Sunday, June 7, 2026

_సీఎం బందోబస్తు విధులు ముగించుకొని తిరుగు ప్రయాణంలో వస్తుండగా దుర్ఘటన_

*పిడుగుపాటుకు గురై ఏఆర్ కానిస్టేబుల్ రాజు మృతి*

*సీఎం బందోబస్తు విధులు ముగించుకొని తిరుగు ప్రయాణంలో వస్తుండగా దుర్ఘటన*
 
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 6:

బందోబస్తు విధులు ముగించుకొని తిరిగి వస్తుండగా పిడుగుపాటుకు గురై ఏఆర్ కానిస్టేబుల్ రాజు మృతి.కానిస్టేబుల్ రాజు  కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన జిల్లా ఎస్పీ.డాక్టర్.సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ IPS.నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం ఉల్పారా గ్రామానికి చెందిన మద్దమల్ల.రాజు 2014 బ్యాచ్ ఏ ఆర్ కానిస్టేబుల్ గా ఎంపికై నాగర్ కర్నూల్ ఆర్మూడ్ రిజర్వులో విధులు నిర్వర్తిస్తున్నాడు.గత రెండు రోజులుగా సీఎం బందోబస్తు నిమిత్తం సోమశిల లో విధులు నిర్వర్తిస్తున్నారు.శుక్రవారం సాయంత్రం బందోబస్తు విధులు ముగించుకొని తిరుగు ప్రయాణంలో వస్తుండగా  మామిళ్ళపల్లి గ్రామం సమీపంలో  పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మరణించడం జరిగింది.ఈ సమాచారం అందుకున్న ఉప్పునుంతల పోలీసులు మృతదేహాన్ని నాగర్ కర్నూల్ గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు.ఈ సంఘటనపై జిల్లా ఎస్పీ  గారు స్పందిస్తూ జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వెళ్లి  ఏఆర్ కానిస్టేబుల్ రాజు పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించినారు.వారి యొక్క కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యాన్ని చెప్పడం జరిగింది.అలాగే రేపు వారి యొక్క స్వగ్రామమైన ఉల్పర గ్రామం వంగూరు మండలం నందు ప్రభుత్వ లాంఛనాలతోటి అంత్యక్రియలు జరుగుతాయని తెలిపారు.

_సోషల్ మీడియా లో పోస్ట్లు చేసేటప్పుడు ఆలోచించండి_

*సోషల్ మీడియా లో పోస్ట్లు చేసేటప్పుడు ఆలోచించండి*

*సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తే జైలుకు - తెలంగాణ పోలీస్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 6:

ఉద్దేశ్యపూర్వకంగా సోషల్ మీడియాలో గౌరవ సీఎం గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొర్ర చందర్ లాల్ అనే వ్యక్తి పై  కేసు (395/2026) నమోదు చేసి జైలుకు పంపించిన తెలంగాణ పోలీసులు. సోషల్ మీడియాలో మితిమీరినవ్యాఖ్యలు చేసేటప్పుడు ఇంగితజ్ఞానం మర్చిపోవద్దు. అలా చేస్తే చట్టం పని చట్టం చేస్తుంది.

_రాజ్యాంగం ఇంకా బతికే ఉందా? - చెన్‌బసమ్మ కుటుంబ సభ్యులు_

*న్యాయం కోసం ఎదురుచూసి కన్నుమూసిన వృద్ధురాలు*

*రాజ్యాంగం ఇంకా బతికే ఉందా? - చెన్‌బసమ్మ కుటుంబ సభ్యులు*

*మార్చ్ 17,2026 నాడు "మీడియా టుడే" లో "వృద్ధ మహిళ న్యాయ పోరాటం" వార్త కథనం కూడా వచ్చింది*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 6:

