Friday, January 5, 2024

_జర్నలిస్టు సమస్యలపై స్పష్టమైన హామీ_

*_జర్నలిస్టు సమస్యలపై స్పష్టమైన హామీ ఇచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి_*

*_తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో అఖిల భారత వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జాతీయ అధ్యక్షులు కె.కోటేశ్వర్ రావు, తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షులు అనంచిన్ని వెంకటేశ్వరరావులు ఏకాంత చర్చలు. జర్నలిస్టులకు ఉన్న సమస్యలలో ఎక్కువ సమస్యలు పరిష్కరించే మార్గాలతో పాటు, చిన్న , మధ్య తరగతి పత్రికల మనుగడ కోసం భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలన్న శీనన్న. జర్నలిస్టు సంఘాల సూచనలపై పలు అంశాలపై సానుకూలంగా స్పందించిన మంత్రి_*

https://twitter.com/Praja_Snklpm/status/1743238725667328056?t=R2qDEBYSSaYdfOyOgftDKQ&s=19

conservation and development of the Musi, addressing critical issues.

Join us for a walk, poetry performance, and discussion on the Musi River by Focus High School students on *5th (Friday), 2024, from 11:00 am to 12:30 pm. Students will gather at Musi, Infront of High Court*.

Let's assert the importance of this space and convey a message for the conservation and development of the Musi, addressing critical issues. 

Dr. Lubna Sarwath will lead the discussion. Your presence will greatly encourage these students in their initiative. 

Shaher Bano
coordinator - Service Learning at FHS

We are meeting at Musi river Infront of High Court at 11:00
*****************************

#TelanganaHighCourt
#SaveMusiRiver
#Hyderabad
#HMDA

@TelanganaCMO @Bhatti_Mallu #MDanakishoreIAS @HMDA_Gov @LubnaSarwath @BrsBandari @KaleruVenkatesh

Bplkm🪶

https://twitter.com/Praja_Snklpm/status/1742953223739301981?t=XrSsER9U-LoajxYtEHvaXg&s=19

https://www.instagram.com/reel/C1tvKrDvkqX/?igsh=MWw3OW1uc3Q1eWc4aA==

https://www.facebook.com/reel/217800664742734/?app=fbl

Thursday, January 4, 2024

ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్ బస్తీ లో నాయకుల దురాక్రమణని అడ్డుకోవాలి

*ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్ బస్తీ లో నాయకుల దురాక్రమణని అడ్డుకోవాలి*


ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్ అనబడే బస్తీ యొక్క ప్రజలను గత కొద్ది సంవత్సరాలుగా రాజకీయనాయకులు ఆ భూమిని అప్పగించవలసిందిగా భయాందోళనలకు గురి చేస్తున్నారు. ఈ విషయం మీద జనవరి 2వ 2024 రోజు బస్తీ ప్రజలు ముఖ్యమంత్రి ప్రజావాణి కార్యక్రమంలో నివేదికని సమ్పార్పించిన విషయం మీడియా లో రావడం వలన మానవ హక్కుల వేదిక హైదరాబాద్ యూనిట్ బృందం జనవరి 3వ తారీఖున నిజనిర్ధారణ జరిపింది. 

బాలానగర్ మండలం, బేగంపేట్ దగ్గరి ప్రకాష్ నగర్ కాలనీ పక్కన ఉన్న ఈ భూమి జలాలుద్దీన్ ఖాన్ అనే వ్యక్తికి చెందినది. ఆ భూమి నిజాం కాలం నుంచి వారి వంశస్థుల ఆధీనంలో ఉంది. అతని భూమిలో కొంత భాగం సర్వే నెంబర్ 194/8/1 లో ఈ బస్తీ నెలకొంది ఉంది. ఈ బస్తీ లో ప్రస్తుతం ఉన్న 300 కి పైగా కుటుంబాలు 182 ఇళ్లలో ఉన్నారు. ఈ స్థలం దశాబ్దాలుగా చాలా చేతులు మారింది. వీరందరికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్లు ఉన్నాయి. బస్తీలో మంచి రోడ్లు కూడా వేయడం జరిగింది. ఇంటి పన్ను కూడా కడుతున్నారు. బస్తీ వైశాల్యం ఒక ఎకరం ఉంటుంది. 

