Sunday, December 14, 2025

Press Club of India election result


*#SaveJournalism ✊*

*Press Club of India election result:—*

*President: Sangeeta Barooah Pisharoty*

*Vice President: Jatin Gandhi*

*Secretary General: Afzal Imam*

*Joint Secretary: PR Sunil*

*Treasurer: Aditi Rajput*

*#PCIElection2025 #PressClubElection*

https://x.com/Praja_Snklpm/status/2000195836408737812?t=FYgigkk1lNipCWm1Y5zO9w&s=08

*_Congratulations @sangbarooahpish, the first woman President of the Press Club of India_*

https://x.com/Praja_Snklpm/status/2000188557290611166?t=OxfEIJBUi0vhGiZEOIeBAA&s=08

*#SaveJournalism ✊*

*_Congratulations @sangbarooahpish, the first woman President of the Press Club of India.Thank you all members of @PCITweets for your immense support for her and the panel._*

Together we will #DefendMediaFreedom 

*_Press club of india के 68 सालों के इतिहास में पहली बार एक महिला पत्रकार ने अध्यक्ष पद पर जीत हासिल किया_*

#PCIElection2025 @PCIOriginal2025 

*#AWJA #kkrAWJA*
*Bapatlakrishnamohan*
*#Hyderabad*
*#Telangana*

Friday, December 12, 2025

రామంతాపూర్ మండల ప్రాథమిక పాఠశాలను సందర్శించిన ఉప్పల్ MLA బండారి లక్ష్మారెడ్డి

మండల ప్రాథమిక పాఠశాల రామాంతపూర్ నందు గల పాఠశాలలో 255 మంది విద్యార్థులకుగాను టీచర్స్ 8 మంది కావల్సి ఉండగా నలుగురు టీచర్స్ ఉన్నారు. ఉపాధ్యాయులు లేకపోవడం విద్యార్థులకు సరైన పద్ధతిలో భోధన చేయలేక పోతున్నాం. కావున విద్యావాలంటరు టీచర్ను మీ ద్వారా పంపగలరు. పాఠశాల ప్రైమిసన్ నందు హైస్కూల్ విద్యార్థులు సుమారు 700, మొత్తం ప్రైమరి, హైస్కూల్ కలిపి 1000 మంది విద్యార్థులు ఉండడంతో మంచినీరు సరిపోవడం లేదు. మాకు అదనపు కనెక్షన్ ఇప్పించగలరు, యూరినల్స్, డ్రైలేజ్ బయటకు వెళ్ళే దారి బాగోలేక దుర్ఘందపు వాసనతో విద్యార్థులు రోగాల బారిన పడే ప్రమాదం ఉంది మరియు MDM పథకము క్రింద విద్యారులందరికి ఇక్కడే వంట చేసి పెట్టే అవకాశం ఉన్నప్పటికి దానికి షేడ్డు లే లేకపోవడంతో వర్షం పడినప్పుడు చాలా ఇబ్బంది కలుగుతుంది. కావున పాఠశాల నందు తరగతి గదులు సరిపోక పోవడంతో విద్యార్థులకు భోదన బయట చేయల్సి వస్తుంది మాకు బిల్డింగ్ పైన మూడు రూమ్లు ఏర్పాటు చేయాలని కోరారు.

సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్ రావు గారు BRS పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Sunday, December 7, 2025

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2025 DAY-1 (DEC 8) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2025

*DAY 1 (DEC 8)  CM SIR Schedule*

రెండు రోజుల పాటు జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025  ఈరోజు (డిసెంబర్​ 8) మధ్యాహ్నం 1.30కు ప్రారంభమవుతుంది. 

ముఖ్యమంత్రి ఎ.రేవంత్​ రెడ్డి మధ్యాహ్నం 12.30కు ఫ్యూచర్​ సిటీకి చేరుకుంటారు. ముందుగా గ్లోబల్ సమ్మిట్​ వేదిక వద్ద  ఏర్పాటు చేసిన  స్టాళ్లను పరిశీలిస్తారు. 

1:30 కు వేడుక ప్రారంభమవుతుంది. ఈ ప్రారంభోత్సవ సమావేశానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ గారు ముఖ్య అతిథిగా హాజరవుతారు. 

ఈ వేడుకపై ముఖ్యమంత్రి  ప్రసంగిస్తారు.  ప్రజా ప్రభుత్వం రెండేళ్ల  విజయోత్సవాలతో పాటు  తెలంగాణ రాష్ట్ర ఉజ్జ్వల అభివృద్ధి లక్ష్యంగా ఆవిష్కరించే ప్రణాళికలను వివరిస్తారు. 