వికారాబాద్ జిల్లా, తాండూర్ పట్టణంకు చెందిన చెన్‌బసమ్మ మరణం అధికార యంత్రాంగం వైఫల్యానికి నిదర్శనమా?. అనారోగ్యంతో బాధపడుతూ, తనకు సంబంధించిన ఆస్తి మరియు న్యాయ సమస్య పరిష్కారం కోసం సంవత్సరాల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి చివరకు పక్షవాతంతో మంచానికి పరిమితమైన 75 ఏళ్ల వృద్ధురాలు శ్రీమతి చెన్‌బసమ్మ గారు చివరకు 29-05-2026న కన్నుమూశారు.మార్చ్ 17,2026 నాడు "మీడియా టుడే" లో "75 ఏళ్ల వృద్దురాలు పక్షవాతంతో మంచాన పడ్డా సంవత్సరాలనుండి న్యాయ పోరాటం" వార్త కథనం కూడా వచ్చింది. అయినా అధికారులు స్పందించలేదు. ప్రభుత్వ అధికారిక మాధ్యామాల ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మరియు ముఖ్యమంత్రి కార్యాలయం CMOHYD,వికారాబాద్ జిల్లా కలెక్టర్ కు, స్థానిక చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశవేశ్వరరెడ్డి కి, తాండూర్ నియోజకవర్గం శాసనసభ్యులు మనోహర్ రెడ్డి కి,తాండూర్ మున్సిపల్ చైర్మన్ కు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. ఇదేనా ప్రజాపాలన - ప్రగతి పాలన అని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.
ప్రశ్న ఏమిటంటే — తన జీవితకాలంలో న్యాయం కోసం ఎదురు చూసిన ఒక వృద్ధురాలికి న్యాయం చేయలేకపోతే, రాజ్యాంగం కల్పించిన హక్కులు సామాన్య ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి?
ప్రభుత్వ కార్యాలయాలు,జిల్లా కలెక్టర్ కార్యాలయం,రెవెన్యూ శాఖ, మున్సిపల్ శాఖ, ప్రజావాణి, ఉన్నతాధికారులు, ఇంకా అనేక వేదికల ద్వారా సమస్యను పలుమార్లు తెలియజేసినా పరిష్కారం దొరకకపోవడం బాధాకరం.అనేక ఫిర్యాదులు, పత్రాలు, వినతులు, ఆధారాలు సమర్పించినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో, చెన్‌బసమ్మ గారు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రతి సంవత్సరం మహిళా హక్కుల గురించి గొప్పగా మాట్లాడే సమాజం, ఒక వృద్ధ మహిళ న్యాయం కోసం ఎదురుచూస్తూ కన్నుమూసినప్పుడు ఎక్కడ ఉంది? ప్రజల హక్కులను కాపాడాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖలు ఈ పరిస్థితికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా?
"న్యాయం ఆలస్యమైతే అది కూడా అన్యాయమే" అనే సూత్రాన్ని ఈ సంఘటన మరోసారి గుర్తు చేస్తోంది.చెన్‌బసమ్మ గారు ఇక లేరు.కానీ ఆమె అడిగిన ప్రశ్నలు ఇంకా సమాధానం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాయి.
పేదలకు న్యాయం పొందే హక్కు ఉందా?వృద్ధుల సమస్యలు పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత కాదా?రాజ్యాంగం కల్పించిన హక్కులు కేవలం పుస్తకాలకే పరిమితమా?అధికారులు స్పందించకపోతే సామాన్యుడు ఎవరిని ఆశ్రయించాలి? కుటుంబ సభ్యుల విజ్ఞప్తి ఏమిటంటే, చెన్‌బసమ్మ గారు జీవించి ఉండగా పరిష్కారం కాలేకపోయిన ఈ సమస్యను ఇప్పటికైనా సంబంధిత అధికారులు పరిశీలించి న్యాయం చేయాలి.అదే "ఆమె ఆత్మకు నిజమైన శాంతి కలిగించే మార్గమని" వారు కోరుతున్నారు.
— కుటుంబ సభ్యులు

Sunday, May 31, 2026

జాతీయ జంతువు,గో మాంసం అమ్మడం,ఎగుమతుల నిషేధం తీసుకురావొచ్చు కదా - ఆకునూరి మురళి,IAS రిటైర్డ్*