ఈ సర్వే నెంబర్ భూమికి పక్కన ఉన్న సర్వే నెంబర్ 184,185,186 లలో దాదాపు మూడు ఎకరాల భూమి ఉంది. ఈ బస్తీ భూమిని కూడా కలుపుకుని అపార్టుమెంట్లు కట్టి అమ్ముకోవాలని కొంతమంది బిల్డర్స్ ఆలోచన. వీరికి రాజకీయ నాయకుల మద్దతు ఉంది. మాజీ మంత్రి దానం నాగేందర్ అనుచరులు ఈ బస్తీ వాసులను భయాందోళనలకు గురి చేస్తున్నారు. బస్తీలో ఎప్పుడూ కొంతమంది కాపు కాయడం,  రాత్రి పూట ప్రజలు మీద దాడి చెయ్యడం, ఇళ్లపై రాళ్లు రువ్వడం, బస్తీ ఖాళీ చేసి వెళ్లిపొమ్మని బెదిరించడం బాగా జరిగింది. ఈ విషయం మీద బేగంపేట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడానికి వెళ్లిన బస్తీవాసులను, పోలీసు వారు నిరాశ పరిచి, కంప్లైన్ట్ తీసుకోకుండా, బస్తీ వాసులు ఈ పోరాటం గెలవలేరని  వారు భూమి ఇచ్చేయడం మంచిదని ఉచిత సలహా ఇచ్చి పంపించేవారు. 

2022 సంవత్సరంలో పైవేటు వ్యక్తులు బుల్డోజర్ల సహాయంతో 8 ఇళ్లను కూల్చివేయడం జరిగింది.  బస్తీ ప్రజలు హై  కోర్టును ఆశ్రయించగా, WPS నెంబర్ 37279, 37392, 37587 status quo తీర్పు ఇచ్చింది, అయినా సరే, దానం నాగేందర్ అనుచరుడిగా గుర్తింపు ఉన్న సుధీర్ గౌడ్ ఆధ్వార్యంలో బస్తీ ప్రజలను భయపెట్టడం ఆగలేదు.జనవరి మూడవ తారీఖు ప్రజావాణిలో నివేదిద్దామని వెళ్లిన బస్తీ వాస్తులను సుధీర్ గౌడ్ మనిషి వారిని అనుసరరిస్తూ అతని మీద ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది. 

బస్తీకి రెండు వైపులా ఉన్న చెరువులలో ఒక చెరువు కబ్జాకి గురి అయ్యి, శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కంపెనీ ద్వారా అపార్ట్మెంట్ నిర్మాణం జరిగింది. ఇంకో వైపు ఉన్న చిన్న చెరువు కూడా కబ్జాకి గురి అయ్యింది. మరో వైపు ఉన్న భూమిలో బస్తీకి భూమిని కూడా కలుపుకుని నిర్మాణాలు కొనసాగించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి రాజకీయ అండదండలు ఉన్నాయి. భూమి రికార్డులలో ఉన్న అవకతవకలు, చెరువుల రక్షణ ప్రభుత్వం చేపట్టకపోవడం, ప్రభుత్వ భూమిని గుర్తించకపోవడం, ఇవన్నీ కూడా పేదవారికి భారం అవుతున్నాయి.

మానవ హక్కుల వేదిక హైదరాబాద్ యూనిట్ ఉపాదాధ్యక్షులు శ్రీ బిలాల్ మరియు ప్రధాన కార్యదర్శి సంజీవ్ ఈ బృందంలో పాల్గొన్నారు. 

డిమాండ్లు 

*జిల్లా కలెక్టర్ విచారణ జరిపి ఆ బస్తీ వాసులకు చట్టరీత్యా నివాస హక్కులు కల్పించాలి.
*బస్తీ వాసులకు రౌడీల నుండి పోలీస్ కమిషనర్ పూర్తి రక్షణ కల్పించాలి.
*మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ పాత్రపై ప్రభుత్వం విచారణకు ఆదేశించాలి.
Courtesy / Source by : hrf Hyderabad unit 

Tuesday, January 2, 2024

కాళేశ్వరం ప్రాజెక్టు పై జుడిషల్ విచారణ

As per our promise on the Kaleshwaram project... we will start the judicial inquiry this week itself.

