Tuesday, August 25, 2026

_తెలంగాణ జైళల్లో దీర్ఘకాలంగానిర్భందంలో ఉన్న మావోయిస్టు సానుభూతిపరులు, కార్యకర్తల కేసులను మానవతా దృక్పధంతో పునఃసమీక్షించి వారిని విడుదల చేయాలి_


*_తెలంగాణ జైళల్లో దీర్ఘకాలంగానిర్భందంలో ఉన్న మావోయిస్టు సానుభూతిపరులు, కార్యకర్తల కేసులను మానవతా దృక్పధంతో పునఃసమీక్షించి వారిని విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సారుకు విజ్ఞప్తి చేసిన మానవహక్కుల వేదిక సంస్థ._*

*@TelanganaCMO @TelanganaDGP @MaheshBhagwat95 @dgprisonstg @IPRTelangana @DigitalMediaTG @HRF_Humanrights @BplplH*

https://x.com/Praja_Snklpm/status/2092152845495902384?t=bWa8FSsD8iNOTAz9vGNVjQ&s=08

తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ #TGFDC ఆధ్వర్యంలో ’యంగ్‌ ఫిల్మ్‌ మేకర్‌ ఛాలెంజ్‌ 2026 - సీజన్ 2’_

*బతుకమ్మ పండగ సందర్భంగా తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ #TGFDC ఆధ్వర్యంలో ’యంగ్‌ ఫిల్మ్‌ మేకర్‌ ఛాలెంజ్‌ 2026 - సీజన్ 2’ పోటీలు* 

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 24:

బతుకమ్మ పండగ సందర్భంగా తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ #TGFDC ఆధ్వర్యంలో ’యంగ్‌ ఫిల్మ్‌ మేకర్‌ ఛాలెంజ్‌ 2026 - సీజన్ 2’ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఎఫ్‌డీసీ చైర్మన్‌ దిల్‌ రాజు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఎఫ్‌డీసీ ఎండీ జి. ముకుంద రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ క్రెయేటివ్ డైరెక్టర్ రాజ్ కొండా, ఎఫ్‌డీసీ ఈడీ కిషోర్ బాబుతో కలిసి ఆవిష్కరించారు.రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పండుగలు, కళారూపాలపై షార్ట్‌ ఫిల్మ్, పాటల పోటీలు ఉంటాయన్నారు. ఈ సారి కొత్తగా జానపద పాటలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ఇన్‌ఫ్లుయెన్సర్ల వీడియోస్, వ్యాసాలు (ఆర్టికల్స్) కు చోటు కల్పించామని తెలిపారు.గత ఏడాది నిర్వహించిన బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్‌కు విశేష స్పందన లభించిందని,  500కు పైగా లఘు చిత్రాలు, బతుకమ్మ పాటలు వచ్చాయన్నారు. ఈ సంవత్సరం కూడా యువ ప్రతిభావంతులు పోటీలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ పోటీలు యువతకు భవిష్యత్తులో సినీ రంగంలో అవకాశాలను సృష్టించడానికి, సృజనాత్మక కంటెంట్‌కు వేదికగా నిలుస్తాయి. తెలంగాణ సంప్రదాయాలు, సంస్కృతి, పండగలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు విస్తృత స్థాయిలో ప్రాచుర్యం పొందేందుకు దోహదం చేస్తాయని ఈ పోటీలను నిర్వహిస్తున్నారు అని అన్నారు.లఘు చిత్రాల నిడివి 3 నిమిషాలు, పాటల రన్‌టైమ్‌ 5 నిమిషాలకు మించకూడదు అని ఆయా వీడియోలు 4K రిజల్యూషన్ కలిగి ఉండాలి అని అన్నారు. ఆసక్తి కలిగిన వారు వాటిని 2026 సెప్టెంబర్ 15లోపు youngfilmmakerschallenge@gmail.com మెయిల్‌కు గానీ, 8125834009 వాట్సాప్ నంబరుకు గానీ పంపాలి అని అన్నారు. అనంతరం నిపుణులతో కూడిన జ్యూరీ విజేతలను ప్రకటిస్తుంది.ఈ పోటీలలో ప్రథమ బహుమతి రూ.3 లక్షలు, ద్వితీయ బహుమతి రూ. 2 లక్షలు, తృతీయ బహుమతి రూ. 1 లక్ష. మరో ఐదుగురికి కన్సోలేషన్ బహుమతిగా రూ. 20 వేల చొప్పున అందించనున్నారు. ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు ప్రదానం చేస్తారు.

