Friday, August 28, 2026

మీరాలం ట్యాంక్ ను పర్యాటకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాలి - సీఎం రేవంత్ రెడ్డి_

*మీరాలం ట్యాంక్ ను పర్యాటకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాలి - సీఎం రేవంత్ రెడ్డి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 27:

హైదరాబాద్ మీరాలం ట్యాంక్‌ను ప్రముఖ పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దే ప్రణాళికలో భాగంగా సాగుతున్న పనులను ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి అనుముల ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ సాగుతున్న పనులను ఒక్కొక్కటిగా పరిశీలించారు.అత్యుత్తమ డిజైన్లతో పర్యాటకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. కొనసాగుతున్న పనులపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన ద్వారా అధికారులు వివరించారు. ప్రణాళికలను పూర్తిగా పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి గారు అధికారులకు పలు సూచనలు చేశారు.నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ట్యాంక్ చుట్టూ జరుగుతున్న అభివృద్ధి పనులను ఓపెన్-టాప్ జీపులో ప్రయాణించి ఆ ప్రాంతాన్ని మొత్తంగా పరిశీలించారు. మీరాలం చెరువుపై నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జ్ పనులను భారీ క్రేన్ సహాయంతో పైకి వెళ్లి చూశారు.చెరువులోకి మురుగు నీరు చేరకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే చెరువు నుంచి మూసీలోకి వరద నీరు వెళ్లేలా నాలాను విస్తరించాలని చెప్పారు.పర్యాటకులు చెరువులో వాటర్ స్పోర్ట్స్ కోసం డిజైన్ చేయాలని, చెరువు మధ్యలో ఉన్న ఐలాండ్‌లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని చెప్పారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్నందున మీరాలం చెరువును, పరిసర ప్రాంతాలను పర్యాటకులకు ఆకట్టుకునేలా ఏర్పాట్లు జరగాలని సూచించారు.ముఖ్యమంత్రి గారి ఆకస్మిక పర్యటన సందర్భంగా మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఉన్నతాధికారులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

నకిలీ వైద్యుల ఉచ్చులో పడకండి అప్రమత్తంగా ఉండండి - హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఐపిఎస్_

*నకిలీ వైద్యుల ఉచ్చులో పడకండి అప్రమత్తంగా ఉండండి - హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఐపిఎస్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 27:

వైద్యం పేరిట అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యుల పట్ల ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కమీషనర్ సజ్జనార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా సజ్జనార్ మాట్లాడుతూ ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు కట్టుబడిన హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే కల్తీ ఆహారంపై ఉక్కుపాదం మోపుతున్నారు అని అన్నారు. 
తాజాగా నగరంలో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న నకిలీ వైద్యులపై ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది. 12 మంది నకిలీ వైద్యులను గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకున్నాం.ఎలాంటి విద్యార్హతలూ, కనీస వైద్య పరిజ్ఞానం లేని వీరు అసలైన వైద్యుల తరహాలోనే నటిస్తూ రోగులకు యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు, బీపీ, మధుమేహం మందులతో పాటు విచక్షణారహితంగా ఇంజెక్షన్లు, సెలైన్లు ఎక్కిస్తూ ఆరోగ్యాన్ని తీవ్ర ప్రమాదంలోకి నెడుతున్నారు.
అవగాహనారాహిత్యంతో రోజుల తరబడి మందులు వాడాలని సూచించడంతో ప్రజల ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి.ఇలాంటి మోసగాళ్లపై మా నిఘా, కఠిన చర్యలు కొనసాగుతుండగా.. ప్రజలు కూడా చికిత్స కోసం వెళ్లే ముందు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి.తాము వెళ్లే క్లినిక్‌లు, ఆసుపత్రుల రిసెప్షన్ వద్ద జిల్లా వైద్యారోగ్య శాఖ (DMHO) జారీ చేసిన అధికారిక రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను ప్రముఖంగా ప్రదర్శించారో లేదో గమనించాలి. 
అలాగే వైద్యుల బోర్డులపై పేరు, విద్యార్హతలతో పాటు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ (TSMC) కేటాయించిన రిజిస్ట్రేషన్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి. వైద్యుల వివరాలపై ఏమాత్రం సందేహం కలిగినా వెంటనే onlinetsmc.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి Doctor Searchలో పేరు లేదా రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేసి వారి వివరాలను సరిచూసుకోవచ్చు. అక్కడ వివరాలు కనిపించకపోతే వారు నకిలీలని గుర్తించాలి.చికిత్స విధానం లేదా సిబ్బంది ప్రవర్తనపై ఏమాత్రం అనుమానం వచ్చినా తక్షణం అర్హత గల ఇతర నిపుణులైన వైద్యుల వద్ద రెండో అభిప్రాయం (Second Opinion) తీసుకోవాలి. ఎక్కడైనా నకిలీ వైద్యులు చలామణి అవుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే ఆలస్యం చేయకుండా డయల్ 112కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేసి అమాయకుల ప్రాణాలను కాపాడాలని కోరుతున్నాను అని అన్నారు.