కాళేశ్వరం ప్రాజెక్టు పై మేము ఇచ్చిన మాట ప్రకారం జుడిషల్ విచారణ ఈ వారంలోనే మొదలు పెడతాం.
    -- మంత్రి, ఉత్తమ్ కుమార్ రెడ్డి.
📍 సెక్రటేరియట్ మీడియా పాయింట్

*స్వాతంత్రం తరువాత సాగునీటి ప్రాజెక్టులకు కార్పొరేషన్ నిధులు ఇవ్వలేదు.
*బ్యాంక్ లు, రూరల్ ఎలాక్ట్రిఫిషల్ ద్వారా లోన్స్ కాళేశ్వరం ప్రాజెక్టు కు కేంద్రం ఇప్పించింది.
* కిషన్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ పై చేసిన వ్యాఖ్యలు సత్యదూరంగా ఉన్నాయి.
* బీజేపీ - BRS పదేళ్ల పాటు కలిసి పనిచేసి ... కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పది రోజుల కాలేదు అప్పుడే మాపై బురద జల్లుతున్నారు.
* కాళేశ్వరం ప్రాజెక్టు కు మద్దతు ఇచ్చింది కేంద్ర బీజేపీనే.
* పవర్, ఇరిగేషన్ కార్పొరేషన్ కు నిబంధనలు మార్చి బీజేపీ లోన్స్ BRS ప్రభుత్వానికి లోన్స్ ఇచ్చింది.
* 1లక్ష 27వేల కార్పొరేషన్ పేరుతో కేంద్రం రాష్ట్రానికి లోన్ ఇచ్చింది.
* ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కే 60వేల లోన్స్ బీజేపీ ఇచ్చింది.
* BRS - BJP కలిసి దోచుకుందాం అని లక్షల కోట్లు ఇచ్చారా?
* మేడిగడ్డ 5 పిట్లు కుంగితే కనీసం కిషన్ రెడ్డి పరిశీలన చెయ్యలేదు.
* కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ చేసిన కాళేశ్వరం కుంగితె ఎందుకు విసిట్ చెయ్యలేదు?
* మేడిగడ్డ పై కేసీఆర్ స్పందించకపోతే కిషన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదు?
* ఎవరు తప్పులు చేసినా వదిలిపెట్టం.
* 80వేల కోట్ల ప్రాజెక్ట్ ను 1లక్ష 27వేల కోట్లకు పెంచితే కేంద్రం ఎందుకు అనుమతి ఇచ్చింది?
* CBI - ED అని ఎదేదో అని కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు?
* ప్రతిపక్ష నాయకుల పై తప్పు చేయకున్నా ED కేసులు వేసిన బీజేపీ కేసీఆర్ పై ఎందుకు వెయ్యలేదు?
* కాళేశ్వరం కేసీఆర్ ఏటీఎం అనే అమిత్ షా, మోడీ, నాడ్డ పదే పదే అంటారు..మరి ఎందుకు విచారణకు అదేశించలేదు?
* లిక్కర్ కేసులో కవిత పై ఎందుకు చర్యలు తీసుకోలేదు?
* పదేళ్ల పాటు లక్షల కోట్లు BRS వాళ్ళు తిన్నారు అని బీజేపీ ఆరోపణ చేసింది మరి సీబీఐ విచారణ ఎందుకు  చెయ్యలేదు?
* మేడిగడ్డ డ్యామేజ్ పై ఖర్చు అంతా పూర్తిగా సంస్థనే భరిస్తుంది.
* ఇరిగేషన్ పై త్వరలోనే శ్వేత పత్రం విడుదల చేస్తాం.
*బీజేపీ - BRS కలిసి 3500 రోజులు పని చేశారు.
*ఇరిగేషన్ లో అవినీతి బీజేపీ - BRS కలిసి చేశాయి.

#Uttam @UttamINC

https://twitter.com/Congress4TS/status/1742186646651777197?t=ygg4RAHSCls1ez-danJKXA&s=19

సీఎం గారు మూసీ నది అభివృద్ధిపై సమీక్షా సమావేశం

మూసీ నది అభివృద్ధిపై నానక్ రామ్ గూడలోని @HMDA_Gov కార్యాలయంలో అధికారులతో సీఎం శ్రీ @Revanth_Anumula గారు సమీక్ష నిర్వహించారు.

మునిసిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ దానకిషోర్, HMDA జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ శ్రీమతి ఆమ్రపాలి, సీఎం ఓ.ఎస్.డి శ్రీ అజిత్ రెడ్డి, ఇతర అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

https://twitter.com/TelanganaCMO/status/1742202507466867066?t=fHSuhOE65R6HS6T5yVtqVA&s=19

రెవిన్యూ శాఖలోని అవినీతి అధికారుల భరతం పట్టాలి

*రెవెన్యూ శాఖను బలోపేతం చేయండి : సీఎం రేవంత్ రెడ్డిని కోరిన ట్రెసా* https://www.dishadaily.com/telangana/tresa-asked-cm-revanth-reddy-to-strengthen-the-revenue-department-285328 
 
*****---*****---*****                                                                                                      _*'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'*_                        _*#ప్రజాస్వామికతెలంగాణ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి సారు & 'ట్రెసా' ప్రతినిధులు ముందుగాళ్ళ చేయాల్సింది #తెలంగాణరెవిన్యూ శాఖలోని అవినీతి అధికారుల భరతం పట్టాలి.ఎందుకంటే ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం రెవిన్యూ కార్యాలయాల చుట్టూ సంవత్సరాలతరబడి తిరిగినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.#RTIA కు సరి అయిన స్పందన ఉండదు. చట్టాలను గౌరవించరు.ఇక ముఖ్యమైన అంశం 'రైతుల ఆత్మహత్యలు' ఇలాంటి పరిస్థితులు 2014 నుంచి డిసెంబర్ 3,2023 వరకు కొనసాగాయి #తెలంగాణ లో కావున ఇప్పటినుండి #తెలంగాణరెవిన్యూ అధికారులు & సిబ్బంది #రాజ్యాంగం ను గౌరవిస్తూ ప్రజాప్రయోజనాలకోసం ప్రజలకు జవాబుదారీతనంగా విధులు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.*_                                                                                                                               *@Bhatti_Mallu @mpponguleti @UttamINC @KomatireddyKVR @seethakkaMLA @PonnamLoksabha @DamodarCilarapu @KondaSurekha @dr_mvreddy @KVishReddy @ProfKodandaram  @RamsGTRK*                                                               
 *Bplkm🪶*                                                    *Bapatla Krishnamohan*
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (Twitter)
https://youtube.com/channel/UCO3m8P1ULX6soj73A43nhMg   (youTube)
https://prajasankalpam1.blogspot.com/      prj_snklpm9456 (Instagram)

Monday, January 1, 2024

మెట్రో కానీ , ఫార్మాసిటీ కానీ రద్దు చెయ్యడం లేదు-సీఎం రేవంత్ రెడ్డి

Metro and Pharmacy are not cancelled.
   -- CM Revanth Reddy, Chit Chat at Secretariat👇

మెట్రో కానీ , ఫార్మాసిటీ కానీ రద్దు చెయ్యడం లేదు.
  -- సీఎం రేవంత్ రెడ్డి , చిట్ చాట్ సచివాలయం👇

