Friday, October 24, 2025

*నమిశ్రీ అవినీతికి సహకరించిన సంబందిత ప్రభుత్వ శాఖల అవినీతి అధికారులను సస్పెండ్ చేసి జైళ్ళో పెట్టాలి.*

*ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు.* https://x.com/Praja_Snklpm/status/1981715955261870362?t=J2iZUdkbNA8zLBQGpNmO2Q&s=08

*ఆదాబ్ హైదరాబాద్: 24 Oct 2025*

*సికింద్రాబాద్ ఎస్టేట్ భూములు & అబ్దుల్లాపూర్ మెట్ అటవీభూములు*

*_ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది_*

*Mr రేవంత్ రెడ్డి సారు ఇదేనా #TelanganaRising అంటే ??*

*@HMDA_Gov @Comm_HYDRAA*

*నమిశ్రీ అవినీతికి సహకరించిన సంబందిత ప్రభుత్వ శాఖల అవినీతి అధికారులను సస్పెండ్ చేసి జైళ్ళో పెట్టాలి.*

*@TelanganaCMO @CPRO_TGCM @IPRTelangana @TelanganaCS @Aadabtvlive @iamkondasurekha @HarithaHaram @CollectorRRD @Acpibrahimpatnm @Tahsildaribp @IbrahimpatnamPS @PIBHyderabad @BplplH*

కర్నూలు జిల్లా బస్సు ప్రమాద ఘటనలో గాయపడిన మరియు సురక్షితంగా ఉన్న ప్రయాణికుల వివరాలు

కర్నూలు జిల్లా బస్సు ప్రమాద ఘటనలో గాయపడిన మరియు సురక్షితంగా ఉన్న ప్రయాణికుల వివరాలు :

1.మన్నెంపల్లి సత్యనారాయణ (వయసు 27), తండ్రి ఎం. రవి, సత్తుపల్లి, ఖమ్మం జిల్లా – గాయపడి ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

2.బడంత్ర జయసూర్య (వయసు 24), తండ్రి సుబ్బరాయుడు, మియాపూర్, హైదరాబాద్ – గాయపడి కర్నూలు GGH లో చికిత్స పొందుతున్నారు.

3.అండోజ్ నవీన్ కుమార్ (వయసు 26), తండ్రి కృష్ణాచారి, హయత్‌నగర్, హైదరాబాద్ – గాయపడి చికిత్సలో ఉన్నారు.

4.సరస్వతి హారిక (వయసు 30), తండ్రి రంగరాజు, బెంగళూరు – కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలో ఉన్నారు.

5.నెలకుర్తి రమేష్ (వయసు 36), దత్తలూరు మండలం, నెల్లూరు జిల్లా – స్వల్ప గాయాలు, ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారు.

6.శ్రీలక్ష్మి (నెలకుర్తి రమేష్ భార్య), జస్విత (వయసు 8), అభీరా (వయసు 1.8 సంవత్సరాలు) – ముగ్గురు సురక్షితంగా కర్నూలులో బంధువుల వద్ద ఉన్నారు.

7.కపర్ అశోక్ (వయసు 27), తెలంగాణ రాష్ట్రం – సురక్షితంగా హైదరాబాద్‌కి వెళ్తున్నారు.

8.ముసలూరి శ్రీహర్ష (వయసు 25), నెల్లూరు జిల్లా – గాయపడి కర్నూలు GGH లో చికిత్స పొందుతున్నారు.

9.పునుపట్టి కీర్తి (వయసు 28), ఎస్.ఆర్. నగర్, హైదరాబాద్ – చికిత్స అనంతరం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యి హైదరాబాద్ చేరుకున్నారు.

10.వేణుగోపాల్ రెడ్డి (వయసు 24), తెలంగాణ రాష్ట్రం – చికిత్స అనంతరం హైదరాబాద్ చేరుకున్నారు.

11.ఎం.జి.రామరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా – చికిత్స పూర్తయి హైదరాబాద్ చేరుకున్నారు.

12.ఘంటసాల సుబ్రమణ్యం, కాకినాడ, ఆంధ్రప్రదేశ్ – ఆకాశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

13.అశ్విన్ రెడ్డి – ఎటువంటి గాయాలు లేవు, సంఘటనా స్థలంలో సురక్షితంగా ఉన్నారు.

14.ఆకాశ్ – ఎటువంటి గాయాలు లేవు, సురక్షితంగా ఉన్నారు.

15.జయంత్ కుశ్వాల్, మధ్యప్రదేశ్‌ (హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు) – సురక్షితంగా ఉన్నారు.

16.పంకజ్ ప్రజాపతి – ఎటువంటి గాయాలు లేవు, సురక్షితంగా ఉన్నారు.

17.గుణ సాయి, తూర్పు గోదావరి జిల్లా – స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్నారు.

18.శివా (గణేష్ కుమారుడు) – ఎటువంటి గాయాలు లేవు, బెంగళూరు చేరుకున్నారు.

19.గ్లోరియా ఎల్సా సామ్, బెంగళూరు – ఎటువంటి గాయాలు లేవు, బెంగళూరు చేరుకున్నారు.

20.చారిత్ (వయసు 21), బెంగళూరు – సురక్షితంగా బెంగళూరు చేరుకున్నారు.

21.మొహమ్మద్ ఖిజర్ (వయసు 51), బెంగళూరు – సురక్షితంగా బెంగళూరు చేరుకున్నారు.

22.తరుణ్ (వయసు 27) – బస్సులో ఎక్కకముందే రద్దు చేసుకున్నారు.

డ్రైవర్ల వివరాలు
1.లక్ష్మయ్య, పల్నాడు జిల్లా – ప్రధాన డ్రైవర్‌. సంఘటన సమయంలో బస్సు నడుపుతున్నారు. ప్రమాదం తర్వాత అబ్స్కాండ్‌ అయ్యారు (సంఘటన స్థలం నుండి పరారయ్యారు).
2.శివనారాయణ, ప్రకాశం జిల్లా – స్పేర్ డ్రైవర్‌. ప్రస్తుతం పోలీస్‌ కస్టడీలో ఉన్నారు మరియు విచారణ కొనసాగుతోంది.