ప్రపంచ ఆర్థిక సదస్సును తలపించేలా  తెలంగాణ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ అంతర్జాతీయ స్థాయి సదస్సు నిర్వహిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన దిగ్గజాలు దాదాపు 3 వేల మంది ఇందులో పాల్గొంటున్నారు. 

ప్రారంభోత్సవ వేడుకల అనంతరం ముఖ్యమంత్రి వివిధ రంగాలకు చెందిన ప్రతినిధుల బృందంతో విడివిడిగా సమావేశమవుతారు.  

దేశ విదేశాల నుంచి వచ్చిన వివిధ రంగాల ప్రతినిధులు, దిగ్గజ కంపెనీల ప్రతినిధులను ఈ సందర్భంగా సీఎం కలుసుకుంటారు. 

ప్రతి 15 నిమిషాలకో వన్ టు వన్​ రౌండ్​ టేబుల్​ మీటింగ్​ లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. 

మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 గంటల వరకు  దాదాపు 15  సమావేశాల్లో సీఎం పాల్గొంటారు. 

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత శ్రీ కైలాష్ సత్యార్థి,  రిపబ్లిక్​ ఆఫ్​ కొరియా ప్రతినిధులు,  ట్రంప్ మీడియా ప్రతినిధులు, అమెజాన్. ఐకియా ప్రతినిధులు, టెక్స్​టైల్​,  ఫర్నిచర్ తయారీ  MSME, ఎలక్ట్రానిక్స్, మాన్యుఫాక్చరింగ్, లాజిస్టిక్స్, వేర్‌హౌజింగ్ ​ రంగ ప్రతినిధులు, SIDBI, వరల్డ్ బ్యాంక్, వెస్ట్రన్ యూనియన్ ప్రతినిధులతో ఈ రౌండ్​ టేబుల్​ సమావేశాలు ఏర్పాటు చేశారు. 

ఏరోస్పేస్, డిఫెన్స్  రంగంలో పేరొందిన కంపెనీల ప్రతినిధులు,  యూనివర్సిటీ ఆఫ్ లండన్‌ ప్రతినిధులు,  వంతార, VinGroup  ప్రతినిధులు,  వివిధ దేశాల నుంచి వచ్చిన రాయబారులు, ఇతర అంతర్జాతీయ ప్రతినిధులతో సమావేశమవుతారు. 

రాత్రి 7 గంటలకు ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన విందులో ముఖ్యమంత్రి పాల్గొంటారు

Wednesday, December 3, 2025

తెలంగాణలో మరో అవినీతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారి

Sai Kumar, Junior Assistant and In-Charge Sub-Registrar, Sub Registrar Office,Tandur of Vikarabad District along with  D.Saikumar, Document Wtiter and D.Ashoke, Assitant Document Writer, near to the same Sub-Registrar Office, were caught by Telangana #ACB Officials for demanding and accepting the #bribe of Rs.16,500/- from the Complainant "to hand over the registered documents of 4 Plots and also to hand over the remaining documents of 7 plots by registering them, from the 11 Plots related to the Complainant".

In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website: ( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.

ఫిర్యాదుధారునికి సంబంధించిన 11 ప్లాట్లకు సంబంధించి రిజిస్ట్రేషన్  అయిన 4 ప్లాట్ల యొక్క దస్తావేజులను అప్పగించడం తో పాటుగా మిగిలిన 7 ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి వాటి దస్తావేజులను అప్పగించడానికి" ఫిర్యాదుధారుని నుండి రూ.16,500/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన వికారాబాద్ జిల్లాలోని తాండూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయపు ఇన్-చార్జ్ సబ్-రిజిస్ట్రార్  మరియు జూనియర్ అసిస్టెంట్ - సాయి కుమార్, సబ్ రిజిస్ట్రార్ వారి కార్యాలయ పరిసర ప్రాంతము లోని దస్తావేజు లేఖకుడు - డి.సాయికుమార్ మరియు సహాయక దస్తావేజు లేఖకుడు డి.అశోక్.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Courtesy / Source by :https://x.com/TelanganaACB/status/1996208690391662676?t=qcQ9KfMzm0fDzF91qWJaNg&s=19

Sunday, November 30, 2025

Notification for Recruitment of 66 Civil Judge Posts

Notification for Recruitment of 66 Civil Judge Posts

Telangana High Court invites online applications for 66 Civil Judge (Junior Division) posts.
Apply from Dec 8 to 29.
Exam dates, hall tickets & CBT details will be announced on the official website.

Notification is available on the High Court website: tshc.gov.in.

