Wednesday, February 4, 2026

మిర్యాల‌గూడా ప్ర‌జా పాల‌న ప్ర‌గ‌తిబాట బ‌హిరంగ‌స‌భ‌లో సీఎం రేవంత్ రెడ్డి గారి స్పీచ్ పాయింట్స్..

మిర్యాల‌గూడా ప్ర‌జా పాల‌న ప్ర‌గ‌తిబాట బ‌హిరంగ‌స‌భ‌లో సీఎం రేవంత్ రెడ్డి గారి స్పీచ్ పాయింట్స్..

తెలంగాణ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో  గెలుపు న‌కు విజ‌య‌సూచిక గా వేలాది మంది త‌ర‌లివ‌చ్చారు.. 

స‌భ‌లో ఆడ‌బిడ్డలు ఉత్సాహంగా పాల్గొన‌డం చూస్తే మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఎదురులేద‌న్న విశ్వాసం క‌నిపిస్తోంది.. 

ఈ ప్ర‌భుత్వం గిరిజునులు, పేద‌లు, ఆదివాసీలు, నిరుద్యోగులు, మ‌హిళ‌లు , మైనార్టీల కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాలు తీసుకువ‌చ్చింది..

మా ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను చూసి మున్సిపల్ ఎన్నిక‌ల్లో తీర్పు ఇవ్వాలి.. 

తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత గ‌త ప్ర‌భుత్వం క‌నీసం రేష‌న్ కార్డులు ఇవ్వ‌లేదు.. 

ప్ర‌జా ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ల‌క్ష‌లాది మందికి రేష‌న్ కార్డులు ఇచ్చాం..

మూడు కోట్ల ప‌ది ల‌క్ష‌ల మందికి స‌న్న బియ్యం ఇస్తున్నాం.. 

గ‌త ప్ర‌భుత్వం ఇచ్చిన దొడ్డు బియ్యం బ‌ర్రెల‌కు ధానా పెట్ట‌డానికి ఉప‌యోగ‌ప‌డ్డాయి.. 

బుక్కెడు బువ్వ తిన‌డానికి ఉప‌యోగ‌ప‌డ‌లేదు..

మా ప్ర‌భుత్వం ఇస్తున్న స‌న్న బియ్యం పేద‌వారికి చేరాయి.. 

స‌న్న బియ్యం తో వండుకుని తింటున్న వారంద‌రూ కాంగ్రెస్ కు ఓటు వేయాలి.. 

ప్ర‌తి ఇంటికి రెండు వంద‌ల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.. ఇళ్ల‌లో వెలుగులే కాదు మీ క‌ళ్ల‌లో సంతోషం చూస్తున్నాం.. 

వ్య‌వ‌సాయానికి ఉచిత విద్యుత్ తో పాటు ఇళ్ల‌కు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.. 

రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ మిర్యాల‌గూడా.. 

మిర్యాల‌గూడా లో అత్య‌ధికంగా వ‌రి పండుస్తున్నారు..

గ‌తంలో ఆ నాటి సీఎం వ‌రి వేసుకుంటే ఉరే అన్నాడు..

 మా ప్ర‌భుత్వం వ‌చ్చాక స‌న్న వ‌డ్లు పండిస్తే 500 రూపాయ‌ల బోన‌స్ ఇస్తున్నాం.. 

బోన‌స్ తీసుకుంటున్న అత్య‌ధిక ల‌బ్దిదారులు మిర్యాల‌గూడాలోనే ఉన్నారు.. 

రైతు భ‌రో సా కింద ప్ర‌తి ఎక‌రాకు 6 వేల రూపాయ‌లు ఇస్తున్నాం....9 రోజుల్లోనే 9 వేల కోట్లు రైతుల‌కు ఇచ్చాం..

మున్సిప‌ల ఎన్నిక‌లు ముగియ‌గానే రైతు భ‌రోసా ఇస్తాం.. 

త్వ‌ర‌లోనే రైతు భ‌రోసా కింద నే తొమ్మిది వేల కోట్ల ఇస్తాం.. 

 రైతుల కోసం ఇప్ప‌టి వ‌ర‌కు మా ప్ర‌భుత్వం ల‌క్షా ప‌దివేల కోట్లు ఖ‌ర్చు చేసింది... 

తెలంగాణ‌లో ఆడ‌బిడ్డ‌ల‌కు ఆర్టీసీలో ఉచిత‌ప్ర‌యాణం క‌ల్పించాం.. .

