెలుగులోకి రావాలి. అందులోనూ ఆంద్రా మూలాలున్న వారితో పాటు పదుల సంఖ్యలో పత్రికలు నడుపుతున్నట్లు కలరింగ్ ఇస్తూ, జిరాక్స్ కాపీలు తీసి పత్రికలని నమ్మిస్తూ తెలంగాణ సొమ్ము దోచేస్తున్న దగుల్బాజీల బండారం బైటపడాలి. పదుల సంఖ్యలో పత్రికల ముసుగులో, మధ్య తరహా పత్రికల పేరుతో మోసం చేస్తున్న వారి బాగోతాలు బైటపడాలి. అసలు యంత్రాంగమే లేకుండా పత్రికలు నడిపేవారిపై ఎంక్వౌరీ వేయాలి. గతంలో జరిగిన ఎంక్వౌరీ వివరాలు బైటపెట్టాలి. మళ్లీ  పూర్తి స్థాయిలో ఎంక్వౌరీ చేపట్టాలి. తెలంగాణ రాగానే ఇక్కడ పత్రికల ముసుగులో పబ్బం గడపుకోవడం కుదరదని ఆలోచించుకున్న కొందరు విజయవాడకు వెళ్ళిపోయారు. పత్రికలు అక్కడినుండి నిర్వహించుకున్నారు. అక్కడ చంద్రబాబు పాలనలో దండుకోవాల్సినంత దండుకున్నారు. జగన్ రాకతో సమైక్యవాదులు గిలగిలలాడిపోయారు. కనీసం ఆంధ్రప్రదేశ్‌లో అక్రిడిటేషన్లకు కూడా దిక్కులేకుండా పోయింది. దాంతో తెలంగాణలోనే  మళ్ళీ నూకలు సంపాదించుకుందామని వచ్చారు. అలా ఆంధ్రాకు వెళ్లిపోయేవారు వెళ్లిపోగా, కొంత అతి తెలివి మంత్రులు అటు పత్రికల ముసుగులో యాడ్ ఏజెన్సీలు మొదలుపెట్టారు. నిజానికి ఉమ్మడి రాష్ట్రంలో కూడా వాళ్లదే హవా...తెలంగాణ వచ్చిన తర్వాత కూడా  వాళ్లే లబ్దిపొందారు. తెలంగాణలో ప్రభుత్వం మారడంతో మొత్తం దిగిపోయారు._*

*_ఒక్కొక్కడికి పది పేపర్లా?_*
వినడానికి ఆశ్చర్యంగా వుందా? మీరు చదివింది నిజమే..పదిపది పత్రికలు నడిపేవాడికొక్కడికి అక్షరం ముక్క రాయరాదు. అందులోనూ ఇంగ్లీషు పత్రికలు కూడా నిర్వహిస్తుంటారు. సహజంగా ఒక ఎడిటర్‌కు ఒక్క పాత్రిక నడపడమే గగనం. అలాంటిది ఈ అక్షరం ముక్క రాని కొంతమంది సోకాల్డ్ దగా కోరులు పలు పత్రికలు నడుపుపుతుంటారు. పదిపత్రికలలో అన్నీ అవే వార్తలు. ఇలా కూడా తెలంగాణ సొమ్ము తినొచ్చని నేర్చుకున్నారు. తెలంగాణ బొక్కసానికి పొక్కపెడుతున్నారు. అవి పత్రికలు కాదు...జిరాక్స్ కాపీలు మాత్రమే. ఒక్కసారి ఐఅండ్‌పిఆర్ దుమ్ము దులిపితే ఎంత మంది అక్షరం రాని వాళ్లు పత్రికలు నడుపుతున్నారో తెలుసుకోవచ్చు. 

*_ఈ దగాకోరుల కోసం జర్నలిస్టుల జీవితాలు విలవిల_*
అవో పత్రికలు. వాటికి యాజమాన్యాలు. విలేకరులకు బెదిరింపులు. పండగలు వచ్చాయంటే ప్రకటనలు తేవాలి. వేళాది రూపాయలు పంపాలి. కొత్త సంవత్సరం వేళ లక్షలాది రూపాయల ప్రకటనలు సేకరించాలి. ఎన్నికలొస్తే ఇక విలేకరులకు నరకమే. అక్రిడిటేషన్లు జారీ చేసే సమయంలో అదో వ్యాపారం. ఏడాదంతా యాజమాన్యాలను మేపుతున్న విలేఖరులకు అక్రిడిటేషన్ కావాలంటే వేలాది రూపాయల ముట్డజెప్పాల్సిందే..ఇలా జర్నలిస్టుల రక్తం తాగుతున్నారు. ఇలా యాజమాన్యాల ఒత్తిడి తట్టుకోలేక అప్పులు చేసి, ఆత్మహత్యలు చేసుకున్న జర్నలిస్టులు ఎంతో మంది వున్నారు. అందుకే నిజాయితీగా సమాజం కోసం తపనపడే పత్రికలు మాత్రమే నడవాలి. తెలంగాణ ముసుగులో సాగే 'ఆంధ్రా దోపడీ' ఆగాలి. 

*_అన్నీ ఆంద్రా యాడ్ ఏజెన్సీలే_*
తెలంగాణ వచ్చినా తెలంగాణ యాడ్ ఏజెన్సీలకు దిక్కేది. తెలంగాణ ప్రభుత్వ ప్రకటనల్లో తెలంగాణ యాసకు చోటేది. సినిమాలలో తెలంగాణ యాస వాడుతున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వాలు ఇచ్చే ప్రభుత్వ ప్రకడనలన్నీ ఆంధ్రా యాసలోనే ఎందుకుంటున్నాయి. అంటే తెలంగాణ వచ్చినా తెలంగాణ యాడ్ ఏజెన్సీలకు గుర్తింపు లేదు. తెలంగాణ యాస వచ్చిన వాళ్లు లేరు. తెలంగాణ యాసలో ప్రకటనలు తయారు చేయాలంటే, తెలంగాణ వారికే ఇవ్వాలి. కానీ లాబీయింగ్ అంతా ఆంధ్రాదే...కమీషన్లకు కక్కుర్తి పడిన వాళ్ల వల్ల జరుగుతున్న మోసానికి తార్కాణమిదే... ఆంధ్రప్రదేశ్‌లో వీళ్లే... తెలంగాణలోనూ వాళ్లే... తెలంగాణ వచ్చినా బతుకుతున్నది ఆంధ్రా వాళ్లే... తెలంగాణ వాళ్లు ఆంధ్రాలో యాడ్ ఏజన్సీ నడపగలరా? ఒక్కసారి ఆలోచించండి.

