Tuesday, January 27, 2026

*_అక్రెడిటేషన్ల జీవోను సమూలంగా సవరించాలి_*



*అక్రెడిటేషన్ల జీవోను సమూలంగా సవరించాలి*
*ప్రెస్' స్టిక్కర్ నిబంధన తొలగించండి* 
*-మంత్రి ని, స్పెషల్ కమీషనర్ ను కలిసిన టీడబ్ల్యూజేఎఫ్ నేతలు*

హైదరాబాద్, జనవరి 27: మీడియా అక్రెడిటేషన్ల జీవో 252ను సవరించడం పట్ల తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర సమాచార పౌరసంబధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్పెషల్ కమీషనర్ సీహెచ్ ప్రియాంక లకు కృతజ్ఞతలు తెలిపారు. ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య, రాష్ట్ర కో-కన్వీనర్లు తన్నీరు శ్రీనివాస్, కుడుతాడు బాపురావు, హైదరాబాద్ జిల్లా కన్వీనర్ రవి కుమార్, నాయకులు శ్రీధర్, శ్రీనివాస్, రవికుమార్ తదితరులు  మంగళవారం సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని, సమాచార భవన్ లో కమీషనర్ ప్రియాంక ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. జీవో 252 సవరణ సమూలంగా జరగలేదని,  మరోసారి జీవోను పున:సమీక్షించి  సవరించాలని వారు కోరారు. జీవో
సవరణలో  కేబుల్ చానల్స్, నియోజకవర్గ స్థాయి రిపోర్టర్లకు న్యాయం జరగడం లేదని,  గతంలో  కేబుల్ ఛానల్స్ కు ఐఅండ్ పీఆర్ ద్వారా 12  రాష్ట్రస్థాయి అక్రెడిటేషన్ కార్డులు, నాలుగు జిల్లా స్థాయి అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చేవారని, ఈ విషయాన్ని తాము పలు తమరి దృష్టికి తీసుకువచ్చినప్పటికీ, సవరించిన జీవోలో కేబుల్ చానల్స్ అంశమే లేకపోవడం బాధాకరమని అన్నారు. యూనియన్ గా తమ అభిప్రాయాన్ని చెప్పినప్పటికీ కేబుల్ చానల్స్ విషయంలో, నియోజకవర్గ స్థాయిలో రిపోర్టర్లకు ఇచ్చే కార్డుల విషయంలో ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమని, అదే విధంగా ఎంపానల్మెంట్ లేని చిన్న, మధ్య తరహా పత్రికలకు గతంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఇచ్చినట్లు అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని, అదే విధంగా రెగ్యులర్ గా నడుస్తున్న పత్రికలను ఎంపానల్మెంట్ చేయాలని వారు మంత్రిని, కమీషనర్ ను కోరారు. 
*'ప్రెస్'స్టిక్కర్ నిబంధన తొలగించాలి*
అక్రెడిటేషన్ కార్డు ఉన్న జర్నలిస్టులు మాత్రమే తమ వాహనాలకు 'ప్రెస్' అని రాసుకోవాలంటూ జారీ చేసిన సర్క్యులర్ ను రద్దు చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య కోరారు. ఈ మేరకు ఆయన, పలువురు ఫెడరేషన్ నాయకులు మంగళవారం సమాచార పౌరసంబధాల శాఖ స్పెషల్ కమీషనర్ ప్రియాంక ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సర్క్యలర్... జర్నలిస్టులను, జర్నలిజం వృత్తిని అవమానించేదిగా ఉందని, జర్నలిస్టులకు కేవలం సంక్షేమ పథకాల కోసం గుర్తింపు కార్డుగా ఇచ్చే అక్రెడిటేషన్ కార్డును జర్నలిస్టుగా గుర్తించేందుకు ప్రామాణికం చేయడం తగదని, అక్రెడిటేషన్ కార్డు ఉన్న వారే తమ వాహనాలకు "ప్రెస్"అని రాసుకోవాలనే నిబంధన సరైంది కాదని, ఈ సర్క్యులర్ నిబంధన ఇటు జర్నలిస్టుల సమాజానికి,
అటు జర్నలిజం వృత్తి స్వేచ్ఛకు భంగం కలుగుతుందని మామిడి సోమయ్య కమీషనర్ తో అన్నారు.  రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చే అక్రెడిటేషన్ కార్డు కలిగి ఉన్న జర్నలిస్టులు మాత్రమే జర్నలిస్టులు కాదని, అక్రెడిటేషన్ కార్డు లేని జర్నలిస్టులు చాలా మంది ఉన్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 వేల మంది జర్నలిస్టులు వుండగా, వీరిలో సగం మందికి మాత్రమే ప్రభుత్వం అక్రెడిటేషన్ కార్డులు ఇస్తున్నదని, మిగతా సగం మంది జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు లేకుండా కేంద్ర ప్రభుత్వం ఆర్ ఎన్ ఐ (ప్రస్తుత పీ ఆర్ జీఐ) రిజిస్ట్రేషన్ పొందిన మీడియా సంస్థలు గుర్తింపు కార్డులతో పనిచేస్తున్నారని అన్నారు. 
ఎంపానల్మెంట్ లేని మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు ఉండవని, అంత మాత్రాన ఆ జర్నలిస్టులను జర్నలిస్టులే కాదనే విధంగా తమ వాహనాలకు ప్రెస్ స్టిక్కర్ పెట్టుకోవద్దంటూ ప్రభుత్వం నిబంధనలు విధించడం సరైంది కాదని అన్నారు. సమాజంలో  నకిలీ జర్నలిస్టులను కట్టడి చేయడానికి అనేక మార్గాలున్నాయని, ప్రత్యేక రూల్స్ ద్వారా నియంత్రించవచ్చని, అలాంటి చర్యలకు తామేమీ వ్యతిరేకం కాదని, కానీ ఆ పేరుతో అసలైన జర్నలిస్టులను అవమానించడం, అడ్డుకోవడం సరైంది కాదని అన్నారు. ఇప్పటికే అక్రెడిటేషన్ కార్డు లేని అనేక మంది జర్నలిస్టులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ నేపథ్యంలో తమరు జారీ చేసిన సర్క్యులర్ "మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు"గా అంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సర్క్యులర్ నిబంధన ను వెంటనే ఉపసంహరించాలని మామిడి సోమయ్య కోరారు. దీనిపై పునరాలోచన చేస్తామని, రవాణాశాఖ అధికారులతో చర్చిస్తానని కమీషనర్ ప్రియాంక హామీ ఇచ్చారు.