కోట్లాది మంది ఆడ బిడ్డ‌లు అమ్మ‌గారి ఇంటికైనా, అమ్మ‌వారి గుడి కైనా ఉచితంగా వెళ్లున్నారు..

ఆర్టీసీలో ఉచిత ప్ర‌యాణం చేసిన మ‌హిళ‌లు కాంగ్రెస్ కు ఓటేస్తే బీజేపీ, బీఆర్ఎస్ కు వాళ్ల‌కు డిపాజిట్లు రావు.. 

బీఆర్ఎస్, బీజేపీ త‌రుపున పోటీ చేస్తున్న మ‌హిళా అభ్య‌ర్థుల‌కు కూడా ఉచిత ప్ర‌యాణం క‌ల్పిస్తున్నాం. 

బీఆర్ఎస్ నాయ‌కుల‌కు అన్ని సంక్షేమ కార్య‌క్ర‌మాలు ఇస్తున్నాం..ఎక్క‌డా వివ‌క్ష చూపించ‌లేదు.. 

బీఆర్ఎస్ నాయ‌కుల పిల్ల‌లు కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ స్కూల్ లో చ‌దువు కోవ‌చ్చు.. 

రాష్ట్రంలో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ స్కూల్స్ నిర్మిస్తున్నాం.. 

వైఎస్ ముఖ్య‌మంత్రి గా ఉన్న‌ప్పుడు 25 ల‌క్ష‌ల ఇందిర‌మ్మ ఇళ్లు క‌ట్టించాం.. 

డ‌బుల్ బెడ్రూం ఇళ్లు క‌ట్టిస్తామ‌ని కేసీఆర్ ఆనాడు ఊరించాడు.. 

ప‌దేళ్లు సీఎంగా ఉండి ఫామ్ హౌస్, ప్ర‌గ‌తి భ‌వ‌న్ క‌ట్టుకున్నాడు.. 

ఏ పేద‌వాడికి ఇళ్లు క‌ట్టి ఇవ్వాల‌న్న‌ ఆలోచ‌న బీఆర్ఎస్ చేయ‌లేదు..

ప్ర‌జా ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే 4.50 ల‌క్ష‌ల ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు చేశాం..

ద‌ళారులు, ద‌గా లేకుండా నేరు గా ల‌బ్దిదారుల ఎకౌంట్ లోనే డ‌బ్బులు వేస్తున్నాం.. 

ప్ర‌తి ఎమ్మెల్యే  మాకు మ‌రిన్ని ఇందిర‌మ్మ ఇళ్లు ఇవ్వాల‌ని కోరుతున్నారు.. 

వ‌చ్చే బ‌డ్జెట్ లో కొత్త‌గా ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు చేయ‌బోతున్నాం..

న‌ల్గొండ జిల్లా ప్లోరైడ్ ప్రాంతం..  ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం గ‌తంలో దొర‌క‌లేదు.. 

న‌ల్గొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల‌న్ని కాంగ్రెస్ పార్టీ క‌ట్టిన‌వే.. 

ఎస్ ఎల్ బీసీ 30 కిలో మీట‌ర్ల ట‌న్నెల్ ను గ‌త కాంగ్రెస్ ప్ర‌భుత్వం తొవ్వింది..

న‌ల్గొండ జిల్లా పైన కోపం ,విషంతో ఎస్ ఎల్ బీసీ ని పూర్తి చేయ‌లేదు.. 

ఎస్ ఎల్ బీసీ ని రెండేళ్ల‌లో పూర్తి  చేయ‌డానికి ముందుకు వ‌చ్చాం.. కాని అనుకోని ప్ర‌మాదం జ‌రిగి 8 మంది చ‌నిపోయారు.. 

ఎస్ ఎల్ బీసీలో 8 మంది చ‌నిపోతే మామ‌, అల్లుడు, బామ్మ‌ర్థి  సంతోష ప‌డ్డారు..

 క‌డుపులో విషం పెట్టుకున్న‌వాళ్లు మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో త‌మ‌కు ఓటు వేయ‌మ‌ని ఎలా అడుగుతారు.. 

సిగ్గులేకుండా గంగిరెద్దుల్లా ఇంటి ముందుకు వ‌స్తే క‌ర్రు కాల్చి వాత పెట్టండి.. 

గంజికి గ‌తి లేని వాళ్లు బెంజ్ కార్లు కొన్నారు..అదంతా మందిని ముంచిన‌దే.. 

