Thursday, September 18, 2025

ఓయూ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారు

ఈరోజు గౌరవనీయులైన ఓయూ రిజిస్ట్రార్ ఆచార్య.G. నరేష్ రెడ్డి గారికి మరియు గౌరవనీయులైన OSD ఆచార్య.జితేందర్ కుమార్ నాయక్ గారిని ఓయూ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యచందర్ మరియు ఓయూ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు కట్టా వెంకటేష్ గార్ల ఆధ్వర్యంలో పలువురు నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు కలిసి  ఓయూ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను అటు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఇటు ఓయూ అధికారులు పరిష్కరించడం లేని కారణంగా మేము ఈనెల 23-09-2025 నుండి తలపెట్టిన నిరసన కార్యక్రమాల గూర్చి వివరిస్తూ పత్రము ఇవ్వడం  జరిగినది.మేము గత 25 నుండి 30 సంవత్సరాలుగా తక్కువ జీతాలతో విశ్వవిద్యాలయ అభివృద్ధికి కృషిచేస్తూ నిరంతరం పనిచేస్తున్నాము.అయినప్పటికీ,గత నాలుగు సంవత్సరాలుగా వేతనాల పెంపు జరుగలేదు.మేము పలు దఫాలుగా అధికారులకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ మా సమస్యలు పరిష్కరించబడలేదు.రోజు రోజుకి పెరుగుతున్న నిత్యావసరాల ధరలు,ఇంటి అద్దెలు పెరగడం వలన,జీవన వ్యయం అధికమై పిల్లల చదువు,వైద్య ఖర్చులు భరించలేని స్థితి ఏర్పడింది. కనుక మేము ఇట్టి సమస్యలను తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి  తీసుకపోవుటకు గాను ఈనెల 23-09-2025 నుండి శాంతియుత నిరసన కార్యక్రమాలు ప్రారంభించాలని నిర్ణయించుకున్నాము.       

మాయొక్క ప్రధాన డిమాండ్లు:-1.ఓయూలో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు "మినిమం టైంస్కేల్"ఇవ్వాలి. 2.EPF ఏరియర్స్ ను వెంటనే ఓయూ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఖాతాలో జమచేయాలి. 3.రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు వయోపరిమితిని61 సంవత్సరాలకు పెంచాలి. 4.రిటైర్మెంట్ మరియు మరణించిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీసం 5 లక్షల గ్రాట్యుటీ ఇవ్వాలి.   5.పర్మినెంట్ ఉద్యోగులతో సమానంగా మరణించిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు 30,000 వేలు అంత్యక్రియల ఖర్చులు ఇవ్వాలి.                                                      
మాయొక్క నిరసన కార్యక్రమాల షెడ్యూల్:-         1.బ్లాక్ రిబ్బన్ ధరించి పెన్ డౌన్-23-09-2025         2.బైక్ ర్యాలీ- 24-09-2025                                   3.మహా ర్యాలీ-25-09-2025                                 4.మానవహారం-26-09-2025                               5.మహాధర్నా-27-09-2025                                   6.రిలే నిరాహారదీక్షలు -29-09-2025 నుండి ప్రారంభమగును.

Tuesday, September 16, 2025

బ‌తుకమ్మ యంగ్ ఫిల్మ్ మేక‌ర్స్ ఛాలెంజ్‌...

తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ ఆధ్వ‌ర్యంలో...
బ‌తుకమ్మ యంగ్ ఫిల్మ్ మేక‌ర్స్ ఛాలెంజ్‌...

ప్ర‌జా పాల‌న‌, తెలంగాణ పండుగ‌లు, చ‌రిత్ర, సంస్కృతి నేప‌థ్యంగా పోటీలు

పోటీలో పాల్గొనేందుకు యువ సృజ‌న‌శీలురకు ఆహ్వానం

హైద‌రాబాద్‌:  తెలంగాణ‌లోని యువ సృజ‌న‌శీలుర‌కు ప‌ట్టం క‌ట్టేందుకు తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ బతుక‌మ్మ యంగ్ ఫిల్మ్ మేక‌ర్స్ ఛాలెంజ్ పేరిట పోటీలు నిర్వ‌హించ‌నుంది.

ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న అభివృద్ది, సంక్షేమం (మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు, మ‌హాల‌క్ష్మి, గృహ‌జ్యోతి, ఇందిర‌మ్మ ఇండ్లు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ, యంగ్ ఇండియా రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ త‌దిత‌రాలు), తెలంగాణ చ‌రిత్ర‌, సంస్కృతి, పండుగ‌లు, క‌ళారూపాల‌పై షార్ట్ ఫిలిమ్స్‌, పాట‌ల పోటీలు ఉంటాయి. 

షార్ట్ ఫిలిమ్స్ నిడివి 3 నిమిషాల‌కు, పాట‌ల వ్య‌వ‌ధి 5 నిమిషాల‌కు మించి ఉండ‌కూడ‌దు.

పోటీలకు సంబంధించిన అర్హతలు :
1.ఈ పోటీలో పాల్గొనే వారందరూ 40 ఏళ్ళ లోపు వయసు కలిగి ఉండాలి. 
2. 4K రిజల్యూషన్ కలిగి ఉండాలి. 
3. షార్ట్ ఫిల్మ్స్/ వీడియో సాంగ్స్ ఏవైనా ఈ పోటీలలో సూచించిన ‘థీమ్’ ల పైనే ఉండాలి.
4. మీరు చేసిన వీడియోలు గతంలో ఎక్కడా ప్రదర్శించి ఉండకూడదు. 
5. బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేక‌ర్స్ ఛాలెంజ్ కోసమే చిత్రీకరించినవై ఉండాలి 

పోటీల్లో ఎంపికైన థీమ్స్‌కు 
ప్ర‌థ‌మ బ‌హుమ‌తి - రూ.3 ల‌క్షలు
ద్వితీయ బ‌హుమ‌తి - రూ.2 ల‌క్ష‌లు
తృతీయ బ‌హుమ‌తి - రూ.1 ల‌క్ష‌
కన్సోలేష‌న్ బ‌హుమ‌తి - రూ. 20 వేలు (అయిదుగురికి) ఇవ్వ‌డంతో పాటు విజేత‌లంద‌రికీ ప్ర‌శంసా ప‌త్రం, జ్ఞాపిక ప్ర‌దానం చేస్తారు. 

నిర్దేశిత గడువులోగా  వచ్చిన‌ ఎంట్రీలను నిపుణులతో కూడిన జ్యూరీ వీక్షించి వివిధ కేటగిరీలలో ఎంపిక‌లు పూర్తి చేస్తుంది. 

ఎంట్రీల‌ను ఈ కింది మెయిల్ ఐడీ
youngfilmmakerschallenge@gmail.com   

లేదా 

వాట్సాప్ నెంబర్ -  8125834009 (WhatsApp Only)కు పంపాలి

ఎంట్రీల‌ను పంపించేందుకు తుది గ‌డువు సెప్టెంబ‌రు 30, 2025.

- దిల్ రాజు, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మ‌న్‌

Saturday, September 13, 2025

Waqf Resolutions were submitted to Hon'ble Minister for Minorities

Hyderabad: 12sep2025, Awaam(People's) Waqf Resolutions were submitted to Hon'ble Minister for Minorities, Shri Adluri Laxman garu. We had a discussion and he assured that he is trying to resolve the issues discussed.  Waqf is a specialised subject and needs a focused attention, he said.  We had pointed out that the Waqf Board is irregular with corruption; a functional CEO was removed citing subjudice Act, even though the CEO had a higher rank than Deputy Secretary; all the staff at the Waqf Office were underqualified drawing high salaries. When such is the set up how can the Islamic charitable institution of Waqf be protected and used for the beneficiaries, was our worry that we explained to the Minister garu and urged for earliest resolution. 

 -  Adv Dr Lubna Sarwath, Social & Environmental Activist, Indian National Congress; Prof Anwar Khan, Jago Telangana; Nayeemullah Shareef, Waqf Protection Council;  Ahmed Hameeduddin, Movement for Peace & Justice; Hyderabad

Tuesday, September 9, 2025

తెలంగాణ‌లో విద్యాభివృద్ధికి అండ‌గా నిల‌వండి...