ఖమ్మం జిల్లా కలెక్టర్ సమాచార హక్కు చట్టాన్ని గౌరవిస్తున్నారా.?

బ్రేకింగ్ న్యూస్ :

*_ఖమ్మం జిల్లా కలెక్టర్,మున్సిపల్ కార్పొరేషన్,ఇరిగేషన్ కార్యాలయం,అర్బన్ తహశీల్దార్ కార్యాలయం వారికి సమాచార హక్కు చట్టం అంటే గౌరవం లేదు.._*

#RTIA ➡️ #violation 

#TelanganaRising ??

#telanganarising2047  ??

#RevanthreddyCM 

#ponguletisrinivasreddy

#IPRD_Telangana

@TelanganaCMO @Bhatti_Mallu @INC_Ponguleti @TummalaOfficial @CPRO_TGCM @IPRTelangana @PonguletiOffice @Collector_KMM @MC_Khammam @aclbkhammam @Khammam @Aadabtvlive @v6velugu @ShanarthiNews3 @eenadulivenews @ABNJyothyTV @myvaartha @NavatelanganaD @bigtvtelugu @BplplH 

https://x.com/Praja_Snklpm/status/2016061726677217791?t=4Z14bs6vKENF5Dk19Lnkwg&s=19

Monday, January 26, 2026

ప్రైవేట్ వ్యక్తలు గుప్పిట్లో తెలంగాణ పాలనా యంత్రాంగం!



*_ఇందిరమ్మ రాజ్యంలో "రాజ్యాంగేతర శక్తులు!"_*

👉మంత్రులు, ఎమ్మెల్యేల కంటే కూడా పవర్ ఫుల్! 
👉ఫైలు ఏదైనా, పైరవీలు ఏమైనా అన్నీ వారి కనుసన్నల్లోనే! 
👉ప్రైవేట్ వ్యక్తలు గుప్పిట్లో తెలంగాణ పాలనా యంత్రాంగం! 