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై చర్యలు_

*సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై చర్యలు*  

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 27:

అంజయ్య నగర్ లో అక్రమ నిర్మాణం కూలి మనుషులు చనిపోయాక కళ్ళు తెరిచిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మరియు సిబ్బంది. అధికారుల పర్యవేక్షణ క్షేత్రస్థాయిలో ఉండడం లేదు అని అర్థం అవుతుంది. చైన్మాన్ సిబ్బంది నిద్దురపోతున్నారా ?.
ఇప్పుడు నిబంధనలు ఉల్లంగించిన అక్రమ నిర్మాణాలపై కొనసాగుతున్న చర్యలలో భాగంగా, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ CMC బృందాలు మూడు జోన్లలోనూ తనిఖీలు మరియు చర్యలను కొనసాగిస్తున్నాయి.

*ప్రస్తుతం నిబంధనలు ఉల్లంగించిన 54 అక్రమ నిర్మాణాలు గుర్తించబడ్డాయి అని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు.*

*(1)*: 21 భవనాలు కూల్చివేయబడ్డాయి.
*(2)*: 14 నోటీసులు జారీ చేయబడ్డాయి.
*(3)*: 1 అనధికృత నిర్మాణం స్వాధీనం చేసుకోబడింది.
*(4)*: తదుపరి కూల్చివేత చర్యల కోసం 33 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి

*జోన్ల వారీగా కూల్చివేతలు:*
*(1)*: శేరిలింగంపల్లి జోన్ – 9
*(2)*:  కూకట్‌పల్లి జోన్ – 6
*(3)*:  కుత్బుల్లాపూర్ జోన్ – 6

భవన నిర్మాణ నిబంధనల అమలును నిర్ధారించడానికి CMC బృందాలు క్షేత్రస్థాయిలో గుర్తింపు మరియు తనిఖీ చర్యలను కొనసాగిస్తాయి. గుర్తించిన అన్ని అక్రమ నిర్మాణాలపై, నిర్దేశిత విధానం మరియు వర్తించే నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాము అని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు.

Thursday, August 27, 2026

వార్త రాస్తే.. వేటాడతారా?!అవినీతిని ప్రశ్నిస్తే జర్నలిస్టులపై దాడులు చేస్తారా?_

*జర్నలిస్టు నేలపాటి రవిపై పాశవిక దాడి*

తలకు తీవ్ర గాయాలు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రవి

గురువారం రాత్రి కాపుకాచి దాడికి పాల్పడిన దుండగులు

*‘వెలుగులో లోన్ దందా’ కథనంతో కక్షగట్టారన్న ఆరోపణ*

*కర్రలు, ఇనుప రాడ్లు, కత్తులతో దాడి.. హత్య చేస్తామంటూ హెచ్చరికలు*

*దాడి వెనుక  పీసీ పల్లి వెలుగు అధికారుల హస్తం?!*

వార్త రాస్తే.. వేటాడతారా?!

అవినీతిని ప్రశ్నిస్తే జర్నలిస్టులపై దాడులు చేస్తారా?

దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

దాడి వెనుక అధికారుల ప్రేరేపణ ఉందన్న ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరపాలి

*తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం డిమాండ్*

*మార్కాపురం/కనిగిరి* : ప్రజా సమస్యలు, ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చే జర్నలిస్టులపై దాడులకు పాల్పడటం అత్యంత దారుణమని తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.
మార్కాపురం జిల్లా పీసీ పల్లి వెలుగు కార్యాలయంలో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై ‘వెలుగులో లోన్ దందా’ పేరుతో వార్త ప్రచురించినందుకు జర్నలిస్టు నేలపాటి రవిపై కొందరు వ్యక్తులు గురువారం రాత్రి కాపుకాచి కర్రలు, ఇనుప రాడ్లు, కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసినట్లు రవి ఆరోపించారు. ఈ దాడిలో ఆయన తలకు తీవ్ర గాయాలైనట్లు, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.

దాడి సమయంలో తనపై తీవ్రంగా దాడి చేయడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి వార్తలు రాస్తే చంపేస్తామని బెదిరించినట్లు రవి వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేసి దాడికి పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని సంఘం డిమాండ్ చేసింది.

వెలుగు కార్యాలయంలోని అక్రమాలను ప్రశ్నిస్తూ వార్త రాసినందుకే తనపై దాడి జరిగిందన్న రవి ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని సంఘం పేర్కొంది. జర్నలిస్టులు ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకలని, వార్తలు రాసినందుకు వారిపై భౌతిక దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని స్పష్టం చేసింది.

అదేవిధంగా, ఈ దాడి వెనుక వెలుగు శాఖకు చెందిన కొందరు అధికారుల ప్రేరేపణ ఉందన్న ఆరోపణలు కూడా వెలువడుతున్న నేపథ్యంలో సమగ్ర దర్యాప్తు జరిపి నిజానిజాలను నిగ్గు తేల్చాలని సంఘం డిమాండ్ చేసింది. ఆరోపణలు వాస్తవమైతే బాధ్యులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది.

దాడికి పాల్పడిన వ్యక్తులను గుర్తించి వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, దాడిని ప్రేరేపించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల పాత్రపై కూడా విచారణ జరపాలని సంఘం కోరింది. భవిష్యత్తులో జర్నలిస్టులపై ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, బాధిత జర్నలిస్టుకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది.
జర్నలిస్టులపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, జర్నలిస్టుల భద్రత కోసం అవసరమైన చర్యలు తీసుకునేలా అధికారులపై ఒత్తిడి తీసుకువస్తామని తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం స్పష్టం చేసింది.
SOURCE 

_నకిలీ వైద్యుల ఉచ్చులో పడకండి.. అప్రమత్తంగా ఉండండి - హైదరాబాద్ సిటీ పోలీస్ కమీషనర్ సజ్జనార్ ఐపిఎస్_

*_నకిలీ వైద్యుల ఉచ్చులో పడకండి.. అప్రమత్తంగా ఉండండి - హైదరాబాద్ సిటీ పోలీస్ కమీషనర్ సజ్జనార్ ఐపిఎస్*

https://youtu.be/8zPo_HhOS-4?si=8-zfI83Ki5Frazmt 

*వైద్యుల వివరాలపై ఏమాత్రం సందేహం కలిగినా వెంటనే onlinetsmc.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి Doctor Searchలో పేరు లేదా రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేసి వారి వివరాలను సరిచూసుకోవచ్చు. అక్కడ వివరాలు కనిపించకపోతే వారు నకిలీలని గుర్తించాలి.*

https://www.instagram.com/reel/DcicUbhqw6W/?igsi=aTNzMjQ2bzBjaDE0
               *****
https://www.facebook.com/share/p/1DF4SV1DsU/
               *****
https://x.com/Praja_Snklpm/status/2092903294918353358

గణేష్ ఉత్సవాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు – అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్, IPS_

*గణేష్ ఉత్సవాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు – అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్, IPS.*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 26:

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, పోలీసు అధికారులతో సమన్వయ సమావేశాన్ని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయ ఆడిటోరియంలో నిర్వహించారు.సెప్టెంబర్ 14 నుంచి 25వ తేదీ వరకు 12 రోజుల పాటు జరగనున్న గణేష్ ఉత్సవాలకు సంబంధించి గత ఏడాది ఏర్పాట్లు, ఎదురైన సమస్యలు, ఈ ఏడాది చేపట్టాల్సిన భద్రతా, మౌలిక వసతుల ఏర్పాట్లపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. గత ఏడాది సైబరాబాద్ పరిధిలో సుమారు 25,000 గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో, ఈ ఏడాది కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.
ఈ సమావేశం లో పోలీస్,  సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, రెవెన్యూ, హైడ్రా, ఆర్ అండ్ బీ, వైద్య ఆరోగ్య శాఖ, అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖ, జలమండలి, ఆర్టీసీ, టూరిజం తదితర శాఖల అధికారులు   పాల్గొన్నారు. 
ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్, ఐపీఎస్ మాట్లాడుతూ, గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గణేష్ విగ్రహాల ఏర్పాటు, నిమజ్జన తేదీ వంటి వివరాలను నిర్వాహకులు ముందుగానే స్థానిక పోలీసులకు తెలియజేయాలని, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే ప్రదేశాల్లో విగ్రహాలు, మండపాలు ఏర్పాటు చేయరాదని తెలిపారు. ప్రతి గణేష్ మండపం వద్ద నిర్వాహకులు 24 గంటలు అందుబాటులో ఉండడంతో పాటు, అవసరమైన సీసీ కెమెరాలు, అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
నిమజ్జన కార్యక్రమాలను సురక్షితంగా, సజావుగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల సమన్వయంతో నిమజ్జన ప్రాంతాల్లో అవసరమైన భద్రతా, అత్యవసర సేవలను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. నిమజ్జన మార్గాల్లో రోడ్ల మరమ్మతులు, అడ్డంకుల తొలగింపు, బ్యారికేడింగ్, లైటింగ్, పార్కింగ్, తాగునీరు వంటి ఏర్పాట్లతో పాటు అవసరమైన చోట సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిఘా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రజలు, గణేష్ మండప నిర్వాహకులు పోలీసులకు, ఇతర ప్రభుత్వ శాఖలకు పూర్తి సహకారం అందించి గణేష్ ఉత్సవాలను సురక్షితంగా, విజయవంతంగా నిర్వహించాలని సీపీ కోరారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన మాట్లాడుతూ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మూడు జోన్లకు చెందిన అధికారులు, సంబంధిత విభాగాల సిబ్బంది సమావేశంలో పాల్గొని గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించినట్లు తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, విగ్రహాల ఊరేగింపు, నిమజ్జనం జరిగే మార్గాలను ముందుగానే పరిశీలించి, ఆయా మార్గాల్లో పెండింగ్‌లో ఉన్న పనులను సకాలంలో పూర్తి చేసి అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు.
ప్రధానంగా రోడ్లపై గుంతల మరమ్మతులు, లైటింగ్, డ్రైనేజీ సిల్టింగ్, అవసరమైన చోట జనరేటర్ల ఏర్పాటు, ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు వంటి పనులను ప్రాధాన్యతగా చేపడతామని తెలిపారు. అలాగే, నిర్దేశిత ప్రాంతాల్లో తాత్కాలిక పారిశుద్ధ్య బృందాలను ఏర్పాటు చేసి పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని  తెలిపారు. సైబరాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ – ట్రాఫిక్ సన్‌ప్రీత్ సింగ్,  మాట్లాడుతూ, గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా ట్రాఫిక్‌కు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపడతామని తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, పరిస్థితులను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటారని చెప్పారు. భక్తుల రద్దీ, వాహనాల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన చోట ప్రత్యామ్నాయ మార్గాలను గుర్తించి, ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపడతామని తెలిపారు. సంబంధిత శాఖలు ముందుగానే తమ ఏర్పాట్లను పూర్తి చేస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉత్సవాలను సజావుగా నిర్వహించవచ్చని పేర్కొన్నారు.సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ, ఇంద్రేశం, ఇస్నాపూర్‌తో పాటు జిల్లాలోని ఇతర మున్సిపాలిటీల్లో గత ఏడాది గణేష్ ఉత్సవాల సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లను దృష్టిలో ఉంచుకుని, ఈ ఏడాది మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేస్తామని చెప్పారు.భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు రాఘవ రెడ్డి మాట్లాడుతూ, గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని కోరారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అధికారులు ఉత్సవాల నిర్వహణ కోసం ఎంతో కృషి చేస్తున్నారని అభినందించారు. గతంలో ఎదురైన సమస్యలను పరిష్కరించి, ఈ ఏడాది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ సందర్భంగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు గతంలో ఎదురైన సమస్యలు, అవసరమైన ఏర్పాట్లను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వాటిపై శాఖల వారీగా సమన్వయం చేసుకుని, సకాలంలో చర్యలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు.అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు వారి శాఖ తరపున చేసే ఏర్పాటును వివరించారు, అలాగే ఉత్సవ కమిటీ వారు చెప్పిన సమస్యలను కూడా పరిష్కరిస్తామని చెప్పారు.
ఈ సమావేశంలో  సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్, జాయింట్ సీపీ ట్రాఫిక్ సన్‌ప్రీత్ సింగ్, సీఎంసీ కమిషనర్ సృజన, సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్, అడ్మిన్ డీసీపీ అన్నపూర్ణ, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి సభ్యులు మహిపాల్ రెడ్డి, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి అధ్యక్షులు రాఘవ రెడ్డి, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి సెక్రటరీ శశిధర్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కమిటీ సభ్యులు రామరాజు, రమేష్, భాస్కర్, జీవన్ అదే విధంగా పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్ ముఠాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి - సీపీ సజ్జనార్_

*హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్ ముఠాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి - సీపీ సజ్జనార్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 26:

సాంప్రదాయ జేబుదొంగతనాలకు ఆధునిక సైబర్ నేరాలను జోడించి అమాయకుల బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్న సరికొత్త హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్ ముఠాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి అని హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్ అన్నారు.ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉన్నవారే లక్ష్యంగా ఈ ముఠాలు వ్యవస్థీకృతంగా దోపిడీకి పాల్పడుతున్నట్లు మా దర్యాప్తులో వెల్లడైంది అని తెలిపారు.బస్టాండ్లు, రద్దీ బస్సుల్లో ప్రయాణికులు ఫోన్ అన్‌లాక్ చేసే సమయంలో పిన్/ప్యాటర్న్ నిశితంగా గమనించి ఫోన్లను చోరీ చేస్తున్నారు.ఒకవేళ లాక్ తెలియకపోతే.. బాధితులు కాల్ చేసినప్పుడు ‘మేము బస్సు కండక్టర్లం.. ఫోన్ ఇచ్చేస్తాం’ అంటూ లేదా ‘ఓనర్ వెరిఫికేషన్’ పేరిట మాయమాటలు చెప్పి స్క్రీన్ పాస్‌వర్డ్‌లు రాబడుతున్నారు.అనంతరం ఫోన్ గ్యాలరీ, నోట్స్ యాప్‌లలో దాచుకున్న డెబిట్ కార్డులు, ఆధార్/పాన్ వివరాలను సేకరిస్తున్నారు.దొంగిలించిన సిమ్ కార్డు ద్వారా వచ్చే ఓటీపీలతో యూపీఐ, నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లు రీసెట్ చేసి, నిధులను ఆన్‌లైన్ గేమింగ్ యాప్స్, మ్యూల్ అకౌంట్లకు మళ్లించి డ్రా చేస్తున్నారు.ఈ తరహా నేరాలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది.
*ఈ తరహా నేరాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.* 
ఫోన్ పోయినప్పుడు ఎవరైనా ఫోన్ చేసి ఇచ్చేస్తామని చెప్పినా.. ఎట్టిపరిస్థితుల్లోనూ స్క్రీన్ లాక్ పిన్, ఓటీపీలు ఎవరికీ చెప్పవద్దు.ఏటీఎం కార్డులు, బ్యాంకు పాస్‌బుక్, ఆధార్/పాన్ కార్డుల ఫోటోలను ఫోన్ గ్యాలరీలో, నోట్స్‌లో ఎప్పుడూ భద్రపరచుకోవద్దు. 
ఫోన్ పోయిన వెంటనే సిమ్ కార్డును, బ్యాంక్/యూపీఐ సేవలను తక్షణమే బ్లాక్ చేయించి, ceir.gov.in పోర్టల్‌లో ఫోన్‌ను బ్లాక్ చేయండి.సైబర్ మోసం జరిగినట్లు గుర్తిస్తే వెంటనే 1930 హెల్ప్‌లైన్ లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి అని తెలిపారు.ముఖ్యంగా ఇంట్లోని పెద్దలకు ఈ మోసాల గురించి వివరించి అప్రమత్తం చేయండి అని అన్నారు.