Praja Sankalpam Group Media
Tuesday, July 7, 2026
సింగరేణిని గత పదేళ్లు బీఆర్ఎస్ దోచుకుంటే.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోంది_
*సింగరేణిని గత పదేళ్లు బీఆర్ఎస్ దోచుకుంటే.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోంది*
*తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు 52 వేల కోట్ల రూపాయల బకాయిలు*
*1600 కోట్ల రూపాయల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు మాయం*
*కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ని కలిసిన తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ ప్రతినిధుల బృందం*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 06:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు 52 వేల కోట్ల రూపాయల బకాయిలు ఉండటం మరియు 1600 కోట్ల రూపాయల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు మాయమవడంతో పాటు వేల కోట్ల బకాయిలు చెల్లించకపోవడం వల్ల కార్మికులకు కనీస వసతులు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు అని సింగరేణిని గత పదేళ్లు బీఆర్ఎస్ దోచుకుంటే.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోంది అని సింగరేణి సంస్థ సంస్థను ఆర్ధిక నష్టాలు తీర్చడానికి తాడిచర్ల కోల్ బ్లాక్- II ను సింగరేణి సంస్థకు కేటాయించాలని బీజేపీ ప్రతినిధుల బృందం కేంద్ర కేంద్ర బొగ్గుల గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది.ఈరోజు మంత్రి జి.కిషన్ రెడ్డి ని కలిసిన వారిలో బీజేపీ రాష్ట్ర కోశాధికారి వాసుదేవ్, శ్రీధర్ రెడ్డి, 6 జిల్లాల బీజేపీ అధ్యక్షులు, MLA గా పోటీ చేసిన బీజేపీ అభ్యర్థులు ఉన్నారు.
పరిపాలనలో మరింత పారదర్శకత కోసం వ్యవస్థను పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు_
*పరిపాలనలో మరింత పారదర్శకత కోసం వ్యవస్థను పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 07:
రాష్ట్రంలో డిజిటల్ గవర్నెన్స్ దిశగా సమగ్ర ప్రణాళికలను సిద్ధం చేసి అవసరమైన మేరకు చట్టాలను రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.రాష్ట్రంలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి గారు #MCRHRD లోని బోధి పెవిలియన్లో ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రజలకు మెరుగైన సేవలను అందించడంతో పాటు సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరే విధంగా #DigitalGovernance అమలు చేయాలని సూచించారు.ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు 1వ తారీఖున జీతాలు అందించేలా వివరాలను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని స్పష్టంగా చెప్పారు. వివిధ విభాగాలలోని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, జీతాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలను డిజిటలైజ్ చేయాలన్నారు.రాష్ట్రంలో దాదాపు 4,800 కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు ఉండగా, ఇందులో 4,300 ఏజెన్సీలు ఉద్యోగులకు ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లించడం లేదని అధికారులు ముఖ్యమంత్రి గారి దృష్టికి తెచ్చారు. ఏజెన్సీలకు ప్రభుత్వం చెల్లింపులు చేసినా, ఉద్యోగులకు సమయానికి జీతాలు చెల్లించడం లేదని తెలిపారు.ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి అలాంటి ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు. డిజిటల్ గవర్నెన్స్తో ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టాలని సూచించారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 1 నుంచి గరిష్టంగా 5వ తేదీలోగా పారదర్శకంగా జీతాలు చెల్లింపులు జరిపేందుకు డిజిటల్ గవర్నెన్స్ ఉపయోగపడుతుందని అన్నారు. అందుకే పూర్తి వివరాలను డిజిటలైజ్ చేయాలని తెలిపారు.
ప్రభుత్వం నుంచి చెల్లింపులు జరిగినప్పటికీ సమయానికి ఉద్యోగులకు జీతాలు చెల్లించని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనిపై పూర్తిస్థాయిలో కసరత్తు చేసేందుకు వీలుగా ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించాలని ముఖ్యమంత్రి గారు సూచించారు. ఈ కమిటీ 100 రోజుల్లో నివేదిక సమర్పించి ఈ అంశాన్ని ఒక కొలిక్కి తీసుకురావాలని ఆదేశించారు.హెల్త్ కార్డులు, ఇతర బెనిఫిట్స్ అమలు చేసేందుకు ప్రభుత్వ ఉద్యోగుల వివరాలను కూడా డిజిటలైజ్ చేయాలని సూచించారు. నిరంతరం మానీటరింగ్ చేసేందుకు ఆర్థిక శాఖ విభాగం ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు.ఈ సమావేశంలో ఎంపీ వెంనరేందర్ రెడ్డి , సలహాదారు కె. రామకృష్ణారావు,తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సంజయ్ జాజు , MA&UD ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, హెచ్ఆర్డీ వైస్ చైర్మన్ శాంతి కుమారి గారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సిఎంసి పరిధిలోని మణికొండ వార్డు నెం.127 సరిహద్దులలో ఉన్న వ్యత్యాసాన్ని సరిచేసి సమర్థవంతమైన పౌర పరిపాలనను నిర్ధారించవలెనని విజ్ఞప్తి_
