Tuesday, January 6, 2026

రామంతాపూర్ డివిజన్‌కు ప్రత్యేక పోలీస్ స్టేషన్ మంజూరు చేయాలి

ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని రామంతాపూర్ డివిజన్‌కు ప్రత్యేక పోలీస్ స్టేషన్ మంజూరు చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్  రెడ్డి గారిని కలిసి విజ్ఞప్తి చేశారు.

రామంతాపూర్ డివిజన్‌లో లక్ష జనాభా పైగా నివసిస్తుండగా, ప్రస్తుతం ఈ ప్రాంతం ఉప్పల్ పోలీస్ స్టేషన్ మరియు ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో విభజించబడి ఉండటంతో పోలీసు పర్యవేక్షణలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఎమ్మెల్యే గారు లేఖలో వివరించారు.

విస్తీర్ణం ఎక్కువగా ఉండటం, జనసాంద్రత అధికంగా ఉండటంతో పాటు అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజల భద్రత కోసం రామంతాపూర్ డివిజన్‌కు ప్రత్యేక పోలీస్ స్టేషన్ అత్యవసరమని పేర్కొన్నారు.

కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటుతో చట్ట అమలు మరింత పటిష్టమై, నేర నియంత్రణ, పర్యవేక్షణ మెరుగుపడి ప్రజలకు భద్రతా భావం పెరుగుతుందని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు తెలిపారు. ఈ అంశంలో పూర్తి సహకారం అందిస్తామని డీజీపీకి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో BRS పార్టీ రాష్ట్ర నాయకులు గంధం నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Monday, January 5, 2026

గల్ఫ్ జైలులో ఉన్న నిర్మల్ జిల్లా సోన్ మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన ముండ్ల రాజన్నను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలి


గల్ఫ్ జైలు నుంచి విడుదల కావాలంటే
భారతీయుడు అని నిరూపించుకోవాలి,

● సహాయం కోసం 'ప్రవాసీ ప్రజావాణి' తలుపు తట్టిన బాధితుడి కుటుంబ సభ్యులు, 

● ఓటర్ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు లాంటి గుర్తింపు పత్రాలు లేవు,

● బ్యాంకు పాస్ బుక్, ఎల్ఐసీ పాలసీ, ఒక గ్రూప్ ఫోటో మాత్రం ఉన్నాయి, 

నిర్మల్ జిల్లా: సోన్ మండలం మాదాపూర్, గ్రామానికి చెందిన ముండ్ల రాజన్న (59) అనే గల్ఫ్ కార్మికుడు 18 సంవత్సరాల క్రితం ఉపాధి కోసం యూఏఈ దేశంలోని దుబాయికి వెళ్ళి, అక్కడే ఉండిపోయాడు. మూడు నెలల క్రితం అక్కడి పోలీసుల తనిఖీల్లో అరెస్టయి అబుదాబి జైల్లో మగ్గుతున్నాడు. ముండ్ల రాజన్న, భారతీయుడు అని నిరూపించుకునేందుకు పాత పాస్ పోర్ట్ జీరాక్స్ గాని, ఇతర సాక్ష్యాలు గాని లేనందున యూఏఈ, దేశ రాజధాని అబుదాబి లోని ఇండియన్ ఎంబసీ తాత్కాలిక పాస్ పోర్ట్ (ఎమర్జెన్సీ సర్టిఫికెట్) జారీ చేయలేకపోతున్నది.  

ఈ నేపథ్యంలో ముండ్ల రాజన్నను గల్ఫ్ జైలు నుంచి విడిపించి, భారత్‌కు తిరిగి తీసుకురావాలంటూ ఆయన భార్య ముండ్ల లక్ష్మి, కుమారుడు నితిన్, కుమార్తె నిఖిత లు ఇటీవల హైదరాబాద్ లోని 'సీఎం ప్రవాసీ ప్రజావాణి' వద్ద, తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ ఛైర్మన్, అంబాసిడర్ డా. బిఎం వినోద్ కుమార్, వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి లను కలిసి విజ్ఞప్తి చేశారు. గతంలో హైదరాబాద్ పాస్ పోర్ట్ ఆఫీసర్ గా పనిచేసిన అనుభవం కలిగిన డా. వినోద్ వారికి మార్గదర్శనం చేశారు. ముండ్ల రాజన్నకు చెందిన అన్ని రకాల పత్రాలు, లిఖిత సాక్ష్యాలు (డాక్యుమెంటరీ ఎవిడెన్స్) సేకరించి దరఖాస్తు చేస్తే, పాస్ పోర్ట్ ఆఫీస్ లో రికార్డులు సెర్చ్ చేయించి పాత పాస్ పోర్ట్ వివరాలు రాబట్టి సహాయం చేస్తామని ఆయన వారికి సూచించారు. 