#TelanganaHighCourt #CivilJudgeRecruitment #JudicialService #JobNotification #TSHC #Recruitment2025

Courtesy / Source by :
https://x.com/IPRTelangana/status/1995126589244526785?t=M09mtYtmCGxlAOs6FpUUZg&s=19

Friday, November 28, 2025

“తరలిరండి – ఉజ్వల తెలంగాణలో పాలుపంచుకోండి..” సీఎం రేవంత్ రెడ్డి


“తరలిరండి – ఉజ్వల తెలంగాణలో పాలుపంచుకోండి..” అన్న నినాదంతో ప్రజా ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రపంచంలో పేరొందిన ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, టెక్నాలజీ రంగ నిపుణులు హాజరుకానున్నారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్​ #BharathFutureCity లో జరగనున్న ఈ సదస్సు  నిర్వహణకు భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి.

❇️హైదరాబాద్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలని నిర్ణయించిన  ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు ప్రముఖులకు ఆహ్వానాలు పంపించారు. ఇందుకోసం దేశ విదేశాలకు చెందిన దాదాపు 3 వేల మంది ప్రముఖులకు ప్రభుత్వం ఆహ్వానిస్తోంది.

❇️బ్రిటన్ మాజీ ప్రధాని @TonyBlairEU, ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్విడర్, పారిశ్రామిక దిగ్గజం @anandmahindra, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయల్ ఫ్యామిలీ సభ్యులు, వివిధ కంపెనీల అంతర్జాతీయ స్థాయి సీఈఓలు సదస్సుకు హాజరవుతున్నట్టు ఇప్పటికే సమాచారం పంపించారు.

❇️#UAE రాజవంశానికి చెందిన, ఎమిరేట్స్ గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్స్ డైరెక్టర్ షేఖ్ తారిక్ బిన్ ఫైజల్ అల్ ఖసిమి, #RasAlKhaimah ప్రతినిధులు, డుయిష్ బోర్సే (#DeutscheBörse) గ్రూప్ హెడ్ Ludwig Heinzelmann , ఎన్రిషన్ (#Enrission) వ్యవస్థాపక భాగస్వామి #Winston, మాండయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్ #MandaiWildLife గ్రూప్ సీఈఓ Bennett Neo తో పాటు పలు టెక్ కంపెనీల సీఈవోలు, పెట్టుబడిదారులు, స్టార్టప్ వ్యవస్థాపకులు ఈ సదస్సులో పాల్గొనడానికి ఇప్పటికే సంసిద్ధతను తెలియజేశారు.

❇️‘2047 నాటికి వికసిత్ భారత్ - జాతీయ వృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ 2047’ దార్శనిక పత్రం తయారు చేసింది. ఆర్థిక వృద్ధి, అన్ని రంగాల ప్రగతి, సంక్షేమం, సాధికారత, సమ్మిళిత వృద్ధి లక్ష్యంగా భవిష్యత్తు తెలంగాణకు రోడ్‌మ్యాప్‌ను రూపొందించింది.

❇️ఈ లక్ష్యాలను.. ప్రభుత్వం సంకల్పాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించేందుకు డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో #TelanganaRisingGlobalSummit2025 ను నిర్వహిస్తున్నాం. తప్పకుండా తరలిరండి..’ అని ముఖ్యమంత్రి గారి పేరిట సందేశంతో ఆహ్వాన లేఖలు పంపించారు.

❇️తెలంగాణ భవిష్యత్ ప్రణాళికలను ఆవిష్కరించడం, పెట్టుబడులకు గమ్యస్థానంగా రూపొందిన ఇక్కడి వాతావరణం, విధానాలు, స్పష్టమైన లక్ష్యాలతో రాష్ట్ర అభివృద్ధి సాధన అంశాలను ఈ వేదికగా చాటి చెప్పాలని ప్రభుత్వం సంకల్పించింది.

లియోనెల్ మెస్సీ..
❇️రెండు రోజుల పాటు జరిగే సదస్సులో డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్‌ను ముఖ్యమంత్రి గారు ఆవిష్కరిస్తారు.

❇️తర్వాత ఈనెల 13న ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం, గ్రెటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ #GOAT లయనెల్ మెస్సీ హైదరాబాద్‌కు రానున్నారు. ఆయన పాల్గొనే వేడుకలోనే ప్రత్యేక ఫుట్‌బాల్ మ్యాచ్‌ నిర్వహిస్తారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సుకు ఇది ప్రత్యేక ఆకర్షణగా, ముగింపు ఘట్టంగా నిలువనుంది. #Messi #Hyderabad
#MessiInHyderabad #TelanganaRising2047

Courtesy / Source by :

https://x.com/TelanganaCMO/status/1994665836997657072?t=R6pvGVQWiKqQttOC1j0mWQ&s=19