*_వార్తలతో...నాలుగు జిరాక్స్‌లు తీస్తే సరి_*
అవును అదే...పత్రిక. న్యూస్ ఏజెన్సీల వార్తల మీద ఆధారపడి పత్రికలు నడుపుతున్నట్లు బిల్డప్ ఇవ్వాలి. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సొమ్ముంతా అప్పటి  ప్రభుత్వం అలాంటి వారికి దారపోసింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. తెలంగాణ పత్రికలు ఏవి? నిజాయితీగా నడుస్తున్నవేవి? జర్నలిస్టుల యోగ క్షేమాలు చూస్తున్నవేవి? నిజమైన జర్నలిస్టులను ఆదరిస్తున్న పత్రికలు ఏవి? అన్నది గుర్తించాలి. దానికి తోడు జర్నలిస్టును రాచి రంపానపెడుతున్నవి ఏవి? కనీసం ప్రింటింగ్ సెక్షన్ కూడా లేకుండా నడుస్తున్నవి ఏవి? అసలు కార్యాలయమే లేకుండా నడుస్తున్నట్లు భ్రమింపజేస్తున్న పత్రికలు ఏవి? జర్నలిస్టుల వార్తలకు విలువలు ఇస్తున్న పత్రికలు ఏవి? గతంలో ఐఅండ్‌పిఆర్ అధికారులకు పెద్ద మొత్తంలో ముడుపులు చెల్లించి, అప్ గ్రేడ్ అయిన పత్రికలు ఏవి? అన్నవాటిపై కచ్చితంగా విచారణ జరిపించాలి. అంతే కాకుండా కేవలం న్యూస్ ఏజెన్సీల మీద ఆధారపడి, పత్రికలు నడుపుతున్నట్లు నటిస్తూ, నాలుగు పత్రికలు జిరాక్స్ లు తీసి, పదుల సంఖ్యలో పత్రికల పేరుతో దోచుకుంటున్న దొంగల గుట్టు రట్టు కావాలి. లేకుంటే తెలంగాణ అస్థిత్వానికే ప్రమాదం రావొచ్చు. సాంస్కృతిక విధ్వంసం జరగొచ్చు. తెలంగాణ యాస మరింత మరుగునపడిపోవచ్చు. 

*_అవకాశవాదులు పదవుల కోసం_*
ఏ ఎండకు ఆ గొడుగుపట్టే గోడ మీద పిల్లలు ఎప్పుడూ వుంటారు. అసలైన అర్హులకు అవకాశాలు అందకుండా తన్నుకుపోతారు. పెద్ద మనుషులుగా చెలామణీ అవుతుంటారు. పదేళ్ల కల్వకుంట్ల దోపిడీకి చరమగీతం పాడడంలో సున్నా శాతం కూడా పాత్ర లేని వాళ్లు తెల్ల బట్టలేసుకొని, ముందు వరుసక్రమంలో వుంటారు. అలాంటి వారిని దూరం పెట్టాలి. లేకుంటే వాళ్లు తిన్నింటి వాసాలు లెక్కపెడతారు. తెలంగాణ ఉద్యమ సమయంలో దశ..దిశ పేరుతో సమైక్యవాద ముసుగేసుకొని, తెలంగాణ వాదానికి విలువ లేకుండా చేయాలని చూసిన ఓ పెద్ద మనిషి తెరమీదకు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ వచ్చిన వెంటనే అప్పటి ప్రభుత్వం ఆ ప్రభుద్దుడి అక్షతన జర్నలిస్టుల సంక్షేమం పెడితే జర్నలిస్టుల జీవితశలు ఆగం చేశాడు. తెలంగాణ జర్నలిస్టుల గోస పుచ్చుకున్నాడు. ఆంద్రప్రదేశ్ లో జగన్ అధికారంలో రాగానే అక్కడ ప్రత్యక్షమై సలహాదారుడయ్యాడు.‌ ఇప్పుడు మళ్లీ మేకవన్నె వేషాలేయడానికి వస్తున్నట్లు తెలుస్తోంది. గత నలబై సంవత్సరాలుగా కొత్త తరం జర్నలిస్టులకు అవకాశాలు రాకుండా,  తమకే పదవులు అని అనుభవిస్తూ,కూర్చున్న కొమ్మే నరికే కుహనావాదుల పట్ల జాగ్రత్త సుమీ...!

బాక్స్:

*_యాడ్స్ ఆపేయడమే కాదు._*
_* ఇన్నేళ్ల వందల కోట్ల 'యాడ్స్ స్కాం' తవ్వాలి_

రేవంత్ ప్రభుత్వం నమస్తే తెలంగాణకు యాడ్స్ ఆపేసింది. అందరికీ ఇచ్చిన సిక్స్ గ్యారంటీలు, ప్రజాపాలన, అభయహస్తం బాపతు యాడ్స్ అందులో రాలేదు. నిజానికి రేవంత్ ప్రభుత్వం చేయాల్సింది మరో కీలకాంశం ఉంది. అసలు ఏ పత్రిక సర్క్యులేషన్ ఎంత..? ఏ టీవీ చానెల్ వ్యూయర్‌షిప్ ఎంతో తేల్చాలి. ఏబీసీ లేదా ఐఆర్ఎస్. ఏదో ఒక న్యూట్రల్ ప్రొఫెషనల్ సర్వే ఫలితాన్నే పరిగణనలోకి తీసుకోవాలి. పత్రికల సొంత సర్టిఫికెట్లను, సీఎ మదింపుల్ని చెత్తబుట్టలో పడేయాలి. టీవీలకు రేటింగ్స్ ప్రతివారం బార్క్ ఇస్తుంది. ఇన్నేళ్ల ప్రభుత్వ యాడ్స్ కలిపి లెక్కేసి చూస్తే కొన్ని వేల కోట్ల స్కాం ఇది.