ఈ మేరకు ముండ్ల రాజన్న భార్య లక్ష్మి అందుబాటులో ఉన్న ఆధారాలతో సోమవారం ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి మెయిల్ ద్వారా వినతిపత్రం పంపారు. నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఆదిలాబాద్, ఎంపీ గోడం నగేష్ లకు ప్రతులు పంపారు. అబుదాబి లోని తెలంగాణ సామాజిక కార్యకర్తలు గడ్చంద నరేందర్, ప్రియా సింగిరెడ్డి లు ఎంబసీతో సమన్వయం చేస్తున్నారు. అబుదాబి లోని సామాజిక సేవకులు గడ్చంద నరేందర్ సెప్టెంబర్ లో సెలవుపై నిర్మల్ జిల్లాను సందర్శించిన సందర్భంగా, బాధిత కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ఆయనకు వివరించారు. నరేందర్ అప్పుడే సమస్యను నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, నిర్మల్ జిల్లా ప్రవాసీ హెల్ప్ లైన్ నిర్వాహకులు, కార్మిక శాఖ అధికారి ముత్యం రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.  

ఈ సందర్భంగా మంద భీంరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) ప్రత్యేక చొరవ తీసుకొని, జీఏడి ఎన్నారై విభాగం ద్వారా ప్రయత్నాలు ప్రారంభించిందని అన్నారు. హైదరాబాద్ పాస్ పోర్ట్ కార్యాలయంలో రికార్డుల  శోధన, నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ద్వారా వ్యక్తి గుర్తింపు ధృవీకరణ, అబుదాబి లోని భారత దౌత్య కార్యాలయం ద్వారా మద్దతు కోసం ఏక కాలంలో మూడు కార్యాలయాలకు తెలంగాణ ప్రభుత్వం ద్వారా లేఖలు రాసే విధంగా తాము కృషి చేస్తున్నామని భీంరెడ్డి వివరించారు. తెలంగాణ బిడ్డలు ప్రపంచంలో ఎక్కడున్నా వారి కష్టాల్లో పాలు పంచుకుంటామని, ఆదుకుంటామని ఆయన అన్నారు.

Saturday, January 3, 2026

అభిమానులు / చిన్ననాటి మిత్రులతో రఘునాథ్ వెరబెల్లి

#raghunathverabelli #mancherial #friends

*_నిర్మల్ జిల్లా ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం దస్తురాబాద్ మండలం బుట్టాపూర్ గ్రామంలో అభిమానులు & చిన్ననాటి మిత్రులతో ఆత్మీయ పలకరింపు లో భాగంగా కాబోయే ఎమ్మెల్యే రఘునాథ్ వెరబెల్లి గారు._*

*_➡️The prominent Bharatiya Janata Party (BJP) leader in Mancherial is Raghunath Verabelli (also known as Raghunath Rao Verabelli)._*
 
*_➡️He serves as the BJP Telangana State Vice President and previously held the position of BJP Mancherial District President._*

*_➡️He was the BJP's Member of the Legislative Assembly (MLA) contestant for the Mancherial constituency in both the 2018 and 2023 Telangana Assembly elections, where he was the runner-up in 2023._*

Wednesday, December 31, 2025

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి లో బయటపడ్డ భారీ 'హనీ ట్రాప్' ముఠా

తేదీ: 31.12.2025
ప్రెస్ నోట్
జగిత్యాల: జిల్లా మెట్‌పల్లి లో బయటపడ్డ భారీ 'హనీ ట్రాప్' ముఠా.. రౌడీ షీటర్ నేతృత్వంలో విచ్చలవిడి దందా!.........
ఉచ్చులో పడితే నగ్న వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ - ముగ్గురు నిందితుల అరెస్ట్, ముగ్గురు పరారీ……...
వ్యాపారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు - రౌడీ షీటర్ సహా ముగ్గురు కటకటాల్లోకి.