న‌ల్గొండ జిల్లా ప్ర‌జ‌లు కాంగ్రెస్ కు అండ‌గా నిల‌బ‌డాలి.. 

రెండేళ్లో 70 వేల ఉద్యోగాలు ఇచ్చాం..రైతు రుణ‌మాఫీ చేశాం..రైతు భ‌రోసా ఇచ్చాం.. నాలుగున్న‌ర ల‌క్ష‌ల ఇందిర‌మ్మ ఇళ్లు ఇచ్చాం.. 1000 బ‌స్సుల‌కు మ‌హిళ‌ల‌ను య‌జ‌మానులను చేశాం.. 

మ‌హిళా సంఘాల‌తో పెట్రోల్ బంకులు పెట్టించాం..

25 వేల కోట్ల ను సున్నా వ‌డ్డీకి మ‌హిళా సంఘాల‌కు ఇచ్చాం..

ప్ర‌జా ప్ర‌భుత్వం వ‌ల్ల‌నే ఇది సాధ్యం అయింది.. 

ప‌దేళ్లు అధికారంలో ఉండి తెలంగాణ‌ను దోచుకున్నారు...

పెళ్లం మొగుడు మాట్లాడుకుంటే ఫోన్లు విన్న‌రు..

జ‌ర్న‌లిస్టులు, సినిమా తార‌లు, జ‌డ్జీలు ..ఎవ‌రిని వ‌ద‌ల‌కుండా ఫోన్లు విన్నారు..

అన్నం తినే వాల్లు ఎవ‌ర‌రైనా పెళ్లాం మొగుడు మాట్లాడుకుంటే వింటారా..? 

కొంత మంది జాతిపిత‌ను విచారిస్తారా అని అడుగుతున్నారు.. 

 ఎవ‌రికి రా నువ్వు జాతి పిత వు... నీ జాతికి నువ్వు పిత కావొచ్చు.. మాకు కాదు..

పెళ్లాం మొగుడు జోలి పెట్టుకుంటే విన్న‌ స‌న్నాసి నువ్వు జాతిపిత‌వా.. 

సిగ్గుతో త‌ల‌దించుకోవాలి మీరు.. 

కేసీఆర్, కేటీఆర్, హ‌రీష్ రావు ను మొఖాల‌కు ముసుగు తొడిగి విచార‌ణ‌కు పోలీసులు తీసుకువ‌చ్చేది ఉండే.. 

జాతిపిత అయితే మీరు సంపాదించుకున్న ఆస్తులు తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఇస్తారా..?

కేటీఆర్ జ‌న్వాడ ఫామ్ హౌస్ , కేసీఆర్ ఎర్ర‌వల్లి ఫామ్ హౌస్ , హ‌రీష్ రావు మోయినా బాద్ ఫామ్ హౌస్ , టీవీలు, ఫేప‌ర్లు, వేల కోట్లు తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఇస్తారా..

సీఎం, మంత్రి, ఎమ్మెల్యే అన్ని ప‌ద‌వులు మీరే తీసుకున్నారు.. 

తెలంగాణ కోసం ప్రాణ‌త్యాగం చేసిన‌ శ్రీకాంతాచారి  త‌ల్లి శంక‌ర‌మ్మ‌కు చిన్న ప‌ద‌వి కూడా ఇవ్వ‌లేదు..

తెలంగాణ కోసం స‌ర్వం త్యాగం చేసిన‌ ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ జాతి పిత అవుతడు..

 ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కాంగ్రెస్ పార్టీ మొత్తం పోయినా తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ను నేర‌వేర్చిన  సోనియ‌మ్మ తెలంగాణ త‌ల్లి అవుతుంది.. 

లుచ్చా, స‌న్నాసి , దొంగ నువ్వెలా జాతి పిత అవుతావు..  తెలంగాణ ప్ర‌జ‌ల‌కు మీరు క్ష‌మాప‌ణ చెప్పాలి..

న‌క్క జిత్తుల భాస్క‌ర్ రావు మిర్యాల‌గూడాలో ఉన్నాడు..

జానారెడ్డి చెప్పులు మోసిన‌వాడు.. నీళ్ల సీసాలు మోసిన‌వాడు  భాస్క‌ర్ రావు..

మిర్యాల‌గూడా లో కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు గెలిపిస్తే ఆత్మ‌గౌర‌వాన్ని ఎర్ర‌వెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ పాదాల ద‌గ్గ‌ర పెట్టాడు..