ప్రయాణికుల రాష్ట్రాలవారీగా:
👉తెలంగాణ రాష్ట్రం – 6
👉ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం – 11
👉మధ్యప్రదేశ్ – 1
👉కర్ణాటక రాష్ట్రం – 4

మరో ముగ్గురు ఏ రాష్ట్రానికి చెందినవారు తెలియాల్సి ఉంది.
@Collector_JGL 

Source / Courtesy by :

https://x.com/IPRTelangana/status/1981664928810373602?t=mn9So2NzD25H5Ck_ZfvJ9w&s=19

Tuesday, October 21, 2025

*ప్రజా సేవకురాలు, ప్రగతి వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకురాలు బూర్గుల సుమన ఇక లేరు*

*ప్రజా సేవకురాలు, ప్రగతి వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకురాలు బూర్గుల సుమన ఇక లేరు*

రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం బూర్గుల గ్రామ మాజీ ఎంపీటీసీ మరియు మాజీ సర్పంచ్ బూర్గుల సుమన అనారోగ్యంతో ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో కన్నుమూశారు. ఈమె హైదరాబాద్ మొదటి ముఖ్యమంత్రి  బూర్గుల రామకృష్ణారావు సోదరుడి కుమార్తె , బూర్గుల నరసింగరావు చెల్లెలు. ఈమె బూర్గుల గ్రామానికి ఒక సారి ఎంపీటీసీ గా మరియు సర్పంచ్ గా సేవలందించారు.. అంతే కాకుండా ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో తాను టీచర్ గా తన దగ్గర చదువుకున్న ఆ నాటి విద్యార్ధుల సహకారం తో బూర్గులలో "ప్రగతి వెల్ఫేర్ అసోసియేషన్" ను స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, నేడు ఈ అసోసియేషన్ అనేక గ్రామాలకు విస్తరించి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుంది.. అంతేకాదు తాను చనిపోయినా తన శరీరం పదిమందికి ఉపయోగ పడాలని హాస్పిటల్ కి దానం చేస్తున్నట్లు వీలునామా రాసుకున్న గొప్ప వ్యక్తి.  ఆమె లేని లోటు బూర్గుల గ్రామ ప్రజలతో పాటు చుట్టూ పక్కల ప్రజలకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు... 
(Courtesy/ Source)by:➡️𝗚𝗡𝗥

Sunday, October 19, 2025

*_Mr రేవంత్ రెడ్డి "గారు" మిమ్మల్ని బద్నామ్ చేస్తున్న రెవిన్యూ శాఖ అవినీతి అధికారులు._*

https://youtu.be/iO9xmgfmQJ4?si=N2yCnNSiZj8XJ5ZY  

*_ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది_*

*_Mr రేవంత్ రెడ్డి "గారు" మిమ్మల్ని బద్నామ్ చేస్తున్న రెవిన్యూ శాఖ అవినీతి అధికారులు._*
 
*_#TelanganaRising అంటే అవినీతి లో అని అన్ని ప్రభుత్వ శాఖల అవినీతి ప్రభుత్వ అధికారులు / అవినీతి ప్రజాప్రతినిధులు రుజువు చేస్తుండ్రు._*

*@MNatarajanINC*
*@TelanganaCMO* *@CPRO_TGCM @IPRTelangana @TelanganaCS* *@INC_Ponguleti @Bmaheshgoud6666 @PIBHyderabad @aadabhyd* *@INCTelangana @RamMohanINC @TRPpartyTG @BplplH*

https://x.com/Praja_Snklpm/status/1979811942740197680?t=GUsxMmL2fm-ktcjHw3-cOg&s=19
               *****
https://www.instagram.com/reel/DP-5TBHEoOC/?igsh=eTJkNWt6eW1va243
               *****
https://www.facebook.com/share/1CMgZLpaWM/

Saturday, October 18, 2025

*తీరు మార్చుకోండి .... అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్*

*తీరు మార్చుకోండి .... అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్*

హైదరాబాద్... ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనుల అమలులో అన్ని శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీలు, డిపార్ట్‌మెంట్ హెడ్‌లు (హెచ్‌ఓడిలు) తమ నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారుఏ అధికారి అయినా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ప్రభుత్వం సహించబోదని ముఖ్యమంత్రి అధికారులకు గుర్తు చేశారు.

రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా కొందరు అధికారులు పని తీరులో మార్పు రాలేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల అలసత్వం విడనాడి, ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ లక్ష్యాలు, లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నతాధికారులు విధులు నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. అధికారులు సొంతంగా నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావద్దని సీఎం సూచించారు. రాష్ట్రాభివృద్ధితోపాటు రాష్ట్ర ప్రజలందరి సంక్షేమం కోసం అధికారులు కృషి చేయాలని సీఎం సూచించారు.

సీఎంవో కార్యదర్శులు , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో ముఖ్యమంత్రి ఈరోజు తన నివాసంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

పథకాల ప్రయోజనాలను ప్రజలకు చేరవేయడంలో మరింత చురుగ్గా పని చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి.. సీఎస్‌ను అన్ని శాఖల కార్యదర్శుల నుండి ఎప్పటికప్పుడు నివేదికలు తీసుకోవాలని, పనుల పురోగతిని సమీక్షించాలని ఆదేశించారు. పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను త్వరితగతిన అమలు చేయడంలో ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలను తన దృష్టికి తీసుకురావాలని సీఎంఓ అధికారులను ఆదేశించారు.

కేంద్ర నిధుల స్థితిగతులను సమీక్షించిన సీఎం రేవంత్‌రెడ్డి పెండింగ్‌లో ఉన్న కేంద్ర గ్రాంట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద వచ్చే నిధులను వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్ర వాటా చెల్లించి పెండింగ్‌లో ఉన్న కేంద్ర నిధుల విడుదల కోసం ఎదురుచూస్తున్న పథకాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం సూచించారు.

తమ పరిధిలోని శాఖలపై ప్రతివారం తనకు నివేదికలు అందజేయాలని, ప్రగతిని సమీక్షిస్తానని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎంఓ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

*V.S.జీవన్*

Friday, October 17, 2025

*Mr రేవంత్ రెడ్డి సారు ఇదేనా #TelanganaRising అంటే ?*


*ఆదాబ్ హైదరాబాద్:*

*"నమిశ్రీ భూదందా"*

*Mr రేవంత్ రెడ్డి సారు ఇదేనా #TelanganaRising అంటే ?*

*@TelanganaCMO*
*@CPRO_TGCM @IPRTelangana @TelanganaCS @PrlsecyMAUD @cdmatelangana @CommissionrGHMC @Collector_HYD @RdoSecunderabad @Aadabtvlive @PIBHyderabad @TRPpartyTG @PressClubHyd @BplplH @Narhariyarabotu*

https://x.com/Praja_Snklpm/status/1979438425838358905?t=zbxe6C0QNoZARKKlzu_Lew&s=08

Thursday, October 16, 2025

కోర్టు పర్మిషన్తో క్రిమినల్ కేసు బుక్ చేసిన మేడిపల్లి పోలీసులు

భాజపా నేత మేక రాంరెడ్డిపై కేసు నమోదు

- కోర్టు పర్మిషన్తో క్రిమినల్ కేసు బుక్ చేసిన మేడిపల్లి పోలీసులు
-  న్యాయం గెలిచిందంటున్న సీనియర్ జర్నలిస్ట్ జీ కుమార స్వామి
-  మేడిపల్లి సిఐ గోవింద్ రెడ్డి, ఎస్ఐ నర్సింగ్ తిరుపతయ్యలకు కృతజ్ఞతలు..