మెట్‌పల్లి (నేర విభాగం): అమాయక వ్యక్తులను, ముఖ్యంగా ధనవంతులను టార్గెట్ చేస్తూ మహిళలతో వల వేసి, ఏకాంతంగా ఉన్న సమయంలో నగ్న వీడియోలు తీసి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న ఒక ప్రమాదకరమైన హనీ ట్రాప్ ముఠాను మెట్‌పల్లి పోలీసులు ఛేదించారు. ఈ ముఠాకు నాయకత్వం వహిస్తున్న రౌడీ షీటర్ కోరుట్ల రాజుతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

కేసు వివరాలు:
పోలీసుల కథనం ప్రకారం.. మెట్‌పల్లి దుబ్బవాడకు చెందిన కోరుట్ల రాజ్‌కుమార్ అలియాస్ రాజుపై గతంలోనే పలు కేసులు ఉండటంతో పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో రాజు, భర్తకు దూరంగా ఉంటున్న బలుమూరి స్వప్న అనే మహిళతో చేతులు కలిపాడు. వీరిద్దరితో పాటు బట్టు రాజశేఖర్, సుంకిటి వినోద్, పులి అరుణ్, మాగని దేవా నర్సయ్యలు ఒక ముఠాగా ఏర్పడ్డారు.

నేర ప్రవృత్తి:

మెట్‌పల్లి హనుమాన్ నగర్‌లోని బచ్‌పన్ స్కూల్ సమీపంలో ఒక గదిని అద్దెకు తీసుకున్న ఈ ముఠా, మహిళల పట్ల బలహీనత ఉన్న ధనవంతుల ఫోన్ నంబర్లు సేకరించేవారు. స్వప్న వారితో ఫోన్లో కవ్వించి మాట్లాడుతూ తన గదికి రప్పించేది. బాధితులు లోపలికి వెళ్లి నగ్నంగా ఉన్న సమయంలో, నిందితులు ఒక్కసారిగా గదిలోకి ప్రవేశించి సెల్ ఫోన్లలో వీడియోలు తీసేవారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి లక్షలాది రూపాయలు వసూలు చేసేవారు. ఇప్పటికే ఈ ముఠా పలువురిని బ్లాక్ మెయిల్ చేసినట్లు విచారణలో తేలింది.

తాజా ఘటన:

మూడు నెలల క్రితం మెట్‌పల్లికి చెందిన ఒక వ్యాపారిని టార్గెట్ చేసిన ఈ ముఠా, ఈ నెల 28న ప్లాన్ ప్రకారం గదికి పిలిపించి నగ్న వీడియోలు తీసింది. విషయం బయటకు రాకుండా ఉండాలంటే 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, లేదంటే చంపేస్తామని బెదిరించారు. బాధితుడు ధైర్యంతో పోలీసులను ఆశ్రయించడంతో ఈ ముఠా గుట్టు రట్టయింది.

అరెస్టయిన వారు:
 * కోరుట్ల రాజ్‌కుమార్ (రౌడీ షీటర్)
 * మాగని దేవా నర్సయ్య
 * బలుమూరి స్వప్న
పరారీలో ఉన్న వారు:
 * బట్టు రాజశేఖర్ (ఎర్దండి)
 * సుంకిటి వినోద్ (ములరంపూర్)
 * పులి అరుణ్ (మెట్‌పల్లి) (రౌడీ షీటర్)

స్వాధీనం చేసుకున్నవి: నిందితుల నుండి 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అందులో గతంలో వారు చేసిన బ్లాక్ మెయిల్ వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని, ఇటువంటి మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెట్‌పల్లి పోలీసులు హెచ్చరించారు.

సి.ఐ. హెచ్చరిక:
ఈ సందర్భంగా సి.ఐ. వి. అనిల్ కుమార్ గారు మాట్లాడుతూ, సోషల్ మీడియా లేదా అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్ నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. ఎవరైనా ఇటువంటి వేధింపులకు గురైతే భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు. ఈ ముఠా గుట్టు రట్టు చేసిన సి.ఐ. మరియు వారి బృందాన్ని జిల్లా పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.
ఇట్లు 
ఎస్సై, మెట్ పల్లి..