మా అభ్య‌ర్థుల‌ను బెదిరిస్తే భాస్క‌ర్ రావు..నీకు చింత పండు అవుతుంది.... 

కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు ఎవ‌రూ భ‌య‌ప‌డొద్దు.. 

జానారెడ్డిని ఓడించ‌డానికి భాస్క‌ర్ రావు ఇంటింటికి తిరిగాడు.. 

న‌ల్గొండ జిల్లాలో 18 మున్సిపాలిటీల్లో విజ‌యంపైన నాకు న‌మ్మ‌కం ఉంది. 

తెలంగాణ‌లో అన్ని మున్సిపాలిటీలు గెల‌వాలి..

తెలంగాణ‌లో మున్సిపాలిటీల్లో 17,472 కోట్లు ఖర్చు పెట్టాం..

న‌ల్గొండ జిల్లా మున్సిపాలిటీల్లో 2028 కోట్లు ఖ‌ర్చు పెట్టాం.. 

మిర్యాల‌గూడ మున్సిపాలిటీలో  295 కోట్ల ఖ‌ర్చు చేశాం..

మున్సిప‌ల్ శాఖ నా ద‌గ్గ‌రే ఉంది.. మున్సిపాలిటీల అభివృద్ధి నా బాధ్య‌త‌.. 

వ‌డ్డించే వాడు మ‌న‌వాడు..అలాగే అడిగే వాడు మ‌న వాడు ఉండాలి.. మ‌నోడు అయి ఉండాలి..  

ఇంకా 8 ఏళ్లు అధికారంలో ఉంటాం.. మున్సిపాలిటీల‌ను అద్దంలా తీర్చిదిద్దుతాం.. 

కాంగ్రెస్ గెలిస్తే పేద‌వాడు గెలిచిన‌ట్లు..

అభివృద్ధి జ‌ర‌గాలంటే అధికార పార్టీ గెల‌వాలి.. 

గ‌తంలో ఇచ్చిన‌ బ‌తుక‌మ్మ చీర‌లు దేనికైనా ప‌నికి వ‌చ్చాయా..?  సారె పెట్టిన‌ట్లుగా ఆడ‌బిడ్డ‌లు ఇందిర‌మ్మ చీర‌లు క‌ట్టుకుని వ‌చ్చారు 

జ‌మ్మికి వ‌చ్చిన పాల‌పిట్ట‌ల్లా ఇందిర‌మ్మ చీర‌ల్లో ఆడ‌బిడ్డ‌లు క‌నిపిస్తున్న‌రు.. 

ఓటేసే ముందు  స‌న్న‌బియ్యం, రేష‌న్ కార్డు, రైతు భోరోసా,రుణ‌మాఫీ, బ‌స్సు ప్ర‌యాణం, 70 వేల ప్ర‌భుత్వ ఉద్యోగాలు , ఇందిర‌మ్మ ఇళ్ల‌ను గుర్తు చేసుకోండి.. 

ఈ ప్ర‌భుత్వాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్య‌త మీది.. 

123 మున్సిపాలిటీల పైన కాంగ్రెస్ జెండా ఎగురుతుంది...