 అక్షర శోధన న్యూస్ : అక్టోబర్ 17 హైదరాబాద్

 అక్టోబర్ 9 తారీకు ఉదయం సోషల్ మీడియా వేదికగా సీనియర్ జర్నలిస్ట్ జి కుమార స్వామిని బెదిరించిన భాజపా నాయకుడు మేక రామ్ రెడ్డి పైన మేడిపల్లి పోలీసులు కోర్టు పర్మిషన్ తో 352 బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అదేవిధంగా సదరు వ్యక్తికి నోటీసులిచ్చి చార్ షీట్ వేసి కోర్టుకు పంపిస్తామని తెలిపారు.
ఈ మేరకు స్పందించిన బాధితుడు కుమారస్వామి మాట్లాడుతూ.. ఎట్టకేలకు న్యాయం గెలిచిందని, మేడిపల్లి పోలీసుల మీద నమ్మకం ఉంచి సుమారుగా వారం రోజులపాటు వేచి చూడడం జరిగిందని, కోర్టు పర్మిషన్ తో సదరు వ్యక్తి మీద కేసు నమోదు చేసి న్యాయం చేశారని పేర్కొన్నారు. అదేవిధంగా ఇలాంటి వ్యక్తుల మీద నిఘా కూడా ఏర్పాటు చేసి మాలాంటి వారికి రక్షణ కల్పించాలని కోరారు. అదేవిధంగా అతని నుండి మాకు ప్రాణహాని ఉందని, సిటీ పరిధిలో ఎక్కడ, ఎప్పుడు ఏమైనా సదరు వ్యక్తే కారణమని మీడియాతో తెలియజేశారు. ఈ కేసు విషయంలో మాకు సహకరించిన మేడిపల్లి ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులకు, నా తోటి జర్నలిస్టు మిత్రులకు, అదేవిధంగా దళిత సంఘాలు నాయకులకు, ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
(SOURCE)

రౌడీషీటర్ నగర బషిష్కరణ

పత్రికా ప్రకటన

రౌడీషీటర్ నగర బషిష్కరణ

గౌరవ శ్రీ. జి. సుధీర్ బాబు IPS గారు, రాచకొండ పోలీస్ కమిషనర్, ఆదిబట్ల SHO సమర్పించిన రికార్డులను పరిశీలించిన తర్వాత, తేదీ.30.09.2025 న హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్, 1348 ఫస్లీ, సెక్షన్ 26(1) నిబంధనల ప్రకారం రౌడీ షీటర్ అయిన కొడుదుల నవీన్ రెడ్డి S/o కోటి రెడ్డి, వయస్సు: 32 సంవత్సరాలు, Occ: వ్యాపారం, R/o. ప్లాట్ నెం. 34, తిరుమల హోమ్స్, మన్నెగూడ, అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, రంగారెడ్డి జిల్లా. N/o  ముషంపల్లి గ్రామం, నల్గొండ మండలం మరియు జిల్లాకు చెందిన వ్యక్తికి నగర బహిష్కరణ ఉత్తర్వులు నోటీసును జారీ చేశారు. 

స్థానికంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చట్టవిరుద్ధ కార్యకలాపాలలో పాల్గొంటున్నందుకు, ఏసీపీ ఇబ్రహీంపట్నం ద్వారా నోటీసు అందిన ఏడు రోజులలోగా, తనను రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధి నుండి 6 నెలల పాటు ఎందుకు బహిష్కరించకూడదో కారణం తెలపాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. పైన పేర్కొన్న కొడుదుల నవీన్ రెడ్డి S/o కోటి రెడ్డి (రౌడీ షీటర్) పై ఆదిబట్ల పోలీస్ స్టేషన్ లో దాడి, హత్యాయత్నం, క్రిమినల్ బెదిరింపులు, మరియు అల్లర్లు, వంటి నేరాలతో సహా పలు క్రిమినల్ కేసుల నేర చరిత్ర ఉంది. అతను ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ, భయాందోళనలు సృష్టించడంలో పేరుగాంచాడు. అతని నిరంతర బెదిరింపుల కారణంగా, ప్రజలు అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి లేదా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడానికి భయపడుతున్నారు. కావున నగర బహిష్కరణ విధించటం జరిగింది.

@TelanganaCOPs @DcpMalkajgiri @DCPLBNagar @DcpBhongir @DCPMaheshwaram @ntdailyonline @TelanganaToday @eenadulivenews @v6velugu @ManaTelanganaIN @sakshinews @thenewsminute @TOIHyderabad @XpressHyderabad @DeccanChronicle @TheDailyPioneer @TheHansIndiaWeb @the_hindu @TheDailyMilap @TheSiasatDaily @way2_news @abntelugutv @IndianExpress @NewIndianXpress @IndiaToday @bbcnewstelugu

SOURCE / Courtesy by :

https://x.com/RachakondaCop/status/1978311802284032171?t=8rReLHGbHhr7jLqgCh96wg&s=19