వాటిని బట్టి టారిఫ్ రివైజ్ చేయాలి. నమస్తే తెలంగాణ మాత్రమే కాదు. కొన్ని చిన్న పత్రికలు పేరుకు ఐఅండ్‌పీఆర్ అధికారులకు పంపించడం కోసమే ఓ వందా రెండొందల కాపీలు కొట్టి అడ్డగోలుగా యాడ్స్ కొట్టేసేవాళ్లు. టీవీ చానెళ్లకు ఇచ్చే యాడ్స్‌కు లెక్కాపత్రం ఏమీ లేదు. జాతీయ స్థాయిలో తన పేరు వెలిగిపోవడానికి ఏవేవో భాషల్లో ఉన్న పత్రికలకూ వందల కోట్లు తగలేశాడు కేసీయార్. కేవలం ఆ యాడ్స్ కమీషన్ల కోసం అప్పటికప్పుడు ‘యాడ్ ఏజెన్సీలు’ పుట్టు కొచ్చాయి. తెలుగు కదా, అవి పలువురు పీఆర్ఓల బినామీ ఏజెన్సీలు. అదొక పెద్ద దందా. దీన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి. అలా చేస్తేనే కోట్ల ప్రజాధనానికి న్యాయం చేసినట్టు.. 'అబ్బే, అలా చేస్తే, ఓ పారదర్శక విధానం తీసుకొస్తే మా వెలుగు పత్రికకు కష్టం కదా.!' అంటారా..? ఏబీసీకి వెళ్లమనండి, తప్పేముంది..? అన్నట్టు… మీడియా అకాడమీ వేరు, జర్నలిస్టుల యూనియన్ వేరు. ఆ రెండింటి మధ్య ఓ బలమైన గీత ఉంటుంది. దాన్ని గౌరవించండి..!!

ప్రతి నియోజకవర్గానికి ఒక ఒక జర్నలిస్టుకు కార్పొరేటర్ గా అవకాశం ఇవ్వాలి సత్యం గౌడ్ డిమాండ్

ప్రతి నియోజకవర్గానికి ఒక ఒక జర్నలిస్టుకు కార్పొరేటర్ గా అవకాశం ఇవ్వాలి
 సత్యం గౌడ్ డిమాండ్

ప్రతి సమస్యని మొదటగా గుర్తించేది జర్నలిస్టులే తీర్చేది జర్నలిస్టులే 

జర్నలిస్టుల సూచనలతోనే అధికారులు, ప్రజాప్రతినిధులు విధులు నిర్వహిస్తున్నారు 

హైదరాబాద్: రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈసారి జర్నలిస్టులకు అన్ని నియోజకవర్గాల్లో ఒక డివిజన్ కు కార్పొరేటర్ గా సముచిత అవకాశాలు కల్పించాలి అని భాగ్యనగర్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యంగౌడ్  డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్థంభంగా ఉన్న మీడియాకు తగిన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రజా సమస్యలు పరిష్కరించడంలో, అభివృద్ధి చేయడంలో ఒక జర్నలిస్టుకు తెలిసినట్టు మరి ఎవరికి తెలియదని,
ప్రాంతీయ సమస్యలను ప్రభుత్వాల ముందుకు తీసుకెళ్లడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని, అలాంటి వారిని రాజకీయంగా ప్రోత్సహించడం ద్వారా ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని సత్యంగౌడ్ పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ నియోజకవర్గాల్లో ప్రజలతో నిత్యం మమేకమై  ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించగల సామర్థ్యం కలిగి ఉన్నారని,యూనిఫామ్ లేకుండా,జీతాలు లేకున్నా నిస్వార్ధంగా ప్రజాసేవ చేసే జర్నలిస్ట్ లకు రాజకీయ అవకాశాలు కల్పిస్తే ప్రజలకు మరిన్ని సేవాలందించగలరని,
ఇప్పటి వరకు కొన్ని నియోజకవర్గాలకే పరిమితమైన అవకాశాలు ఈసారి రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జర్నలిస్టులకు అవకాశం ఇవ్వాలని రాజకీయ పార్టీలు ఆదిశగా ఆలోచించాలని, దీనివల్ల రాజకీయాల్లో అభివృద్ధి, పారదర్శకత పెరుగుతాయని జర్నలిస్ట్ సంఘాలు అభిప్రాయం వ్యక్తo చేస్తున్నాయని సత్యంగౌడ్ అన్నారు.
ఈ అంశంపై రాజకీయ పార్టీల అధిష్టానాలు ఎలా స్పందిస్తాయో, జర్నలిస్టులకు వాస్తవంగా ఎలాంటి అవకాశాలు కల్పిస్తారో వేచి చూడాల్సి ఉంది. అయితే ఈ డిమాండ్ మాత్రం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంటుందనే చెప్పాలి.

ముగ్గుల పోటీల కార్యక్రమంలో BRS పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు పసుల ప్రభాకర్ రెడ్డి

*_ఉప్పల్ నియోజకవర్గంలోని వెంకట్ రెడ్డి నగర్ డివిజన్ లో ముగ్గుల పోటీల కార్యక్రమంలో BRS పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు పసుల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.విజేతలకు నగదు బహుమతులు అందజేశారు... Bplkm✍️_*

సంక్షేమ పథకాలు ప్రజలకు అందకపోతే ప్రభుత్వ అకౌంట్ నుంచే ఆటో కట్ + పెనాల్టీ!