Monday, February 2, 2026

*_కేసీఆర్, బీఆరెస్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్_*

BREAKING 

కేసీఆర్, బీఆరెస్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ 

➡️తెలంగాణ జాతిపిత అని కొందరు వాళ్లకు వాళ్లే రాసుకుంటున్నారు 
➡️ఉద్యమకారులం అని వాళ్లే చెప్పుకుంటున్నారు 
పోలీసులు చిన్న నోటీసులు ఇస్తే జాతిపితకు నోటీసులు ఇస్తారా అంటున్నారు 
➡️ఆనాడు జాతిపిత గాంధీజీ పదవులను త్యాగం చేసి దుర్మార్గుల తూటాలకు ప్రాణాలు వదిలారు 
మరి ఇప్పుడు జాతిపిత అని చెప్పుకుంటున్న వాళ్లు ఏం చేశారు?
➡️తెలంగాణ ఉద్యమకారులను ఏకం చేసి ఉద్యమాన్ని నడిపించిన ప్రొఫెసర్ కోదండరాం ఉద్యమకారుడు కాదా? 
➡️ఆనాడు తలుపులు బద్దలు కొట్టి ఆయన్ను అరెస్టు చేసింది మీ పాలనలో కాదా.. అప్పుడు ఉద్యమకారులు గుర్తుకురాలేదా? 
➡️పోలీసులు మిమ్మల్ని అలా తలుపులు బద్దలు కొట్టి తీసుకురాలేదు కదా… నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు 
➡️రావి నారాయణ రెడ్డి లాంటి వారు తెలంగాణ కోసం సర్వం కోల్పోయారు 
➡️పదవులు, వేలకోట్ల ఆస్తులు సంపాదించుకున్న మీరు ఉద్యమకారులు ఎలా అవుతారు 
➡️ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినప్పుడు అర్థం చేసుకోవాలీ.. హుందాగా తప్పుంటే కొంతైనా మీ గౌరవం నిలబడేది 
➡️ప్రజలే తప్పు చేశారని చెప్పడం.. ఇదెక్కడి ప్రజాస్వామ్యం, ఇదెక్కడి ఉద్యమకారుడి లక్షణం, ఇదెక్కడి జాతిపిత లక్షణం 
➡️అక్రమ మార్గం ఎంచుకున్న వారు ప్రజాస్వామ్యంలో విచారణ ఎదుర్కోవాల్సిందే అని అంబేద్కర్ చెప్పారు 
➡️శిబు సోరెన్ లాంటి వాళ్లు విచారణ ఎదుర్కొన్నారు 
➡️మనమేం దైవాంశ సంభూతులం కాదు 
➡️మధ్య యుగాల చక్రవర్తులు తమ బాధను రాజ్యం బాధగా ప్రచారం చేసేవారు 
➡️మధ్య యుగాల చక్రవర్తులకు కాలం చెల్లింది 
➡️ప్రజాస్వామ్యంలో తప్పు చేసినవారు విచారణ ఎదుర్కోవాల్సిందే

Tuesday, January 27, 2026

*_అక్రెడిటేషన్ల జీవోను సమూలంగా సవరించాలి_*



*అక్రెడిటేషన్ల జీవోను సమూలంగా సవరించాలి*
*ప్రెస్' స్టిక్కర్ నిబంధన తొలగించండి* 
*-మంత్రి ని, స్పెషల్ కమీషనర్ ను కలిసిన టీడబ్ల్యూజేఎఫ్ నేతలు*