*టెండర్లు, దందాలు రేవంత్ బామ్మర్ది సూదిని సృజన్ రెడ్డి!*

*షాడో హోం రేవంత్ రైట్ హ్యాండ్ వేం నరేందర్ రెడ్డి!*

*షాడో రెవెన్యూ రేవంత్ తమ్ముడు కొండల్ రెడ్డి!*

*షాడో సినిమాటోగ్రఫి రేవంత్ నమ్మినబంటు రోహిన్ రెడ్డి!*

*షాడో మున్సిపల్ రేవంత్ అనుచరుడు ఫయీం ఖురేషీ!*

*కొడంగల్ షాడో ఎమ్మెల్యే రేవంత్ అన్న తిరుపతి రెడ్డి!*

*విదేశీ పెట్టుబడుల వ్యవహారాలు రేవంత్ తమ్ముడు కృష్ణారెడ్డి!*

*ఫైరవీలు దందాలు రేవంత్ చిన్ననాటి దోస్త్ అనిల్ రెడ్డి!*

*సచివాలయంలో షాడో సీఎంగా ఓ మహిళా అంటూ కథనాలు!*

ప్రజాపాలనా, ఇందిరమ్మ రాజ్యంతో పేరుతో రాజ్యాంగేతరుల చేతుల్లో తెలంగాణ ప్రభుత్వ పాలన!
ప్రతిపక్షాలు ఆధారాలు బయటపెడుతున్నా మారని ప్రభుత్వ పెద్దల తీరు

*‘వాళ్లు చట్టసభకు వెళ్లలేదు. రాజ్యాంగం మీద ప్రమాణం చేయలేదు. ప్రభుత్వంలో ఎలాంటి చిన్న పదవులు కూడా లేవు. కానీ, వాళ్ల మాటే శాసనం.* వాళ్ల కన్ను పడందే టెండర్ దక్కదు. వాళ్ల అనుమతి లేనిదే ఫైలు కదలదు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ‘రాజ్యాంగేతర శక్తులు’ తెలంగాణ పరిపాలనా యంత్రాంగాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్నారన్న ఆరోపణలు ఇప్పుడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. అమృత టెండర్ల నుంచి సినిమా టికెట్ల సెటిల్మెంట్ల వరకు,  హైడ్రా కూల్చివేతల నుంచి భూముల కేటాయింపుల వరకు. అంతా ఈ ‘షాడో’ శక్తుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
Courtesy / Source by :
https://x.com/shankar_journo/status/2015960656676323799?t=T4axAws-IaWfzrgffY5EEQ&s=08

Monday, January 19, 2026

_NFC రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) వెడల్పు చేయాలి_

NFC రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) వెడల్పు పెంపు అవసరం కోసం మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారిని శామీర్ పేట లో వారి నివాసంలో కలిసిన వినతి పత్రం అందజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు
స్థానిక కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి గారు.

ఈ సందర్భగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ ఈ వంతెనను సుమారు 45 సంవత్సరాల క్రితం అప్పటి అవసరాలకు అనుగుణంగా నిర్మించారు.

ప్రాంతంలో జనాభా వేగంగా పెరగడం, కొత్త కాలనీలు విస్తరించడంతో ప్రస్తుతం ఈ వంతెన ట్రాఫిక్‌ను మోయలేకపోతోంది. ఇది హబ్సిగూడా నుండి ఈసీఐఎల్‌కు, బోడుప్పల్ నుండి ఈసీఐఎల్‌కు వెళ్లే ప్రధాన మార్గం కావడంతో రోజూ వేలాది మంది ప్రయాణికులు దీనిపై ఆధారపడుతున్నారు.

వంతెన వెడల్పు తక్కువగా ఉండడం వల్ల తీవ్రమైన ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి, స్థానిక ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, చిన్న పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల రోజువారీ జీవితం తీవ్రంగా ప్రభావితమవుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తక్షణ చర్యలు అవసరం.