నిబంధనలు ఉల్లంఘించే భవనాలపై కఠిన కూల్చివేత చర్యలు చేపట్టిన సైబరాబాద్ మున్సిపల్ కమీషనర్_

*నిబంధనలు ఉల్లంఘించే భవనాలపై కఠిన కూల్చివేత చర్యలు చేపట్టిన సైబరాబాద్ మున్సిపల్ కమీషనర్*

*నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలపై సీఎంసీ చర్యలను ముమ్మరం చేసింది*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 25:

సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు ఈరోజు  నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న 38 అనధికార భవనాలను గుర్తించాయి.
**వాటి వివరాలు* 
 *(1)*: 28 UC నోటీసులు జారీ
*(2)*:  1 భవనం స్వాధీనం
*(3)*:  9 భవనాలు కూల్చివేత
**ఈ కింది అక్రమ నిర్మాణాల మీద చర్యలకు దృష్టి సారించింది:**
*(1)*: 75 చదరపు గజాల లోపు ప్లాట్లు: 7 మీటర్లకు మించిన ఎత్తు ఉన్న నిర్మాణాలు.
*(2)*: 75 చదరపు గజాల పైబడిన ప్లాట్లు: ఎత్తుతో సంబంధం లేకుండా, భవన నిర్మాణ అనుమతి లేకుండా చేసిన నిర్మాణాలు.
పౌరుల ఫిర్యాదుల ద్వారా, అలాగే స్వచ్ఛంద క్షేత్ర తనిఖీల ద్వారా కేసులను గుర్తిస్తున్నారు. అమలు చర్యలను ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నారు.

నాచారం డివిజన్ లో 46 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఉప్పల్ శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి_

*నాచారం డివిజన్ లో 46 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఉప్పల్ శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 24:

ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం నాచారం 21 డివిజన్ రామ్ రెడ్డి నగర్ కాలనీలో 30 లక్షల రూపాయలు వ్యాయామంతో నూతన సిమెంటు  రోడ్డు నిర్మాణం మరియు అంగన్వాడి నూతన నిర్మాణాని16 లక్షల రూపాయలు గల స్థలాలకు  శంకుస్థాపన చేసిన ఉప్పల్ శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి మరియు మాజీ కార్పొరేటర్ శాంతి సాజన్ శేఖర్ మేడల మల్లికార్జున్ పోగుల వెంకటరమణారెడ్డి టేకపల్లి రామచందర్ దయా గౌడ్ కట్ట బుచ్చన్న బొడ్డు శివ అద్వైత దాసరి కరణ శ్రీధర్  జిమ్ లడ్డు శివ ఎండి ఖాదర్ యూసుఫ్ బాయ్ తదితర ముఖ్య అతిథులు పాల్గొన్నారు.

హైదరాబాద్ జిల్లా కన్వీనర్ గా బాపట్ల కృష్ణమోహన్ ముదిరాజ్ మరియు కో కన్వీనర్ గా గడ్డమీద శ్రీశైలం ముదిరాజ్_

*తెలంగాణ ముదిరాజ్ జర్నలిస్టు సంఘం రాష్ట్ర కార్యవర్గ ముఖ్యుల సమావేశం*

*సికింద్రాబాద్ బోయగూడా   ముదిరాజ్ భవన్ లో తెలంగాణ ముదిరాజ్ జర్నలిస్టు సంఘం ఆత్మీయ సమ్మేళనం*

*హైదరాబాద్ జిల్లా కన్వీనర్ గా బాపట్ల కృష్ణమోహన్ ముదిరాజ్ మరియు కో కన్వీనర్ గా గడ్డమీద శ్రీశైలం ముదిరాజ్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 23:

తెలంగాణ ముదిరాజు జర్నలిస్టు సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చింతల నీలకంఠం, బోయిని శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33  జిల్లాల అధ్యక్షులను  ఎన్నుకోవడం కొరకు ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలుగా ఉన్నటువంటి 10 జిల్లాల కన్వీనర్లను ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. ఉమ్మడి జిల్లా కన్వీనర్లు గా ఉన్నటువంటి వారు ఉమ్మడి జిల్లాలో ఏ జిల్లా కొత్త జిల్లాలుగా ఏర్పడినావో ఆ జిల్లాలకు అధ్యక్షుల నియామకం జరిగే క్రమంలో వారి బాధ్యతను నిర్వహించడానికి ప్రస్తుతం కన్వీనర్లను నియమించడం జరిగింది.హైదరాబాద్ జిల్లా కన్వీనర్ గా బాపట్ల కృష్ణమోహన్ ముదిరాజ్ మరియు కో కన్వీనర్ గా గడ్డమీద శ్రీశైలం ముదిరాజ్ ను నియమించారు. అలాగే ఉమ్మడి మహబూబ్నగర్ కన్వీనర్ గా 
జి .నర్సింలు ముదిరాజ్,నారాయణపేట జిల్లా కన్వీనర్ గా నవీన్ ముదిరాజ్, సిద్దిపేట జిల్లా కన్వీనర్ గా 
పరమేశ్వర ముదిరాజ్ మరియు  కో కన్వీనర్ గా బరిగే నర్సింలు ముదిరాజ్,నిర్మల్ జిల్లా కన్వీనర్ గా హనుమాన్లు ముదిరాజ్,సంగారెడ్డి జిల్లా కన్వీనర్ గా ఏ. రాంబాబు మరియు కో కన్వీనర్ గా గోవర్ధన్ ముదిరాజ్,మెదక్ జిల్లా కన్వీనర్ గా వెంకటేశం ముదిరాజ్,కరీంనగర్ జిల్లా నేదురు సమ్మయ్య ముదిరాజ్,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల్ సుమన్ ముదిరాజ్,నల్గొండ జిల్లా కన్వీనర్ గా సైదులు ముదిరాజ్ లను నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లాల నుండి వచ్చినటువంటి ముదిరాజులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sunday, August 23, 2026