హైదరాబాద్, జనవరి 27: మీడియా అక్రెడిటేషన్ల జీవో 252ను సవరించడం పట్ల తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర సమాచార పౌరసంబధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్పెషల్ కమీషనర్ సీహెచ్ ప్రియాంక లకు కృతజ్ఞతలు తెలిపారు. ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య, రాష్ట్ర కో-కన్వీనర్లు తన్నీరు శ్రీనివాస్, కుడుతాడు బాపురావు, హైదరాబాద్ జిల్లా కన్వీనర్ రవి కుమార్, నాయకులు శ్రీధర్, శ్రీనివాస్, రవికుమార్ తదితరులు  మంగళవారం సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని, సమాచార భవన్ లో కమీషనర్ ప్రియాంక ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. జీవో 252 సవరణ సమూలంగా జరగలేదని,  మరోసారి జీవోను పున:సమీక్షించి  సవరించాలని వారు కోరారు. జీవో
సవరణలో  కేబుల్ చానల్స్, నియోజకవర్గ స్థాయి రిపోర్టర్లకు న్యాయం జరగడం లేదని,  గతంలో  కేబుల్ ఛానల్స్ కు ఐఅండ్ పీఆర్ ద్వారా 12  రాష్ట్రస్థాయి అక్రెడిటేషన్ కార్డులు, నాలుగు జిల్లా స్థాయి అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చేవారని, ఈ విషయాన్ని తాము పలు తమరి దృష్టికి తీసుకువచ్చినప్పటికీ, సవరించిన జీవోలో కేబుల్ చానల్స్ అంశమే లేకపోవడం బాధాకరమని అన్నారు. యూనియన్ గా తమ అభిప్రాయాన్ని చెప్పినప్పటికీ కేబుల్ చానల్స్ విషయంలో, నియోజకవర్గ స్థాయిలో రిపోర్టర్లకు ఇచ్చే కార్డుల విషయంలో ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమని, అదే విధంగా ఎంపానల్మెంట్ లేని చిన్న, మధ్య తరహా పత్రికలకు గతంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఇచ్చినట్లు అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని, అదే విధంగా రెగ్యులర్ గా నడుస్తున్న పత్రికలను ఎంపానల్మెంట్ చేయాలని వారు మంత్రిని, కమీషనర్ ను కోరారు. 
*'ప్రెస్'స్టిక్కర్ నిబంధన తొలగించాలి*
అక్రెడిటేషన్ కార్డు ఉన్న జర్నలిస్టులు మాత్రమే తమ వాహనాలకు 'ప్రెస్' అని రాసుకోవాలంటూ జారీ చేసిన సర్క్యులర్ ను రద్దు చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య కోరారు. ఈ మేరకు ఆయన, పలువురు ఫెడరేషన్ నాయకులు మంగళవారం సమాచార పౌరసంబధాల శాఖ స్పెషల్ కమీషనర్ ప్రియాంక ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సర్క్యలర్... జర్నలిస్టులను, జర్నలిజం వృత్తిని అవమానించేదిగా ఉందని, జర్నలిస్టులకు కేవలం సంక్షేమ పథకాల కోసం గుర్తింపు కార్డుగా ఇచ్చే అక్రెడిటేషన్ కార్డును జర్నలిస్టుగా గుర్తించేందుకు ప్రామాణికం చేయడం తగదని, అక్రెడిటేషన్ కార్డు ఉన్న వారే తమ వాహనాలకు "ప్రెస్"అని రాసుకోవాలనే నిబంధన సరైంది కాదని, ఈ సర్క్యులర్ నిబంధన ఇటు జర్నలిస్టుల సమాజానికి,
అటు జర్నలిజం వృత్తి స్వేచ్ఛకు భంగం కలుగుతుందని మామిడి సోమయ్య కమీషనర్ తో అన్నారు.  రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చే అక్రెడిటేషన్ కార్డు కలిగి ఉన్న జర్నలిస్టులు మాత్రమే జర్నలిస్టులు కాదని, అక్రెడిటేషన్ కార్డు లేని జర్నలిస్టులు చాలా మంది ఉన్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 వేల మంది జర్నలిస్టులు వుండగా, వీరిలో సగం మందికి మాత్రమే ప్రభుత్వం అక్రెడిటేషన్ కార్డులు ఇస్తున్నదని, మిగతా సగం మంది జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు లేకుండా కేంద్ర ప్రభుత్వం ఆర్ ఎన్ ఐ (ప్రస్తుత పీ ఆర్ జీఐ) రిజిస్ట్రేషన్ పొందిన మీడియా సంస్థలు గుర్తింపు కార్డులతో పనిచేస్తున్నారని అన్నారు. 
ఎంపానల్మెంట్ లేని మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు ఉండవని, అంత మాత్రాన ఆ జర్నలిస్టులను జర్నలిస్టులే కాదనే విధంగా తమ వాహనాలకు ప్రెస్ స్టిక్కర్ పెట్టుకోవద్దంటూ ప్రభుత్వం నిబంధనలు విధించడం సరైంది కాదని అన్నారు. సమాజంలో  నకిలీ జర్నలిస్టులను కట్టడి చేయడానికి అనేక మార్గాలున్నాయని, ప్రత్యేక రూల్స్ ద్వారా నియంత్రించవచ్చని, అలాంటి చర్యలకు తామేమీ వ్యతిరేకం కాదని, కానీ ఆ పేరుతో అసలైన జర్నలిస్టులను అవమానించడం, అడ్డుకోవడం సరైంది కాదని అన్నారు. ఇప్పటికే అక్రెడిటేషన్ కార్డు లేని అనేక మంది జర్నలిస్టులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ నేపథ్యంలో తమరు జారీ చేసిన సర్క్యులర్ "మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు"గా అంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సర్క్యులర్ నిబంధన ను వెంటనే ఉపసంహరించాలని మామిడి సోమయ్య కోరారు. దీనిపై పునరాలోచన చేస్తామని, రవాణాశాఖ అధికారులతో చర్చిస్తానని కమీషనర్ ప్రియాంక హామీ ఇచ్చారు.

ఖమ్మం జిల్లా కలెక్టర్ సమాచార హక్కు చట్టాన్ని గౌరవిస్తున్నారా.?

బ్రేకింగ్ న్యూస్ :

*_ఖమ్మం జిల్లా కలెక్టర్,మున్సిపల్ కార్పొరేషన్,ఇరిగేషన్ కార్యాలయం,అర్బన్ తహశీల్దార్ కార్యాలయం వారికి సమాచార హక్కు చట్టం అంటే గౌరవం లేదు.._*

#RTIA ➡️ #violation 

#TelanganaRising ??

#telanganarising2047  ??