Monday, October 13, 2025

*మునగనూరు సర్కారు భూమి కబ్జా లో ఫేక్ రసీదుల కలకలం..?*

*మునగనూరు సర్కారు భూమి కబ్జా లో ఫేక్ రసీదుల కలకలం..?*

*పోలీస్ వ్యవస్థ ఎక్కడ..?*

*హైడ్రా నిద్రపోతుందా..?*

*ఇప్పటికే దీనిపై ఇంటలిజెన్స్ రిపోర్ట్ పంపిన స్థానిక ఐబి అధికారులు..*

*ఫేక్ రసీదులు తయారు చేసి భూములు కబ్జా చేసిన వారిని శిక్షించరా..?*

*రాచకొండలో పోలీసు వ్యవస్థ పని చేస్తుందా..?*

*ఎందుకు విచారణ జరిపి క్రిమినల్ కేసులు నమోదు చేయడం లేదు..?*

*సామాన్యుడికి ఒక చట్టం.. జర్నలిస్టులకు మరో చట్టమా.. ఇదెక్కడి న్యాయం..?*

*ఫేక్ సర్టిఫికెట్లు.. రసీదులు తయారు చేయడం నేరం.. కాదా?*

*మునగనూరు గ్రామపంచాయతీ పేరుతో ఫేక్ రసీదులు తయారు చేసిన వారిని ఎందుకు వదిలేస్తున్నారు..?*

*జర్నలిస్టులు అయితే నేరం చేయవచ్చా..!*

*చట్టం అందరికీ సమానమే.. కదా.. మరి వీళ్లపై ఎందుకు క్రిమినల్ చర్యలు తీసుకోవడం లేదు..?*

*మునగనూరు సర్వేనెం :90 భూ కబ్జా బాగోతంలో ప్రజా ప్రతినిధులు, గత అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో.. తుర్కయంజాల్ కమిషనర్... అందరూ పాత్రధారులే..!*

గత ప్రభుత్వం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పేరుతో మాయ చేసింది. అందుకోసం ఎటువంటి జీ.ఓ విడుదల చేయకుండా.. అనధికారికంగా ప్రభుత్వ భూములను కబ్జా చేసి మరీ.. కొంత మంది జర్నలిస్టులకు అంట గట్టింది. ఆయా నియోజకవర్గాలలో గత ప్రభుత్వ అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సర్కార్ భూముల కబ్జా బాధ్యతలను అప్పటి ప్రభుత్వం అప్పగించింది. దీంతో నాటి అధికార పార్టీ ఎమ్మెల్యేలు వారికి నచ్చిన వాళ్లను.. వాళ్ల మోచేతి నీళ్లు తాగే జర్నలిస్టులను ఎంపిక చేసి ప్రభుత్వ భూములను అనధికారికంగా కట్టబెట్టారు.

*జర్నలిస్టులు అనే సోయి మరిచి.. ఫేక్ రసీదులు సృష్టించి..!*

రంగారెడ్డి జిల్లా పరిధిలోని గత అధికార పార్టీ ఇద్దరు ఎమ్మెల్యేలు (ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం) 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వాళ్ల లబ్దికోసం అనధికారికంగా ప్రభుత్వ భూమిని కబ్జా చేసి వారికి అనుకూలమైన జర్నలిస్టులకు అంటగట్టారు. ఎల్బీనగర్ పరిధిలోని జర్నలిస్ట్ ల కోసం మునగనూరు సర్వేనెం :90 లో రెండున్నర ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఎమ్మెల్యే తనకు నచ్చిన జర్నలిస్ట్ లకు  అప్పగించారు. దీంతో సదురు మహానుభావులు.. లోక జ్ఞానం ఉన్నోళ్లు.. కదా.. సమాజం పట్ల అవగాహన ఉంటుందని ప్రజలు నమ్మేవాళ్లు.. కానీ సదురు జర్నలిస్టులు సంకలు గుద్దుకొని.. సోయి మరిచి.. సర్కారు భూమి లో 2004 నుంచి తామే ఉంటున్నట్లు.. ఇంటి నెంబర్లతో సహా పొందుపరిచి మునగనూరు గ్రామపంచాయతీలో ఇంటి పన్ను చెల్లిస్తున్నట్లు ఫేక్ రసీదులు తయారు చేశారు. ఎందుకంటే మునగనూరు సర్వేనెం:90 సర్కారు భూమిలో ఏండ్ల తరబడి ఉంటూ ఇంటి పన్ను చెల్లిస్తున్నట్లు నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రభుత్వ భూమిలో 2023 వరకు ఒక్క ఇంటి నిర్మాణం జరగలేదు. 

*బొక్క బోర్లా..*

మునగనూరు ప్రభుత్వ భూమిలో 2004 నుంచి ఇంటి పన్ను చెల్లిస్తున్నట్లు బుఖాయించే ప్రయత్నం చేసిన కబ్జాదారులు 2023లో కరెంటు మీటర్ల కోసం అదే ఇంటి పన్ను రసీదులను పొందుపరచడం గమనార్హం. ఇక్కడే సదురు కబ్జాదారులు బొక్క బోర్లా పడ్డారు. వీళ్లను కాపాడే ప్రయత్నంలో అధికారుల కూడా బుక్కయ్యారు. 2004లో ఎటువంటి నిర్మాణాలు లేకుండా కొత్తగా నిర్మించిన ఇండ్లకు ఫేక్ రసీదులతో కరెంటు మీటర్లు మంజూరు చేసిన ఏడీఈ కూడా నేరస్తుడే..? వీళ్ళతో పాటు అతడిని కూడా విచారణ జరిపి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

*గత ఎమ్మార్వో.. మున్సిపల్ కమిషనర్లు కూడా నేరస్తులే...!*

మునగనూరు ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన గత ఎమ్మార్వో.. గత తుర్కయంజాల్ కమిషనర్, ప్రస్తుత కమిషనర్లకు కూడా ఈ కబ్జా బాగోతంలో భాగము ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఎటువంటి జీవో లేకుండా సర్కారు భూమిని ఆక్రమించడం నేరం. ఇందులో గత ఎమ్మార్వో కు.. కమిషనర్లకు కూడా ప్లాట్లు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపితే అనేక విషయాలు బయటపడతాయి పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

*ఎమ్మెల్యేల పిఏ లకు డ్రైవర్లకు సైతం..!*

గత ప్రభుత్వ ఎమ్మెల్యే తన సోకాల్డ్ జర్నలిస్టులతో పాటు పీఏలకు, పీఆర్ఓలకు, డ్రైవర్లకు కూడా మునగనూరు సర్కార్ భూమిలో ఎలా ఉంటాయి..? ప్రస్తుత ఎమ్మెల్యే పీఏకు డ్రైవర్ కు, తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డ్రైవర్ తో పాటు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ముఖ్యంగా లోకల్ ఎమ్మెల్యే కు అనుకూలంగా ఉండే మరో డిజిటల్ పత్రిక చైర్మన్ కూడా ఇటీవల మునగనూరు సర్కారు భూమిలో ప్లాట్లు పొందినట్లుగా సమాచారం. దీనిపై ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