తెలంగాణ‌లో విద్యాభివృద్ధికి అండ‌గా నిల‌వండి...

* కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌కు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి విన‌తి
*  యంగ్ ఇండియా స్కూళ్లు, ఇత‌ర విద్యా సంస్థ‌ల అభివృద్ధికి రూ.30 వేల కోట్ల వ్య‌యం..

ఢిల్లీ:  తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌కృషికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌కు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. తెలంగాణ‌లో సుమారు 90 శాతంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వ‌ర్గాల్లోని పిల్ల‌ల‌కు కార్పొరేట్ త‌ర‌హా విద్య‌ను అందించేందుకు త‌మ ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను కేంద్ర మంత్రికి సీఎం వివ‌రించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తో నార్త్ బ్లాక్‌లోని ఆమె కార్యాల‌యంలో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి మంగ‌ళ‌వారం  స‌మావేశ‌మ‌య్యారు. రాష్ట్రంలోని 105 శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల్లో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మించ‌నున్న‌ట్లు సీఎం తెలిపారు. ఇప్ప‌టికే నాలుగు పాఠ‌శాల‌ల నిర్మాణ ప‌నులు మొద‌ల‌య్యాయ‌ని... మిగ‌తా పాఠ‌శాల‌ల‌కు సంబంధించి టెండ‌ర్లు ముగిశాయ‌న్నారు.  ఒక్కో పాఠ‌శాల‌లో 2,560 మంది విద్యార్థులు ఉంటార‌ని... 2.70 ల‌క్ష‌ల మంది విద్యార్థుల‌కు ఈ పాఠ‌శాల‌ల్లో చదువుకునే అవ‌కాశం ల‌భిస్తుంద‌ని కేంద్ర మంత్రికి సీఎం వివ‌రించారు. 
అత్యాధునిక వ‌స‌తులు, ల్యాబ్‌లు, స్టేడియాలతో నిర్మించే ఈ 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి రూ.21 వేల  కోట్ల వ్య‌య‌మ‌వుతుంద‌ని  వివ‌రించారు. అలాగే రాష్ట్రంలో జూనియ‌ర్‌, డిగ్రీ, సాంకేతిక క‌ళాశాలలు, ఇత‌ర ఉన్న‌త విద్యా సంస్థ‌ల్లో ఆధునిక ల్యాబ్‌లు, ఇత‌ర మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు రూ.9 వేల కోట్లు వెచ్చించ‌నున్న‌ట్లు కేంద్ర మంత్రికి  సీఎం తెలిపారు. ఈ నిధుల స‌మీక‌ర‌ణ‌కు ప్ర‌త్యేక కార్పొరేష‌న్ ఏర్పాటుకు అనుమ‌తించ‌డంతో పాటు ఎఫ్ఆర్‌బీఎం ప‌రిమితి నుంచి మిన‌హాయించాల‌ని కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వం విద్యా రంగంపై చేస్తున్న వ్య‌యాన్ని పెట్టుబ‌డిగా ప‌రిగ‌ణించాల‌ని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. 

గ‌త ప్ర‌భుత్వం ఇష్టారీతిగా అధిక వ‌డ్డీల‌కు అప్పులు తీసుకువ‌చ్చింద‌ని... వాటి చెల్లింపు రాష్ట్ర ప్ర‌భుత్వానికి భారంగా మారిన నేప‌థ్యంలో వాటి రీస్ట్ర‌క్చ‌రింగ్‌కు అనుమ‌తించాల‌ని కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  కోరారు.  ముఖ్య‌మంత్రి విజ్ఞ‌ప్తుల‌కు కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ సానుకూలంగా స్పందించారు. స‌మావేశంలో ఎంపీలు డాక్ట‌ర్ మ‌ల్లు ర‌వి, పోరిక బ‌ల‌రాం నాయ‌క్‌, సురేశ్ షెట్కార్‌, చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కేంద్ర ప్రాజెక్టులు, పథకాల సమన్వయ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.
Bplkm✍️

తెలంగాణ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అవినీతి అధికారి

S. Mani Harika, Town Planning Officer, Town Planning Wing in Narsingi Municipality, Hyderabad was caught by Telangana #ACB for demanding a #bribe of Rs.10,00,000/- and accepting Rs.4,00,000/- as bribe from the complainant for showing official favour "To process and to issue LRS proceedings to regularise an open plot of the Complainant ".

