Wednesday, August 6, 2025

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన బిల్లులను ఆమోదించాలన్న అంశంపై ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన పోరుబాట ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి శాసనసభ ఆమోదించిన రెండు బిల్లులకు వెంటనే ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు రాష్ట్రపతి గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దని పరిమితి విధిస్తూ చేసిన చట్టాన్ని సవరిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ కు కూడా ఆమోదముద్ర వేయాలని విజ్ఞప్తి చేశారు.

❇️బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన బిల్లులను ఆమోదించాలన్న అంశంపై ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన పోరుబాట ధర్నా కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొని ప్రసంగించారు. ఈ ధర్నాలో పార్లమెంట్ లో ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన పలువురు పార్లమెంట్ సభ్యులు పాల్గొని ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న తెలంగాణ సంకల్పానికి మద్దతును ప్రకటించారు.

❇️ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ పోరుబాట కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా శాసనసభలో విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు ఆమోదముద్ర వేయాలని డిమాండ్ చేశారు.

❇️“రాబోవు రోజుల్లో దేశవ్యాప్తంగా చేపట్టే జనగణనలో కులగణన తెలంగాణ నమూనా దేశానికి ఆదర్శంగా, రోల్ మాడల్ గా నిలుస్తుంది. ఫిబ్రవరి 4, 2024 రోజున ప్రారంభించి సరిగ్గా ఏడాది కాలంలో 4 ఫిబ్రవరి 2025 నాటికి సర్వే పూర్తి చేసి రిజర్వేషన్లు కల్పిస్తూ పరిష్కార మార్గం చూపించాం.

❇️ఆ రిజర్వేషన్లను సాధించుకోవడానికే సడక్ నుంచి సంసద్ వరకు వచ్చాం. యావత్ దేశం ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తోంది. వందేళ్లలో ఇలాంటి ప్రక్రియ చేపట్టలేదు. రాష్ట్రాలను పాలించిన దాదాపు మూడు వందల మంది ముఖ్యమంత్రులు ఎవరూ చేయలేని సాహసం తెలంగాణ మంత్రిమండలి విజయవంతంగా పూర్తి చేసింది.

❇️తెలంగాణ శాసనసభ చేసిన బిల్లులు, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ గవర్నర్ ద్వారా రాష్ట్రపతి గారికి చేరి నాలుగు నెలలైనా ఆమోదముద్ర పడలేదు. ఆ నేపథ్యంలోనే చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టాం.

❇️తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిన బీసీ రిజర్వేషన్లకు వివిధ రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది పార్లమెంట్ సభ్యులు మద్దతుగా నిలబడ్డారు. జంతర్ మంతర్ ధర్నాతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కుతాయని నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. మా డిమాండ్ ను ఆమోదించాలి. రిజర్వేషన్లు సాధించే వరకు నిద్రపోం.

❇️ఈ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో నినదించిన విషయాలను తెలంగాణ గ్రామ గ్రామాన చేరవేయాలి. ఒక గొప్ప లక్ష్యంతో ఢిల్లీ వేదికగా పోరాటం సాగిస్తున్నాం. రాష్ట్రపతి గారు మా బిల్లులను వెంటనే ఆమోదించండి..” అని విజ్ఞప్తి చేశారు.

❇️ఈ ధర్నా కార్యక్రమంలో డీఎంకే, సమాజ్ వాది, ఎన్సీపీ, శివసేన, వామపక్ష పార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులు పాల్గొని తెలంగాణ సంకల్పించిన 42 శాతం బీసీ రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతును ప్రకటించారు.

❇️ధర్నాలో ఉప ముఖ్యమంత్రి @Bhatti_Mallu గారితో పాటు మంత్రులు @UttamINC గారు, @DamodarCilarapu గారు, @OffDSB గారు, @Tummala_INC గారు, @jupallyk_rao గారు, @iamkondasurekha గారు, @KomatireddyKVR గారు, @Ponnam_INC గారు, @seethakkaMLA గారు, @INC_Ponguleti గారు, @VivekVenkatswam గారు, @minister_adluri గారు, వాకిటి శ్రీహరి గారు, సలహాదారులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, బీసీ సంఘాల ప్రతినిధులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
#SocialJustice #BCReservations #CasteCensus 

Courtesy / Source by :

https://x.com/TelanganaCMO/status/1953084115168739454?t=_G6ms_vzf7WyDMTWXN7psg&s=19

No comments:

Post a Comment