*ఇప్పటికే ఐ బి రిపోర్ట్..?*

మునగనూరు సర్కారు భూమి కబ్జాపై ఇంటలిజెన్స్ బ్యూరో అధికారులు జిల్లా కలెక్టర్ కు.. సంబంధిత రెవెన్యూ అధికారులకు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులకు.. ప్రభుత్వానికి ఇప్పటికే ఒక నివేదిక అందజేసినట్లుగా తెలుస్తోంది..! అయినా ఇప్పటి వరకు ఫేక్ రషీదులతో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై ఎందుకు విచారణ జరిపి క్రిమినల్ కేసులు నమోదు చేయడం లేదంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు ఫేక్ రసీదుల విషయంలో సమగ్ర విచారణ చేపట్టి సర్కార్ భూమిని కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

*హైడ్రా నిద్రపోతుందా..?*

పేదోడు ఓ 30- 40 గజాల ప్రభుత్వ స్థలంలో చిన్నపాటి గుడిసె వేసుకున్న.. లేదా ఓ రేకుల షెడ్డు లాంటి ఇల్లు నిర్మించుకున్న.. కూల్చి వేస్తున్న హైడ్రాధికారులు.. అప్పనంగా మునగనూరులో ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఫేక్ రసీదులతో కరెంట్ మీటర్లు పొంది.. జర్నలిస్టుల పేరుతో పక్కా నిర్మాణాలు చేపట్టిన వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు. చట్టం పేదోడికైనా.. ఉన్నోడికైనా.. జర్నలిస్ట్ అయినా.. ఒక్కటే కదా..! మరి ఫేక్ రసీదులతో ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై విచారణ చేపట్టి క్రిమినల్ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు..? అనేది.. పలువురి ప్రశ్న..? వెంటనే హైడ్రాధికారులు మునగనూరు సర్కారు భూమి విషయంలో జోక్యం చేసుకొని ప్రభుత్వ భూమిని కాపాడాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
(SOURCE)

Saturday, October 11, 2025

*ఇలా చేస్తే మీ ఆధార్ సేఫ్....వర్చువల్ ఐడీతో మరింత గోప్యంగా సమాచారం*

*ఇలా చేస్తే మీ ఆధార్ సేఫ్....వర్చువల్ ఐడీతో మరింత గోప్యంగా సమాచారం*

మన ప్రాథమిక ఐడీ ఆధార్. అందులోని వివరాలు అంగడి సరకుగా మారితే చాలా ముప్పు ఉంటుంది. గతంలో రిజిస్ట్రేషన్​ శాఖ వెబ్​సైట్ నుంచి బయటికి వచ్చిన ఆధార్ సమాచారంతో అనేకమంది ఖాతాల నుంచి రూ.లక్షలు మాయమయ్యాయి. ఇలా జరగకుండా చూడ్డానికి ఉడాయ్ వర్చువల్ ఐడీ, ఆధార్ లాక్, హిస్టరీ వంటి సేవలను అందుబాటులో ఉంచింది. మరి మన సమాచార భద్రతను సరిచూసుకుందామా?

*ఆధార్‌ వర్చువల్‌ ఐడీని ఎలా పొందాలి :*

* వర్చువల్ ఐడీ (వీఐడీ) ద్వారా వ్యక్తిగత సమాచారం మరింత గోప్యంగా ఉంటుంది.
* అధికారిక పోర్టల్​కి వెళ్లి ఆధార్ సర్వీసుల్లో వర్చువల్ ఐడీ (వీఐడీ) జనరేట్​పై క్లిక్ చేయాలి.
* అనంతరం ఆధార్​ కార్డు నంబరు, క్యాప్చా నంబరును నమోదు చేయాలి.
* తరువాత లింక్ అయిన ఫోన్​ నంబరుకు వచ్చిన ఓటీపీని నమోదు చేస్తే వర్చువల్ ఐడీ కనిపిస్తుంది.
* మెసేజ్​ ద్వారా కూడా ఈ ఐడీని పొందవచ్చు.
* ఆధార్​కు లింక్ అయిన ఫోన్​ నంబరులో ఆర్​వీఐడీ స్పేస్ ఆధార్​లోని చివరి నాలుగు నంబర్లను టైప్ చేసి 1947కు మెసేజ్ పంపించాలి. ఇలా చేస్తే వర్చువల్ ఐడీ నంబర్ మెసేజ్ ద్వారానే వస్తుంది.
* ప్రతి పనికీ ఆధార్ నంబరును కాకుండా వర్చువల్ ఐడీని వినియోగించుకోవచ్చు.
* బ్యాంకు అకౌంట్ తెరవడానికి, ప్రభుత్వ సర్వీసులకు దరఖాస్తు చేయడానికి, ఈ కేవైసీ వంటి తదితరాలకు దీనిని ఉపయోగించవచ్చు.

*లాక్‌ చేసే అవకాశం :*

* ముందు మై ఆధార్ పోర్టల్​కు వెళ్లాలి. అందులో ఆధార్ సర్వీసెస్​పై క్లిక్ చేయాలి.
* దానికింద ఆధార్ లాక్, అన్​లాక్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి తదుపరిపై క్లిక్ చేయాలి.
* తరువాత ఆధాక్ వర్చువల్ ఐడీ (వీఐడీ), పూర్తి పేరు, పిన్​కోడ్, క్యాప్చాను నమోదు చేయాలి.
* తరువాత వచ్చిన ఓటీపీని నమోదు చేస్తే మీ ఆధార్ బయోమెట్రిక్ లాక్ అవుతుంది.
* ఇదే తరహాలో అన్​లాక్ చేసుకోవచ్చు.

*ఎక్కడ వినియోగించామో తెలుసుకోండిలా :*

* ఆధార్​ను ఎక్కడెక్కడ ఉపయోగించామో తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం ఉడాయ్ పోర్టల్​కు వెళ్లాలి.
* పైన ఎడమవైపు ఉన్న మై ఆధార్ ఆప్షన్​లో కనిపించే ఆధార్ సర్వీసెస్​పై క్లిక్ చేయాలి.
* ఆధార్ అథంటికేషన్​ హిస్టరీ అనే ఆప్షన్​ ఎంచుకోగానే కొత్త పేజీ ఓపెన్​ అవుతుంది.
* అందులో లాగిన్​పై క్లిక్ చేసి ఆధార్ నంబరు, క్యాప్చా, ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
* తరవాత కనిపించే స్క్రీన్లో ఆథంటికేషన్ హిస్టరీపై క్లిక్ చేయాలి.
* అక్కడ ఆల్​ను, తేదీని ఎంచుకుంటే ఆధార్​కు లింక్ చేసిన ఓటీపీ, బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ ద్వారా మీ కార్డును ఆరు నెలలుగా ఎక్కడెక్కడ వినియోగించారనే విషయం కనిపిస్తుంది.