*జాతీయ జంతువు,గో మాంసం అమ్మడం,ఎగుమతుల నిషేధం తీసుకురావొచ్చు కదా - ఆకునూరి మురళి,IAS రిటైర్డ్*

*ట్విట్టర్ వేదికగా సూచనలు చేసిన ఆకునూరి మురళి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, మే 29:

మీ వైపు(ముస్లీములు) నుండి ఇట్లాంటి ప్రతిపాదన రావడం మంచి పరిణామం.మరి అధికార పార్టీ బీజేపీ ఇలాంటి చట్టం (జాతీయ జంతువు,గో మాంసం అమ్మడం,ఎగుమతుల నిషేధం) తీసుకురావొచ్చు కదా.ఇలాంటిదే మైక్ లో రోజు నమాజ్ (Azaan) ను కూడా ఆపేస్తే బెటర్.దీని వలన అందరికి disturbance ముసలి వాళ్లకు,రోగులకు,చంటి పిల్లలకు చాలా disturbance. హిందువులు కూడా గుడులలో రకరకాల పండగలప్పుడు వేడుకల పేరు మీద అర్ధరాత్రి వరకు మైకుల ద్వారా పాటలు పెట్టడం కూడా అందరికి disturbance. అక్కడక్కడా చర్చీలు కూడా మైకులు మొదలు పెట్టిండ్రు. ఇవ్వన్నీ కూడా ఆపేస్తే ఒక మంచి సమాజం ను నిర్మించినట్టు అవుతుంది.మూడు మతాల పెద్దలు కూర్చొని ఈ విషయాల మీద మాట్లాడుకొని ప్రభుత్వాలకు ప్రతిపాదనలు ఇస్తే సమాజం లో మంచి సామరస్య వాతావరణం నెలకొల్పవచ్చు.లేకపోతే రాజకీయ స్వార్ధపరులు మతాలను తమ తమ రాజకీయాలకు వాడుకోడం ఇలాగే నడుస్తుంది .దాని ద్వారా సమాజం నాశనం కావడానికి దారి తీస్తుంది.

పిల్లల ప్రాణాలు గొప్పవా? లేక 179 సంవత్సరాల చరిత్ర గొప్పదా?

*పిల్లల ప్రాణాలు గొప్పవా? లేక 179 సంవత్సరాల చరిత్ర గొప్పదా?*

*అనూరాధ రావు - బాలల హక్కుల సంఘం*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, మే 30:

179 ఏళ్లుగా చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నాం,ఇది సంప్రదాయం అని చెప్పుతున్నారు బత్తిన ఫ్యామిలీ.ఇది ఎక్కడ శాస్త్రీయంగా నిరూపించని ప్రసాదం.దీనిలో ఎలాంటి ఔషధ గుణాలు లేవని నిరూపించింది బాలల హక్కుల సంఘం.2013లో- గతంలో దీన్ని చేప మందు అని చేప్పవారు,బాలల హక్కుల సంఘం 2013లో లోకాయుక్త దృష్టికి తీసుకు వచ్చింది.దీనిలో ఎలాంటి మందు / ఔషధం లేదు కేవలం పిండి,పసుపు,నూనె మాత్రమే ఉంది అని లాబరెటరీ పరీక్షల ద్వారా నిరూపించింది.
దీన్ని మందు అనకూడదు ప్రసాదం అనాలి అని జస్టిస్ సుభాషణ్ రెడ్డి గారు తీర్పు ఇచ్చారు.పిల్లలకు WHO సూచించిన మందులనే వాడాలి.పిల్లలపై ప్రయోగాలు చేసే అధికారం ఎవ్వరికి లేదు.ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం.లాలాజలం ద్వారా ఎన్ని రకాల అంటు వ్యాధులు వస్తాయో తెలుసా? ఒకరి నోట్లో పెట్టిన చేయి,ఇంకొకరి నోట్లో పెట్టడం వల్ల అనేక అంటు వ్యాధులు వ్యాప్తి చెందుతాయి.చేపమింగడం చిన్న పిల్లలకు చాలా కష్టం.ఒక్కోసారి శ్వాస ఆగిపోవచ్చు గొంతులో చేప అడ్డుపడి.ప్రతి తల్లి తండ్రి ఆలోచించాల్సిన విషయం.ఇంత వరకు ఆస్తమా తగ్గిన వాళ్లు ఎవరైనా ఉన్నారా? అంటే ఎలాంటి ఇతర ఔషధాలు వాడకుండా, ఒక్క ఫిష్ ప్రసాదం తీసుకుని ఆస్తమా తగ్గిన వారు ఉన్నారా?చేపలోని మెర్క్యురీ, మెటల్స్ చిన్న పిల్లల నాడి వ్యవస్థ పైనా,కిడ్నీ ప్రభావం చూపెడతాయి.పిల్లలకు ఫిష్ ప్రసాదం వేయడం పూర్తిగా  నిషేదించాలి.బత్తిన సోదరులు సైంటిఫిక్గా నిరూపణ చేయ్యాలి.
ప్రభుత్వం మూఢనమ్మకాలను ప్రచారం చేయడం,ప్రోత్సహించడం కరెక్ట్ కాదు.బత్తిన సోదరులు పంపిణీ చేసే ఈ అశాస్త్రీయ ప్రసాదం కోసం ఆరెంజ్మెట్స్ ఆపేయాలి అని బాలల హక్కుల సంఘం డిమాండ్.