ఈ పనుల కోసం ప్రత్యేక రైల్వే అభివృద్ధి ప్రణాళిక (SRDP) కింద నిధులు ఇప్పటికే విడుదలైనట్లు నా దృష్టికి వచ్చింది.
అందువల్ల, దయచేసి ఈ విషయాన్ని పరిశీలించి NFC రైల్వే ఓవర్ బ్రిడ్జి వెడల్పు పెంపుకు అనుమతి ఇవ్వగలరని మనవి. దీనివల్ల ప్రజలకు కలిగే ఇబ్బందులు తగ్గుతాయి అని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

_దోమల బెడద నుండి ప్రజలకు విముక్తి కలిగించండి జోనల్ కమిషనర్ గారు : కార్పొరేటర్ బన్నాల_

*హైకోర్టు కాలనీ హెచ్ఎంటి చెరువులోనీ గుర్రపు డెక్కని తొలగించండి : కార్పొరేటర్ బన్నాల* 

*దోమల బెడద నుండి ప్రజలకు విముక్తి కలిగించండి జోనల్ కమిషనర్ గారు : కార్పొరేటర్ బన్నాల* 

*చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ జిహెచ్ఎంసి  స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ ఈరోజు ఉప్పల్ జోనల్ కమిషనర్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ రాధిక గుప్తా గారిని కలిసి హైకోర్టు కాలనీ హెచ్ఎంటి నగర్ చెరువులో గుర్రపు డెక్క తో నిండి పోయిందని దానివల్ల విపరీతమైన దోమల తో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని వెంటనే గుర్రపు డెక్కను తొలగించే అన్ని చర్యలు చేపట్టాలని వినతి పత్రం సమర్పించడం జరిగింది* 

*అనంతరం కార్పొరేటర్ గీతా ప్రవీణ్ జోనల్ కమిషనర్ రాధిక గుప్తా గారితో మాట్లాడుతూ గతంలో ఎంటమాలజీ డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి మూడు నెలలకు ఒకసారి గుర్రపు డెక్కను తొలగించుటకు అన్నీ చర్యలు చేపట్టే వారుఅని, కానీ సెప్టెంబర్ మాసం నుండి ఎంటమాలజీ డిపార్ట్మెంట్ కనుమరుగ అయిందని, చెరువుల వైపు ఎంటమాలజీ డిపార్ట్మెంట్ కనీసం రావట్లేదని గతంలో యాంటీ లార్వా ప్రోగ్రాంను ఏర్పాటు చేసేవారని గుర్రపు డెక్కని ప్రతి మూడు నెలలకు ఒకసారి తొలగించేవారని ఇవన్నీ గత ఆరు నెలల నుండి జరగడంలేదని*, *విపరీతమైన దోమలతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పాలవుతున్నారని సాయంత్రం 5 దాటితే ప్రజలు వీధుల్లో నిలబడే పరిస్థితి లేదని ,వెంటనే గుర్రపు డెక్క తొలగించుటకు అన్నీ చర్యలు చేపట్టి ప్రజలకు దోమల నుండి ఉపశమనం కల్పించాలని కోరారు*. *జోనల్ కమిషనర్ గారు మాట్లాడుతూ వీలైనంత త్వరలో గుర్రపు డెక్కన్ తొలగించి అన్ని చర్యలు చేపడతానని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలక్కుండా చూసుకుంటానని హామీ ఇవ్వడం జరిగింది*.

*కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, సీనియర్ నాయకులు ఎద్దుల కొండలరెడ్డి, కోకొండ జగన్, ముద్ధం శ్రీనివాస్ యాదవ్, బాలకృష్ణ గౌడ్ ,ఎండి షఫీ, ఎండి హనీఫ్, శ్యాం, బాలు, సకినాల చందు మొదలగువారు పాల్గొన్నారు*

Sunday, January 18, 2026

*_బోల్తా పడిన గిల్ట్ ఆఫ్ ఇండియా(EGI)_*

*_బోల్తా పడిన గిల్ట్ ఆఫ్ ఇండియా(EGI)_*
_# ట్రాప్ లో పడటానికి ఎవడైనా ఒకటే.!_
_# పడేసిటోడి తెలివితేటలే ముఖ్యం_ 

ఎన్టీవీ జర్నలిస్టుల అక్రమ అరెస్టులపై రేవంత్ సర్కార్ తీరుపై మండిపడ్డ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా(EGI)