*ఇలా ఫిర్యాదు చేయవచ్చు :*

* మీకు తెలియకుండా ఆధార్​ను ఎక్కడైనా వినియోగించారని అనిపిస్తే వెంటనే 1947కి కాల్ చేసి కంప్లెయింట్ చేయవచ్చు.
* help@uidai.gov.inకి మెయిల్ ద్వారా లేదా ఉడాయ్ వెబ్​సైట్​లో నేరుగా ఫిర్యాదు చేయవచ్చు.
* ఇకపై ఈ ఘటనలు జరగకుండా ఉండాలంటే మీ ఆధార్ కార్డును బయోమెట్రిక్ లాక్ చేయడం ఉత్తమం.
* దీంతో మీ ప్రమేయం లేకుండా బయోమెట్రిక్​ని వినియోగించడానికి వీలుండదు.

*వేలిముద్ర పడటంలేదా :*

* వేలిముద్రలు లేని వారికి, వైకల్యం ఉన్న వ్యక్తులకు తమ ఐరిస్ స్కాన్లను మాత్రమే అందించడం ద్వారా ఆధార్ కార్డు లభ్యమవుతుంది.
* కొందరు వృద్ధులు, కాయకష్టం చేసేవారి వేలి ముద్రల గీతలు చెరిగిపోతుంటాయి.
* దానికోసం దగ్గరలోని ఆధార్ కేంద్రానికి వెళ్ల బయోమెట్రిక్ మినహాయింపు నమోదు మార్గదర్శకాల కింద పేరు, జండర్, చిరునామా, పుట్టిన తేదీ వివరాలను సమర్పించాలి. దీని తరువాత ఆధార్ ఎన్​రోల్​మెంట్ సెంటర్ సూపర్​వైజర్ ధ్రువీకరిస్తే సరిపోతుంది.
* అప్పటికీ కాకపోతే దగ్గరలోని ప్రాంతీయ కార్యాలయానికి వెళ్తే సరిపోతుంది.
* అక్కడ ఆధికారులు వేలిముద్రలను పరిశీలించి సమస్యకు పరిష్కారం చూపిస్తారు.

*గంతల నాగరాజు(GNR)*

Friday, October 10, 2025

నోబెల్ శాంతి బహుమతి 2025 గెలుచుకున్న వెలిజులా ఉక్కు మహిళ..

బుల్లెట్ల కంటే బ్యాలెట్ గొప్పది మచాడో పిలుపునకు దేశమే కదిలింది..

నోబెల్ బహుమతి వచ్చింది

నోబెల్ శాంతి బహుమతి 2025 గెలుచుకున్న వెలిజులా ఉక్కు మహిళ.. ఐరన్ లేడీ మరియా మచాడో. ఆమె ధైర్యసాహసాలు, తెగింపు, పోరాటం వల్లే గుర్తింపు పొందినట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది. మూడే మూడు అంశాలు ఆమెను ఎంపిక చేయటానికి దోహదపడ్డాయని స్పష్టం చేస్తూ కమిటీ వెల్లడించింది.

వెనిజులా దేశంలో సైన్యం పాలనకు వ్యతిరేకంగా స్థిరమైన శాంతియుత పోరాటం చేశారు. వెనిజుల దేశంలో ప్రజాస్వామ్యాన్ని తిరిగి తీసుకురావాలనే లక్ష్యంతో అందర్నీ ఏకం చేశారు. వెనిజుల దేశ ప్రజల ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛ, శాంతి కోసం ఆమె చేసిన పోరాటం, ఉద్యమం ఆ దేశ ప్రజల్లో ఆశను పుట్టించాయి. ఒకప్పుడు చాలా విభేదాలు ఉన్న రాజకీయ ప్రతిపక్షంలో ఆమె స్వేచ్ఛాయుత ఎన్నికలు అలాగే ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రభుత్వం కోసం అందరినీ కలిపింది. ప్రజాస్వామ్యానికి ఇదే ముఖ్యం. మన అభిప్రాయాలు వేరైనా, ప్రజాపాలన నియమాలను కాపాడుకోవడానికి అందరూ ఏకం కావాలి. ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఉన్నప్పుడు, ఈ ఐక్యత చాలా అవసరం.

ప్రభుత్వ హింస సొంత ప్రజలపైనే జరుగుతోంది. దాదాపు 8 కోట్ల మంది దేశం విడిచి వెళ్లిపోయారు. ఎన్నికల మోసాలు, అక్రమ కేసులు, జైలు శిక్షల ద్వారా ప్రతిపక్షాన్ని అణచివేశారు. మచాడో గురించి, ఆమెకు నోబెల్ కమిటీ ఎందుకు అవార్డు ఇచ్చింది అంటే 

మచాడో సుమాటే అనే సంస్థను స్థాపించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని పెంచడానికి ఉన్న సంస్థ. 20 సంవత్సరాల క్రితమే ఆమె స్వేచ్ఛాయుత, నిజాయితీగల ఎన్నికలకు మద్దతు ఇచ్చారు.

*ఆమె మాటల్లో చెప్పాలంటే, రాజకీయ పదవుల కోసం తుపాకీలను కాకుండా, బ్యాలెట్ (ఓటు) పద్ధతిని ఎన్నుకోవాలని ఆమె నమ్మారు.

*అప్పటి నుండి ఆమె న్యాయ స్వాతంత్రం మానవ హక్కులు, ప్రజల ప్రాతినిధ్యం కోసం గట్టిగా మాట్లాడారు.

ఆమె 2024 ఎన్నికలకు ముందు వెనిజులా ప్రజల స్వేచ్ఛ కోసం చాలా సంవత్సరాలుగా కృషి చేస్తున్నారు.

*మచాడో ప్రతిపక్షం తరఫున అధ్యక్ష అభ్యర్థిగా నిలబడాలనుకున్నారు, కానీ పాలకులు ఆమెను పోటీ చేయకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత, ఆమె మరొక పార్టీ అయిన ఎడ్ముండో గొంజాలెజ్ ఉరుటియాకు మద్దతు ఇచ్చింది.