మెట్లచిట్టాపూర్ లో కాలిపోయిన దాదాపు 2వేల చెట్ల ఈత వనం గీత కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయాలి*

*మెట్లచిట్టాపూర్ లో కాలిపోయిన దాదాపు 2వేల చెట్ల ఈత వనం గీత కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయాలి*

*జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ (IAS) మరియు స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ సానుకూల స్పందన*

బాపట్ల కృష్ణమోహన్,మీడియా టుడే, మే 30:

జగిత్యాల జిల్లా,కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం,మెట్పల్లి మండలం,మెట్లచిట్టాపూర్ గ్రామంలో కొద్దిరోజుల క్రితం కాలిపోయిన దాదాపు 2వేల చెట్ల ఈత వనం కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున సహాయం కోసం,గ్రామానికి చెందిన పలు అభివృద్ధి పనుల కోసం ఎమ్మెల్యే గారి చొరవతో జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ (IAS)ను కలిసిన గీత కార్మిక కుటుంబ సభ్యులు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జరిగిన నష్టాన్ని అంచనావేసి ఆ నివేదికను ముఖ్యమంత్రి ద్రుష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం తరుపున సహాయం అందేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు.ఈ సందర్బంగా కోరుట్ల ఎమ్ఎల్ఏ కల్వకుంట్ల సంజయ్ కుమార్ మాట్లాడుతూ మెట్లచిట్టాపూర్ గ్రామ అభివృద్ధిలో తాను ఎప్పుడు ముందుంటానని, ప్రజాసమస్యల పరిష్కారం కోసం కట్టుబడిఉంటానని అన్నారు. నిన్న గ్రామాన్ని సందర్శించి కాలిపోయిన దాదాపు 2వేల చెట్ల ఈత వనం ప్రాంతంను సందర్శించి గీత కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున నష్టపరిహారం అందించేలా చూసుకుంటానని హామీ ఇవ్వడం జరిగింది.గ్రామంలో త్రాగునీటి కొరకు మరియు ప్రజా అవసరాల నిమిత్తం బోరు బావులు వేయించడం కోసం,శిథిలావస్థ లో ఉన్న ప్రభుత్వ పాఠశాల పునర్నిర్మాణం మరియు అసంపూర్తిగా మిగిలిపోయిన పాఠశాల భవనం నిర్మాణం కొరకు ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ కు గ్రామ సర్పంచ్ అరుణ గంగాధర్ విన్నవించగా వారు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ద్వారా సమస్యలు వెంటనే పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

హైదరాబాద్ జల వ్యవస్థ – విచ్ఛిన్నమైన గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ*

*హైదరాబాద్ జల వ్యవస్థ – విచ్ఛిన్నమైన గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ*