👉మహాలక్ష్మి – ₹2500
నెల మారిపోయినా ₹2500 పడకపోతే,
ప్రజల అకౌంట్ కు … ప్రభుత్వ అకౌంట్ నుంచే ఆటో కట్ + పెనాల్టీ!

👉రైతు భరోసా
సీజన్ అయిపోయి పంట అమ్మినా డబ్బులు రాకపోతే,
వడ్డీతో సహా Govt అకౌంట్ నుంచే ట్రాన్స్‌ఫర్!

👉నిరుద్యోగ భృతి / ఉద్యోగాలు
జాబ్స్ మాటలకే పరిమితం అయితే,
నిరుద్యోగ భృతి Govt అకౌంట్ నుంచే ఆటో డిపాజిట్!

👉కళ్యాణలక్ష్మి / షాదీ ముబారక్
పెళ్లి అయ్యి పిల్లలు స్కూల్‌కి వెళ్లినా డబ్బులు రాకపోతే,
Govt అకౌంట్ నుంచే లేట్ ఫైన్‌తో పేమెంట్!

👉పింఛన్లు
నెల మొదలై పింఛన్ పడకపోతే,
Govt అకౌంట్ నుంచే పెనాల్టీతో సహా జమ!

👉ఫీజు రీయింబర్స్‌మెంట్ / స్కాలర్‌షిప్స్
కాలేజ్ అయిపోయినా ఫీజు రాకపోతే,
Govt అకౌంట్ నుంచే వడ్డీతో చెల్లింపు!

👉మహిళల ఆర్థిక భరోసా పథకాలు
పథకాలు పోస్టర్లకే ఉంటే,
డబ్బులు మాత్రం Govt అకౌంట్ నుంచే డైరెక్ట్!

👉రుణమాఫీ
రుణం మాఫీ కాక బ్యాంక్ నోటీసులు వస్తే,
ఆ మొత్తం Govt అకౌంట్ నుంచే కట్!

👉చలాన్‌కు ఆటో డెబిట్ ఉంటే,
హామీలకు ఆటో క్రెడిట్ తప్పనిసరి!
SOURCE / Courtesy by :
(RIGHT TO INFORMATION ACT -+91 81791 32131)

Saturday, January 10, 2026

*️⃣జ‌ర్న‌లిజానికి వ‌న్నెతెచ్చే జ‌ర్న‌లిస్టుల‌కు అండ‌గా ఉంటాం

*️⃣జ‌ర్న‌లిజానికి వ‌న్నెతెచ్చే జ‌ర్న‌లిస్టుల‌కు అండ‌గా ఉంటాం
*️⃣అక్రిడిటేష‌న్ కార్డులు త‌గ్గుతాయ‌నే ప్ర‌చారం వాస్త‌వం కాదు
*️⃣గ‌తంలో కంటే ఎక్కువ‌గానే అక్రిడిటేష‌న్ల మంజూరు
*️⃣ఏకార్డుకైనా అన్ని ప్ర‌యోజ‌నాలు వ‌ర్తిస్తాయి
*️⃣జ‌ర్న‌లిస్టు సంఘాల సూచ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటాం
*️⃣జీవో 252లో మార్పులు చేర్పులు చేస్తాం
*️⃣జ‌ర్న‌లిస్టుల ఇండ్ల స్ధ‌లాల కోసం కోర్టు అడ్డంకులు లేని విధానాన్ని రూపొందిస్తాం
*️⃣14 జ‌ర్న‌లిస్టు సంఘాల‌తో స‌మావేశం నిర్వ‌హించిన
    
       -రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార‌, పౌర‌సంబంధాల‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి గారు

 జర్న‌లిజం గౌర‌వాన్ని నిల‌బెట్టి ఆ వృత్తికి వ‌న్నెతెచ్చే జ‌ర్న‌లిస్టులంద‌రికీ గౌర‌వ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం అన్నివిధాలా అండ‌దండ‌గా ఉంటుంద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార‌, పౌర‌సంబంధాల‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి గారు అన్నారు. ఏ ఒక్క‌రి గౌర‌వాన్ని త‌గ్గించాల‌ని గాని, చిన్న‌బుచ్చాల‌ని గాని త‌మ‌  ప్ర‌భుత్వ ఉద్దేశ్యం కాద‌ని స్ప‌ష్టం చేశారు. 

జీవో 252 పై శ‌నివారం నాడు స‌చివాల‌యంలోని త‌న కార్యాల‌యంలో 14 జ‌ర్న‌లిస్టు సంఘాల ప్ర‌తినిధుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ స‌మావేశంలో జ‌ర్న‌లిస్టు సంఘాల ప్ర‌తినిధులు విలువైన సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇచ్చార‌ని వారు ప్ర‌స్తావించిన అంశాల‌ను విజ్ఞ‌ప్తుల‌ను ప‌రిశీలించి సానుకూల‌మైన నిర్ణ‌యం తీసుకుంటామ‌ని జీవో 252లో మార్పులు చేర్పులు చేస్తామ‌ని హామీ ఇచ్చారు. 

అక్రిడిటేష‌న్ కార్డులు త‌గ్గుతాయ‌ని జ‌రుగుతున్న ప్ర‌చారంలో వాస్త‌వం లేద‌ని స్ప‌ష్టం చేశారు. గ‌తంలో ఉన్న సుమారు 23వేల అక్రిడిటేష‌న్ కార్డుల సంఖ్య కంటే ఈ సారి ఇచ్చే కార్డుల సంఖ్య ఎక్కువ ఉంటుంద‌ని వెల్ల‌డించారు. అక్రిడిటేష‌న్ కార్డుల జారీలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొద‌టివ‌రుస‌లో ఉంద‌ని అన్నారు. అర్హులైన జ‌ర్న‌లిస్టులంద‌రికీ అక్రిడిటేష‌న్ కార్డులు ఇవ్వాల‌నే స‌దుద్దేశంతో శాస్త్రీయ ప‌ద్ద‌తిలో అధ్య‌య‌నం చేయ‌డం జ‌రిగింద‌ని  ప‌లుమార్లు స‌మావేశాలు నిర్వ‌హించామ‌ని అంతేగాక దేశ వ్యాప్తంగా ఉన్ననియ‌మ నిబంధ‌న‌ల‌ను ప‌రిశీలించ‌డం జ‌రిగింద‌ని ఫ‌లితంగా  కొత్త కార్డుల  మంజూరులో కొంత‌ జాప్యం  జ‌రిగింద‌ని అన్నారు.