పాలిటెక్నిక్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - తెలంగాణ ప్రభుత్వం_

*పాలిటెక్నిక్ కళాశాలలను అత్యుత్తమ ప్రమాణాలతో అప్‌గ్రేడ్ చేస్తున్నాము*

*పాలిటెక్నిక్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - తెలంగాణ ప్రభుత్వం*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 22:

పాలిటెక్నిక్ విద్యార్థులకు విస్తృతంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందులో భాగంగా పాలిటెక్నిక్ విద్యలో కొత్త కోర్సులు ప్రవేశపెట్టడంతో పాటు ఆధునిక సాంకేతిక శిక్షణ అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది.పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులకు లేటరల్ ఎంట్రీ ద్వారా ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశాల విధానం యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. శాఖ మార్పు వల్ల పాలిటెక్నిక్ కళాశాలల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి సంబంధించిన సర్వీసు నిబంధనల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని వెల్లడించింది.పాలిటెక్నిక్ కళాశాలలను అత్యుత్తమ ప్రమాణాలతో అప్‌గ్రేడ్ చేసేందుకు, అవసరమైన నిధులు సమకూర్చేందుకు ప్రభుత్వం వాటిని శక్తి శాఖతో అనుసంధానం చేసినట్లు పేర్కొంది. ఆధునిక సౌకర్యాలు, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలతో విద్యార్థులను తీర్చిదిద్ది, కోర్సులు పూర్తి చేసిన తర్వాత వారికి మెరుగైన ఉద్యోగ అవకాశాలు, అత్యుత్తమ వేతనాలు లభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.
విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, పాలిటెక్నిక్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను దేశంలోనే అత్యంత ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలి_

*తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను దేశంలోనే అత్యంత ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలి*

*స్కూల్ ఎడ్యుకేషన్ మరియు టి-సాట్ మధ్య ప్రత్యేక అవగాహన ఒప్పందం*

బాపట్ల కృష్ణమోహన్, ఆగస్టు 22:

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ అన్నివేళలా అన్ లైన్ ద్వారా అందించాలనే లక్ష్యంతో స్కూల్ ఎడ్యుకేషన్ మరియు టి-సాట్ మధ్య ప్రత్యేక అవగాహన ఒప్పందం కుదిరింది. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి ఒప్పంద పత్రాలపై డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో సంతకాలు చేసి ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను దేశంలోనే అత్యంత ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేందుకు డిజిటల్ లెర్నింగ్ ఎంతగానో ఉపయోగపడుతుందని నవీన్ నికోలస్,వేణుగోపాల్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. డిజిటల్ కంటెంట్ ప్రసారాల విషయంలో ఎంఓయూ ఫలితంగా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మరియు టి-సాట్ మధ్య కార్యక్రమాల ప్రసారాల విషయంలో స్పష్టత వస్తుందని భావించారు.తొమ్మిది, పదవ తరగతి పిల్లలకు సాయంత్రం వేళల్లో డిజిటల్ పాఠ్యాంశాలు ప్రసారం చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 28 వేల పాఠశాలల్లో చదువున్న విద్యార్థుల తల్లిదండ్రులతో సీఎం రేవంత్ రెడ్డి ‘ముఖాముఖి’, ‘ మా జిల్లా మా పాఠశాల’ పేరుతో డీఈవోలు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమం, ఉపాధ్యాయుల కోసం ‘టి.ఎల్.ఎమ్’ మేళా వంటి ప్రత్యేక కార్యక్రమాలు ఇక నుండి టి-సాట్ వేదికగా ప్రసారం చేసుకునేందుకు ఎంఓయూ ఉపయోగపడుతుందని నవీన్ నికోలస్,వేణుగోపాల్ రెడ్డి భావించారు.డిజిటల్ ప్రసారాలకు సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని టి-సాట్ ద్వారా నిర్వహించే విధంగా సమగ్ర శిక్ష, ఎస్.ఇ.ఆర్.టి తదితర విభాగాలు తగిన చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ నవీన్ నికోలస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎంఓయూ కార్యక్రమంలో సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ అడిషనల్ డైరెక్టర్ పీవీ శ్రీహరి, టి-సాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎండీ సాధిక్, జనరల్ మేనేజర్ లింగారెడ్డి, ప్రాజెక్ట్ జేడీలు, కో-ఆర్డినేటర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.