*సీతారాం ధూళిపాళ - వ్యవస్థాపక అధ్యక్షులు,ది సిటిజన్స్ కౌన్సిల్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, మే 30:

హైదరాబాద్ నగరం ఒకప్పుడు కుతుబ్ షాహీలు,నిజాంలు అభివృద్ధి చేసిన అద్భుతమైన గొలుసుకట్టు చెరువుల (Chain-Link Lakes) వ్యవస్థతో ప్రసిద్ధి చెందింది.ఒక చెరువు నిండితే అదనపు నీరు కాలువలు, వాగులు,నాళాల ద్వారా తదుపరి చెరువుకు చేరేది.ఈ సహజ ప్రక్రియ వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు సమృద్ధిగా పునరుద్ధరించబడేవి. అదే సమయంలో వరదల తీవ్రత కూడా తగ్గేది.నేడు కోటి మందికి పైగా జనాభా కలిగిన హైదరాబాద్ మహానగర ప్రాంతంలో ఈ సహజ జల వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. వేలాది చెరువులు,కుంటలు, వాటిని అనుసంధానించే ఫీడర్ ఛానెల్లు ఆక్రమణలు,రియల్ ఎస్టేట్ అభివృద్ధి,ప్రణాళికలేని పట్టణీకరణ కారణంగా కనుమరుగవుతున్నాయి లేదా పరస్పర అనుసంధానం కోల్పోతున్నాయి.ముఖ్యంగా ఫీడర్ ఛానెల్ల ఆక్రమణలు, నాళాల కాంక్రీటీకరణ ఆందోళనకర అంశాలు. గతంలో మట్టి నాళాలు వర్షపు నీటిని భూమిలోకి ఇంకించి భూగర్భ జలాలను పెంచేవి. ప్రస్తుతం కాంక్రీటు నాళాలు నీటిని వేగంగా తరలిస్తున్నప్పటికీ, భూమిలోకి నీరు ఇంకే అవకాశాన్ని పూర్తిగా అడ్డుకుంటున్నాయి. అలాగే రోడ్లు,కాలనీలు,వాణిజ్య సముదాయాల విస్తృత కాంక్రీటీకరణ కారణంగా నగరంలోని సహజ జల శోషణ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయింది.దీని ఫలితంగా హైదరాబాద్ వర్షాకాలంలో వరదలు,వేసవిలో నీటి కొరత అనే విరుద్ధ పరిస్థితిని ఎదుర్కొంటోంది. తగినంత వర్షపాతం నమోదవుతున్నప్పటికీ,అధిక భాగం వర్షపు నీరు ఉపరితల ప్రవాహంగా వెళ్లిపోతోంది.దీంతో భూగర్భ జలాలు క్షీణించి బోర్‌వెల్లు,ట్యాంకర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.దీర్ఘకాలిక జల భద్రత కోసం ప్రభుత్వం గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ పునరుద్ధరణకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఫీడర్ ఛానెల్లలోని ఆక్రమణలను తొలగించడం, చెరువులను పరస్పరం అనుసంధానం చేయడం,బఫర్ జోన్లను పరిరక్షించడం,నాళాల అనవసర కాంక్రీటీకరణను నివారించడం, ప్రతి భవనం మరియు కాలనీలో వర్షపు నీటి సంరక్షణ గుంతలు (Rain Water Harvesting Pits) మరియు ఇంకుడు గుంతలను తప్పనిసరి చేయడం అత్యవసరం. హైదరాబాద్‌లో భూగర్భ జలాల సంక్షోభం వర్షాల కొరత వల్ల కాదు; ప్రకృతి సిద్ధమైన జల నిర్వహణ వ్యవస్థను విచ్ఛిన్నం చేయడం వల్ల ఏర్పడింది. భవిష్యత్ తరాలకు నీటి భద్రత కల్పించాలంటే గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ,భూగర్భ జలాల రీఛార్జ్‌కు ప్రాధాన్యతనిచ్చే పట్టణ ప్రణాళికలను అమలు చేయాల్సిన అవసరం ఉంది.