In case of demand of #bribe by any public servant, you are requested to contact
#AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.

"ఫిర్యాదుధారునికి చెందిన బహిరంగంగా గల ఒక ప్లాటు యొక్క క్రమబద్ధీకరణకు LRS ప్రొసీడింగ్‌లను జారీ చేయడానికి మరియు అట్టి ప్రక్రియను ప్రాసెస్ చేయడానికి" అధికారికంగా సహాయం చేసేందుకు ఫిర్యాదుధారుని నుండి మొదటగా రూ.10,00,000/- #లంచం డిమాండ్ చేసి అందులో రూ.4,00,000/- లంచం తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడిన హైదరాబాద్‌, నార్సింగి పురపాలక సంఘం యొక్క పట్టణ ప్రణాళిక శాఖ లోని  పట్టణ ప్రణాళిక అధికారిణి - ఎస్. మణి హారిక.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Courtesy / Source by :

https://x.com/TelanganaACB/status/1965392305718002096?t=nXENN9Uzk0HJbCwTsszOcg&s=19

HYDRAA’s rejection of RTI applications.

https://x.com/Praja_Snklpm/status/1965391654606766579?t=cFV2SUvezdtutBraU6EtcQ&s=08
                 *****
https://www.instagram.com/p/DOYch88Ev03/?igsh=MThnMWNxdWk4d2k2dg==

*#HYDRAA #RTIA #MAUD #HMDA #GHMC #TGRERA*

*09092025 Hyderabad*
*PUBLIC NOTE:*

*Today Complaint , already emailed on 29.08.2025 and regd post on 01.09.2025, gvn by hand  to Chief information Commissioner garu  seeking  immediate RTI implementation by HYDRAA, especially in light of HYDRAA’s rejection of RTI applications.*

We explained how there is no official information whatsoever in public domain by HYDRAA.

Commissioner garu assured that he wud take it up with Municipal Administration Secretary Ilam Bharti garu and resolve the complaint.
We also sought penalties on HYDRAA for not implementing RTI being public authority.
In the complaint compensation is also sought as per RTI Act.

Thanks
Lubna Sarwath, INC, Hyderabad 
Er Amgoth Venkatesh, Gen Secy TPCC & Campaign Committee Exec Member,
Er Natesh Dravidian, Congress Seva Dal SM incharge Hyderabad 
Vijay bhaskar Reddy, Environmental Activist,
Hyderabad


*@TelanganaCMO*
*@Bhatti_Mallu* *@CPRO_TGCM @IPRTelangana @TelanganaCS @PrlsecyMAUD @cdmatelangana @HMDA_Gov*  *@LubnaSarwath @BplplH*

Monday, September 8, 2025

తెలంగాణ రెవిన్యూ అవినీతి అధికారి

Amarnath Reddy, Revenue Inspector, O/o the Tahsildar & Joint Sub-Registrar of Maddur Mandal in Narayanpet district was caught by Telangana #ACB Officials for demanding and accepting the #bribe of Rs.5,000/- from the complainant to do an official favour "To submit the verification report of an agricultural land held in the name of the father of the complainant for inclusion in the Pattadar Pass Book".

In case of demand of #bribe by any public servant, you are requested to contact
#AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.

ఫిర్యాదుధారుని నాన్న గారి స్వాధీనంలో ఉన్న వ్యవసాయ భూమిని వారి నాన్న గారి పేరుమీద పట్టాధారు పాసు పుస్తకంలో చేర్చడానికి ధృవీకరణ నివేదికను సమర్పించడానికి" అధికారిక సహాయం అందించేందుకు ఫిర్యాదుధారుని నుండి రూ.5,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారుల చేతికి చిక్కిన నారాయణపేట జిల్లాలోని మద్దూరు మండల తహశీల్దార్ & జాయింట్ సబ్-రిజిస్ట్రార్ ఆఫీసర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అమర్నాథ్ రెడ్డి.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Courtesy / Source by :

https://x.com/TelanganaACB/status/1965050364618739974?t=IRVFVYh2rlBKSL84eiH02g&s=19