ఎన్టీవీ ప్రసారం చేసిన వీడియోలో ఎలాంటి వ్యక్తుల పేర్లు ప్రస్తావించలేదు.. దీనిపై తెలంగాణ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సంఘం ఫిర్యాదు చేసిన వెంటనే జర్నలిస్టులపై క్రిమినల్ డిఫమేషన్ కేసు నమోదు చేశారు

అర్ధరాత్రి ఇంటిపై దాడులు చేసి జర్నలిస్టులను అరెస్ట్ చేసి, కోర్టు బెయిల్ మంజూరు చేసే వరకు లాకప్‌లో ఉంచారు

అపకీర్తి జరిగిందని భావించిన గుర్తుతెలియని మహిళా అధికారిణి కాకుండా, తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు

ఈ ఘటనలో ఎన్టీవీ జర్నలిస్టులపై తొందర తొందరగా చర్యలు తీసుకొని, మీడియాను అపకీర్తి చేయడాన్ని మేము ఖండిస్తున్నాం

అరెస్టులు చేసే కంటే ముందుగా, పోలీసులు న్యాయ ప్రక్రియను అనుసరించి, సమగ్ర దర్యాప్తు జరపాల్సింది

తెలంగాణలో మీడియా స్వేచ్ఛగా, ఎలాంటి అడ్డంకులు లేకుండా పనిచేసేలా ప్రభుత్వం చూడాలి

అలాగే మీడియాతో వ్యవహరించేటప్పుడు న్యాయ ప్రక్రియను పాటించి, సంయమనం వహించాలని అధికారులను కోరుతున్నాం – ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా

Wednesday, January 14, 2026

_తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క జర్నలిస్టుకు చిన్న సమస్య వచ్చిన ముందుండేది తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం మాత్రమే_

*_మిత్రులారా ... "NTv జర్నలిస్టుల అరెస్ట్ గురించి మౌనం ఎందుకు ఉన్నారు..? TJSS అధ్యక్షుడు అనంచిన్ని గారూ" అంటూ ఉదయం నుంచి చాలా ఫోన్ కాల్స్_*

*తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క జర్నలిస్టుకు చిన్న సమస్య వచ్చిన ముందుండేది తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం మాత్రమే*

*_NTv యాజమాన్యం బహిరంగ క్షమాపణ తరువాత మనం ఏ విధంగా ఆ జర్నలిస్టుల అరెస్ట్ ను ఖండించగలం. గత ప్రభుత్వం సంకలు నాకిన వారు ఇప్పుడు ఎలా అరుస్తారు.? నాడు 1889 మంది జర్నలిస్టులు అరెస్టు అయినప్పుడు NTv  ఎప్పుడూ నోరు మెదపలేదు. ఇతర పత్రికలలో చానలలో చేస్తున్న జర్నలిస్టులు వాళ్ళ దృష్టిలో జర్నలిస్టులు కారా.? క్షమాపణ ఈ వీడియో చూడండి.._*

*_మంత్రి, ఐఏఎస్ అధికారిణిపై కథనం: బహిరంగ క్షమాపణ చెప్పిన న్యూస్ ఛానల్_*

మంత్రి, ఐఏఎస్ అధికారిణిపై కథనం: బహిరంగ క్షమాపణ చెప్పిన న్యూస్ ఛానల్
మంత్రి, మహిళా ఐఏఎస్ అధికారిణిపై వివాదాస్పద కథనం ప్రసారం
తీవ్రంగా స్పందించిన ఐఏఎస్ అధికారుల సంఘం, పోలీసులకు ఫిర్యాదు
ఎన్టీవీతో పాటు పలు డిజిటల్ ఛానళ్లపై ఎఫ్ఐఆర్ నమోదు
క్షమాపణ చెబుతూ ప్రకటన చేసిన ఎన్టీవీ
తెలంగాణలో ఓ మంత్రి, ఓ మహిళా ఐఏఎస్ అధికారికి సంబంధించి ప్రసారం చేసిన వివాదాస్పద కథనంపై ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ ఎన్టీవీ (NTV) బహిరంగంగా క్షమాపణ చెప్పింది. ఈ కథనం ఓ మహిళా ఐఏఎస్ అధికారిణి ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉందని ఐఏఎస్ అధికారుల సంఘం ఆరోపించడంతో పాటు, పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్టీవీ యాజమాన్యం, తమ ప్రసారం వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా విచారం వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించింది.