#RevanthreddyCM 

#ponguletisrinivasreddy

#IPRD_Telangana

@TelanganaCMO @Bhatti_Mallu @INC_Ponguleti @TummalaOfficial @CPRO_TGCM @IPRTelangana @PonguletiOffice @Collector_KMM @MC_Khammam @aclbkhammam @Khammam @Aadabtvlive @v6velugu @ShanarthiNews3 @eenadulivenews @ABNJyothyTV @myvaartha @NavatelanganaD @bigtvtelugu @BplplH 

https://x.com/Praja_Snklpm/status/2016061726677217791?t=4Z14bs6vKENF5Dk19Lnkwg&s=19

Monday, January 26, 2026

ప్రైవేట్ వ్యక్తలు గుప్పిట్లో తెలంగాణ పాలనా యంత్రాంగం!



*_ఇందిరమ్మ రాజ్యంలో "రాజ్యాంగేతర శక్తులు!"_*

👉మంత్రులు, ఎమ్మెల్యేల కంటే కూడా పవర్ ఫుల్! 
👉ఫైలు ఏదైనా, పైరవీలు ఏమైనా అన్నీ వారి కనుసన్నల్లోనే! 
👉ప్రైవేట్ వ్యక్తలు గుప్పిట్లో తెలంగాణ పాలనా యంత్రాంగం! 

*టెండర్లు, దందాలు రేవంత్ బామ్మర్ది సూదిని సృజన్ రెడ్డి!*

*షాడో హోం రేవంత్ రైట్ హ్యాండ్ వేం నరేందర్ రెడ్డి!*

*షాడో రెవెన్యూ రేవంత్ తమ్ముడు కొండల్ రెడ్డి!*

*షాడో సినిమాటోగ్రఫి రేవంత్ నమ్మినబంటు రోహిన్ రెడ్డి!*

*షాడో మున్సిపల్ రేవంత్ అనుచరుడు ఫయీం ఖురేషీ!*

*కొడంగల్ షాడో ఎమ్మెల్యే రేవంత్ అన్న తిరుపతి రెడ్డి!*

*విదేశీ పెట్టుబడుల వ్యవహారాలు రేవంత్ తమ్ముడు కృష్ణారెడ్డి!*

*ఫైరవీలు దందాలు రేవంత్ చిన్ననాటి దోస్త్ అనిల్ రెడ్డి!*

*సచివాలయంలో షాడో సీఎంగా ఓ మహిళా అంటూ కథనాలు!*

ప్రజాపాలనా, ఇందిరమ్మ రాజ్యంతో పేరుతో రాజ్యాంగేతరుల చేతుల్లో తెలంగాణ ప్రభుత్వ పాలన!
ప్రతిపక్షాలు ఆధారాలు బయటపెడుతున్నా మారని ప్రభుత్వ పెద్దల తీరు

*‘వాళ్లు చట్టసభకు వెళ్లలేదు. రాజ్యాంగం మీద ప్రమాణం చేయలేదు. ప్రభుత్వంలో ఎలాంటి చిన్న పదవులు కూడా లేవు. కానీ, వాళ్ల మాటే శాసనం.* వాళ్ల కన్ను పడందే టెండర్ దక్కదు. వాళ్ల అనుమతి లేనిదే ఫైలు కదలదు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ‘రాజ్యాంగేతర శక్తులు’ తెలంగాణ పరిపాలనా యంత్రాంగాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్నారన్న ఆరోపణలు ఇప్పుడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. అమృత టెండర్ల నుంచి సినిమా టికెట్ల సెటిల్మెంట్ల వరకు,  హైడ్రా కూల్చివేతల నుంచి భూముల కేటాయింపుల వరకు. అంతా ఈ ‘షాడో’ శక్తుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
Courtesy / Source by :
https://x.com/shankar_journo/status/2015960656676323799?t=T4axAws-IaWfzrgffY5EEQ&s=08

Monday, January 19, 2026

_NFC రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) వెడల్పు చేయాలి_

NFC రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) వెడల్పు పెంపు అవసరం కోసం మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారిని శామీర్ పేట లో వారి నివాసంలో కలిసిన వినతి పత్రం అందజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు
స్థానిక కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి గారు.

ఈ సందర్భగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ ఈ వంతెనను సుమారు 45 సంవత్సరాల క్రితం అప్పటి అవసరాలకు అనుగుణంగా నిర్మించారు.