👉 మెట్రో కానీ , ఫార్మాసిటీ కానీ రద్దు చెయ్యడం లేదు.
👉 ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్ట్రీమ్ లైన్ చేస్తున్నా.
👉 ఎయిర్ పోర్టుకి ముందు ప్రభుత్వం ప్రతిపాదించిన రూట్లతో పోలిస్తే 
దూరం తగ్గిస్తాం.
👉 BHEL నుంచి ఎయిర్పోర్ట్ వరకు 32 కిలోమీటర్లు వస్తుంది 
👉 ఎంజిబిఎస్ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రో ఉంటుంది.
👉 నాగోల్ నుంచి ఎల్బీ నగర్, ఓఎస్ హాస్పిటల్  మీదుగా చాంద్రాయణ్ గుట్ట
వద్ద ఎయిర్పోర్టుకి వెళ్లే మెట్రో లైన్ కి లింక్ చేస్తాం.
👉 మియాపూర్ నుంచి అవసరమైతే రామచంద్ర పురం వరకు మెట్రో పొడిగిస్తాం.
👉 అవసరమైతే మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రో ని ఫైనాన్సిల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగిస్తాం.
👉 గచ్చిబౌలి ఏరియా నుంచి ఎయిర్పోర్టు కి మెట్రో వెళ్లేవారు దాదాపు ఉండరు. 
👉 మేము కొత్తగా ప్రతిపాదిస్తున్న మెట్రో లైన్స్ ముందు ప్రభుత్వం ప్రతిపాదించిన మొత్తం కంటే తక్కువ అవుతుంది.
👉 ఫార్మాసిటీ ని అంచలంచలుగా రింగ్ రోడ్ రీజినల్ రింగ్ రోడ్ మధ్య ప్రత్యేకంగా క్లస్టర్లను ఏర్పాటు చేస్తాము.
👉 జీరో కాలుష్యంతో ఈ క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం.
👉 అక్కడనే అక్కడి పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళకి గృహనిర్మాణం కూడా ఉంటుంది 
👉 అక్కడి వాళ్ళు ఎవ్వరు కూడా హైదరాబాద్ వరకు రాకుండా అన్ని ఏర్పాట్లు ఉండేట్లు క్లస్టర్లు ఉంటాయి.
👉 గతంలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని స్టేట్ గెస్ట్ హౌస్ గా మారుస్తాం.
👉 యువతకు అవసరమైన స్కిల్స్ పెంచేందుకు ప్రత్యేక విశ్వవిద్యాలయాలు 
ఏర్పాటు.
👉 అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు కలిగిన ....ప్రముఖ పేరున్న పారిశ్రామిక వేత్తల ద్వారా ఈ స్కిల్స్ పై శిక్షణ ఉంటుంది.
👉 సాధారణ డిగ్రీలకు ఉండే అర్హతలన్నీ ఉంటాయి ....స్కిల్స్ అదనంగా ఉంటాయి.
👉 అక్కడ నుంచి బైటకి వెళ్ళేవాళ్ళకి క్యాంపస్ లోనే ఎంపిక ఉంటుంది.
👉 ఇప్పటికే అధికారాన్ని వికేంద్రీకరించాం.
👉 మంత్రులను ఉమ్మడి జిల్లాలకు ఇంచార్జి లుగా  బాధ్యతలు అప్పగించాం.
👉 100 బెడ్స్ ఆస్పత్రి ఉన్న చోట నర్సింగ్ కళాశాల ఉంటుంది.
👉 విదేశాలకు వెళ్లే యువతకు ఓరియంటేషన్ ఇప్పిస్తాం.
👉 ఆయాదేశాలకు అవసరమైన మాన్ పవర్ ను ప్రభుత్వం ద్వారా అందిస్తాం.
👉 ఇందువల్ల యువతకు ఉపాధి అవకాశాలు  మెరుగుపరుస్తాం.
👉 మన వద్ద పెద్ద సంఖ్యలో యువత ఉంది...వారికీ ఆసక్తి కలిగిన విభాగాల్లో శిక్షణ ఇప్పిస్తాం.
👉 చాలా మంది సీనియర్ అధికారులు ప్రావిణ్యం కలిగిన వారికి శిక్షణ ఇప్పించే 
అవకాశం ఉంది.
👉 3వ తేదీన పీసీసీ విస్తృతస్థాయి సమావేశం ఉంది.
👉 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పదవులు ఇస్తాం.
👉 పార్టీ కోసం పనిచేసిన వారితో నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తాం.
👉 నాకు దగ్గరనో భందువులనో పదవులు ఇచ్చేది ఉండదు.
👉 నేను ఏది చేసినా విస్తృతస్థాయి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పదవులు భర్తీ చేస్తాం.
👉 పార్టీ కోసం పని చేసిన వారికీ పదవులు ఇస్తాం.👉 ప్రెస్ అకాడమీ చైర్మన్ భర్తీ చేసిన తర్వాత జర్నలిస్టుల సమశ్యలు పరిష్కరిస్తాం.

👉 హైదరాబాద్ కమిషనరేట్ల కమిషనర్లను నియమించా ....వారికి అవసరమైన మాన్ పవర్ ను వాళ్ళే పిక్ చేసుకుంటారు.
👉 శాఖలకు ప్రతిభ కలిగిన అధిపతులను నియమించడం వరకు నేను చూస్తా.
👉 వాళ్ళ పరిధిలో అవసరమైన అధికార్లను నియమించుకుని యంత్రాంగం సక్రమంగా పనిచేసేట్లు చూసుకోవాలి.
👉 అధికార్ల నియామకాల్లో సామాజిక న్యాయం కూడా జరిగేట్లు చూస్తాం.
👉 సంస్కరణలు తీసుకొచ్చి స్ట్రీమ్ లైన్ చేసే పనిలో ఉన్నా.
👉 నా వద్ద చెప్పేది ఒకటి చేసేది ఒకటి
ఉండదు.
👉 జర్నలిస్టులకు సంభందించి సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తాం.
👉 ఇప్పటి నుంచి వంద రోజుల్లో పరిష్కరిస్తాం.

#RevanthReddy @revanth_anumula