మీడియా కార్డుకు, అక్రిడిటేష‌న్ కార్డుకు ఎలాంటి వ్య‌త్యాసం లేద‌ని అక్రిడిటేష‌న్ కార్డుదారుల‌కు ప్ర‌భుత్వ ప‌రంగా అందే ప్ర‌తి ప్ర‌యోజ‌నం మీడియా కార్డుదారుల‌కు కూడా అందుతాయ‌ని ఇందులో ఎలాంటి అనుమానాల‌కు తావులేద‌ని మ‌రోమారు స్ప‌ష్టం చేశారు.  
 
తాము అక్రిడిటేష‌న్ కార్డుల మంజూరు విష‌యంలో ఎటువంటి భేష‌జాల‌కు పోవ‌డం లేద‌ని కానీ ఈ వ్య‌వ‌స్ధ‌ను గాడిలో పెట్టేందుకు గాను ప్ర‌భుత్వ ప‌రంగా స‌ర్క్యులేష‌న్, ఇత‌ర సంబంధిత వివ‌రాల‌ను ఖ‌చ్చితంగా సేక‌రిస్తామ‌ని, ఛార్టెడ్ అకౌంటెంట్ స‌ర్టిఫికేట్ల ప‌రిశీల‌న కూడా చేస్తామ‌ని దీనివ‌ల‌న అస‌లైన ప‌త్రిక‌లు, పాత్రికేయ‌లకు న్యాయం జ‌రుగుతుంద‌ని అన్నారు.

రాష్ట్రంలో మండ‌లానికో విలేక‌రి ప్రాతిప‌దిక‌న గాక జ‌నాభా వారీగా అక్రిడిటేష‌న్‌లు మంజూరు చేస్తే ఎలా ఉంటుంద‌న్న విష‌యంలో కూడా ఆలోచిస్తామ‌ని, దీనిపై పాత్రికేయ సంఘాలు స్పందించాల‌ని అన్నారు.  అక్రిడిటేష‌న్ క‌మిటీల‌లో ఉర్ధూ జ‌ర్న‌లిస్టుల‌కు అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని క్రీడా, సాంస్కృతిక‌, క్రైమ్‌, కేబుల్ టీవీ త‌దిత‌ర విభాగాల‌ పాత్రికేయుల‌కు  అక్రిడిటేష‌న్ సౌక‌ర్యం త‌ప్ప‌క ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. మ‌హిళా జ‌ర్న‌లిస్టుల విజ్ఞ‌ప్తి మేర‌కు అక్రిడిటేష‌న్ కార్డుల జారీలో ప్రత్యేక కోటా కేటాయిస్తామ‌ని హామీ ఇచ్చారు.

దేశంలోని తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే డిజిట‌ల్ మీడియా కార్డులు మంజూరు చేశామ‌ని తెలియ‌జేశారు. స‌మావేశంలో ప‌లువురు పాత్రికేయ సంఘాల ప్ర‌తినిధులు ఇండ్ల స్ధ‌లాలు, పెన్ష‌న్, బ‌స్‌పాసులు, పాత్రికేయుల‌కు బీమా త‌దిత‌ర అంశాల‌ను ప్ర‌స్తావించ‌గా మంత్రి పొంగులేటి గారు సావ‌ధానంగా వారికి స‌మాధాన‌మిచ్చారు. 

జ‌ర్నలిస్టుల‌కు ఇండ్ల స్ధ‌లాల అంశంపై కొంత‌మంది ప్ర‌తినిధులు అడిగిన ప్ర‌శ్న‌ల‌పై మంత్రిగారు స్పందిస్తూ.. త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ద‌శాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న జ‌ర్నలిస్టుల‌కు ఇండ్ల స్ధ‌లాల అంశాన్ని ప‌రిష్క‌రించి జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి భూమిని అప్ప‌గించ‌డం జ‌రిగింద‌న్నారు. ఆ త‌ర్వాత సుప్రీంకోర్టు ఈ అంశాన్ని కొట్టివేయ‌డంతో స‌మ‌స్య మొద‌టికి వ‌చ్చింద‌ని అయినా కూడా ఇండ్ల స్ధ‌లాల విష‌యంలో త‌మ ప్ర‌భుత్వం ఎప్పుడూ సానుకూలంగా ఉంటుంద‌ని  అన్నారు.ఈ విష‌యంలో గౌర‌వ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గారి సూచ‌న మేర‌కు ఎటువంటి కోర్టు అడ్డంకులు లేని విధానాన్ని రూపొందిస్తామ‌ని తెలిపారు

ఈ స‌మావేశంలో తెలంగాణ మీడియా అకాడ‌మీ ఛైర్మన్ కె. శ్రీ‌నివాస‌రెడ్డి గారు, ఐ&పిఆర్ క‌మీష‌న‌ర్ సిహెచ్‌. ప్రియాంక గారు, సీపీఆర్‌వో జి. మ‌ల్సూర్ గారు తదిత‌రులు పాల్గొన్నారు

ప్రెస్ క్లబ్ జర్నల్ ను ఆవిష్కరించిన మంత్రి పొంగులేటిశ్రీనివాసరెడ్డి గారు

ప్రెస్ క్లబ్ జర్నల్ ను ఆవిష్కరించిన మంత్రి పొంగులేటిశ్రీనివాసరెడ్డి గారు

జర్నలిస్టుల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు. 

హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ రూపొందించిన ప్రెస్ క్లబ్ జర్నల్ ను మంత్రి పొంగులేటి గారు సచివాలయంలో శనివారం ఆవిష్కరించారు. తెలుగు ఇంగ్లీష్ భాషల్లో ప్రతినెల ప్రెస్ క్లబ్ జర్నలను రూపొందించడం అభినందనీయమని ప్రశంసించారు. ఈ జర్నల్లో జర్నలిస్టులకు సంబంధించిన సమకాలిన అంశాలు పొందుపరచడం సంతోషకరమని చెప్పారు. 

ప్రెస్ క్లబ్ నూతన పాలకమండలి ఏర్పడి మూడు నెలలు అయినప్పటికీ జర్నలిస్టుల సంక్షేమ అభివృద్ధికి వివిధ కార్యక్రమాలను రూపొందించామని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎస్ విజయకుమార్ రెడ్డి ప్రధాన కార్యదర్శి రమేష్ వరికుప్పల మంత్రికి వివరించారు. ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నామని ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మంత్రికి వివరించారు. 

జర్నలిస్టుల కోసం ప్రెస్ క్లబ్ చేపట్టే కార్యక్రమాలకు ప్రభుత్వం సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తుందని మంత్రి గారు హామీ ఇచ్చారు. ప్రెస్ క్లబ్ జర్నల్ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రెస్ క్ల బ్ ఉపాధ్యక్షులు ఏ. రాజేష్ గారు, అరుణ అత్తలూరి గారు, జాయింట్ సెక్రెటరీ చిలుకూరి హరిప్రసాద్ గారు, కోశాధికారి రమేష్ వైట్ల గారు, ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు శంకర్ శీగ గారు, ఎన్. ఉమాదేవి గారు, రచన ముడుంబై గారు, వనం నాగరాజు గారు, అమిత్ బట్టు గారు తదితరులు పాల్గొన్నారు.

*_బోల్తా కొడుతున్న రేవంత్ సర్కార్_*

*_బోల్తా కొడుతున్న రేవంత్ సర్కార్_*

_# కాంగ్రెస్ పార్టీని అణగదొక్కిన జర్నలిస్ట్ సంఘాలకే రెడ్ కార్పెట్_ 
_# తెలంగాణలో జర్నలిస్టు సంఘాలు చాలా ఉన్న పిలిచింది మూడు సంఘాలు ఎందుకో.?_*
_# గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ సంఘాలని నమ్ముకొని ప్రభుత్వాన్ని కోల్పోయింది.. తాజాగా రేవంత్ సర్కార్ అదే దారిలో .._*

_# మీ ఎవరికీ బానిసలం కాదు. గులాంగిరీ చేయమని చెపుతున్న తెలంగాణా రాష్ట్ర జర్నలిస్టు సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ (టి.ఎస్.జేఏసీ)

_# అన్ని సంఘాలని పిలవాలన్న అవగాహనాలేని ఐ & పి.ఆర్ శాఖ_

*_గత ప్రభుత్వంలో అక్కడేషన్ కార్డు జారీలో భారీగా అవకతవకలు జరగడానికి అప్పటి ప్రభుత్వానికి ('సంకలు నాకారు అంటే బాగుండదు' అని) ఊడిగం చేసిన జర్నలిస్టు సంఘాలే అన్న విషయం అందరికీ తెలుసు..!అధికారం ఎక్కడుంటే అక్కడనే ఆ సంఘాలు తొత్తులుగా వ్యవహరిస్తూ వాళ్ళ స్వలాభం కోసం పాటుపడడం గత 3 దశాబ్దాలుగా సర్వసాధారణాంగా జరుగుతున్న ప్రక్రియ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అక్రిడేషన్ కార్డుల వ్యవహారం నడుస్తున్న సమయంలో ప్రభుత్వం *_జేఏసీగా ఉన్న అన్ని సంఘాలను పిలవకుండా_* కేవలం మూడు సంఘాలను పిలిచి మాట్లాడడంపై జర్నలిస్టు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సంఘాలని ఏ ప్రతిపాదికన సమాచార శాఖ పిలిచిందో వాళ్లకే తెలియాలి. ప్రభుత్వానికి తొత్తుగా ఉన్నందుకు పిలిచారా..? లేక గత ప్రభుత్వాన్ని మోసం చేసినందుకు పిలిచారా.? సభ్యులు ఎక్కువగా ఉన్నారని పిలిచారా.? లేక 'ఊసరవెల్లి'లా రంగులు మార్చే యూనియన్లు ఉన్నాయని పిలిచారా.? మరి సమాచార శాఖకి తెలియాలి. గత కెసిఆర్ ప్రభుత్వ వ్యతిరేకాలను ఎండగట్టి జైలు పాలైన అనేకమంది జర్నలిస్టులను యూనియన్లను పక్కన పెట్టేసి 'అప్పుడు జోల పాట పాడిన యూనియన్ల'ను రేవంత్ సర్కార్ దగ్గర తీయడం ఏమిటో.?

*_నియంతను ఎదిరించి జైళ్ళకు వెళ్ళిన జర్నలిస్టుల పరిస్థితి ఏమిటి.?_*

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే... గత ప్రభుత్వం హయంలో జైలుకు వెళ్లిన పాత్రికేయులకు ఏదో ఒరుగుతుందని అందరూ భావించారు. అది జరగలేదు సరి కదా.! నియంత పాలనలో గుడ్డలు ఉతికిన వారికే రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇచ్చారు. తప్పులు సరిదిద్దుకో రేవంత్ రెడ్డి సార్.