*సిఎంసి పరిధిలోని మణికొండ వార్డు నెం.127 సరిహద్దులలో ఉన్న వ్యత్యాసాన్ని సరిచేసి సమర్థవంతమైన పౌర పరిపాలనను నిర్ధారించవలెనని విజ్ఞప్తి*
*ధూళిపాళ సీతారాం అధ్యక్షులు పంచవటి రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్(RWA),వ్యవస్థాపక అధ్యక్షులు ది సిటిజన్స్ కౌన్సిల్*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 07:
మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మరియు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ సర్ నమస్కారం.సిఎంసి పరిధిలోని మణికొండ వార్డు నెం. 127కు సంబంధించిన సరిహద్దు వ్యత్యాసం (Boundary Discrepancy) అనేక సంవత్సరాలుగా పరిష్కారం కాకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనివల్ల పారిశుద్ధ్యం సహా పలు మున్సిపల్ సేవల అందజేతలో అయోమయం ఏర్పడి సమర్థవంతమైన పౌర పరిపాలన దెబ్బతింటోంది. ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాను. మున్సిపల్ పునర్వ్యవస్థీకరణకు ముందు మొత్తం పంచవటి కాలనీ అప్పటి మణికొండ గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేది. అనంతరం అదే ప్రాంతం అప్పటి మణికొండ మున్సిపాలిటీ పరిధిలో కొనసాగింది. దీనికి సంబంధించిన అధికారిక గెజిట్ నోటిఫికేషన్లో కూడా సంబంధిత సరిహద్దులు స్పష్టంగా పేర్కొనబడ్డాయి. అయితే ప్రస్తుతం క్షేత్రస్థాయిలో అమలవుతున్న సరిహద్దులు గెజిట్లో పేర్కొన్న విధంగా లేకపోవడంతో అనవసర పరిపాలనా గందరగోళం నెలకొంది.
పంచవటి కాలనీ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ముందుగా మణికొండ గ్రామ పంచాయతీకి, అనంతరం మణికొండ మున్సిపాలిటీకి, ప్రస్తుతం డిప్యుటీ కమీషనర్ నార్సింగి కార్యాలయం కు క్రమం తప్పకుండా ఆస్తి పన్నులు చెల్లిస్తున్నారు. ఒకే మున్సిపల్ సంస్థ పన్నులు వసూలు చేస్తున్నప్పుడు, పరిష్కారం కాని సరిహద్దు సమస్య కారణంగా పారిశుద్ధ్యం వంటి ప్రాథమిక పౌర సేవల కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రావడం సమంజసం కాదు.ఈ సరిహద్దు నిర్ధారణలో ఏవైనా లోపాలు ఉన్నట్లయితే వాటిని గుర్తించి, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, అవసరమైన సవరణలు చేయించడం సంబంధిత అధికారుల బాధ్యత. ప్రజల పన్నుల ద్వారా జీతాలు పొందుతున్న అధికారులు తమ విధులను నిర్వర్తించాల్సిన బాధ్యత కలిగి ఉంటారు. పరిపాలనా లోపాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడటం ఏ విధంగానూ సమర్థనీయం కాదు.
ఈ విషయాన్ని వార్డు నెం. 127 సందర్శన సందర్భంగా కమిషనర్ గుమ్మల్ల శ్రీజన మేడం దృష్టికి కూడా తీసుకువెళ్లాం. అయినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి సరిదిద్దే చర్యలు చేపట్టలేదు.గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యూర్ (CURE)ప్రాంతాన్ని సింగపూర్, టోక్యో, న్యూయార్క్ వంటి ప్రపంచ స్థాయి నగరాలతో పోటీపడే విధంగా అభివృద్ధి చేయాలనే దూరదృష్టితో ముందుకు సాగుతున్నారు. అలాంటి లక్ష్యం సాకారం కావాలంటే క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న పౌర సమస్యలను వెంటనే పరిష్కరించడం, ప్రభుత్వ జోక్యం అవసరమైన అంశాలను సంబంధిత అధికారులు సమర్థవంతంగా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడం అత్యంత అవసరం. ప్రస్తుతం ఉన్న ఈ సమస్య విధాన రూపకల్పనకు, క్షేత్రస్థాయి అమలుకు మధ్య ఉన్న అంతరాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది.అందువల్ల, గెజిట్లో ప్రకటించిన సరిహద్దులను పరిశీలించి, అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి, మణికొండ వార్డు నెం. 127లో ఉన్న సరిహద్దు వ్యత్యాసాన్ని సరిచేయడానికి తగిన ఆదేశాలు జారీ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. తద్వారా స్థానిక ప్రజలకు పారిశుద్ధ్యం సహా అన్ని మున్సిపల్ సేవలు ఎటువంటి పరిపాలనా గందరగోళం లేకుండా అందేలా చర్యలు తీసుకోవాలని ప్రార్థిస్తున్నాను.మీ పరిశీలనార్థం సంబంధిత గెజిట్ నోటిఫికేషన్ ప్రతిని జతపరచడం జరిగింది.ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ దీర్ఘకాలిక సమస్యను మీ వ్యక్తిగత చొరవతో త్వరితగతిన పరిష్కరించవలసిందిగా వినయపూర్వకంగా కోరుతున్నాను.
Monday, July 6, 2026
Subscribe to:
Posts (Atom)