ప్రాంతంలో జనాభా వేగంగా పెరగడం, కొత్త కాలనీలు విస్తరించడంతో ప్రస్తుతం ఈ వంతెన ట్రాఫిక్‌ను మోయలేకపోతోంది. ఇది హబ్సిగూడా నుండి ఈసీఐఎల్‌కు, బోడుప్పల్ నుండి ఈసీఐఎల్‌కు వెళ్లే ప్రధాన మార్గం కావడంతో రోజూ వేలాది మంది ప్రయాణికులు దీనిపై ఆధారపడుతున్నారు.

వంతెన వెడల్పు తక్కువగా ఉండడం వల్ల తీవ్రమైన ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి, స్థానిక ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, చిన్న పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల రోజువారీ జీవితం తీవ్రంగా ప్రభావితమవుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తక్షణ చర్యలు అవసరం.

ఈ పనుల కోసం ప్రత్యేక రైల్వే అభివృద్ధి ప్రణాళిక (SRDP) కింద నిధులు ఇప్పటికే విడుదలైనట్లు నా దృష్టికి వచ్చింది.
అందువల్ల, దయచేసి ఈ విషయాన్ని పరిశీలించి NFC రైల్వే ఓవర్ బ్రిడ్జి వెడల్పు పెంపుకు అనుమతి ఇవ్వగలరని మనవి. దీనివల్ల ప్రజలకు కలిగే ఇబ్బందులు తగ్గుతాయి అని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

_దోమల బెడద నుండి ప్రజలకు విముక్తి కలిగించండి జోనల్ కమిషనర్ గారు : కార్పొరేటర్ బన్నాల_

*హైకోర్టు కాలనీ హెచ్ఎంటి చెరువులోనీ గుర్రపు డెక్కని తొలగించండి : కార్పొరేటర్ బన్నాల* 

*దోమల బెడద నుండి ప్రజలకు విముక్తి కలిగించండి జోనల్ కమిషనర్ గారు : కార్పొరేటర్ బన్నాల* 

*చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ జిహెచ్ఎంసి  స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ ఈరోజు ఉప్పల్ జోనల్ కమిషనర్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ రాధిక గుప్తా గారిని కలిసి హైకోర్టు కాలనీ హెచ్ఎంటి నగర్ చెరువులో గుర్రపు డెక్క తో నిండి పోయిందని దానివల్ల విపరీతమైన దోమల తో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని వెంటనే గుర్రపు డెక్కను తొలగించే అన్ని చర్యలు చేపట్టాలని వినతి పత్రం సమర్పించడం జరిగింది* 

*అనంతరం కార్పొరేటర్ గీతా ప్రవీణ్ జోనల్ కమిషనర్ రాధిక గుప్తా గారితో మాట్లాడుతూ గతంలో ఎంటమాలజీ డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి మూడు నెలలకు ఒకసారి గుర్రపు డెక్కను తొలగించుటకు అన్నీ చర్యలు చేపట్టే వారుఅని, కానీ సెప్టెంబర్ మాసం నుండి ఎంటమాలజీ డిపార్ట్మెంట్ కనుమరుగ అయిందని, చెరువుల వైపు ఎంటమాలజీ డిపార్ట్మెంట్ కనీసం రావట్లేదని గతంలో యాంటీ లార్వా ప్రోగ్రాంను ఏర్పాటు చేసేవారని గుర్రపు డెక్కని ప్రతి మూడు నెలలకు ఒకసారి తొలగించేవారని ఇవన్నీ గత ఆరు నెలల నుండి జరగడంలేదని*, *విపరీతమైన దోమలతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పాలవుతున్నారని సాయంత్రం 5 దాటితే ప్రజలు వీధుల్లో నిలబడే పరిస్థితి లేదని ,వెంటనే గుర్రపు డెక్క తొలగించుటకు అన్నీ చర్యలు చేపట్టి ప్రజలకు దోమల నుండి ఉపశమనం కల్పించాలని కోరారు*. *జోనల్ కమిషనర్ గారు మాట్లాడుతూ వీలైనంత త్వరలో గుర్రపు డెక్కన్ తొలగించి అన్ని చర్యలు చేపడతానని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలక్కుండా చూసుకుంటానని హామీ ఇవ్వడం జరిగింది*.

*కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, సీనియర్ నాయకులు ఎద్దుల కొండలరెడ్డి, కోకొండ జగన్, ముద్ధం శ్రీనివాస్ యాదవ్, బాలకృష్ణ గౌడ్ ,ఎండి షఫీ, ఎండి హనీఫ్, శ్యాం, బాలు, సకినాల చందు మొదలగువారు పాల్గొన్నారు*