*రాజకీయ విభేదాలను పక్కన పెట్టి, లక్షల మంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు. పౌరులపై వేధింపులు, అరెస్టులు, హింస జరిగే ప్రమాదం ఉన్న, వారికి ఎన్నికలను పర్యవేక్షించేవారిగా శిక్షణ ఇచ్చారు.

ప్రభుత్వం ఓట్లను నాశనం చేసి, ఫలితాల గురించి అబద్ధాలు చెప్పకముందే, లెక్క చేసుకున్నారు

https://x.com/Praja_Snklpm/status/1976675390023508072?t=spIWT0NYqtRLJWxeTsHiww&s=08

*_BREAKING NEWS_*

*The Norwegian Nobel Committee has decided to award the 2025 #NobelPeacePrize to Maria Corina Machado for her tireless work promoting democratic rights for the people of Venezuela and for her struggle to achieve a just and peaceful transition from dictatorship to democracy.*

*Congratulations ⬇️* *#MariaCorinaMachado ✊*

*#NobelPrize #Nobel #NobelPeacePrize2025 #nobelprize2025* 

*@PIB_India*
*@PTI_News*
*@IPRTelangana @IPR_AP*

*Human Rights Forum-మానవ హక్కులు వేదిక* Press release/Invitation.

*Human Rights Forum*
*మానవ హక్కులు వేదిక*
Press release/
Invitation.
సీనియర్ జర్నలిస్ట్,
కృష్ణ మోహన్ గారికి.

Balagopal Memorial Meet on *October 12, 2025*

Human Rights Forum (HRF) is organising the 16th commemorative meeting of human rights activist K Balagopal on October 12 (Sunday), 2025. The venue of the meet, which will be held from 10 am to 5 pm, is the Sundarayya Vignana Kendram Main Hall, Baghlingampally, Hyderabad.
There will be talks on four important, contemporary topics on the occasion:
Prof. Nandini Sundar, sociologist, Delhi University will speak on ‘Whose Bastar? The struggle for Adivasi futures’
PS Ajay Kumar of the All India Lawyers Association for Justice (AILAJ), will talk on ‘New forms of land theft’
Apar Gupta of the Internet freedom Foundation will reflect on ‘AI and Privacy’  
Yogendra Yadav, national convener of Bharat Jodo Abhiyaan will speak on ‘Challenges to the Architecture of Electoral Democracy’
HRF shall be releasing a book on the day titled ‘Rajyanganni Ela Chudali?’, a collection of writings in Telugu on the Indian Constitution by K Balagopal.
A short film on Palestine will also be screened.
About Balagopal
A tireless fighter for justice for three decades, Balagopal inspired an entire generation to rights activism, leading by example. An eloquent speaker, original political thinker and writer, his rich analyses of various contemporary and historical issues are well known both within Telangana, AP and outside. He was a man of rare courage and integrity who espoused a politics that was deeply ethical. He entered the legal profession in 1996 and defended cases of adivasis, women, dalits and labourers creating spaces for those who could not otherwise access justice in the courts.
Balagopal was founder-member of the Human Rights Forum (HRF) and its general secretary for four years, from 2005 to 2009.  A champion of the oppressed, he was a source of enormous moral strength to all democratic struggles. He relentlessly strove to build a vibrant, broad-based and truly independent human rights movement. 
HRF invites all to the meet to remember this human rights colossus.
Request you to depute your reporter to cover the lectures.
 
VS Krishna                                                      S Jeevan Kumar                                      
(HRF TS & AP Coordination Committee Members)
10-10-2025
Hyderabad

Thursday, October 9, 2025

అక్రమాలపై వార్త రాసిన విలేకరిని బెదిరించిన మేక రామ్ రెడ్డి


అక్రమాలపై వార్త రాసిన విలేకరిని బెదిరించిన మేక రామ్ రెడ్డి

- సోషల్ మీడియా వేదికగా మానసికంగా, శారీరకంగా కృంగదీసే విధంగా పోస్టులు
-  టార్గెట్ చేస్తూ ఎక్కడ కనబడ్డా ఫోటోలు వీడియోలు తీసి దాడి చేయాలని పిలుపు
-  హుడా లక్ష్మీ నగర్ పాత నేరస్తుడు మేకరామ్ రెడ్డి పైన మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
-  రామ్ రెడ్డి వికృత చేష్టలపై జర్నలిస్ట్ సంఘాలు, దళిత సంఘాల సీరియస్