Tuesday, December 30, 2025

*_జర్నలిస్టు సంఘాలతో త్వరలో సమావేశం - ఐ అండ్ పిఆర్ కమీషనర్ ప్రియాంక_*


*_జర్నలిస్టు సంఘాలతో త్వరలో సమావేశం - ఐ అండ్ పిఆర్ కమీషనర్ ప్రియాంక_*

_# తెలంగాణ జర్నలిస్టు సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ (జర్నలిస్టు సంఘాల జేఏసీ)కి స్పష్టం_

అతి త్వరలో అన్ని జర్నలిస్టు సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందని, అందరి అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకొని ముందుకు వెళ్ళాలని నిర్ణయించినట్లు సమాచార కమిషనర్ ప్రియాంక స్పష్టం చేశారు.

 ఈ సందర్భంగా రెండు అక్రెడిటేషన్ కార్డుల వ్యవహారంలో జర్నలిస్టుల మధ్య ఎన్నో అనుమానాలను, ఇతర సమస్యలను జేఏసీ నేతలు కమీషనర్ దృష్టికి తీసుకెళ్లారు. కమీషనర్ ను కలిసిన వారిలో జేఏసీ కన్వీనర్లు కే.కోటేశ్వర్ రావు, అనంచిన్ని వెంకటేశ్వరరావు, మామిడి సోమయ్య, పులిపలుపుల ఆనందం, రావికంటి శ్రీనివాస్, గౌటి రామకృష్ణ, రాణా ప్రతాప్, కీర్తి సంతోష్ రాజా తదితరులు పాల్గొన్నారు.

*_జేఏసీ డిమాండ్స్_*
1). రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో 252 మార్గదర్శకాలలోని అభ్యంతరాలను నోటిఫికేషన్‌కు ముందు సవరించాలి.

2) చిన్న వార్తాపత్రికలు, కేబుల్ ఛానెళ్లు మరియు M-ఛానల్ కాకుండా ఇతర వార్తాపత్రికలకు, ప్రతి జర్నలిస్టుకు వారి సీనియారిటీని పరిగణనలోకి తీసుకొని అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలి.

3). రెండు కార్డుల వ్యవస్థకు బదులుగా, డెస్క్ జర్నలిస్టులు కూడా అన్ని జర్నలిస్టుల మాదిరిగానే ఒకే అక్రిడిటేషన్ కార్డు వ్యవస్థను కొనసాగించాలి.

4). తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అయింది. తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులకు 15 సంవత్సరాల సీనియారిటీ నిబంధన అసంబద్ధం. దానిని తొలగించాలి.

6). కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన వారందరికీ ఎటువంటి షరతులు లేకుండా అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి.

7) తెల్ల రేషన్ కార్డులను వెంటనే అందించాలి.

8). జర్నలిస్టుల కుటుంబాలకు ఉచిత విద్య మరియు ఉచిత వైద్యం వెంటనే అందించాలని సంబంధిత విభాగాలకు అధికారిక ఆదేశాలు జారీ చేయాలి.

9). జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు బీమా సౌకర్యాలు కల్పించాలి.

10). 60 సంవత్సరాలు నిండిన జర్నలిస్టులందరికీ నెలకు రూ. 12,000 పెన్షన్ పథకాన్ని అమలు చేయాలి.

11)జర్నలిస్టులకు దేశవ్యాప్తంగా రైల్వే ఫ్రీ పాసులు కల్పించాలి. 

12)దేశవ్యాప్తంగావెహికల్ టోల్గేట్ సౌకర్యం కల్పించాలి

*_నిజమైన జర్నలిస్టులకు అన్యాయం జరగదు -మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి_*


*_నిజమైన జర్నలిస్టులకు అన్యాయం జరగదు -మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి_*