*_ప్రెస్ అకాడమీ చైర్మన్ పూర్తిగా విఫలం_* 
ఇదో పెద్ద దౌర్భాగ్యం. ప్రెస్ అకాడమీ చైర్మన్ గా శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటినుండి నేటి వరకు ఆయన జర్నలిస్టులకు చేసింది పూర్తిగా శూన్యం. మంచి చేయడం దేవుడెరుగు.! చెడు చేయడమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన పార్టీ పత్రిక కోసం ఎంతకైనా దిగజారుతాడు‌. కొన్ని యూనియన్లనే ఆయన దత్తత తీసుకున్నట్టుగా వాటిని అన్నిటికీ ముందుకు పెట్టడం విడ్డూరంగా మారింది. గత కెసిఆర్ ప్రభుత్వంలో ఆ యూనియన్లను వ్యతిరేకించిన శ్రీనివాస్ రెడ్డి ఈరోజు వాటిని సంకలు పెట్టుకొని తిరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కనీస జర్నలిస్టు విలువలు కూడా తెలియని ఈయన ఈరోజు ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఉండడం తెలంగాణ జర్నలిస్టుల దౌర్భాగ్యంగానే చెప్పుకోవచ్చు.! ఒక్క జీవోని కూడా సక్రమంగా రిలీజ్ చేయించలేని ప్రెస్ అకాడమీ చైర్మన్ ఉండి కూడా ఎలాంటి ఉపయోగం లేదు. ఇక జర్నలిస్టుల సాధకబాధలు కష్టాలు ఆయనకు పట్టే ఆయన సంబంధించిన పత్రికలకు ఎన్ పానెల్ చేసుకోవడం స్వలాభం కోసం యాడ్స్ వేయించుకోవడం తప్ప చిన్న పత్రికల బాగుకోసం ఒక్కరోజు కూడా ఆయన పాటుపడ్డ దాఖలాలు లేవు. ఇలాంటి అనర్హుడిని ప్రెస్ అకాడమీ చైర్మన్ గా నిలబెట్టిన రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.

ఇట్లు 
✍🏻
*_(బైస సంగీత),_* 
*_(మమత)_*
_(తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టు సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ కన్వినర్)_

Media News Links ⬇️
https://www.facebook.com/share/1FxxVpzo5F/
                 *****
https://www.instagram.com/reel/DTVGSk7EmkL/?igsh=eXg0NWRrN210aWk4
             *****
https://x.com/Praja_Snklpm/status/2009961476468158868?t=TRFmbFJtdvoOCHNU4sIbkw&s=19

Thursday, January 8, 2026

జే ఎన్ జే హెచ్ ఎస్ మ్యాక్ సొసైటీ పోరాటానికి అండగా #TGJAC ✊

*_⬆️జే ఎన్ జే హెచ్ ఎస్ మ్యాక్ సొసైటీ_*

https://x.com/Praja_Snklpm/status/2009490265766285513?t=djDw6dwI3LLa_nS5FsEyvw&s=08

*#SaveJournalism ✊*
*#TGJAC ✊ #AWJA ✊* *#TJSS ✊*

*@TelanganaCMO*
*@Bhatti_Mallu* *@INC_Ponguleti*
*@CPRO_TGCM @IPRTelangana*
*@Sridharmamidala @PCITweets*
*@PTI_News @PressClubHyd*
*@AnamchinniJ @AnamchinniE2*

*_ఈ కార్యక్రమాన్ని జర్నలిస్టులం అందరం కలిసి విజయవంతం చేయాలి.తోటి జర్నలిస్టు సోదరులకు ఇప్పుడు అండగా నిలుద్దాం.అందరూ తమ సొంత మీడియాలతో పాటు,మనకు తెలిసిన మీడియా మిత్రులకు సమాచారం చేరవేద్దాం.వీరికి మన జేఏసీ తోడుగా ఉంటుంది.వీలైన జర్నలిస్టు మిత్రులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలి... జై జర్నలిస్ట్...✊_*
*_Bplkm✍️(TGJAC మీడియా ఇంచార్జి)_*

https://www.instagram.com/reel/DTRxJVHkiWg/?igsh=Z2xkenlhZHJ5azBt

Tuesday, January 6, 2026

రామంతాపూర్ డివిజన్‌కు ప్రత్యేక పోలీస్ స్టేషన్ మంజూరు చేయాలి

ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని రామంతాపూర్ డివిజన్‌కు ప్రత్యేక పోలీస్ స్టేషన్ మంజూరు చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్  రెడ్డి గారిని కలిసి విజ్ఞప్తి చేశారు.

రామంతాపూర్ డివిజన్‌లో లక్ష జనాభా పైగా నివసిస్తుండగా, ప్రస్తుతం ఈ ప్రాంతం ఉప్పల్ పోలీస్ స్టేషన్ మరియు ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో విభజించబడి ఉండటంతో పోలీసు పర్యవేక్షణలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఎమ్మెల్యే గారు లేఖలో వివరించారు.

విస్తీర్ణం ఎక్కువగా ఉండటం, జనసాంద్రత అధికంగా ఉండటంతో పాటు అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజల భద్రత కోసం రామంతాపూర్ డివిజన్‌కు ప్రత్యేక పోలీస్ స్టేషన్ అత్యవసరమని పేర్కొన్నారు.

కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటుతో చట్ట అమలు మరింత పటిష్టమై, నేర నియంత్రణ, పర్యవేక్షణ మెరుగుపడి ప్రజలకు భద్రతా భావం పెరుగుతుందని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు తెలిపారు. ఈ అంశంలో పూర్తి సహకారం అందిస్తామని డీజీపీకి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో BRS పార్టీ రాష్ట్ర నాయకులు గంధం నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Monday, January 5, 2026

గల్ఫ్ జైలులో ఉన్న నిర్మల్ జిల్లా సోన్ మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన ముండ్ల రాజన్నను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలి


గల్ఫ్ జైలు నుంచి విడుదల కావాలంటే
భారతీయుడు అని నిరూపించుకోవాలి,

● సహాయం కోసం 'ప్రవాసీ ప్రజావాణి' తలుపు తట్టిన బాధితుడి కుటుంబ సభ్యులు, 

● ఓటర్ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు లాంటి గుర్తింపు పత్రాలు లేవు,

● బ్యాంకు పాస్ బుక్, ఎల్ఐసీ పాలసీ, ఒక గ్రూప్ ఫోటో మాత్రం ఉన్నాయి, 

నిర్మల్ జిల్లా: సోన్ మండలం మాదాపూర్, గ్రామానికి చెందిన ముండ్ల రాజన్న (59) అనే గల్ఫ్ కార్మికుడు 18 సంవత్సరాల క్రితం ఉపాధి కోసం యూఏఈ దేశంలోని దుబాయికి వెళ్ళి, అక్కడే ఉండిపోయాడు. మూడు నెలల క్రితం అక్కడి పోలీసుల తనిఖీల్లో అరెస్టయి అబుదాబి జైల్లో మగ్గుతున్నాడు. ముండ్ల రాజన్న, భారతీయుడు అని నిరూపించుకునేందుకు పాత పాస్ పోర్ట్ జీరాక్స్ గాని, ఇతర సాక్ష్యాలు గాని లేనందున యూఏఈ, దేశ రాజధాని అబుదాబి లోని ఇండియన్ ఎంబసీ తాత్కాలిక పాస్ పోర్ట్ (ఎమర్జెన్సీ సర్టిఫికెట్) జారీ చేయలేకపోతున్నది.  

ఈ నేపథ్యంలో ముండ్ల రాజన్నను గల్ఫ్ జైలు నుంచి విడిపించి, భారత్‌కు తిరిగి తీసుకురావాలంటూ ఆయన భార్య ముండ్ల లక్ష్మి, కుమారుడు నితిన్, కుమార్తె నిఖిత లు ఇటీవల హైదరాబాద్ లోని 'సీఎం ప్రవాసీ ప్రజావాణి' వద్ద, తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ ఛైర్మన్, అంబాసిడర్ డా. బిఎం వినోద్ కుమార్, వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి లను కలిసి విజ్ఞప్తి చేశారు. గతంలో హైదరాబాద్ పాస్ పోర్ట్ ఆఫీసర్ గా పనిచేసిన అనుభవం కలిగిన డా. వినోద్ వారికి మార్గదర్శనం చేశారు. ముండ్ల రాజన్నకు చెందిన అన్ని రకాల పత్రాలు, లిఖిత సాక్ష్యాలు (డాక్యుమెంటరీ ఎవిడెన్స్) సేకరించి దరఖాస్తు చేస్తే, పాస్ పోర్ట్ ఆఫీస్ లో రికార్డులు సెర్చ్ చేయించి పాత పాస్ పోర్ట్ వివరాలు రాబట్టి సహాయం చేస్తామని ఆయన వారికి సూచించారు. 

ఈ మేరకు ముండ్ల రాజన్న భార్య లక్ష్మి అందుబాటులో ఉన్న ఆధారాలతో సోమవారం ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి మెయిల్ ద్వారా వినతిపత్రం పంపారు. నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఆదిలాబాద్, ఎంపీ గోడం నగేష్ లకు ప్రతులు పంపారు. అబుదాబి లోని తెలంగాణ సామాజిక కార్యకర్తలు గడ్చంద నరేందర్, ప్రియా సింగిరెడ్డి లు ఎంబసీతో సమన్వయం చేస్తున్నారు. అబుదాబి లోని సామాజిక సేవకులు గడ్చంద నరేందర్ సెప్టెంబర్ లో సెలవుపై నిర్మల్ జిల్లాను సందర్శించిన సందర్భంగా, బాధిత కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ఆయనకు వివరించారు. నరేందర్ అప్పుడే సమస్యను నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, నిర్మల్ జిల్లా ప్రవాసీ హెల్ప్ లైన్ నిర్వాహకులు, కార్మిక శాఖ అధికారి ముత్యం రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.  

ఈ సందర్భంగా మంద భీంరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) ప్రత్యేక చొరవ తీసుకొని, జీఏడి ఎన్నారై విభాగం ద్వారా ప్రయత్నాలు ప్రారంభించిందని అన్నారు. హైదరాబాద్ పాస్ పోర్ట్ కార్యాలయంలో రికార్డుల  శోధన, నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ద్వారా వ్యక్తి గుర్తింపు ధృవీకరణ, అబుదాబి లోని భారత దౌత్య కార్యాలయం ద్వారా మద్దతు కోసం ఏక కాలంలో మూడు కార్యాలయాలకు తెలంగాణ ప్రభుత్వం ద్వారా లేఖలు రాసే విధంగా తాము కృషి చేస్తున్నామని భీంరెడ్డి వివరించారు. తెలంగాణ బిడ్డలు ప్రపంచంలో ఎక్కడున్నా వారి కష్టాల్లో పాలు పంచుకుంటామని, ఆదుకుంటామని ఆయన అన్నారు.

Saturday, January 3, 2026

అభిమానులు / చిన్ననాటి మిత్రులతో రఘునాథ్ వెరబెల్లి

#raghunathverabelli #mancherial #friends

*_నిర్మల్ జిల్లా ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం దస్తురాబాద్ మండలం బుట్టాపూర్ గ్రామంలో అభిమానులు & చిన్ననాటి మిత్రులతో ఆత్మీయ పలకరింపు లో భాగంగా కాబోయే ఎమ్మెల్యే రఘునాథ్ వెరబెల్లి గారు._*

*_➡️The prominent Bharatiya Janata Party (BJP) leader in Mancherial is Raghunath Verabelli (also known as Raghunath Rao Verabelli)._*
 
*_➡️He serves as the BJP Telangana State Vice President and previously held the position of BJP Mancherial District President._*

*_➡️He was the BJP's Member of the Legislative Assembly (MLA) contestant for the Mancherial constituency in both the 2018 and 2023 Telangana Assembly elections, where he was the runner-up in 2023._*