*_వివాదానికి దారితీసిన కథనం_*
ఈ నెల 8వ తేదీన ఎన్టీవీ ఛానెల్‌లో ఒక కథనం ప్రసారమైంది. తెలంగాణకు చెందిన ఓ కాంగ్రెస్ మంత్రికి, ఓ మహిళా ఐఏఎస్ అధికారిణికి మధ్య వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని, ఆ సంబంధాల కారణంగానే ఆమెకు కీలక పోస్టింగులు లభిస్తున్నాయని ఆ కథనంలో పరోక్షంగా ఆరోపించారు. కథనంలో మంత్రి పేరుగానీ, అధికారిణి పేరుగానీ నేరుగా ప్రస్తావించనప్పటికీ, వారిద్దరినీ సులభంగా గుర్తించేలా పరోక్ష సూచనలు ఇచ్చారు. ఈ కథనం ఆ అధికారిణి నైతికతను శంకించేలా ఉందని, ఆమె వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా ఉందని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అని, ఆయనపై అసత్య ప్రచారం జరుగుతోందని సామాజిక మాధ్యమాల్లో చర్చ మొదలైంది.

*_రంగంలోకి దిగిన ఐఏఎస్ అధికారుల సంఘం_*
ఈ ప్రసారాన్ని తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం తీవ్రంగా పరిగణించింది. సంఘం నాయకుడు, సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ నేతృత్వంలోని బృందం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్‌ను కలిసి అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఈ కథనం పూర్తిగా అసత్యమని, నిరాధారమైనదని, ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేస్తున్న మహిళల పట్ల సమాజంలో ఒక తిరోగమన ధోరణిని ప్రోత్సహించేలా ఉందని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కథనం యూట్యూబ్, ఎక్స్ (ట్విట్టర్) వంటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో సదరు అధికారిణి సైబర్‌స్టాకింగ్‌కు గురవుతూ తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్నారని తెలిపారు.

*_కేసు నమోదు, ఎన్టీవీ క్షమాపణ_*
ఐఏఎస్ అధికారుల సంఘం ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు జనవరి 12న కేసు నమోదు చేశారు. ఎన్టీవీతో పాటు మరో ఏడు డిజిటల్ మీడియా సంస్థలైన తెలుగు స్క్రైబ్, ఎంఆర్ మీడియా, ప్రైమ్9 తెలంగాణ, పీవీ న్యూస్, సిగ్నల్ టైమ్స్, వోల్గా టైమ్స్, మిర్రర్ టీవీ, టీన్యూస్ తెలుగులపై పరువు నష్టం, మహిళల గౌరవానికి భంగం కలిగించడం వంటి సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఈ పరిణామాల నేపథ్యంలో, జనవరి 13న ఎన్టీవీ ఛానెల్ తన తప్పును అంగీకరించింది. యాజమాన్యం తరఫున ఎడిటర్ ఒక ప్రకటన చేస్తూ, జనవరి 7న ప్రసారమైన తమ కథనం ఏ ఒక్కరి వ్యక్తిత్వాన్ని కించపరిచే ఉద్దేశంతో ప్రసారం చేయలేదని తెలిపారు. "ఒకవేళ మా కథనం ఆ విధంగా అపార్థానికి దారితీసి ఉంటే, అందుకు మేము మనస్ఫూర్తిగా విచారం వ్యక్తం చేస్తున్నాం. ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులంటే మాకు అపారమైన గౌరవం ఉంది" అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

*_వివిధ వర్గాల స్పందన_*
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. ఒక వీడియో ప్రకటన విడుదల చేసి, తనపై వస్తున్న వదంతులను ఖండించారు. నిరాధారమైన వార్తలను ప్రచారం చేయవద్దని మీడియా సంస్థలను హెచ్చరించారు. మరోవైపు, ఈ ఘటనపై బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ వంటి వారు స్పందిస్తూ, మంత్రుల వల్ల ఐఏఎస్ అధికారులకు వేధింపులు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.