# తెలంగాణ జర్నలిస్టు సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ (జర్నలిస్టు సంఘాల జేఏసీ)కి హామీ 

గతంలో ఇచ్చిన అక్రెడిటేషన్ కార్డుల కంటే అధికంగా ఇస్తామని, నిజమైన జర్నలిస్టులకు తమ ప్రభుత్వ హయాంలో ఎలాంటి చిన్న అన్యాయం జరగనివ్వబోమని సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనను కలిసిన జేఏసీ నాయకులకు హామీ ఇచ్చారు. రాష్ట్ర సచివాలయంలో జర్నలిస్టు సంఘాల జేఏసీ నాయకులతో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ అతి త్వరలో అన్ని జర్నలిస్టు సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందని, అందరి అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకొని మరో జీవో తెస్తామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. డెస్క్ పనిచేసే వారికి, ఫీల్డ్ లో పనిచేసే జర్నలిస్టులకు అనేక సంక్షేమ పథకాలను అంచెలంచెలుగా అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. మంత్రిని కలిసిన జేఏసీ కన్వీనర్లు కే.కోటేశ్వర్ రావు, అనంచిన్ని వెంకటేశ్వరరావు, మామిడి సోమయ్య, పులిపలుపుల ఆనందం, రావికంటి శ్రీనివాస్, గౌటి రామకృష్ణ, రాణా ప్రతాప్, కీర్తి సంతోష్ రాజా తదితరులు పాల్గొన్నారు.

*_జేఏసీ డిమాండ్స్_*
1). రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో 252 మార్గదర్శకాలలోని అభ్యంతరాలను నోటిఫికేషన్‌కు ముందు సవరించాలి.

2) చిన్న వార్తాపత్రికలు, కేబుల్ ఛానెళ్లు మరియు M-ఛానల్ కాకుండా ఇతర వార్తాపత్రికలకు, ప్రతి జర్నలిస్టుకు వారి సీనియారిటీని పరిగణనలోకి తీసుకొని అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలి.

3). రెండు కార్డుల వ్యవస్థకు బదులుగా, డెస్క్ జర్నలిస్టులు కూడా అన్ని జర్నలిస్టుల మాదిరిగానే ఒకే అక్రిడిటేషన్ కార్డు వ్యవస్థను కొనసాగించాలి.

4). తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అయింది. తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులకు 15 సంవత్సరాల సీనియారిటీ నిబంధన అసంబద్ధం. దానిని తొలగించాలి.

6). కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన వారందరికీ ఎటువంటి షరతులు లేకుండా అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి.

7) తెల్ల రేషన్ కార్డులను వెంటనే అందించాలి.

8). జర్నలిస్టుల కుటుంబాలకు ఉచిత విద్య మరియు ఉచిత వైద్యం వెంటనే అందించాలని సంబంధిత విభాగాలకు అధికారిక ఆదేశాలు జారీ చేయాలి.

9). జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు బీమా సౌకర్యాలు కల్పించాలి.

10). 60 సంవత్సరాలు నిండిన జర్నలిస్టులందరికీ నెలకు రూ. 12,000 పెన్షన్ పథకాన్ని అమలు చేయాలి.

11)జర్నలిస్టులకు దేశవ్యాప్తంగా రైల్వే ఫ్రీ పాసులు కల్పించాలి.  

12)దేశవ్యాప్తంగావెహికల్ టోల్గేట్ సౌకర్యం కల్పించాలి




Monday, December 29, 2025

తెలంగాణ లో బడి ఎగ్గొడుతున్న గవర్నమెంట్ టీచర్లు 9000 మంది.పర్లేదు వాళ్లకు జీతం ఇవ్వనక్కరలేదు.

#TelanganaEducation #teachers #facts #TelanganaRising

తెలంగాణ లో గవర్నమెంట్ ఉద్యోగాన్ని పూచిక పుల్లలాగా తీసేసి సెలవు పెట్టకుండా బడి ఎగ్గొడుతున్న టీచర్లు 9000 మంది. పర్లేదు వాళ్లకు జీతం ఇవ్వనక్కరలేదు. 

మరో 9306 మంది ఆన్ డ్యూటీ మీద బడి ఎగ్గొడుతున్నారు. 612 మండలాల్లో 9306 మంది అంటే మండలానికి 15 మంది టీచర్లు ఆన్ డ్యూటీ అన్నమాట. అంటే జీతం తీసుకొని బడి ఎగ్గొట్టే టోళ్లు. యూనియన్ నాయకులు అంత మంది ఉంటారా?

విద్యాశాఖ అంత గుడ్డిగా నడుస్తోందా?
(SOURCE)
                 https://www.instagram.com/p/DS2UyiiEujW/?igsh=MWV1Nm9kd2FyM21pOQ==