Courtesy/ source by ⬇️
 అక్షర శోధన న్యూస్ : అక్టోబర్ 10 హైదరాబాద్

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని రాజీవ్ నగర్ నివాసులు, సీనియర్ పాత్రికేయులు జి కుమారస్వామి బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలపైన వార్తాలు రాస్తే హుడా లక్ష్మి నగర్ కు చెందిన ఓ రాజకీయ పార్టీ నేత మేక రామిరెడ్డి సోషల్ మీడియా వేదికగా దాడి చేసిన వైనం మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ మేరకు 9 తారీఖు గురువారం మధ్యాహ్నం రాచకొండ కమిషనరేట్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిన విలేఖరి. వెంటనే స్పందించిన పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం.. ఈ మేరకు కుమారస్వామి మాట్లాడుతూ.. నా వృత్తిలో భాగంగా బోడుప్పల్ కార్పొరేషన్ లో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు అక్రమ నిర్మాణాలపై ప్రజలకు ప్రభుత్వానికి అధికారులకు తెలిసే విధంగా వార్తలు రాయడం జరుగుతుందని, అదేవిధంగా గురువారం సత్తిరెడ్డి నగర్ 20వ డివిజన్లో ఒక బిల్డర్ తన బిల్డింగ్ కు అడ్డు వస్తున్నటువంటి ఒక పెద్ద వేప చెట్టును నరికేసి,సెట్ బ్యాక్ లేకుండా బిల్డింగ్ కడుతున్నారని వార్త రాయడం జరిగిందని, దానిమీద వెంటనే స్పందించిన కమిషనర్ ఎంక్వైరీ అధికారులను పంపియగా, కొంతమంది రాజకీయ నాయకులు, కింది స్థాయి అధికారులు తప్పుడు ఎంక్వయిరీ చేసి కమిషనర్ ను తప్పుదోవ పట్టిస్తున్నారని సోషల్ మీడియా వేదికగా వాట్స్అప్ గ్రూప్లో ప్రజలకు ప్రభుత్వానికి అధికారులకు తెలిసే విధంగా నేను పోస్ట్ పెట్టడం జరిగిందని, దానికి కౌంటర్ గా ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తి హుడా లక్ష్మీ నగర్ నివాసులు, ఒక జాతీయ పార్టీ నేత మేక రామ్ రెడ్డి నన్ను టార్గెట్ చేస్తూ.. కింది స్థాయి నుండి, నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఒక విలేకరిగా 9 సంవత్సరాల కాలంలో ఒక పేపర్ కి ఎడిటర్ గా ఎదుగుతున్న నన్ను మానసికంగా, శారీరకంగా కృంగదీసే విధంగా వాట్సాప్ గ్రూపులో పోస్ట్లు పెట్టి, సంగారెడ్డిలో ఒక విలేకరిని చెట్టుకు కట్టేసినట్లు కట్టేసి దాడి చేస్తామని, చేయిస్తామని, జింతక్ జింతక్ జింతక్..అనే సినిమా డైలాగ్ తీసుకొని నిన్ను చింతపండు చేస్తామని, ఎక్కడ కనబడ్డ ఫోటోలు వీడియోలు తీసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని, దాడులు చేయాలని ప్రజలకు ఒకరకంగా ఇన్ డైరెక్టుగా సిగ్నల్ ఇచ్చారని, మేక రామిరెడ్డి నుండి నాకు ప్రాణహాని ఉందని, మేడిపల్లి పోలీసులు నాకు రక్షణ కల్పించి, పాత నేరస్తుడైన రామ్ రెడ్డి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేడిపల్లి పోలీసులను కోరినట్లు తెలిపారు. అదేవిధంగా హుడా లక్ష్మీ నగర్ 7వ డివిజన్ ,19 డివిజన్లలో మేక రామిరెడ్డి పైన పలు ఫిర్యాదులు, ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయని, ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన ఘటనలో ఆయా పార్టీ నుండి సస్పెండ్ కూడా చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎలాంటి సత్సంబంధం లేకుండా ఒక విషయం మీద ఒక విలేకరి మీద సోషల్ మీడియా వేదికగా మానసికంగా కృంగదీసే విధంగా మాటల దాడి చేయడం పట్ల నన్ను నా కుటుంబాన్ని తొక్కి భయభ్రాంతులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి వెంటనే అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని నాకు నా కుటుంబానికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరారు.

సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి


https://x.com/hydcitypolice/status/1976125348275421553?t=t-lSVzd3Fqy3LXgCxQWK_w&s=08 

 *#PauseBeforeYouPost*

*సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా షేర్ చేసే కొన్ని పోస్టులు ఎదుటివారి ప్రతిష్టను, వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తాయి.: @SajjanarVC*

*@TelanganaCOPs*
*@TelanganaDGP*
*@CPHydCity*


Thank you for information sir 

Respect➡️ #IndianConstitution
#Article19To21

#alert #awareness #civilsociety #facts #responsebility #tweets #socialmedia #fakenews 

@IPRTelangana

https://x.com/Praja_Snklpm/status/1976196619096989873?t=62zOZhSVKTwFxWldUIXREQ&s=19

Wednesday, October 8, 2025

*_RTI Act వారోత్సవాలు➡️➡️జర్నలిస్ట్స్ పాత్ర_*

*_RTI Act వారోత్సవాలు➡️➡️జర్నలిస్ట్స్  పాత్ర_*

*_ఈ వర్క్ షాప్ లో జర్నలిస్ట్స్ అందరు పాల్గొనాలని విజ్ఞప్తి._*

https://x.com/Praja_Snklpm/status/1975879450756829475?t=mLkBCvJLTdOhUUlgWTBMyw&s=08  

*#RTI #telangana #journalist*

*_ప్రతి సంవత్సరం అక్టోబర్ 5 నుండి 12 వరకు ఆర్టీఐ వారోత్సవాలను జరుపుకుంటారు.ఈ వారం ముఖ్య ఉద్దేశ్యం సమాచార హక్కు చట్టం (RTI Act) గురించి ప్రజలలో అవగాహన కల్పించడం._*

*_ఎందుకు జరుపుకుంటారు? సమాచార హక్కు చట్టం ప్రాముఖ్యతను నొక్కి చెప్పడానికి, ప్రజలకు తమ సమాచార హక్కు గురించి తెలియజేయడానికి, ప్రభుత్వ కార్యకలాపాలలో పారదర్శకతను పెంచడానికి._*

*@LubnaSarwath @IPRTelangana @PressClubHyd @PIBHyderabad @IPR_AP @MIB_India @AnamchinniJ @marksDudam @raviprakash_rtv @TeenmarMallanna @dasari_srini @DevikaRani81 @RamsGTRK  @murthyscribe @Penpower25 @Pandari_Journo @Madhav51599199 @NizamJourno*

*NOTE :అందరి అనుకూలతను బట్టి సమయం & తేది నిర్ణయించడం జరుగుతుంది. మీకు ఏమైనా సందేహాలు ఉంటే డాక్టర్ లుబ్నా సర్వత్ మేడం గారికి Ph:9963002403 ఫోన్ లో సంప్రదించవచ్చు.*

Tuesday, October 7, 2025

_Mandha Murali Sir taken charge as 6 th special judicial magistrate_

https://x.com/Praja_Snklpm/status/1975514405577392618?t=NKIoUaHBs9Q_T6-Yty5dOA&s=19

*_Mandha Murali Sir taken  charge  as 6 th special judicial magistrate,Manoranjan, Nampally court Hyderabad..special  thanks to  the Hon'ble   M S J Hyderabad_*

*_మురళి సర్ కు శుభాకాంక్షలు 💐 తెలియచేస్తుంది "ప్రజాసంకల్పం Group Link Media_*

*_IMP NOTE : మురళి సర్ "ప్రజాసంకల్పం" కుటుంబ సభ్యులు అని తెలియచేయడానికి గర్వపడుతున్నాను✊._*

*#judiciary #Judicial #court #Magistrate #hyderabad*

*#pashamyadagiri #anamchinnivenkateshwararao #kkrAWJA #TJSS*

*_ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత_*
*Bapatla Krishnamohan*
*#SocialActivist* 
*#HumanRightsMember*
*Bplkm✍️*

*@Praja_Snklpm (Twitter)*
*Prj_snklpm (Instagram)*
*@prajasankalpamnews (YouTube)*
*prajasankalpam1@gmajl.com* 
*prajasankalpam1.blogsoot. com*
*Krishna Mohan Kittu  (fb)*
*Krishnamohan Bapatla (fb)*